Sunday, 4 April 2021

stories

 

"బ్రాహ్మణత్వం"****

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు...!💐శ్రీ💐

పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.

భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు.

ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.

దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో  అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.

గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.

గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో  తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను.

ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి  అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.

ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.

ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.

ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !

ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.

అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.

 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.

తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.

మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.


అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.

మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).

అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం  బ్రాహ్మణులదే.

లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐
                         💐శ్రీ మాత్రే నమః💐
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక   
బ్రహ్మోత్సవ సంకీర్తన (2 )
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పురుషులలొ పుణ్య పురుషుడు ఏగు చుండే
సర్వ శోభిత సౌభాగ్య మంత వెల్గు  
ఇంపు సొంపుగ వెంకటేశ్వర డుండె
జయతు గోవింద వేంకట రమణ జయతు   
 .॥పల్లవి॥

చక్కని పలుకు కులుకుల చెలుల తోన
చుక్కల నెలరాజు వెలుగు కళల తోన
చెక్కిలి మెరుపు హృదయపు చూపు తోన
మక్కువ చెలుల శ్రీ వేంకటేశ్వ రుండు  ..... ... పు     
 ॥పురు॥
అలయుచు వసుధ, నలమేలుమంగఁ గూడి
యెలమిఁ దిరుతేరు పై నేఁగి ఉన్న వాఁడె
బలిమి పెండ్లి కొడుకుగాను వెలుగు చుండె  
నిలువు జక్కఁదనముతోన ఉండె మూర్తి
 ॥పురు॥

హరి రధములో ముద్దుగుమ్మలతొ కదులు
గిరిన యంతయు గంధపు వాసనలతొ
మరియు మురిపెంబు జూపుచు తిరిగి నావు  
సిరులు ఇచ్చేటి వేంకటేశ్వరుడుగాను  
॥పురు॥

--(())--

నిరుద్యోగ ప్రయాణం 16వ రోజు (రోజు వారికధ)

ప్రాంజలి ప్రభ  .. అంతర్జాల పత్రిక
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
 

మాధవ్ నెమ్మదిగా నడుస్తున్నాడు

ఒక ఇంటి వద్ద ఒకటే ఏడుపు వినబడుతుంది

ఎందుకో అర్ధం కాలేదు

లోపలికెళ్ళి అడుగు తామంటే నీకెందుకు అనే తత్త్వం గల మనుషులు, కనీసం సహాయం చేద్దామని కూడా అనుకోరు. ఇంకా వారంటారు

ఇది రోజు జరిగే భగవతమేనండి మీదారి మీరు వెల్ల మనే వారున్నారు

ఎందుకైనా మంచిది అని మాధవ్

అక్కడున్న ఇంటోలోపలికి వెళ్లి ఎవరు ఇంట్లో అన్నాడు


ఒక మధ్య వయస్సు గల స్త్రీ ఏడుస్తూ వచ్చింది

ఏంజరిగిందమ్మా

ఏమని చెప్పేది బాబు

మావారికి ఎదో రోగం వచ్చింది అది ఇంతకీ తగ్గలేదు

డాక్టర్కి చుపించ బొయ్యారా

అందరికీ చూపించాం బాబు " నాపుస్తెలు బంగారం వెండి వస్తువులు అమ్మి 2 ,౦౦,౦౦౦ తెచ్చాడు మా అబ్బాయి

మరింకేమ్మ మందులు వాడొచ్చుగా

ఆ డబ్బు 5 రోజులు  హాస్పటల్ ఖర్చుక్రింద అయి పోయింది, ఇక్కడ తగ్గే సూచనలు లేవు, నీవు డబ్బు కట్టలేవు, అని ఇంటికి పంపించారు. ఆక్సిజన్ పెడితే గాని బతకడుట

అట్లా ఇంటికి తెచ్చేస్తే బతికే దెట్లా

మా అబ్బాయి దగ్గరకు వెల్దామంటే, వాడు చిన్న రూమ్లో ఉంటాడుట, అసలే నాన్నకు రోగం  వచ్చింది, నాకు షాపుల్లో జీతాలివ్వట్లా

నా పరిస్థితి తిండికి కరువైనది అమ్మా అని ఉత్తరం వ్రాసాడు

బంధువులు, చుట్టుప్రక్కవాళ్ళు అడగవచ్చుకదా సహాయం చేస్తారేమో

మీ ఇంట్లో రోగం ఉంది మేము రాలేము అన్నారు బాబు.

