🎈 భాగము 9 🎈
🌻 అంతఃపురం 🌻
🍃🌺సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం వుండే అంతఃపుర భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు వున్న ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు కల ఏనుగులు రక్షణ కార్యంలో వున్నాయి. ఆయుధ పాణులయిన యోధులు అప్రమత్తంగా తిరుగుతున్నారు. మకర, తిమింగల, మహాసర్ప సమృద్ధమయిన సాగరంలా ఉన్నదది. యమ, వరుణ, కుబేర, దేవేంద్ర భవనాలను అధఃకరిస్తున్నది.
🍃🌺రావణుని భార్యలందరూ అక్కడ వున్నారు. ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీజనం కూడా ఆ భవనంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
🍃🌺విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షేశుడయిన కుబేరుడు తీవ్ర తపస్సుచేసి బ్రహ్మను సంతుష్టుని చేసి' విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని ఓడించి రావణుడు దీనిని సాధించాడు.
🍃🌺మేరు మందర గిరిశిఖర సదృశమయిన గోపుర సమూహాలతో అలరారుతోంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు. స్ఫటికమణులతో రూపొందించిన గవాక్షాలు. పగడాలు, మణులు, ముత్యాలతో నిండి అక్కడి నేల అంతా కాంతు లీనుతున్నది. రక్త చందనాలేపనంతో లేతసూర్య కాంతితో వెలుగుతోంది, రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. ఆప్త బంధువుకి విందుకోసం చేసినట్లున్నాయి.
🍃🌺ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది.గ్రామ, నగర, సౌధ చిత్రా లలంకరించిన తివాసీ పరచి ఉంది.
🍃🌺ఆ భవనంలో తెల్లని రాజహంసలవలె అగరు ధూమం వ్యాపించి శోభావహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది.
🍃🌺చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలా ఉంది. అక్కడి బంగారు దీపకళికలను తదేకంగా చూశాడు.చూసి లోపలకు సాగుతున్నాడు హనుమంతుడు.
🍃🌺రంగు రంగుల చీరలతో వివిధ విధాలయిన ఆభరణాలతో అలరారే నారీమణులు అర్థరాత్రివరకూ ఆసవాలు సేవించి, నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో వున్న సరోవరంలా వున్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన పద్మాలమీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖపద్మాలచుట్టూ భ్రమిస్తాయి.
🍃🌺తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకుని నేలకు జారిన తారాగణాల వలె వున్నారువారు.సడలిన కేశబంధాలు, చెదరిన అంగ భూషణాలు, జారిన పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటకు కరగిన తిలకాలు. పాన వ్యాయామ సమయంలో తెగిన ముత్తెపుసరులు.
🍃🌺జారిన వసనాలు, పట్టు సడలిన వడ్డాణాలు, తెగిపోయి ఊడి పడి పగిలిన కుండలాలు.
🍃🌺ఏనుగులు నలగ తొక్కిన లతామతల్లులవలె ఉన్నారు. చంద్రకిరణ శోభ లీనే ముత్యాలహారాల కిరివంకలా ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలు గోచరించాయి.
🍃🌺వారి అలంకారాలలో వైడూర్యమణులు రాజహంసలవలె, బంగారు హారాలు చక్రవాకాలవలె కనిపిస్తూంటే, హంసలూ చక్రవాకాలూ విహరించే నదులవలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి.
🍃🌺వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత కమలాలుగా, శృంగారక్రియలే మకరాలుగా, తనుద్యుతులే తటాలుగా వారందరూ నదీ దేవతల్లా వున్నారు.
🍃🌺కొందరి చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ భ్రమ గొలుపుతోంది. కొందరి నిట్టూర్పులకే వారి చేలాంచలాలు ముఖంమీద ఆడుతున్నాయి. అవి రంగు రంగుల పతాకాలవలె ఉన్నాయి.
🍃🌺ఆ గాలిసోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి. ఆ మహిళల కాంతిగంధానికి తోడు మధుపానగంధం కలిసివచ్చే వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి.
🍃🌺మద్యపాన వివశలయిన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూంటే, ఆ సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు.
🍃🌺మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపధానాలుగా కొందరు, ఎదుటి ఆమె వక్షస్థలం మీద తలవుంచి ఒకతే, దాని ఒడిలో తలపెట్టి యింకొకతె, తొడలమీద, పిరుదులమీద అలా ఒకరికి తెలియని మైకంలో ఒకరు హాయిగా నిద్రిముద్రలో వున్నారు. ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు.
🍃🌺తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలె వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నవారు నారీమణిహారంలా ఉన్నారు.
🍃🌺వసంత వాయువుకు కదలియాడే లతలు, పూవులు, ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరి నొకరి బంధించుకున్నారు.
🍃🌺ఎవరి అవయవాలు ఏవో, ఎవరి అలంకారాలు ఏవో, ఎవరి కేశాలంకారం యేదో తెలియకుండా ఉంది. బంగారు దీపాలవలె వున్నారు.
🍃🌺ఇందరినీ రావణుడు తన పరాక్రమంతోనే తెచ్చాడు. కొందరు మాత్రం రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితులనెవరినీ తీసికొని రాలేదు. ఇతరుల యందు అనురాగం వున్న ఆడదాన్నీ తేలేదు.
🍃🌺వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. అందరినీ చూస్తూ హనుమంతుడు అనుకున్నాడు.
🍃🌺వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీ దేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థమయేది. ఎంతటివాడయినా సీతాపహరణంతో తుచ్చుడయాడు రావణుడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌻 బుధవారం గరుడుని - పూజిస్తే నాగదోషం పోతుందని చెబుతున్నారు పండితులు... 🌻
🍃🌺బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
గరుడాళ్వార్ నారాయణ స్వామికి వాహనధారుడు, గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి.
అందుకే బుధవారం పూట గరుడాళ్వార్ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఆలయంలోనే కాకుండా... ఇంట్లోనూ రోజూ గరుడాళ్వార్ను తలచి పూజ చేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి...
🍃🌺చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి, వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది, సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి, తర్వాతే స్వామిని దర్శించుకోవాలి.
🍃🌺ఇది వైష్ణవ ఆగమ పద్ధతి, ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు...
🌻 గరుడాళ్వార్ దర్శనం: 🌻
🍃🌺ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి.
సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం,
మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది,
బుధవారం శత్రుభయం వుండదు...ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి,
శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది,
శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది...
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
[6:58 pm, 14/04/2021] +91 94414 08564: 🌻 మహా భారతం 🌻
🎈 భాగము 96 🎈
💧 భీమ హిడింబాసురుల సంగ్రామం 💧
🍃🌺చెల్లెలి మీదవిరుచుకుపడబోతున్న హిడింబాసురుని అడ్డగించి-‘‘ఆగాగు! ఏమన్నావు ఏమన్నావు? నీ చెల్లెలుతో పాటు మా అందర్నీ ఒక్కుమ్మడిగా తింటావా! రా మరి’’ అంటూ కుడి చేతి పిడికిలి బిగించి, దాన్ని ముద్దిడి, తర్వాత అదే పిడికిలితో హిడింబాసురుని ముఖం మీద గట్టిగా ఒక్కటిచ్చాడు భీముడు. ఆ దెబ్బకి హిడింబాసురుడికి ఏదీ కనిపించలేదు. అంతా చీకటి మయం అనిపించింది.
🍃🌺‘‘రాక్షసి అయినా స్త్రీ కాబట్టి ఈ హిడింబ మీద ఈగను కూడా నేను వాలనివ్వను. మాకు స్త్రీలంటే చాలా గౌరవం’’ అంటూ హిడింబాసురుని మళ్ళీ కొట్టాడు భీముడు.‘‘ఏది పడితే అది తిని బాగా బలిశావు. నీలాంటి వాణ్ణి చంపి మృగాలకు ఆహారంగా వేస్తే సంతోషిస్తాయవి’’ అంటూ మళ్ళీ భీముడు కొట్టబోయేంతలో ఆసరికి తేరుకున్న హిడింబాసురుడు, అతన్ని గట్టిగా ఎదుర్కొన్నాడు. భీముడి రెండు చేతుల్నీ విరిచి పట్టుకున్నాడు.
🍃🌺పట్టుకున్నంత సేపు పట్టలేదు. అంతలోనే విడిపించుకుని హిడింబాసురుని చేతుల్రెంటినీ మెలిపెట్టి, తమ పోరు కారణంగా అన్నదమ్ములకు, తల్లికీ నిద్రాభంగం కాకూడదని ఆ అసురుణ్ణి అల్లంత దూరానికి లాక్కుపోయాడు భీముడు. అక్కడ ఇద్దరూ మదకరీంద్రాల్లా తలపడ్డారు. వారి భీకర సమరానికి అక్కడ చెట్లు, శిలలు తునాతునకలై అంతెత్తున ఎగిరాయి. పెంధూళి ఆకాశమంతటా అలముకుంది. హిడింబాసురుని పట్టుకు భీముడు దొరికిపోయాడు.
