🙏 *సుందరకాండ మహిమ* 🙏
(---చాగంటి వారి ప్రవచనాల నుండి.)
🍃🌺ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో
అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.
🍃🌺ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్ట చివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు. అందుకే, ప్రత్యేకించి సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు అని అంటారు.
🍃🌺కారణం ఏమంటే శ్రీ రామాయణం లో - మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే వుంది. సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది.
🍃🌺హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు. రామకథ కున్న బలమేమిటో, రామ నామానికున్న బలమేమిటో నిరూపించిన కాండ సుందరాకాండ!
🍃🌺అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.ఎన్ని కోణాలలో చూడండీ, అదంతా సుందరమే!
🍃🌺ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే, అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా
అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే. అలాగే, సుందరాకాండ ని ఎటు వైపునించి చూడండి అంతా సౌందర్యమే.
🍃🌺రామాయణం లో ఒక్క సుందరకాండకొచ్చేసరికి, మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు. ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు కావు. చాలా శ్లోకములు మంత్రములే. అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే, పిల్ల పెళ్ళవలేదు! - సుందరకాండ చదువుకోండి.
🍃🌺పిల్లాడికి ఉద్యోగం రాలేదు - సుందరకాండ చదువుకోండి.ఆరోగ్యం బాలేదు - సుందరకాండ చదువుకోండి. ఏమిటో భయంగా వుంటోంది - సుందరకాండ చదువుకోండి. భీతి కలిగింది - సుందరకాండ చదువుకోండి. ఏ కష్టం కలగనీండి - సుందరకాండ చదువుకోండి. ఫలితం వుంటుందని నమ్ముతారు భక్తులు.
🍃🌺ఎందుకంటే - లోకంలో ఇంత శక్తిమంతమైనవి రెండే రెండు సాహిత్యంలో వున్నాయని చెబుతారు పెద్దలు. ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు.
🍃🌺ఆ రెండూ ఏమిటంటే ఒకటి సుందరకాండ, రెండు - సౌందర్య లహరి. మూడు ఇక లేదు.
రెండూ సౌందర్యము, సుందరము ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి. రామానుగ్రహాన్ని ప్రసాదించే శక్తి సుందరకాండలో వుంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
[20/04, 7:04 am] +91 94414 08564: 🌻 *ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు* 🌻
🍃🌺ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం.
🍃🌺 *పురాణ కథ ప్రకారం*
ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు.
🍃🌺అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.
🌻 *స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:* 🌻
🍃🌺1. తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
🍃🌺2. మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
🍃🌺3. పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
🍃🌺4. తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
🍃🌺5. కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
🌻 *పంచముఖ హనుమాన్:* 🌻
🍃🌺శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.
🍃🌺1. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
🍃🌺2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
🍃🌺3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
🍃🌺4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
🍃🌺5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.
🌻 *హనుమంతుడి సందేశం ?* 🌻
🍃🌺హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.
🍃🌺హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను.
🍃🌺ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
🍃🌺‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని.
🍃🌺కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు.
🍃🌺మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
🍃🌺‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు.
🍃🌺మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🌻 *ప్రతీ పూజకు ఆవు పాలే ఎందుకు?* 🌻
*శ్లో !! గ్రీవా మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా*
*సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా !!*
🍃🌺గోవు యొక్క గొంతుక నందు, పొదుగులో, మూత్రములో, గంగా దేవి ఉంది. అంతే కాదు గోవు యొక్క అన్ని అంగములలో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి. గోవు యొక్క మలముత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు.
🍃🌺ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు అంటే, వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది. పురోహితులు ప్రతీ పూజకు ఆవుపాలు, పెరుగు , నెయ్యి ఖచ్చితంగా కావాలి. శాస్త్రం ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు. గోశాలలుకు విరాళం ఉన్నంతలో కొంత మన భాద్యత గా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దాన గుణ సంపన్నులు , వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గోసంరక్షణ శాల లో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం.