 వెంటనే మాధవ్ అంబులెన్స్ కు ఫోన్ చేసాడు

అంబులెన్స్ వచ్చింది మరలా హాస్పటల్ కు తీసికెళ్ళాడు రోగిని

మానవ ప్రయత్నం చేద్దావమ్మా నీ అదృష్టం ఎలావుందో నేను చెప్పలేను.

నాకు తెల్సిన హాస్పటల్ చేరుస్తా

వారు నీకు పేషేంటుకు భోజనం పెడతారు, అవసరమైన మందులు వాడుతారు, నీవేమి భయపడకు

మనిషిని సగం భయమే కుంగతీస్తుంది అన్నాడు మాధవ్
          

అమ్మా ప్రతి ఒక్కరికి భాధలు ఉంటాయి.వాటిని ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడు  

అంటూ మాట్లాడుతున్నాడు మాధవ్

సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది.

అతను వెంటనే "ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు. అట్లాగే డాక్టర్లు అందరూ చెడ్డ వారు కాదమ్మా ఎవరో డబ్బు కోసం ఆశించేవారుంటారు.

 కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. అమ్మా హాస్పటల్లో చేరినవారందరూ రోగం తగ్గి తిరిగి రాగలరు , అప్పుడు అందరూ మంచి డాక్టర అంటారు, .    



ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ‘ "ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి " అని రాసింది. అట్లాగే మందు వికసించో, చిన్నతప్పు జరిగో చనిపోతే డాక్టర్ మంచి వారు కాదంటారు ఇదేనమ్మా లోకం

ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ‘ఈ సముద్రం ఒకటి చాలు  జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను "అని రాశాడు. అట్లాగే అవసరానికి సహాయపడి తగిన అందులు వాడి ఉచితంగా సేవలు చేసే డాక్టర్లు ఉన్నారు అన్నాడు మాధవ్

అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది.

అందుకే నమ్మా ఏపుట్టలో ఏ పామున్నదో తెలియదు. సముద్రం లా ప్రశాంతంగా బతకాలమ్మ.


ఇద్దరూ కలసి హాస్పటల్లో చేర్చారు.

మాధవ్ అమ్మా నీవు డబ్బు కోసం భయపడకు నాకు చేతనైన వరకు సహాయము చేస్తాను. నీవు దేవునిపై నమ్మకం పెట్టుకో అన్నాడు మాధవ్

మాధవ్ కూడా హాస్పటల్లో ఉండి అవసరమైన మందులు తెచ్చి ఇచ్చి, అమ్మకు కూడా ఆహారము తెచ్చి సహాయపడ్డాడు.        

ఈ హాస్పటల్ రోగికి సరిఅయిన మందు పడుట వల్ల మూడు రోజుల్లో కోలుకున్నాడు

అమ్మా మీ వారు కోరుకున్నారు ఇక నీవు ఇంటికి తీసుకెల్లఁవచ్చు

అమ్మా ఈ డబ్బు ఉంచమ్మా నీదగ్గర అవసరానికి పనికొస్తుంది

అమ్మా నాకు శెలవు ఇవమ్మ

నిన్ను పొమ్మని చెప్పఁలేను, ఉండమని అనలేను,

బాబు నాలాంటి వారి కేందరికో నీ సహాయము అవసరము

ఇద్దరికీ నమస్కరించి బయలుదేరాడు మాధవ్



అమ్మా నేను నిమిత్త మాత్రుడను అంతా ఆ హరిలీల

ప్రజల దారిద్రం తొలగించేది హరి భక్తే వజ్రాయుధంబు

అజ్ణాణమనే అంధకారం తొలగించేది నీ భానూదయంబు

దుర్భుద్ధి మాపి ధర్మబుద్ధి పెంచేది  నీ సేవ దావానలంబు

నిత్య  అమృత తత్వం ఇచ్చేది  నీ స్మరణ దివ్యౌషధంబు

--(())--

--(())--

వికృత రూపములు అసత్య మలుఅయినను

నమ్మి నట్టివానికి యథార్థముగ ఉండు
నిత్య భ్రాంతిలో లోకము తిరుగు చుండు
ఏది నిజమై అబద్ధ మగుచు ఉండు    