🍃🌺అతన్ని గట్టిగా అదిమి పెట్టి భూనభోంతరాళం దద్దరిల్లేట్టుగా పెద్దగా కేక పెట్టాడు హిడింబాసురుడు. ఆ ధ్వనికి కుంతీ పాండునందనులందరు మేల్కొన్నారు. అటుగా చూశారు. రాక్షసుడెవరితోనో భీముడు పోరాడుతున్నాడు. ఇటుగా చూశారు. ఎవరో స్త్రీ...అతిలోక సౌందర్యంతో వెలుగులు విరజిమ్ముతూ నిలుచుని ఉంది. రాక్షసునితో పోరాడుతున్న భీముని కళ్ళార్పకుండా చూస్తూ భయంతో వణికిపోతోంది.
🍃🌺ఆమెను సమీపించింది కుంతి.‘‘ఎవరమ్మా నువ్వు? ఈ వనానికి దేవతవా? లేకపోతే ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సరసవా? ఎవరు నువ్వు? ఎందుకింతలా వణికిపోతున్నావు’’ అడిగింది.‘‘నా పేరు హిడింబ. అదిగో అక్కడ నీ కొడుకుతో పోరాడుతున్న రాక్షసుడు లేడూ...వాడు మా అన్న. మా ఇద్దరికీ ఈ అడవే ఆవాసం. నరమాంసం అంటూ మిమ్నల్ని వధించి రమ్మని హిడింబాసురుడు నన్నిక్కడకు పంపించాడు.
🍃🌺అయితే నీ కొడుకుని చూసి మరులుకొని, అతడే నా జీవితేశ్వరుడని నిశ్చయించుకుని నిలబడితే...జరిగిన ఆలస్యానికి కోపగించుకుని హిడింబాసురుడు ఏతెంచాడు. వస్తూనే భీమునితో కయ్యానికి కాలు దువ్వాడు’’ అంది హిడింబ.‘‘నాకు నమ్మకం ఉందమ్మా! నీ భీమకుమారుడు మా అన్నను అనాయసంగా జయిస్తాడు. మనల్ని సంరక్షిస్తాడు’’ అంది మళ్ళీ.
🍃🌺ఆ మాటలకి కుంతీదేవి సన్నగా నవ్వింది. ‘భయపడకు’ అన్నట్టుగా హి డింబను దగ్గరగా తీసుకుంది.భీమ-హిడింబాసురులిద్దరూ భీకర మల్ల యుద్ధానికి తలపడ్డారు. వారి యుద్ధం చూస్తోంటే ఇది ఇప్పట్లో ముగిసేలా లేదనిపించింది. దాంతో అర్జునుడు భీమసేనుని సమీపించి-‘‘అన్నయ్యా! అదిగో తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. రౌద్ర ముహూర్తంలో రాక్షసులు అత్యంత శక్తివంతులై విజృంభించగలరు. అందుకని ఆలస్యం చేయక ఈ రాక్షసాధముణ్ణి వెనువెంటనే వధించు’’ అన్నాడు.
🍃🌺‘సరే’నన్నట్టుగా ఊహకందని రీతిలో హిడింబుని పాదాన్ని దొరకబుచ్చుకుని వాణ్ణి గిరగిరా తిప్పాడు భీముడు. హిడింబుడు రక్తాన్ని కక్కుకున్నాడు. స్పృహ కోల్పోయాడు. అదే అదనుగా హిడింబుని అక్కడి కొండకు పదే పదే కొట్టి వాడి వెనె ్నముకను ముక్కలు చేసి, ముద్దచేసి ఆకాశంలోకి విసిరేశాడు. ఆకాశంలోంచి పెనుమూటలా కిందపడి కర్ణకఠోరంగా ఆక్రోశించి చనిపోయాడు హిడింబాసురుడు. ఆ చిత్రవధను కుంతీ పాండవేయులు ఆనందంగా చూసి భీముని అభినందించారు.
🍃🌺తర్వాత అర్జునుని మాట మేరకు సుదూరంగా గోచరించే నగరాభిముఖులై బయల్దేరారు. వారిని హిడింబ అనుసరించసాగింది. అది గమనించి వాయునందనుడు-‘‘నువ్వెక్కడికి? రాక్షసులను నేను నమ్మను! నా మీద నీ ప్రేమను కూడ నేను నమ్మను! పో! లేకపోతే నీ అన్నకు పట్టిన గతే నీకూ పడుతుంది’’ అని బెదిరించాడు. ఆ బెదిరింపునకు హిడింబ గజగజ వణికిపోయింది. భయపడింది. ఆమె భయాన్ని గుర్తించిన ధర్మనందునుడు-
🍃🌺‘తప్పు తమ్ముడు! ఆవేశంలో ఆడది అని చూడకుండా మాట్లాడుతున్నావు. స్త్రీ వధ మహా పాపం. అదలా ఉండగా...రాక్షస స్త్రీ అయినా హిడింబలో ఆ రాక్షస గుణాలు కనిపించడం లేదు. చాలా మంచిదానిలా కనిపిస్తున్నది’’ అన్నాడు భీముడితో. ధర్మనందనుడు ఆ విధంగా మాట్లాడేసరికి హిడింబకు కొంచెం ధైర్యం కలిగింది.
🍃🌺ఆ ధైర్యంతో అతనికి నమస్కరించి తర్వాత కుంతీదేవిని సమీపించి-‘‘తల్లీ! ప్రాణికోటికి ఈ మన్మథవేదన సామాన్యమే కదా! పైగా నేను స్త్రీని! స్త్రీలకు ఈ వేదన మరింత దుస్సహం. భీమసేనుని చూడగానే నన్ను నేను మరచిపోయింది ఇందుకే! నేనా వీరాగ్రేసురుణ్ణి వరించాను. నన్ను కాదంటే నేనిక జీవించజాలను. చెప్పండమ్మా! నన్ను కరుణించమని మీ కుమారునికి చెప్పండి’’ అని ప్రాధేయపడింది.‘‘నన్ను కరుణిస్తే మీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను.
🍃🌺కావాలంటే మిమ్మల్నందరినీ కోరిన చోటుకి కొనిపోగలను’’ అంది మళ్ళీ.‘‘నన్ను నమ్మండమ్మా! నాకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు! కావాలంటే చూడండి! మీకో సంగతి చెబుతాను. కొద్ది దూరంలో మీకొక సరోవరం కనిపిస్తుంది. దాని ఒడ్డున ఓ చెట్టు కూడా ఉంటుంది. అక్కడా సరోవరం, ఆ చెట్టూ రెండూ శాలిహోత్ర మహాముని తపశ్శక్తి వల్ల ఉద్భవించాయి. మీరా సరోవరంలోని నీటిని తాగితే ఆకలి దప్పికలు ఇక ఉద్భవించవు.
🍃🌺అలాగే గట్టున ఉన్న చెట్టు నీడన విశ్రమిస్తే శీత వాతాతప వర్షాది బాధలు ఉండవు. మీరలాగే చేస్తారిప్పుడు. మీరా చెట్టు కింద విశ్రమించిన సమయంలోనే కృష్ణద్వైపాయన మహర్షి సమీపించి మీకు హితోపదేశం చేస్తారు’’ అన్నది హిడింబ. ఆ మాటలకు కుంతీ పాండుకుమారులు కడు సంతోషించారు. హిడింబను దగ్గరగా తీసుకుని-‘‘భీమసేనా! నేను, నీ అగ్రజుడు...మేము ఆజ్ఞాపించినట్టుగానే నువ్వు ప్రవర్తించాలి. అది ధర్మం కూడా. హిడింబ ఉత్తమ సాధ్వి. అందులో అనుమానం లేదు. పాండు మహీపతి వంశాభ్యుదయం కాంక్షించి నువ్వు ఈ మనోహరిని చేపట్టక తప్పదు’’ అన్నది కుంతి.
🍃🌺‘‘తప్పదన్నయ్యా! అమ్మ-అన్నల మాట కాదనకు’’ అన్నారు అర్జునాదులు. హిడింబ కూడా దోసిలి పట్టి దీనంగా వేడుకోవడంతో-‘‘సరే మీ ఇష్టమే నా ఇష్టం’’ అని హిడింబను చేపట్టేందుకు భీమసేనుడు అంగీకరించాడు.‘‘నా కుమారుడు నిన్ను ఒప్పుకున్నాడు. అయితే నువ్వు కూడా మా పద్ధతులు కొన్ని ఒప్పుకోవాలి. ఈనాటి నుంచీ నువ్వు కులాంగనా మర్యాదలు అవలంబించి సదాచార పద్ధతులను అనుసరించాలి.
🍃🌺పగటి పూట మీ ఇష్టం. నువ్వు, మా భీమసేనుడు యథేచ్ఛగా విహరించి వినోదించవచ్చు. రాత్రయితే మాత్రం మీరిద్దరూ మా సమీపంలోనే ఉండాలి’’ అన్నది కుంతి. ఆమె మాటకు అంగీకరించింది హిడింబ. అయితే ఓ కొడుకును కనేంత వరకే తాను హిడింబతో ఉండగలనని శపథం చేశాడు భీముడు.తర్వాత తల్లితో పాటుగా పాండవేయులు శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు.
🍃🌺మర్నాడు అక్కడి సరోవరంలో స్నాన సంధ్యాదులు ముగించుకుని, మహర్షి సపర్యలు అందుకుని ఆ తర్వాత అక్కడి చెట్టు నీడలో విశ్రమించి ఆకలి-దాహం లేనివారై అద్భుత ఆనందాన్ని అనుభవించారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:59 pm, 14/04/2021] +91 94414 08564: 🌺 తాళపత్రం 🌺
🥀 96 వ రోజు 🥀
🌻 నక్కకూత చెడు శకునమా? 🌻
🍃🌹నక్కకూత చెడు వార్తలను తెస్తుందని భారతీయులు విశ్వసించేవారు. నక్కకు మన కంటికి కనిపించని దయ్యాలు మరియు యక్ష కిన్నరాది దేవతలను చూడగల శక్తి ఉంది అని చెబుతారు.