🍃🌺ఏ ఊరి నందు ఐతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని భాదలు ఉండవు అని శాస్త్ర వచనం. విష్ణువుకు గోవులు అంటే ఇష్టం అందుకే ఆవు పాలుతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ది ఆయన ఇస్తాడు. గోదాన ఫలం అంతా ఇంతా కాదు, గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ సకల సంపదలు అందుతాయి.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[20/04, 7:07 am] +91 94414 08564: 🙏 *శ్రీ వేంకటేశ్వర శతకము 45* 🙏
🍃🌹పుణ్యులను దూషించడం ఎలా వుంటుందో ఈ పద్యం వివరించింది.
*ఉ. సర్వజనోపకారములు సల్పెడు పుణ్యులనైన నూరకే*
*యుర్విని దూరుమూఢమతులుందురు కొందరు దుష్టచిత్తులై*
*పర్వము గూర్చి రాత్రి పరిపాలనజేయుచునుండు చంద్రునిన్ దుర్విధి*
*జారబోరు లతిదూషణ జేయరె? వేంకటేశ్వరా!*
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! లోకంలో కొందరు మూఢమతి కల్గి మంచివారలను, పరోపకారంచేసే మాన్యులను, పుణ్యాత్ములను, నోటికొచ్చినట్లు తిట్టి దూషిస్తూ వుంటారు. అది తగని పద్దతి.
🍃🌹అది యెలా వుంటుందంటే మంచి వెన్నెలతో చందమామ రాత్రి శోభాయమానంగా పరిపాలన చేస్తూ వుంటే, ఆచందమామను తప్పుడు పనులు చేసే జారులూ, చోరులూ, అతి దూషణ చేయడం ఎటువంటిదో అటువంటిదవుతుంది.
🍃🌹తిరుగుబోతులకూ, దొంగతనాలు చేసే వాళ్ళకూ, వెన్నెల రాత్రుల వెలుగులు అటంకాన్ని కల్గిస్తాయి. అందుచే చందమామను వారు భయంకరంగా తిడతారు. అది మంచిది కాదుకదా. పుణ్యాత్ములను దుర్మార్గులు దూషించడం కూడ అలాగే వుంటుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 *సుందరకాండ* 🙏
🎈 *భాగము 15* 🎈
🌻 *ఆలోచన* 🌻
🍃🌺చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటి-నికి పూజ్యుడూ, గురువూ అయిన రామచంద్రుని భార్యకు యిటువంటి కేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమయినదో!
🍃🌺ఈవిడకు రామ లక్ష్మణుల ధీ ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే అంతగా కలతపడడంలేదు. వర్షాకాలపు మేఘాలను చూచి గంగానది క్షోభిస్తుందా!
🍃🌺కుల రూప గుణ శీలాలలో యిద్దరూ సమానులే. అందువల్లనే ఈమెకు ఆయన, ఆయనకు ఈవిడ తగినవారు.ఈ విశాలాక్షి కోసం వాలిని నేలకూల్చాడు రాముడు. రావణసముడయిన కబంధుణ్ణి హతమార్చాడు.
🍃🌺విరాధుడికీ అదే గతి పట్టింది. వాడేం తక్కువవాడా! శంబరాసురు నంతటివాడు. భీకరాకారులయిన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు జనస్థానంలో నామ రూపాలు లేకుండా పోయింది యీవిడకోసం.
🍃🌺సర్వవానరేశ్వరు డయిన వాలిని నేలకూల్చి సుగ్రీవునికి పెట్టాభిషేకం జరిపింది యీవిడ కోసమే.నదీ నద సాగరాలు లంఘించి లంకానగరాన్ని నేను చూడగలిగానంటే ఈ యిల్లాలి వల్ల కాదా!
🍃🌺ఈవిడ కోసం రామచంద్రుడు ముల్లోకాలు తలక్రిందులు చేసినా ఆశ్చర్యం లేదు.ఈ జనక రాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక. దర్మపరుడైన జనకుని పుత్రిక, పతివ్రతా శిరోమణి.