నేను గడ్డిపోచకుకన్న తక్కువుడ్ని
వ్యక్తి ఆకర్ష ణలకు లొంగకయు ఉన్న  
దు:ఖ సుఖములు సమముగా అనుభవించు
లోభిలాఉండకయు ఉన్న దాన్ని పంచు   

సత్య మార్గాన్ని అన్వేషి పరచు జీవి
స్వీయ ధర్మము తో తృప్తి చెంది యుండు
పైమెరుగుల ఆకర్షణ ఛాయ బతుకు
మానవునిగాను గుర్తింపు సమయ తృప్తి   

వ్యక్తి సహనము తో సిద్ధి కొరకు వేచి
ఉండుటయు శాస్త్రముల వున్న విషయ వాంఛ
కొరకుయు నిరీక్ష జీవికి ఆవసరమ్ము
సమయ శాస్త్ర పఠనములు మనసు శాంతి

ఉత్తమము దురదృష్టము చెలిమి పంచు
విజయ ముఅ దృష్ట ము అనిన అహము పెంచు
పుణ్య శాస్త్రప ఠనములు జీవ మవ్వు
మోక్షము కొరకు సాధన తత్వ మగుట

మనసున అధోగతిని అరికట్టి వేయు     
సత్య తత్త్వమును నిరంత రముగ నుండు
అదియు గమనించు శక్తికి కృషియు సలుపు
ఇదియు కేవలం ప్రతిబింబ మైన కృషియు

==))((--

chaalu kvitvam 

 చాలు చాలు చూపులు పస మలుపు మెరుపు
చాలు కులుకులు కేకలు ఇకను వద్దు
చాలు సరసాల సలపరింత యును వద్దు
చాలు పెట్టిన ముద్దుల కైపు చాలు

చాలు నవయవ్వ నమదిలొ పుల్క రింత
చాలు నవరస నటనలు ఇకను వద్దు
చాలు‌ హావభావాల  విణ్యాస మంత
చాలు మదిలోని ఆలోచనలను చాలు


చాలు నెమలిలా పురివిప్పి ఆట యెంత
చాలు నక్కలా బుద్ధిని చూపు టంత
చాలు తాబేలు నడకలా కదులు చొచ్చి
చాలు సింహపు గర్జన భయము చాలు
 

చాలు మనసును దోచేటి బుద్ధి యంత
చాలు అర్ధము చెప్పేటి గుణము యంత
చాలు మనసును ప్రేమించు లక్ష్య మంత
చాలు వయసును పంచేటి ప్రేమ చాలు

--(())-- 

hasyam

"అయ్యా!మునిసిపల్ కమీషనర్ గారూ,మా వీధిలో ఒక గాడిద చచ్చిపోయిందండి.మీ స్టాఫ్ ను పంపండి" అని ఫోన్ చేశాడు వొకాయన.
"మీరేం చేస్తుంటారూ?"అడిగాడు కమీషనర్.
"నేను పౌరహిత్యం చేస్తుంటానండి"
"మరి ఇంకేం మీరే అంతిమసంస్కారాలు జరిపించవచ్చుగా!" ఆని మునిసిపల్ కమీషనర్ పగలబడి నవ్వాడు.
"నిజమేననుకోండి...జరిపించాలనే అనుకున్నా ..ముందుగా చనిపోయినవారి బంధువులకు చెప్పాలి కదా అందుకని మీకు చెప్పా"😇🧐😷🤒

 ఈ కింది సూచనలు పాటించడం వల్ల కోవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చు.

1. రోజు ఉదయాన్నే మీ ఇంటి డాబా మీద లేదా ఇంటిబయట ఎండలో 20 ని. నుండి 40 ని. వరకు శ్వాస వ్యాయామాలు మరియు యోగ తప్పనిసరిగా
చేయండి.

2. ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి...అది ప్రతి అర గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా చాలా సార్లు 5 లీటర్ల వరకు త్రాగండి...

3. ఆయుర్వేదం లో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగాలు, మిరియాలు మొదలైనవి( ఇదివరకే కాషాయం పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి) నీటిలో బాగా మరిగించి రెండు, మూడు పూటలా తాగాలి.

4. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాల లో చిటికెడు పసుపును కలుపుకుని తాగండి.

5. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళే మనకు విలువైన ఆస్తి. వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి తేలికగా కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ కనుక ఇంట్లో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి చేయండి మరియు పాటించండి.

6. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి బలమైన ఆహారం అయిన కోడిగుడ్డు, పాలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ ఎక్కువుగా తినండి. మరియు రాగి జావ తీసుకోండి.

7. బిపి, షుగర్ వంటి అత్యవసరమైన మందులు తో పాటు ఇంట్లో తప్పనిసరిగా 1. పారాసెటమాల్, 2.సిట్రేజిన్, 3.దగ్గు మాత్రలు,
4.మౌత్ వాష్ మరియు గార్గిల్ కోసం బీటాడిన్, 5.విటమిన్ సి మరియు డి 3, 6.బి కాంప్లెక్స్ జింకోవిట్, 7. ఆవిరి కోసం జండూ బామ్ మరియు
పసుపు ఉంచుకోండి.

8.ఆఫీసులు, ఉద్యోగ ప్రాంతం, రద్దీ ప్రాంతాల్లో నుండి ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే మీ మొబైల్, తాళాలు, పర్సులను శానిటైజర్ తో శుభ్రము చేసి, బట్టలను బయటే విడచి డెట్టాల్ కలిపిన నీళ్ళలో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి మాత్రమే ఇంట్లోకి వెళ్ళండి.

9. బయట నుండి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువులను తప్పనిసరిగా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.

10. ఒకవేళ బయటికి వెళ్ళితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, తరచుగా శానిటైజర్ ని చేతులకు రాసుకుని దగ్గర పెట్టుకోండి.

11. బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును, నోటిని, కళ్లను చేతులతో తాకరాదు.

12. ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి.

13. రోగనిరోధక శక్తి ని పెంచే సీ విటమిన్ ఎక్కువుగా గల పండ్లు నిమ్మ, జామ, ఉసిరి తో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజ మొదలైనవి తరచుగా తీసుకోవాలి.

14. రోజు రాత్రి సమయం లో నీళ్లలో బిటడిన్ ద్రావణం కలిపి నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళే లాగా పుక్కిలించి గార్గిల్ చేయాలి.

15. ప్రతి రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోండి.

16. ఈ పరిస్థితుల్లో మద్యపానం జోలికి వెళ్ళక పోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

ముఖ్య విన్నపం: దయచేసి ఈ పోస్ట్ ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి.

--(())--

 సప్తర్షులు పార్వతిని పరీక్షించుట

నారదుట్లు పలికెను-

బ్రహ్మ, విష్ణువు మొదలగు ఆ దేవతలు, మునులు అందరూ ఆనందముతో మరలి వెళ్లిన తరువాత ఏమాయెను?

తండ్రీ! శంభువు ఏమి చేసినాడు? ఆయన ఎంత కాలము తరువాత వరము నిచ్చుటకు వచ్చినాడు? ఎట్లు వచ్చినాడు? ఆ విషయమును చెప్పి ప్రీతిని కలిగించుము.

బ్రహ్మ ఇట్లు పలికెను-

బ్రహ్మ మొదలగు ఆ దేవతలు తమ స్థానములకు వెళ్లిన తరువాత, శివుడు ఆమె యొక్క తపస్సును బాగుగా పరీక్షింపగోరి సమాధిలోనికి వెళ్లిపోయెను. సర్వము కంటె శ్రేష్ఠమైనది, స్వరూపభూతమైనది, మాయకు అతీతమైనది, ఆటంకములు లేనిది అగు ఆత్మ తత్త్వమును ఆయన మనస్సుతో హృదయమునందు ధ్యానించెను. ఆ హరుడు తత్పద వాచ్యమగు వస్తు స్వరూపుడు, భగవానుడు, ఈశ్వరుడు, వృషభము ధ్వజము నందు గలవాడు, తెలియబడని స్వరూపము గలవాడు, సర్వకారణుడు మరియు పరమేశ్వరుడు. వత్సా ! ఆపుడా పార్వతి ఉగ్రతపస్సును చేయుచుండెను. ఆ తపస్సును గని రుద్రుడు కూడ మిక్కిలి విస్మయమును పొందెను.