🍃🌹మన పూర్వులు అరణ్య ప్రాంతాలకు మరియు చిట్టడవులకు సమీపంలో నివసించేవారు. కావున ఈ విశ్వాసం ప్రబలడానికి అవకాశమేర్పడింది.
🍃🌹జంతువులు ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా సంభోగేచ్చ కలిగి తోడును కోరినప్పుడు కూతలు వేస్తాయి. నక్కలు సహజంగా భయపడినప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు కూతలు వేస్తాయి. తోడు తన సమక్షంలో ఉన్నప్పుడు కూడా అవి కూతలు వేయడం కద్దు. కొన్ని సార్లు సంబోగం వల్ల గాని కడుపు నిండా తిన్న సంతృప్తి వల్ల కానీ నక్కలు కూతలు వేస్తాయి.
🍃🌹ఇలాంటి సమయంలో అవి క్రూరంగా ఉండి దాడి చేయడానికి అవకాశముంది.
🍃🌹కావున పెద్దలు పిల్లలను భయపెట్టి అదుపు చేయడానికి నక్కలు దయ్యాలను లేక యక్ష కిన్నరాది అతీంద్రియ శక్తులను చూసి కూత పెడుతున్నాయని చెప్పి వారిని ఇంటి నుండి బయటకు వెళ్ళనీయకుండా చేసి వారిని ప్రమాదం నుండి కాపాడేవారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:02 pm, 14/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 🌀
🌹 96. సర్వేశ్వరః 🌹
🌺 ఓం సర్వేశ్వరాయ నమః 🌺
సర్వేషాం (ఈశ్వరాణాం) ఈశ్వరః ఈశ్వరులగు ఎల్లవారికిని ఈశ్వరుడు.
:: మాండూక్యోపనిషత్ ::
ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోఽన్తర్యామ్యేష
యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ॥ 6 ॥
🍃🌹ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే సర్వజ్ఞుడు, ఇతడే అంతర్యామి, ఇతడే అంతటికీ కారణము. ఇతడే సమస్త భూతముల యొక్క ఉత్పత్తిలయాలకు స్థా
🙏🙏🙏🙏?
🍃🌺ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు. మత్స్య జయంతి చైత్ర బహుళ తదియ నాడు జరుగుతుంది.
🍃🌺బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’ అని అంటారు.
🌻 మత్స్యావతారం అసలు కథ 🌻
🍃🌺వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది
🍃🌺 “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు.
🍃🌺ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని , నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి , అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.
🍃🌺మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.
🍃🌺బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా , “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు.
🍃🌺బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి …… వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.
🌻 మత్స్య జయంతి విధి విధానాలు 🌻
🍃🌺ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు , కావున ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది.
🍃🌺మోక్షం , హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ , ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:03 pm, 14/04/2021] +91 94414 08564: 🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 10 🎈
🌻 పట్టమహిషి : శయనాగారం 🌻
🍃🌺సాగి సాగి హనుమంతుడు ఏనుగు దంతాలతో, పదారు వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక, వైడూర్య, రత్నాలతో అలంకృతమయిన శయ్యను చూశాడు. ఒకవంక చంద్రకాంతితో తెల్లని గొడుగు. మరొక వంక సూర్యకాంతితో, అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం. శయ్యమీద అజిన చర్మం.
🍃🌺అగరు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు. తెల్లని వింజామరలతో అందగత్తెలు.
🍃🌺ఆ శయ్యమీద మేఘసన్నిభుడైన మహావీరుని చూశాడు. పొడుగాటి బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు, చీనాంబరం, శరీరమంతా మంచిగంధపుపూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపు కాంతుల మేఘంలా వున్నాడు.
🍃🌺లతా, తరుశోభితమయిన మందరగిరిలా ఉన్నాడు. హాయిగా మధుపానం చేసి, మదవతీ పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాడు.
🍃🌺కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు. బుస కొడుతున్న కోడెత్రాచులా వున్నాడు. ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి, మరొక వేదిక మీదకు నడిచి చూశాడు.మత్తేభం అధివసించిన ప్రస్రవణగిరిలా ఉంది, రావణుడు నిద్రిస్తున్న ఆ శయ్య ఇంద్ర ధనుస్సులా వున్నాయి వాని బాహువులు.
🍃🌺దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు, వయుధాన్ని ఢీకొని గట్టి బొప్పికట్టి వున్నాయి. విష్ణుచక్రపు రాపిడికూడా అనుభవించాయి.
🍃🌺చక్కగా, బలిసి, మంచి కణుపులతో, సర్వలక్షణ లక్షితములై అలరారుతున్న గోళ్ళతో, వ్రేళ్ళతో ఆ బాహువులు అయిదు పడగలపాములా ఉన్నాయి. వాటికి మంచిగంధపు పూతలున్నాయి. మందరగిరిమీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తున్న మహాసర్పాలవలె వున్నాయి.
🍃🌺అంతటా సురపొన్న సౌరభం, పొగడపూల పరిమళం. మధుర మదిరాగంధం - అది అంతా ఆ రావణుని నిశ్వాసవాయువే.మణి, రత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులీనే కుండలాలు.రక్త చందనాల కృతం, మణిహార భూషితం అయిన విశాల వక్షస్థలం పసుపురంగు పంచె, తెల్లని ఉత్తరీయం.చూస్తున్నాడు హనుమంతుడు.
🍃🌺గంగానది ఒడ్డున విశ్రమించే ఏనుగులా వున్నాడు. మినుముల రాశిలా ఉన్నాడు. నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు.
🍃🌺ఆ రాక్ష సేంద్రుని పాద సమీపంలో కొందరు భార్యలు. వారు చంద్రవదనలు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంగల వనితలు కొందరు ఆయన కటి ప్రాంతంలోనూ, భుజసీమ దగ్గరావున్నారు. వారందరితో గృహం తారాశోభితమయిన ఆకాశంవలె ఉన్నది.
🍃🌺అలసి, అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట, కొందరు. ఒకతె నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది.నదిలో తరంగాలతో కదలిపోయి నావ చాటున చేరిన కమలం వలె. ఒక కమలముఖి వీణను కౌగలించుకుని ఉంది.
🍃🌺పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక మదవతి.చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాద్యాన్ని చుట్టుకుని పడుకుంది.
🍃🌺ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది.
🍃🌺మరొకతె మద్దెల నానుకుని నిద్రించింది. భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకతే కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది, భేరీ వాద్యాలింగనంతో, ఒకతె వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్న దొక పూబోణి పగలకొట్టిన కుండనీటిలో తడిసి.సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రౌఢ ఒకతె ఒక చంద్రానన మరొక సుశ్రోణిని కౌగలించుకుని పరవశంతో నిద్రిస్తున్నది.
🍃🌺కామ తీవ్రతగల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీ వాద్యాలను ఆలింగనం చేసుకున్నారు.
🍃🌺ఆ రమణీయ రమణీగణంలో అందరికంటె విశిష్టంగా, అత్యంత సౌందర్యంతో, మణి రత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా, సువర్ణకాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఈమెయే అనుకున్నాడు.
🍃🌺అనుకున్న క్షణంలో ఆయన కపి ప్రకృతి విజృంభించింది. తోక నేలకు కొట్టాడు. తోకను ముద్దు పెట్టుకున్నాడు.
🍃🌺గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు.
ఇది 9, 10 సర్గలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 15.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
అవినీతికి పాల్పడేవారికి చివరకు మిగిలేది ఆవేదనా.... అవమానాలే
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించినదట ఇదేమి విచిత్రమో! నిజంగా చిత్రమే! మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎదుటి వారి లోపాలను చూస్తాడు!!
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 17.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
చెడు చేసేవాడే తన గురించి ఇతరులు చెడుగా అనుకుంటున్నారేమో అని ఆతృత పడతాడు.
మంచి చేసేవాడు మౌనంగానే ఉంటాడు. మంచి చేస్తూనే వుంటాడు.
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
మితి మీరిన నమ్మకం చాలా ప్రమాదం. నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంద
🌻 తిరుమల ఆలయంలో పవిత్రోత్సవాలు అంటే ఏమిటి 🌻
🍃🌺ఏడుకొండల వెంకటేశుడికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తారు. ఆయా మాసాల్లో నిర్దిష్టంగా ఆచరిస్తున్న సేవలు, ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో నేటికీ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు విశిష్ట కైంకర్యంగా నిర్వహిస్తారు.
🍃🌺తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం యేటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
🌻 దోషాల నివారణార్థం: 🌻
🍃🌺వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ, మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటుచేసుకుంటాయి.
🍃🌺అలాంటి దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటుచేసు కోవచ్చు.
🍃🌺వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా ఆ దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియాకలాపంతో కూడిన కార్యక్రమాలుగా అత్యంత ప్రవిత్రంగా నిర్వహిస్తారు.
🍃🌺ఆలయ శాసనాలలో: తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుండే ఈ పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాలను బట్టి తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుండి టీటీడీ క్రమం తప్పకుండా యేటా శ్రావణమాసం ( ఆగస్టు) లోని శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశిలలో మూడు రోజులు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది.