🍃🌺విదేహాధీశుడు యజ్ఞంకోసం నాగలిపట్టి దున్నుతున్నవేళ పద్మపరాగ సమధూళినుండి బైటపడ్డది ఈవిడ.పూజ్యుడూ, పరాక్రమోపేతుడూ అయిన దశరధుని యింటికి కీర్తిని తెచ్చిపెట్టిన పెద్దకోడలు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని.
🍃🌺అటువంటి నారీమతల్లి ఈ రాక్షసజన మధ్యంలో పడింది. సర్వరాజ భోగాలూ విడిచి భర్తృవాల్లభ్యంతో అరణ్యక్లేశా లనుభవించడానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు.
🍃🌺కందమూలఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది. ఎన్నడూ క్లేశాలు ఎరుగనిది, ఈ నా డింతటి అవస్థ అనుభవిస్తున్నది.
🍃🌺శీలసంపన్నయైన ఈవిడకోసం రాముడు ఎదురు చూస్తున్నాడు. ఈవిడ దొరికితేచాలు భూ మండలమంతా సాధించిన సంతోషం కలుగుతుంది రామునికి.
🍃🌺ఇక్కడ బంధుజనం లేరు, భోగాలు లేవు. అయినా యీవిడ జీవించకలుగుతున్నదంటే రామసమాగమకాంక్ష కాక వేరేమున్నది.
🍃🌺ఈవిడ తన చుట్టూ వున్న రాక్షసగణాన్ని కాని, పూల తీవెలనుకాని చూస్తున్నట్లు లేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది, యీవిడ మనస్సు.ఈ పద్మనయనను, సుఖబోగార్హను యీ దశలో చూస్తుంటే నా మనస్సు చింతామయి మవుతున్నది.
🍃🌺రామ లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన యీ భూజాత యీ వికృతాకార జన మధ్యంలో ఉన్నది.
🍃🌺మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖపరంపరతో కృశించి ఉంది. ప్రియుడు దూరమయిన చక్రవాకిలా దీనంగా ఉంది.పూల బరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా యీవిడకు సంతోషాన్ని కలిగించడంలేదు. మంచుపొరల అడ్డంలేని శీతకిరణుడు కూడా యీమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు, అలా ఆలోచిస్తూ గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో నాజీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.
✍️ బాగా డబ్బు సంపాదించవచ్చు, నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టు కోవచ్చు, కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చు కోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు. అదే "జీవితం''.
🏵️అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.🌈
🤷♀️ మనం వృద్ధాప్యాన్ని సమీపించి నప్పుడు చురుకుగా తయారవుతాం. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.
👉 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా ఒకే సమయాన్ని సూచిస్తుంది, మన జేబులో 30 డాలర్లు న్నా, 300 డాలర్లున్నా అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం. మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే, నీలోని మనిషికి సంతోషం నీ బాహ్య ప్రపంచ వస్తువుల తో రాదు. నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.
💐అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే అదే నిజమైన సంతోషం.
🙏 జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి
👉 (1) మీ పిల్లలకు ధనవంతులుగా వుండటం కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దాని వల్ల, పెరిగి పెద్దయిన తర్వాత వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.
👉 (2) ఆహారమే ఔషధం, ఆహారాన్ని ఔషధంగా వాడండి. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.
👉 (3) నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు వంద కారణాలు చూపినా నిన్ను వదిలిపోరు, నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.
👉 (4) మనిషికి, మానవత్వం గల మనిషి కి తేడా వుంది.
👉 (5) వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లు,కానీ దూరం వెళ్లాలంటే కలిసి వెళ్లు.
📗చివరగా, వీటిని గుర్తుంచుకో. వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. నీ జీవితంలోని ప్రతి మలుపు లో వీటిని గుర్తుంచుకో 🙏
No comments:
Post a Comment