ఆయన భక్తులకు అధీనుడే గాని మరియొకటి కాదు. ఆయన సమాధి నుంచి చలించెను. జగత్కారణుడగు హరుడు వసిష్ఠాది సప్తర్షులను స్మరించెను. ప్రసన్నమగు ముఖము గల సప్తర్షులు స్మరించినంత మాత్రాన తమ భాగ్యమును అనేక విధములుగా వర్ణించుకొనుచున్నవారై విచ్చేసిరి. వారు ఆనందభరితులై ఆ మహేశ్వరునకు ప్రణమిల్లి, చేతులు జోడించి, తలలు వంచి, గద్గమగు వాక్కుతో నిట్లు స్తుతించిరి.

సప్తర్షులిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణాసముద్రా! ప్రభూ! నీవీనాడు మమ్ములను స్మరించుటచే మేము మిక్కిలి ధన్యలమైతిమి. ఓ స్వామీ! నీవు మమ్ములను దేనికొరకు స్మరించితివి? నీవా విషయమును మాకు ఆజ్ఞాపించుము. నీ దాసులయందు చూపించే కృపవంటి కృపను చూపుము. నీకు నమస్కారమగు గాక !.

బ్రహ్మ ఇట్లు పలికెను-

కరుణా సముద్రుడగు శివుడు మహర్షుల ఈ విన్నపమును విని, వికసించిన పద్మముల వంటి నేత్రములు గలవాడై ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను.

ఓ సప్తర్షులారా ! కుమారులారా ! నా మాటను వెంటనే వినుడు. సర్వజ్ఞులగు మీరు మాకు హితమును చేయువారు. దేవ దేవి యగు పార్వతి ఈ సమయములో గౌరీ శిఖరమును పేరుగల పర్వతమునందు దృఢచిత్తయై తపము నాచరించుచున్నది.  ఓ ద్విజులారా ! అమె నన్ను భర్తగా పొందవలెననే అంతిమ నిశ్చయమును చేసుకొని ఇతర కామనలనన్నిటినీ వీడినది. అమెను సఖురాండ్రు కనిపెట్టియున్నారు. ఓ మహర్షులారా! మీరు నా అజ్ఞచే అచటకు వెళ్లి, ప్రేమతో నిండిన మనస్సు గలవారై, ఆమె మనస్సు ఎంత దృఢమైనది? అను విషయమును పరీక్షించుడు. మీరు పూర్తి అసత్యములను, నిందవాక్యములను పలుకుడు, దృఢమగు వ్రతము గల ఓ ఋషులారా! మీరు నా శాసనముచే ఈ విషయములో ఎట్టి సంశయమునైననూ పొందకుడు.

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు ఆజ్ఞాపింపబడిన ఆ మునులు శీఘ్రమే అచటకు వెళ్లరి. అచట జగన్మాతయగు పార్వతి గొప్ప తేజస్సుతో విరాజిల్లు చుండెను. మూర్తీభవించిన తపస్సిద్ధివలె నున్న, పరమతేజస్సుతో విలసిల్లు చున్న పార్వతిని వారచట చూచిరి. దృఢవ్రతులగు ఆ సప్తర్షులు ఆమెకు మనస్సులో నమస్కరించి, ఆమెచే ప్రత్యేకముగా పూజింపబడినవారై, వినయముతో నిట్లు పలికిరి.

ఋషులిట్లు పలికిరి-

ఓ పార్వతీ దేవీ! వినుము, నీవు దేని కొరకు తపస్సును చేయుచున్నావు? ఏ దేవతను కోరుచున్నావు? ఏ ఫలమును కోరుచున్నావు? ఇపుడా విషయమును చెప్పుము.

పార్వతి ఇట్లు పలికెను -
మునివరులారా ! నా మాటను ప్రీతితో మనస్సును లగ్నము చేసి వినుడు . నేను నా బుద్ధితో ఆలోచించి నిశ్చయించిన నా విచారము చెప్పెదను.

అసంభవమగు నా మాటలను విని మీరు పరిహాసము చెసెదరు. ఓ విప్రులారా! మీ ఎదుట వర్ణించుటకు సంకోచము అగుచున్నది. నేనేమి చేయుదును?