🌻 మొదటిరోజు - అంకురార్పణ 🌻
🍃🌺పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయ నైరుతిదిశలోని వసంతమండపానికి చేరుకుంటారు. అక్కడే భూమిపూజ చేసి మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలోని అంకురార్పణ మండపంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు.
🍃🌺తొలిరోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో మలయప్పస్వామి పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారుచేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించి హోమాలు నిర్వహిస్తారు.
🍃🌺స్నానపీఠంపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పుసుపు, చందనాలతో తిరుమంజనం (అభిషేకం), ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
🌻 రెండో రోజు - సమర్పణ: 🌻
🍃🌺తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారు... వీరందరికీ సమర్పిస్తారు.
🍃🌺జయవిజయులు, గరుత్మంతునికి, ఆనంద నిలయంపైన కొలువైన విమాన వేంకటేశ్వరునికి, ఆలయంలో పరివార దేవతలైన విష్వక్సేనుడు, యోగ నృశింహస్వామి, ఇతర దేవతామూర్తులు, ఉత్సవమూర్తులకు, రామానుజుల వారికి, పోటు తాయారు, పుష్పమండపంలోని శ్రీకృష్ణస్వామికి, ఇతర విగ్రహమూర్తులకు, ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామి మూలమూర్తికి, అదే ఆలయంలోని పరివార దేవతలకు, పుష్కరిణి గట్టుపై వెలసిన ఆంజనేయస్వామికి, అఖిలాండం వద్ద బేడి ఆంజనేయస్వామికి పట్టుపవిత్రాలు సమర్పిస్తారు.
🌻 మూడోరోజు - ముగింపు 🌻
🍃🌺తొలిరోజు తరహాలో హోమాలు, అభిషేకాదులు, పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగమోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
[6:53 am, 17/04/2021] +91 94414 08564: 🙏 ఆనంద నిలయంలో ఆండాళ్ పాశురాల పారాయణ 🙏
🍃🌺ఏడుకొండలవాడు ఏడేడు లోకాల్లో ఈడే లేని, సరిజోడే లేని విచిత్రమైన దేవుడు! వింత వింత వెలుగుల దేవుడు!
🍃🌺తిరుమలలోని విచిత్రాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన ఉన్న 'బంగారుమేడ' విచిత్రమే. ఆయన రూపే విచిత్రం! ఆయన నిలువెత్తు అలంకారాలు విచిత్రమే! ఆయనకు చేసే నివేదనలు విచిత్రాతి విచిత్రం! ఆయనకు నిర్వహించే ఉత్సవాలేమీ, ఊరేగింపులేమీ ఇవన్నీ విచిత్రమే! ఇన్ని విచిత్రాలను చూస్తూ ఆనందంగా అనుభూతులను పొందడానికే నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలి రావడం మరీ విచిత్రాతి విచిత్రం!
🍃🌺ఈమాట నూటికి నూరుపాళ్లు సత్యమైనమాట! అందులోను ఏడాదిలో ఒకనెల మాత్రం తిరుమల క్షేత్ర చరిత్రలోనే మరీ విచిత్రం!
ఆ నెలే ధనుర్మాసం.
🍃🌺ఈ ధనుర్మాసం మార్గశిరం (మార్గళి), పుష్యం(తై). ఇలా రెండు నెలల్లో కలసి వస్తుంది. అనగా ప్రతి సంవత్సరం డిశంబరు 15 నుండి జనవరి 14 వరకు గల …
[6:59 am, 17/04/2021] +91 94414 08564: 🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 42 🙏
🍃🌹తెలివి తక్కువ వాడు చేసే పని యెలా వుంటుందో ఈ పద్యం వివరించింది
ఉ.వీడును కూడులేక పలవించు దరిద్రునిజేరి యప్పుగా మాడలనిమ్మటంచు బతిమాలిన నాతడు నీయనేర్చునే వాడినగడ్డికేమొగము వాచిన యావెటొ యీనబడ్డ పా లూడకె యీయకున్న నొక దుత్తెడుగోరుటె వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! లోకంలో ఒకడు వీడు, గూడు, కూడు- ఈ మూడు లేక చిరునామా అసలు లేక బాధపడుతుంటే, దరిద్రుడై పలవిస్తుంటే, వాడి వద్దకు వెళ్ళి కొన్ని రూపాయలు అప్పుగా యివ్వమని ప్రాధేయపడి అడగడం ఎలా వుంటుందంటే
🍃🌹వాడిన గడ్డికే మొగము వాచి, తింటానికి లేక బక్కచిక్కిన యావు ఏదోరకంగా బాధపడి కన్న చిన్న దూడకు కొన్నిపాలు ఇవ్వడానికే లేక నానా అవస్థలు పడుతుంటే దానివద్దకు దుత్తనొకటి తీసుకొని వెళ్ళి దాని నిండా పాలనివ్వమని కోరితే ఎలా వుంటుందో అలా వుంటుంది.
🍃🌹అది “ఉపయోగం లేని పని ప్రయోజనం శూన్యం” అవుతుంది తెలివిలేనివానిపని అవుతుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[7:00 am, 17/04/2021] +91 94414 08564: 🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 12 🎈
🌻 మనస్తాపం 🌻
🍃🌺రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రమయిన లతాగృహాలు, నిశాసౌధాలు అన్నీ తిరిగాడు.జానకీదేవి జాడలేదు. ఈ దుష్ట రాక్షసుని చేతులలో పడడం యిష్టంలేక జానకీదేవి ప్రాణ త్యాగం చేసి ఉండాలి. ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో!
🍃🌺ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళడమెలా! ఆ కపిరాజు దండనీతి విషయంలో చాలా తీక్షణదృష్టి కలవాడు. అంతకు ముందుగా - వానరవీరులందరూ కనిపిస్తారు. వారికేం చెప్పాలి. సుగ్రీవుడు పెట్టిన గడువుదాటింది కనక వారంతా ప్రాయోపవేశం చేస్తారు. సముద్రం దాటి వెళ్ళగానే అంగద, జాంబవంతులు ఎదురువస్తే వారికి ఏం చెప్పను, అని చింతించాడు.
🍃🌺అంతలో వివేకం తెచ్చుకుని సర్వ అనర్ధాలకూ దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం. మరోసారి అంతటా వెదకుతాను, అనుకుని మళ్ళీ అన్ని వనాలూ, శాలలూ, భవనాలూ వెదుకుతున్నాడు.
🍃🌺రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యాసమూహాన్ని చూశాడు. సీత జాడలేదు.మళ్ళీ విచారంలో పడ్డాడు. ఇందరు వానరుల శ్రమకూ ఏవిటి ఫలితం?
🍃🌺రామచంద్రునికి ప్రీతికరమయిన పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా వెదకగలిగినా అమ్మవారి జాడలేదు.గృధ్రరాజు సంపాతి చెప్పాడే - సీత లంకలో ఉన్నదని? ఎక్కడుంది ఆవిడ? మిధిలాధీశుడయిన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా! ఒకటి జరిగి ఉండవచ్చు.
🍃🌺రామబాణభీతితో వచ్చే రావణుడు తీవ్రవేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి. లేదా సీత స్వయంగానే సాగరమధ్యంలో పడిపోయిందేమో! ఈ దుష్టుడి బాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీల రక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ యిల్లాలిని తిని ఉంటాడా! కాకుంటే - ఈ రాక్షస స్త్రీలే ఆరగించి ఉండరుకదా! రామనామ జపంతో ఆవిడే తనువు చాలించిందా!
🍃🌺కాకుంటే ఆ రావణాంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం రామనామం జపిస్తూ ఉండదా!
🍃🌺ఇప్పుడు వెళ్ళి రామచంద్రునికి ఏం చెప్పాలి! వెళ్ళిన తరువాయి ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే.అదీకాక - సీతను చూడకుండా వెడితే నేను ఏం సాధించినట్లు?
🍃🌺సీత కనబడలేదు, అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూచి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని ఆయోధ్యలో భరత, శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు.
🍃🌺కృతజ్ఞతకు మారుపేరయిన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా! ఆయనతో పాటు ఆయన భార్య రుమ, తార, అంగదుడు వీరందరూ దేహయాత్ర ముగిస్తారు.
🍃🌺ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బద్దలు కొట్టుకుంటారు! విషం మింగుతారు, ఉరిపోసుకుంటారు, అగ్నిగుండాలలో దూకుతారు,ఉపవాసాలతో మరణిస్తారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకువంశం, ఇటు సర్వవానరజాతి నాశనం తధ్యం.
🍃🌺అందుచేత నేనిక్కడే వానప్రస్థ జీవితం గడిపితే వారందరూ నేనింకా సీతాన్వేషణం చేస్తున్నాననే ఆశతో జీవిస్తారు.
🍃🌺ఏమయినా సరే నేను వెళ్ళక పోవడమే మంచిది. చితి పేర్చుకుని అందులో దూకుతాను. లేదా ఏ చెట్టు క్రిందనో ఉపవాస నియమంతో కూర్చుంటే కాకులూ, కుక్కలూ నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్యాణ మార్గం.
🍃🌺సీతను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి, అని కొంతసేపు విచారించి ఛీ! మరణం కంటె దోషం లేదు. బ్రతికి ఉంటేనే సుఖాలకు ఆస్కారం ఉంది; ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు, ఇప్పుడింక ఈ దశకంఠుని కడతేరుస్తాను. కాదు, వీణ్ణి బలిపశువులా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను.
🍃🌺అనుకుంటూ మళ్ళీ శోకసముద్రంలో మునిగి ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో యిక్కడే శేషజీవితం గడుపుతాను, అందువల్ల అయోధ్యలో వారూ కిష్కింధలో వీరూ సుఖంగా ఉంటారు, అనుకుని ముందుకు సాగాడు.
🍃🌺ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకూ ఈ వనం చూడలేదు, అనుకుంటూ, ఆదిత్య, వసు, రుద్ర, అశ్వనీ దేవతలకు నమస్కరించి:
🍃🌺తపస్వి జనానికి ఫలసిద్ధివలె ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవిని రామునికి అందించాలి, అనుకుని: రామ లక్ష్మణులకు,జానకీదేవికి, ఇంద్ర, రుద్ర, వాయు, యమ దేవతలకు నమస్కారం. సూర్య, చంద్రులకు ప్రణామం. మా ప్రభువు సుగ్రీవునికి అభివాదం, అనుకుంటూ అశోకవనం వయిపుసాగుతూ:
🍃🌺ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు, అనేకులు రక్షిస్తూ ఉండవచ్చు. వాయువుకూడా యిక్కడ తగు వూత్రంగా చలిస్తూంటాడు.
🍃🌺ఇప్పుడింక నా కార్యసాధనకు దేవతలూ, ఋషులూ సాయపడాలి. చతుర్ముఖ ప్రజాపతితో సర్వదేవగణాలూ, అగ్నిహోత్రుడూ, వాయువూ, వజ్రధారి డేమేడ్రుడూ, పాశహస్తుడయిన వరుణుడూ, సూర్య, చంద్రులూ, త్రినేత్రధారి శివుడూ, అశ్వనీ దేవతలూ అందరూ నాకు కార్యసిద్ధి యివ్వాలి. సర్వభూతాలూ, భూతనాథులూ, నా యత్నానికి తోడుపడాలి. ప్రసన్న చంద్రబింబంవంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి.
🍃🌺పరమ దుష్టుడూ, నీచుడూ, క్రూరుడూ అయిన ఈ రావణునిచే అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలనో - అనుకుంటూ అశోకవనం వయిపు సాగుతున్నాడు.
ఇది 11, 12, 13 సర్గలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
[8:01 pm, 17/04/2021] +91 94414 08564: 🌻 మహా భారతం 🌻
🎈 భాగము 99 🎈
💧 ద్రౌపదీ స్వయంవరం 💧
🍃🌺బక వధానంతరం పాండవేయులు చతుర్వేదాలను అభ్యసిస్తూ అందరి మన్ననలను అందుకుంటూ ఏకచక్ర పురంలో జీవించసాగారు. ఆ సమయంలో ద్రుపదుని రాజధాని కాంపిల్య నగరం నుండి బ్రాహ్మణుడొకడు పాండవులు ఉంటున్న విప్రవర్యుని ఇంటికి అతిథిగా విచ్చేశాడు. అతనిని ధర్మరాజాదులతోపాటు కుంతీదేవి సందర్శించి-‘‘భూసురేంద్రా! తాము చూసిన రాజాధిరాజులలో గుణవంతులెవరు’’ అని ప్రశ్నించింది.
🍃🌺‘‘ఇంకెవరున్నారమ్మా! ఆ ద్రుపద నరేశ్వరుడే! సద్గుణాలలో ఆ భూపతికి సరిజోడు లేరు’’ అన్నాడు బ్రాహ్మణుడు.‘‘అంతేకాదమ్మా! ఆ నరేశ్వరునికి అగ్నిహోత్ర జ్వాలాంజలి నుంచి ఓ అందాల రాశి సముద్భవించింది. ఆ చక్కని చుక్కకి అన్ని విధాలా తగిన వరుని కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. ఇటీవలే స్వయంవరం కూడా ప్రకటించారు’’ అన్నాడు మళ్ళీ. ఆ మాటలకి-‘‘హోమజ్వాల నుండి అందాల రాశి సముద్భవించడమా! బాగుంద…
[8:02 pm, 17/04/2021] +91 94414 08564: 🌺 తాళపత్రం 🌺
🥀 99 వ రోజు 🥀
🌻 ఇంటి పైకప్పు కంటే ఎత్తుగా ఎందుకు పొప్పడి చెట్టు పెంచకూడదు? 🌻
🍃🌹పొప్పడి చెట్టును ఇంటి పైకప్పు కంటే ఎత్తుగా పెంచకూడదని చెప్పడం జరిగింది. ఈ ఉద్దేశ్యం ముఖ్యంగా చుట్టుతా పూరిల్లు ఉన్నట్లయితే, సరియైనదే.
🍃🌹గ్రామీణ భారత దేశంలో వివిధ రకాలైనటు వంటి ఫలవృక్షాలను విరివిగా పెంచడం జరుగుతుంది.
🍃🌹ఫలాలను ఎక్కువగా తినడం వల్ల పాత తరంవారు విటమిన్లు ఎక్కువగా పొంది ఆరోగ్యవంతంగా ఉండేవారు. పొప్పడి కాయలో ఔషదీయ గుణాలు అధికంగా ఉంటాయి.
🍃🌹పచ్చి పొప్పడి కాయనుండి పాలలా ఉండే దాని ద్రవాన్ని తీసి పాపడాలపై రుద్ది వేయించి తింటే పిల్లల కడుపులో ఉన్న విషక్రీములు నశిస్తాయని ఆయుర్వేదం తెలుపుతుంది. మంచి జీర్ణ వ్యవస్థకు మరియు ఆరోగ్యానికి ఈ పద్దతి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.
🍃🌹ఇలా పొప్పడితో ఎన్నో ప్రయోజనాలున్నా, చెట్టు ఇంటి కప్పు కంటే ఎక్కువ పెరిగితే నిస్సంశయంగా నరికి వేయడం జరుగుతుంది. పొప్పడి చెట్టు బలహీనమైన చెట్లలో ఒకటి. ఫలాలకోసం పొప్పడి చెట్లు ఎక్కినట్లయితే, చెట్టు కాండం విరిగి నీవు క్రింద పడే అవకాశం ఉంది.
🍃🌹అలాగే తుఫాను సమయంలో లేదా భారీ వర్షాల సమయంలో పొప్పడి చెట్టు విరిగి గుడిసె కప్పుపై పడినట్లయితే ఇంటికే కాక ఇంట్లోని వారికి దెబ్బలు తాకే అవకాశముంది. ఈ కారణంగానే పొప్పడి చెట్టును ఇంటి కప్పుకు పైగా పెరగనివ్వరు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[8:03 pm, 17/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 🌀
🌹 99. సర్వాదిః 🌹
🌺 ఓం సర్వాదయే నమః 🌺
🍃🌹సర్వాదిస్సర్వభూతానామాదికారణమచ్యుతః సర్వభూతములకును ఆదికారణము అగువాడు.
:: భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥ 37 ॥
🍃🌹మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్, అసత్తులకు (స్థూలసూక్ష్మ జగత్తులకు రెండింటికిని) పరమైనట్టి అక్షర (నాశరహిత) పరబ్రహ్మ స్వరూపూడవు నీవే అయియున్నావు.
🍃🌹బ్రహ్మదేవునకుగూడ ఆదికారణరూపుడవు కనుకనే సర్వోత్కృష్టుడునగు నీకేల నమస్కరింపకుందురు?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[8:04 pm, 17/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 40 (శ్రీవారికి గాయం) 🎈
🍃🌹అనుమానంతో వెనుకకు తిరిగి చూసిన అనంతాళ్వార్ కు ఆ పిల్లవాడు కనుపించాడు. వద్దన్నా పదే పదే తమ జోలికి వస్తున్న ఆ పిల్లవాణ్ణి తన చేతిలో ఉన్న గునపంతో కొట్టబోయాడు. ఆ పిల్లవాడు భయంతో, చేతిలో ఉన్న మట్టితట్టను అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నాడు. అయినా అనంతాళ్వార్ ఆ పిల్లవాడి వెంట బడ్డాడు.
🍃🌹ఆ పరుగులో, పిల్లవాడు చేతికి అందినట్టే అంది జారి పోతున్నాడు. శ్రీహరి అంత సులభంగా చిక్కుతాడా? దాంతో కోపం ఆపుకోలేని అనంతాళ్వార్ విసిరిన గునపం ఆ పిల్లవాడి గడ్డానికి తగిలింది. బొట బొటా కారుతున్న రక్తంతోటే ఆ బాలుడు పరిగెత్తుకుంటూ ఆనందనిలయం లోకి జొరబడి కనపడకుండా దాక్కుంటాడు.
🍃🌹వెదకి వేసారిన అనంతాళ్వార్ వెను దిరుగుతాడు. అనంతాళ్వార్, ఆ రోజు సాయం సమయంలో పుష్పమాలలతో ఆనందనిలయంలోకి వెళ్ళేటప్పటికి, వేంకటేశ్వర స్వామికి గడ్డం వాచి, రక్తం పెచ్చుకట్టి ఉంది. అది చూసిన అర్చకులు హడలి పోతారు. స్వామి వారి గాయాన్ని చూసిన అనంతాళ్వార్ కు తాను చేసిన ఘోరతప్పిదం తృటిలో అర్థమై, స్వామిని క్షమించమని ప్రాధేయపడ్డాడు.