ఈ నా మనస్సు నియంత్రింప సంభవము కానిది. నావశము లేదు. అసంభవమగు కర్మలనపేక్షించుచున్నది ఈ నా మనస్సు నీటిపై ఎత్తైన మహా ప్రాసాదమును నిర్మింపగోరుచున్నది.

రుద్రుడు నాకు భర్త కావలననే కొర్కెను మనస్సులో నిడుకొని, దేవర్షియగు నారదుని అనుమతిని పొంది తీవ్రమగు తపస్సును చేయుచున్నాను.

రెక్కలు లేని నా మనస్సును అనే పక్షి హఠాత్తుగా ఆకాశమునందు ఎగురుచున్నది. కరుణా సముద్రుడగు శంకరస్వామి దాని యాశను పరిపూర్ణము చేయును గాక !.

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె యొక్క ఈ మాటలను విని ఆ మహర్షులు నవ్వి ఆ పార్వతిని ప్రీతితో ఆదరించి (మనస్సులో) మాయమాటలను ఇట్లు పలికిరి.

ఋషులు ఇట్లు పలికిరి-

వ్యర్థముగా తాను పండితుడనను ధారణ గలవాడు, క్రూరమగు మనస్సు గలవాడు అగు ఆ దేవర్సి యొక్క చరిత్ర నీకు తెలియదు. ఓ పార్వతీ! నీవు సహజముగా బుద్ధిమంతురాలవే.

నారదుడు మోసపు మాటలను చెప్పి ఇతరుల మనస్సులను కల్లోల పెట్టును. అతని మాటలను విన్నవారికి అన్ని విధమలుగా హాని కలుగును.

మేము నీకు క్రమముగా బోధించెదము. నీవు మంచి బుద్ధితో ఈ చక్కని వృత్తాంతమును విని ప్రీతితో దానిని తెలుసుకొని మనస్సులో నిశ్చయించుము  బ్రహ్మపుత్రుడగు దక్షుడు తండ్రి ఆజ్ఞచే తన భార్య యందు పదివేల పుత్రులను గని, ఆ ప్రియపుత్రులను తపస్సు చేయుడని నియోగించెను.

ఆ కుమారులు తపస్సును చేసెదమని ప్రతిజ్ఞచేసి పశ్చిమ దిక్కున నున్న నారాయణ సరస్సుకు వెళ్ళిరి. నారదుడు కూడ అచటకు వెళ్లి  వారికి మోసపు ఉపదేశమును చేసెను. వారతని ఉపదేశముచే తిరిగి తండ్రి వద్దకు ఒక్కడైననూ మరలివెళ్లలేదు.  ఈ వార్తను విని దక్షుడు కుపితుడు కాగా తండ్రి యాజ్ఞచే అతనిని ఓదార్చెను. అతడు తరువాత మరల వేయిమంది కుమారులను గని తపస్సు కొరకు పంపెను. ఆ కుమారులను కూడా తండ్రి యాజ్ఞచే తపస్సును చేయుట కొరకు అచటకు వెళ్లిరి. నారదుడు కూడ అచటకు వెళ్లి వారికి వైరాగ్యము నుపదేశించెను.

అతని ఉపదేశముచే వారు కూడ సోదరుల మార్గములో వెళ్లిరి. వారు భిక్షాటన యందభిరుచి గలవారై తండ్రి గృహమునకు మరలి పోలేదు.  ఓ శైలజా ! నారదుని మంచిదనము ఈ తీరున లోకప్రసిద్ధమై యున్నది. మానవులలో వైరాగ్యమును కలిగించే అతని మరియొక గాథను వినుము. పూర్వము చిత్రకేతు డనే విద్యాధరుడుడుండెను. నారదుడాతనికి తన ఉపదేశమును చేసి అతని ఇంటిని శూన్యము చేసెను.   ఇతరుల బుద్ధిలో భేదములను కల్పించే ఈ నారదుడు తన ఉపదేశములను ప్రహ్లాదునకు చేసి హిరణ్యకశిపునకు మహా దుఃఖమును కలిగించెను.