🌻 పచ్చకర్పూరం బొట్టు 🌻
🍃🌹అప్పట్లో తన భక్తులతో నేరుగా మాట్లాడే శ్రీనివాసుడు, వ్యాకులతతో ఉన్న అనంతాళ్వార్ ను సమాధాన పరుస్తున్నట్లుగా - అర్చకులతో , "నా భక్తుడు గునపంతో కొట్టగా ఏర్పడిన గాయం మీద పచ్చకర్పూరపు బొట్టు పెట్టండి.
🍃🌹రాబోయే తరాలలో నా భక్తులు నా గడ్డం మీద పచ్చకర్పూరపు బొట్టును చూసి, అది అనంతాళ్వార్ అనే భక్తుడు కొట్టిన దెబ్బ అని చెప్పుకుంటుంటే, అది విని నేను మురిసిపోతాను" అని చెప్పి తన భక్తప్రియత్వాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా, స్వామివారు అనంతాళ్వార్ యొక్క నిరుపమాన భక్తిని ఆ విధంగా లోకానికి చాటిచెప్పారు.
🍃🌹స్వామివారి ఆజ్ఞానుసారం - ఆ సంఘటనకు గుర్తుగా, నేటికీ ప్రతిరోజూ, శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని మదిలోనే ఊహించుకొని, వారి గడ్డంపై నిత్యం ఉండే తెల్లటి మచ్చను తలచుకోండి. దాని వెనుక ఉన్న మర్మం ఇదే!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 18.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
విద్యకు మించిన శక్తివంతమైనదేదీ లేదు. అందుకే విద్యావంతుడు అజేయుడు!!
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
"ధనవంతుడు" సముద్రం లాంటివాడు ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. "గుణవంతుడు" బావి లాంటి వాడు ఊర్లో అందరి దాహం తీరుస్తాడు.
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
🌻 సూర్యభగవానుడిని విమలాదిత్యునిగా ఎందుకు పూజిస్తారో తెలుసా..? 🌻
🍃🌺సమస్త ప్రపంచానికి జీవనాధారమైన ఆ సూర్యభగవానుడికి, భానుడు, రవి వంటి వివిధ రకాల పేర్లతో పిలవడం గురించి మనం విన్నాం. కానీ సూర్య భగవానుడి విమలాదిత్యుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఈ విమలాదిత్యుని ఆలయం పరమశివుడు సృష్టించిన కాశీ నగరంలో కొలువై ఉంది.
🍃🌺కాశీలో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, మరి జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. అందుకే మరణించే లోపు ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగానదిలో స్నానం చేయాలని చెబుతుంటారు.
🍃🌺పరమపవిత్రమైన కాశీలో మనకు 12 సూర్య దేవాలయాలు కనిపిస్తాయి. ఈ పన్నెండు ఆలయాలలో ఒక్కో ఆలయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజిస్తుంటారు.
🍃🌺ఇందులో ఒకటిగా ప్రసిద్ధి చెందినదే విమలాదిత్యుని ఆలయం. అసలు ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి విమలాదిత్యుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారు, ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం..
🍃🌺పూర్వం విమలుడు అనే ఒక రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవారు. ఈ వ్యాధితో ఎంతో విరక్తి చెందిన రాజు తన భార్యా బిడ్డలను వదిలి కాశీకి చేరుకున్నాడు. కాశీలో విమలుడు ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్టించి భక్తితో పూజలు చేసేవాడు. తన తపస్సుకి మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై విమలుడికి కుష్టి వ్యాధిని నయం చేశాడు.
🍃🌺అదే విధంగా విమలుడు ప్రతిష్టించిన ఆదిత్య విగ్రహం ఇప్పటి నుంచి విమలాదిత్యునిగా పూజలందుకుంటాడని చెబుతారు. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, బాధలు, దారిద్య దుఖాలు ఉంటాయో అలాంటి వారు విమలాదిత్యుని పూజించడం వల్ల వారి బాధలు, దరిద్రం తొలగిపోతుందని తెలియజేస్తాడు. అందువల్ల కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు తప్పకుండా విమలాదిత్యుని ఆలయాన్ని దర్శించుకుని వెళ్తారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
🌻 దానం 🌻
🍃🌺వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తిని మూడడుగుల నేల దానమడిగాడు. వచ్చిన వాడు విష్ణువని, ఇవ్వడం వల్ల తనకు నాశనం తప్పదని తెలిసీ బలి ఇచ్చాడు. విష్ణువు తీసుకున్నాడు. అలా అడగడం, ఇవ్వడం రెండూ అద్భుత సన్నివేశాలు.
🍃🌺యాచించే వాడు ఎంత గొప్పవాడయినా చేయిచాస్తాడు. ఎదుటి వాని ఆధిక్యతను అంగీకరిస్తాడు. వాని చేయి కింద ఉంటుంది. ఇచ్చేవాడూ చేయి చాస్తాడు. తీసుకునే వాని గొప్పదనాన్ని గుర్తిస్తాడు. కానీ, వాని చేయి పైన ఉంటుంది.
🍃🌺ఈ ప్రక్రియలో ఇచ్చేవాడు, ‘నేను’ ‘ఇస్తున్నాను’ అనే అహంభావాన్ని తెలిసిగానీ, తెలియక గానీ ప్రదర్శిస్తాడు. ఆ అహంకారం తామస, రాజస, సాత్వికాహంకారాలుగా ప్రదర్శితమౌతుంది. తీసుకునే వానిపై ఆధిక్యతాభావన చూపితే అది తామసాహంకారమవుతుంది.
🍃🌺ఉన్నది పంచుకుంటున్నాననే భావనతో ఇస్తే అది రాజసాహంకారమవుతుంది. ఇవ్వడం వల్ల నా సంపద చరితార్ధ్థమవుతుందనే భావనతో ఇవ్…
[5:22 am, 18/04/2021] +91 94414 08564: 🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 43 🙏
🍃🌹దురాశపరుని స్థితి ఎటువంటిదో ఈ పద్యంలో చెప్పడం జరిగింది.
ఉ. రూకలుగల్గువానివలె లోకములోన గృశించు బీద తా శ్రీకరవైభవంబులను జెందఁదలంపు వహింప సాగునే? కాకము గ్రద్దతోడ జన గర్వముబూని ప్రతిజ్ఞ జేయగా నాకసమందు దానిసరియై విహరించునె వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! లోకంలో నిరుపేదయియన వాడు తగని కోరికలు కల్గి ధనవంతునివలె శ్రీకరవైభవంబులతో జీవించాలని ఆశపడడం ఎలా వుంటుందంటే...
🍃🌹కాకి మహాగర్వంతో కూడని ప్రతిజ్ఞలు చేసి గ్రద్దతో కలిసి ఆకసంలో ఎగిరి దానివేగాన్ని మించి వేగంతో వెళ్ళగలవని పందెం కట్టి ఎంతగా ఎగిరినా గద వేగంతో దాని వేగం సరిపోక ఓడిపోయి కాకికి శృంగభంగమయినట్లు నిరుపేద తగని దురాశతో సిరిగలవానితో పోటీపడి ఆ మాదిరిగ వుండాలని ప్రయత్నించడం కాకి పందెంలాగా వుంటుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[5:23 am, 18/04/2021] +91 94414 08564: 🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 13 🎈
🌻 అశోకం 🌻
🍃🌺రావణ భవనప్రాకారం వదలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కసారి శరీరమంతా పులకించింది. తెలయని సంతోషం ఆవహించింది.
🍃🌺వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పొన్న, మామిడి, అశోక, సంపెంగవృక్షాలు గుంపులు గుంపులుగా వున్నాయి.నారి సారించి విడచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. రంగు రంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు.
🍃🌺ఆయన గవునవేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు రెక్కలాడిస్తూంటే సాలవృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి. అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు.
🍃🌺పుష్పాలంకృతుడై విహరించే ఆయన వసంతునివలె ఉన్నాడు. పూలతో నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అలరారే సుందరీమణిలా ఉంది.
🍃🌺ఆకులు రాలిన కొమ్మలతో, పూలు, పండ్లులేని శాఖలతో ఆ వృక్షాలు వస్త్రాభరణాలు కూడా …
[7:44 pm, 18/04/2021] +91 94414 08564: 🌻 మహా భారతం 🌻
🎈 భాగము 100 🎈
💧 మత్స్య యంత్ర భేదనం 💧
🍃🌺పాంచాల రాజధానికి చేరుకునేందుకు అహోరాత్రులు ప్రయాణిస్తోన్న పాండవేయులు ఒకనాటి అర్ధరాత్రి భాగీరథీ తీరంలో గల సోమశ్రవ తీర్థానికి చేరుకున్నారు. జాజ్జ్వల్య మానంగా ప్రజ్వలించే కాగడాను పట్టుకుని ఆ ప్రాంతంలో అర్జునుడు ముందు నడుస్తోంటే అతని వెనుక కుంతీదేవి, ధర్మరాజాదులు నడవసాగారు.
🍃🌺గంధర్వాధినాయకుడు అంగారపర్ణుడు అదే సమయంలో జలక్రీడలాడేందుకు ఆ ప్రాంతానికి చేరుకుని, కుంతీదేవి, పాండవేయులను చూసి, తన ఏకాంత జల విహారానికి విఘాతం కలిగినదని తలచి-‘‘నా పేరు అంగారపర్ణుడు. నేను చెబుతున్నాను! తొందరగా ఇక్కణ్ణుంచి తొలగిపోండి! లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని పాండవులను హెచ్చరించాడు.‘‘తొలగని పక్షంలో’’ అని-‘‘నీ బెదిరింపులు నా దగ్గర కాదు! ఇదిగో! ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తున్నాను.
🍃🌺వీరుడివయితే తట్టుకుని నిలబడు’’ అ…
[7:53 pm, 18/04/2021] +91 94414 08564: 🌺 తాళపత్రం 🌺
🥀 100 వ రోజు 🥀
🌻 ఊసరవెల్లి మనిషి రక్తం తాగుతుందా? 🌻
🍃🌹ఊసరవెల్లి తొండలాంటి ప్రాణి. ఊసరవెల్లి మనిషి రక్తం త్రాగుతుందని నమ్మేవారు. ఆ కారణంగానే దాని మెడ ఎరుపు రంగులో ఉంటుందను కునేవారు.
🍃🌹అది పిల్లల వైపు చూసి వారి నడుము ప్రాంతం నుండి రక్తాన్ని పీల్చివేస్తుందని చెప్పేవారు. కానీ కాలక్రమంలో పెద్దలు సైతం ఈ విషయాన్ని నమ్మడం మొదలు పెట్టారు. క్రమంగా ఓ ఊసరవెల్లిని చూడడం కూడా అపశకునంగా భావించడం మొదలైంది.
🍃🌹కానీ వాస్తవానికి ఊసరవెల్లి చిన్నకిములు, పురుగులు తిని జీవిస్తుంది. అది అవసరానికి తగినట్లుగా తన శరీరపు రంగును మార్చుకోగలదు.
🍃🌹మగ ఊసరవెల్లి మెడ చుట్టూ ఉన్న ఎర్రని రంగు మనుషుల రక్తం పీల్చడం వల్ల కాక దానికి సహజంగా అలాగే ఉంటుంది. ఈ విషయంలో తప్పుడు అభిప్రాయం అమాయకపు ఊసరవెల్లిపై కలిగింది!
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:53 pm, 18/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 🌀
🌹 100. అచ్యుతః 🌹
🌺 ఓం అచ్యుతాయ నమః 🌺
హరి స్వరూపసామర్థ్యాత్ న చ్యుతో చ్యవతే న చ ।
చ్యవిష్యత ఇతి విష్ణురచ్యుతః కీర్త్యతే బుధైః ॥
🍃🌹తన స్వరూప(మగు) శక్తినుండి ఇతః పూర్వము తొలగియుండలేదు. ఇపుడు తొలగుచుండ లేదు. ఇక ముందును తొలగనున్నవాడు కాదు. త్రికాలములలో చ్యుతుడు కాని వాడు అచ్యుతుడని విష్ణువే చెప్పబడును.
🍃🌹మహాభారత శాంతి పర్వము నందు గల భగవద్వచనము ఈ నామము యొక్క వివరణను తెలుపుచున్నది. యస్మాన్నచ్యుత పూర్వోఽహమచ్యుతస్తేన కర్మణా అనగా ఏ హేతువుచే నేను ఇంతకు మునుపు (నా స్వరూప శక్తి నుండి) తొలగినవాడను కానో - కావుననే ఆ పనిచే నేను అచ్యుతుడను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[7:54 pm, 18/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 41 (అనంతాళ్వార్ గడ్డపార) 🎈
🍃🌹శంఖనిధి-పద్మనిధి దాటుకుని ఆలయంలోకి వెళుతూంటే, మహాద్వారపు ఉత్తరం గుమ్మం మీద నేటికీ అనంతాళ్వార్ విసిరిన గునపాన్ని మనం చూడవచ్చు. స్వామివారి గడ్డానికి తగిలిన దెబ్బకు గుర్తుగా, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో, ధ్వజారోహణ జరిగిన మరునాడు, స్వామివారికి "బాగ్ సవారి" అనే ఉత్సవం జరుగుతుంది.
🍃🌹నాడు అనంతాళ్వార్ తరుముకు వస్తూంటే స్వామి ఎలా పరుగు పెట్టారో, ఆ ఉత్సవం రోజు స్వామి పల్లకి అలా పరుగు పెడుతుంది. ఆ ఉత్సవం పూర్తి విశేషాలను "సంవత్సరోత్సవాల్లో" విశదీకరించబడినది.
🍃🌹అన్నమాచార్యుడు - కొండల్లో నెలకొన్న, అనే కీర్తనలో "అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి ముచ్చిలి పెట్టికి మన్ను మోచినవాడు” అంటూ అనంతాళ్వార్ గాథను ప్రస్తుతించారు.
🍃🌹అనంతాళ్వార్ గునపం దెబ్బకు శ్రీవారు గాయపడ్డ ఉదంతం త…
[8:04 pm, 18/04/2021] +91 94414 08564: 🌻 గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? 🌻
🍃🌺గుడికి వెళ్ళిన ప్రతీవారు కాళ్ళు కడుక్కొని మొట్టమొదట చేసే కార్యక్రమం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం. సాధారణంగా ఎక్కువమంది మూడు సార్లు చేస్తుంటారు. కనీసం మూడుసార్లు ప్రదక్షిణ చేయడం మన సంప్రదాయం.
🍃🌺అయితే అయిదుసార్లు కానీ, పదకొండుసార్లు కానీ, ఇరవై ఒకటిసార్లు గానీ ఇలా వారివారి ఓపిక, సమయాన్ని బట్టి ప్రదక్షిణలు చేస్తుంటారు.
🍃🌺ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడి స్తోత్రాలనుకానీ, మంత్రాలనుకానీ చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. అంతేకానీ పక్కవారితో మాట్లాడుకుంటూ కానీ, మనిషి దేవాలయంలో ఉన్నా మనసు ఎక్కడో పెట్టి అర్థంపర్థంలేని ఆలోచనలతో ప్రదక్షిణలు చేయకూడదు.
🍃🌺ఇలా చేయడంవల్ల శరీరానికి వ్యాయామం మాత్రమే కలుగుతుంది. మనసుకి ప్రశాంతత లభించదు. ప్రదక్షిణలు ఎక్కువసార్లు చేస్తే చాలా మంచిది.
🍃🌺శరీరానికి వ్యాయామం అవసరమే. కానీ గతంలో డాక్టర్లు చెబితేనే నడిచేవారు. చక్కటి ఆరోగ్యానికి నడక సరైనమార్గం. ఆరోగ్యవంతుల్లో నడిచేవారి సంఖ్య తక్కువ. ఆ రోజుల్లో ఇంట్లో ఉండే పెద్దవారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేవారు.
🍃🌺అదే వారి శరీరానికి మంచి వ్యాయామంగా వుండేది. ఈ కాలంలో కూడా నడిచేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వర్షాకాలం, శీతాకాలంలో వాకింగ్ కి వెళ్ళడానికి బద్ధకించే వారు కొంచెం పొద్దెక్కాక గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే శరీరానికి వ్యాయామం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 19.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసిందే చెప్పగలవు కానీ..నువ్వు వినేటప్పుడు ఏదొ కొత్త
సంగతి తెలుసుకుంటూ ఉంటావు.అందుకే వీలైనంత వినడానికే ప్రాధాన్యత ఇవ్వు.
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
మనలో తప్పులు వెతికే వారికి మనం ఉత్తములుగా ఉండనవసరం లేదు..కాని, మనల్ని నమ్మిన ప్రతి మనిషికి మనం మంచివారుగానే ఉండాలి.
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
శివుడు ధరించే ఆభరణాల వెనక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..? 🌻
🍃🌹ప్రపంచం మొత్తం శివుడి ఆజ్ఞ మేరకే నడుస్తుందని భావిస్తారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతుంటారు. శివుడిని అభిషేక ప్రియుడని పిలుస్తారు. శివుడికి భస్మంతో అభిషేకం చేస్తారు, స్మశానంలో నివసిస్తారు, త్రిశూలం చేతపట్టుకొని, రుద్రాక్షలు ధరించి ఉంటాడు.
🍃🌹ఈవిధంగా పరమశివుడు ధరించే ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో అర్థం దాగి ఉంది. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
🍃🌹నంది:
నంది శివుని వాహనం. శివుడి ప్రమధ గణాలలో నందికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నంది కైలాసం బయట ఉంటాడు.నంది అనుమతి లేనిదే కైలాసంలోకి ప్రవేశం లేదు. శివ భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్తే తప్పకుండా తీరుస్తారని భావిస్తుంటారు.
🍃🌹రుద్రాక్ష:
శివుని మెడ చుట్టూ రుద్రాక్ష హారాన్ని ధరిస్తాడు. రుద్రాక్ష అనే పదం రుద్ర అంటే శివుడు అక్ష్ అంటే …
🌻 శివుడికి ఇష్టమైన ప్రదోషకాలం… శివుడికి ఈ విధంగా పూజిస్తే..? 🌻
🍃🌺ప్రదోషమంటే ఎంతో విశిష్టమైన సమయం, పాప నిర్మూలనా అని అర్థం. ఈ ప్రదోషకాలం ప్రతిరోజు సూర్యుడు అస్తమించే సమయంలో చంద్రుడు కదలికల వలన ఏర్పడే సమయాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారు. కనుక చంద్రుడు కదలిక వల్ల ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే ఆ సమయాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారు.