ఆ ముని ఎవనికి వినుటకు రుచించే తన విద్యను వినిపించునో, వాడు తప్పని సరిగా తన ఇంటిని వీడి వెంటనే భిక్షాటనను మొదలిడును. నారదుని దేహము సదా ప్రకాశించునదే. కాని అతని మనస్సు మలినము. అతనితో కలిసి నివసించే మాకు అతని గురించి పూర్తిగా తెలియును. కొంగ సాధువు అని కొందరు చెప్పెదరు. కొంగ అన్ని వేళలా చేపలను తినదు గదా! సహవాసుల చరిత్ర సహవాసులకుమాత్రమే తెలియును కదా!  నీవు బుద్ధి మంతురాలవే అయిననూ అతని ఉపదేశమును పొంది మూర్ఖురాలవై వ్యర్థముగా కఠినమగు తపస్సును చేయుచున్నావు.'. అమ్మాయీ! నీవు ఎవని కొరకై ఇంత విస్తారమగు తపస్సును చేయుచున్నావో ఆ శివుడు సర్వదా ఉదాసీనుడై ఉండును. అయన నిర్వికారుడు, మన్మధ శత్రువు అనుటలో సందేహము లేదు.

శూలధారియగు శివుడు అమంగళమగు శరీరము కలిగి సిగ్గులేని వాడై యుండును. ఆయనకు ఇల్లు లేదు. కులము లేదు. ఆయన దిగంబరుడై చెడు వేషమును కలిగి ప్రేతపిశాచాదులతో స్నేహమును చేయును. ఆ మోసగాడు తన మాయచే నీ బుద్ధిని చెడగొట్టి నిన్ను అనేక గొప్ప యుక్తులతో మోహింప జేసి నీచే తపస్సును చేయించుచున్నాడు. ఇట్టి వానిని వివాహమాడిన స్త్రీకి ఏమి సుఖము కలుగును? ఓ దేవదేవి! పార్వతీ నీవే ఆలోచించుము.  ఆ మూర్ఖుడు ముందుగా దక్షపుత్రి, పతి వ్రతయగు సతిని వివాహమాడి సద్భుద్ధితో కొద్దిరోజులైననూ సరిగా కాపురము చేసినాడు కాదు.

ఆ ప్రభువు ఆమె యందు స్వయముగా దోషమును చూపి పరిత్యజించినాడు. ఆయన నిరవయవము, శోకరహితమునగు ఆత్మ తత్త్వమును ధ్యానిస్తూ సుఖముగా రమించుచున్నాడు. ఆయన ఏకాకి, పరమమోక్ష స్వరూపుడు, సంగరహితుడు, ఆద్వితీయుడు, ఓ దేవీ! ఒక యువతి అతనితో ఎట్లు వేగ గలదు? అది సంభవము కాదు. ఈనాటికైననూ మా ఆజ్ఞను మన్నించి చెడు బుద్ధిని వీడి ఇంటికి వెళ్లుము. ఓ పుణ్యత్మురాలా! నీకు శుభము కలుగగలదు.

మంచి గుణములన్నింటినీ కలిగియున్న విష్ణు ప్రభుడు నీకు తగిన వరుడు. ఆయన వైకుంఠ నందుండును. లక్ష్మీ పతియగు విష్ణువు వివిధ క్రీడలలో నిపుణుడు. ఆయన తోడి వివాహము సర్వసుఖముల నిచ్చును. నీకు ఆ వివాహము మేము చేయించెదము. ఈ మొండి పట్టును విడువుము, ఓ పార్వతీ! సుఖపడుము.

పార్వతి ఇట్లు పలికెను-

ఓ మహర్షులారా! మీరు మీకు తెలిసిన సత్యమును పలికితిరి. ఓ బ్రహ్మాణులారా కాని, నాకు గల ఈ హఠము తొలిగిపోయేది కానే కాదు. నేను పర్వతుని కుమార్తెను అగుటచే సహజముగానే కఠినురాలను. మీరు మంచి బుద్ధితో ఈ సత్యమును విచారించి నన్ను తపస్సు చేయవద్దని వారించుట తగదు.  దేవర్షి యగు నారదుని హితకరమగు వచనమును నేను ఎన్నటికీ త్యజించును గురువుల వచనము హితకరమని వేదవత్తలు చెప్పెదరు. గురువుల వచనము సత్యమనిఎవరికైతేదృఢమగు నిశ్చయము ఉండునో వారికి ఇహ పరలోకములలో పరమ సుఖహు కలుగును. వారికి ఎచ్చటనైననూ దుఃఖము లేదు.

గురువుల వచనం సత్యమనే నిర్ణయం ఎవరి హృదయములో ఉండదో, వారికి ఇహమునందు, పరమునందు కూడ దుఃఖము కలుగును. వారికి ఎచ్చటనైననూ సుఖము కలుగదు. ఓ బ్రహ్మణులారా! గురువచనమును ఎట్టి పరిస్థితులోనైననూ వీడరాదు. నా ఈ హఠము నన్ను గృహిణిని చేసి శాశ్విత సుఖము నీయ వచ్చును. లేదా నాకు శూన్యము మిగులవచ్చును.  ఓ ముని శ్రేష్ఠులారా! మీరు చక్కగా చెప్పిన వచనము సరిగాదు. దానిలో గల వివేకమును సంగ్రహముగా చెప్పెదను. విష్ణువు గుణ సంపన్నుడనియు, విహరించువాడనియు చెప్పితిరి సత్యమే. సదాశివుడు గుణహీనుడని చెప్పబడినాడు.దానికి గల కారణమును చెప్పెదను.

పరబ్రహ్మ యొక్క సగుణ రూపమే శివుడు. ఆయన భక్తుల కొరకై ఆకారమును పొందినాడు. ఆయనకు లౌకికమగు సామర్థ్యమును ప్రదర్శించవెననే ఆకాంక్ష లేనే లేదు.  ఇందువలననే అవధూత స్వరూపుడు పరమానంద ఘనుడునగు శివుడు పరమహంసలకు ఆనందముతో పొందదగిన పరమగతియై ఉన్నాడు.  మాయా లేపము గలవారికి అలంకారాదులయందు అభిరుచి ఉండును. కాని పరబ్రహ్మకు అట్టి అభిరుచి ఉండదు. ఆ ప్రభుడు నిర్గుణుడు, పుట్టుక లేని వాడు. మాయాలేపము లేనివాడు, ఆయన స్వరూపము ఇంద్రియ గోచరము కాదు. కాని విరాడ్రూపములో నున్నది ఆయనయే. ఓ బ్రాహ్మణులారా! ధర్మము, జాతి, మొదలగునవి శివుని అనుగ్రహమును పొందుటలో హేతువులు కాజాలవు. గురువు యొక్క అనుగ్రహము చేత మాత్రమే నేను శివుని యథార్ధ స్వరూపము నెరింగినాను.

ఓ బ్రహ్మణులారా ! ఆ శివుడు నన్ను వివాహమాడనిచో, నేను అవివాహితురాలిగా శాశ్వత కాలము మిగిలి యుందును. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను. సూర్యుడు పశ్చిమ దిక్కునందు ఉదయించిననూ, మేరు పర్వతము కదలజొచ్చిననూ, అగ్ని చల్లబడిననూ, పర్వతశిఖరముపై రాతి మీద పద్మము వికసించిననూ, నా ఈ హఠము చలించదు. నేను సత్యమును పలుకుచున్నాను.

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి ఆ పార్వతి వెంటనే ఆ మహర్షులకు నమస్కరించి వికారము లేని మనస్సుతో శివుని స్మరించి విరమించెను.  ఆ ఋషులు కూడా పార్వతి యొక్క ఇట్టి దృఢనిశ్చయము పెరంగి, 'జయము కలుగుగాక! 'అని ఉత్తమమగు ఆశీర్వచనమును పలికిరి.  అపుడు అనందముతో నిండిన మనస్సుగల ఆ మునుల ఆ దేవికి నమస్కరించిరి. ఓ
మహర్షీ! వారీ విధముగా ఆమెను పరీక్షించి వెంటనే శివుని స్థానమునకు వెళ్లిరి. వారు అచటకు వెళ్లి శివునకు నమస్కరించి ఆ వృత్తాంతమును నివేదించి ఆయన ఆజ్ఞను పొంది ఆదరముతో స్వర్గలోకమునకు వెళ్లిరి.


శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీ ఖండలో సప్తర్షులు పరీక్ష చేయుట అనే ఇరువది యైదవ అధ్యాయము ముగిసినది.
 --(())--

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.
తండ్రి శాపం :-
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష :-
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నేయి ,ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు . వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట :-
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన :-
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట :-
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి :-
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను
వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం  :-
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ :-
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత.

No comments:

Post a Comment