🍃🌺అయితే ప్రతి రోజూ మనకు సూర్యాస్తమయం ఏర్పడుతుంది కనుక సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు కదలికల వల్ల తిథి మారితే అప్పుడు ప్రదోష సమయం వస్తుంది.
🍃🌺ఈ విధంగా ప్రతి రోజు కలిగే ప్రదోశాలపై కి మూడు ప్రదోశాలు ఎంతో ముఖ్యమైనవి. అవి సప్తమి, చతుర్దశి, త్రయోదశి సమయాలలో కలిగే ప్రదోశాలు ముఖ్యమైనవి ఈ మూడు ప్రదోషాలలో కూడా త్రయోదశి రోజు కలిగే దోషాన్ని మహాప్రదోషం అని పిలుస్తారు.
🍃🌺ఈ విధమైనటువంటి త్రయోదశి ప్రదోషం కేవలం శనివారం మాత్రమే …
[5:37 am, 19/04/2021] +91 94414 08564: 🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 44 🙏
🍃🌹అజ్ఞాని యయిన రాజు పరిస్థితి ఎటువంటిదో ఈ పద్యం వివరించింది
ఉ.పాడి యొకింతలేని నరపాలుడు పౌరులగోడు మాన్పగా జూడక క్రోధబుద్ధిఁగొని స్రుక్కగజేయదలంచుటెట్లనన్ వీడినకోడె యావుగని వెన్కొని వట్టిదియైనగాని గో రాడుచు నెక్కి తొక్కి శ్రమనందఁగఁజేయుటె, వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! న్యాయమెఱుంగని మహారాజు అధర్మపరుడై ప్రజల కష్టాలను తీర్చడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అసలే కష్టాలతో కుమిలిపోతున్న జనాలను నిష్కారణ కోపంతో వారిని మరింతగా బాధించడం ఎలా వుంటుందంటే -
🍃🌹వట్టి పోయి నీరసమయిన ఆవు వద్దకు ఎదతో పోటెత్తిన కోడె వెళ్ళి దానిని గోరాడుచు నానా విధాలుగా ఎక్కి తొక్కి వట్టిపోయిన ఆవును శ్రమపెట్టడం ఎటువంటిదో అటువంటిదవుతుంది.
🍃🌹కోడెకు ఆ నీరసపు వట్టిపోయిన ఆవు వల్ల ప్రయోజనం ఏమాత్రం లేక శ్రమ మిగిలినట్లు న్యాయమెఱుంగక నరపాలుడు ప్రజలను క్రోధబు…
[5:38 am, 19/04/2021] +91 94414 08564: 🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 14 🎈
🌻 సీతాసందర్శనం 🌻
🍃🌺శింశుపావృక్షంమీది నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తున్నది. ఋతుభేదం లేకుండా అన్నీ చివుళ్ళతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో అలరారే లతా, తరువులే.
🍃🌺నిండుగా పూచిన అశోకాలతో ఆ వనం రాత్రిపూట కూడా ఉదయ సూర్యశోభతో ఉంది. విరగబూసిన పూలబరువుకి ఆగలేక కొండగోగు నేల మీదికి వంగింది. కొమ్మ మ్రాను కనిపించకుండా విరిసింది అశోకం. అంగుళం ఖాళీ లేకుండా పూలు నిండిన మోదుగ కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
🍃🌺పున్నాగం, ఏడాకుల అరటి, సంపెంగ విరగపూసి సువాసనల మత్తు జల్లుతున్నాయి. ఆ వనంలో అశోకాలు కొన్ని బంగారు రంగువి, కొన్ని అగ్నిశిఖా సదృశాలు, దట్టంగా పెరిగి కొన్ని కాటుకరాసిలా ఉన్నాయి.
🍃🌺ఇంద్రుని నందనవనంలా, కుబేరుని చైత్రరథ వనంలా దివ్యంగా వున్న ఆ వనం పూవులనే నక్షత్రాలతో, నీలాకాశంలా, రత్నాకరంలా, మనోహర పరిమళభరితమయిన గంధమాదనంలా వుంది.
🍃🌺ఎదురుగా ఒక ప్రాసాదం కనబడింది. అది వేయిస్తంభాలతో కైలాసగిరిలా ఉంది. పగడాల మెట్లతో బంగారువేదికలు. ఆకాశాన్ని అంటే ఎత్తు. చూస్తున్నాడు హనుమంతుడు. నిశితంగా దృష్టిని కేంద్రీకరించాడు.
🍃🌺శుక్ల పాడ్యమినాటి చంద్రరేఖవలె, ఉపవాసాలతో కృశించిన దీనవదనంతో, మలినవస్త్రధారిణియై, రాక్షసీ జనపరివృతయై, పొగక్రమ్మిన అగ్ని జ్వాలవలె, కుజగ్రహ పీడితమయిన రోహిణీ నక్షత్రంలా, క్రూర మృగాల మధ్య ఆడులేడిలా, నల్లత్రాచువంటి జడతో, పచ్చని వస్త్రం ధరించి ఉన్న విశాలనయనను చూశాడు.
🍃🌺చూచి చూచి ఈవిడ సీత అయివుండాలి.ఔను - నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాము ఋశ్యమూకం నుండి చూచిన వనితారత్నం యిలానే ఉంది.అదే చంద్రవదనం, అదే భ్రూమధ్యం, అదే దేహకాంతి. పద్మ దళనయన, బింబాధర, రతీదేవిలా ఉన్నది నియమనిష్ఠలతో ఉన్న తాపసి. భయకంపితయై రోజుతూన్న నాగరాజ పత్నిలా ఉంది.
🍃🌺సందిగ్ధమయిన స్మృతిలా క్షీణ సంపద వలె, ప్రతిహతమయిన ఆశలా, విఘ్నమయిన కార్యంలా, కలుషమయిన బుద్ధిలా, చెదరిన శ్రద్ధవలె, అపవాద దూషితమయిన కీర్తివలె ఉన్నది.
🍃🌺రావణుడు అపహరించాడనే బాధతో కృశించింది. రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేనట్లుంది. బెదరిన లేడిపిల్లలా చూస్తున్నది.
🍃🌺కన్నీటితో నిట్టూర్పులు విడుస్తూ, కారుమేఘాల మాటున చంద్రకాంతిలా, మననం లేక విస్మరించిన విద్యలా, వ్యాకరణసంస్కారం లేక అనర్థద్యోతకమయిన వాక్కులా ఉంది.
🍃🌺జానకీదేవి ఏఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి గుర్తులు కనిపించాయి.అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు. అవిగో మాణిక్య దీప్తులు, పగడాల కాంతులు. కొంచెం తగ్గి నల్లబడ్డాయి.
🍃🌺ఋశ్యమూకం మీద పడవేయగా మిగిలిన నగలు కాబోలివి. ఆనాడు ఆ నగలమూటకు కట్టిన పట్టుచీర చెరగు, ఈ చీరదే, ఇంతకాలంగా కడుతున్నా నలిగినా, మాసినా పూర్తిగా రంగు మాయలేదు.
🍃🌺ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే. ఈమె మనస్సు ఆయన మీదనే ఉన్నట్టుంది.రామునికి ఈమెయందు జాలి అబల బలాత్కృత అయి అపహరింపబడినదని.
🍃🌺ఈమె యందు ఆదరభావం - తననే నమ్ముకుని వచ్చి యిలా కష్టాలపాలయిందని, దుఃఖం - ఇటువంటి యిల్లాలితో వియోగంవల్ల. మదన తాపం - హృదయేశ్వరి దూరమయిందని. ఇంక సందేహం లేదు. ఈవిడే ఆయన భార్య.
🍃🌺వీరుభయుల మనస్సులూ ఒకరియందొకరికి లగ్నమయి ఉండడం వల్లనే యింకా జీవించి ఉన్నారు వీరు. ఈవిడ దగ్గర లేని దుఃఖంతో ఆయన ఎలా జీవించగలుగుతున్నాడో!
🍃🌺ఎంత దుర్భరమయిన వ్యధ, అని సీతా సందర్శన సంతోషంతో నిండిన హనుమంతుని మనస్సు రామచంద్రుని అభినందించింది.
15 వ సర్గ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
🙏 శ్రీవారి భక్తులకు గమనిక : 🙏
🌹తిరుమల, 2021 ఏప్రిల్ 19: ఏప్రిల్ నెల 21 నుండి 30 వ తారీఖు వరకు ఆన్లైన్లో రూ. 300 టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో, రానున్న 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించు కోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
🌹గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా covid కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ కొన్ని నిర్ణయాలను తిరిగి అమలు లోనికి తీసుకు వచ్చింది.
🌹ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీని నిలిపి వేసింది.
🌹దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులను తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాల్సి గా విజ్ఞప్తి చేసింది
🌹శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నియమాలను అనుసరించాల్సిoదిగా సూచించింది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీవారి ఆలయంలో వేడుకగా శ్రీ భాష్యకారుల సాత్తుమొర 🙏
🌹తిరుమల, 2021 ఏప్రిల్ 18: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ భాష్యకారుల సాత్తుమొర వేడుకగా జరిగింది. ఏప్రిల్ 9న ప్రారంభమైన భాష్యకారుల ఉత్సవాలు 27వ తేదీ వరకు జరుగనున్నాయి.
🌹శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు.
🌹ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ భాష్యకార్లవారికి విశేష సమర్పణ చేశారు.
🌹సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
🌹రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేశారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment