☘ శివ స్తుతి☘ 5/4/2021
శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర గురుం,
వందే జగత్కారణం,
శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర గురుం,
వందే జగత్కారణం,
వందే పన్నగభూషణం మృగధరం,
వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్ని నయనం,
వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ,
వరదం వందే శివం శంకరం.🙏🏿
వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్ని నయనం,
వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ,
వరదం వందే శివం శంకరం.🙏🏿
****
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (15)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండి మన మానవుడు మనవరాలు వచ్చారండి.
వస్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు
ముద్దుగా ఉన్నాయి అయితే ముద్దు పెట్టుకో కాని వాళ్ళ ఇంగ్లీషు నేర్చు కోవటానికి మాత్రం ప్రయత్నిచకు.
పిల్లలను అలా పార్కుకు తీసుకెళ్తాను
అప్పుడే ఇంగ్లీసు మాటొచ్చింది ఎంచక్కగా తోటకు తీసుకెళ్తున్నాను చెప్పొచ్చుగా
సరే అట్లాగేనండి
మీరు ఆయితే
డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ ❓
అప్పడే తలుపుకు తాళం వేయకండి అని చెప్పే బదులు ఇంగ్లీషు ఒకటి
’ఇందులో ‘కీస్’ కు( తాళం ) అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.
ఇదో పిచ్చి ఎవర్ని ఉద్దరించటానికి
చక్కగా అమ్మ అని పిలిపించుకొనే రోజులు తగ్గి పోయినాయి, మమ్మి డాడీ అని పిలిపించు కుంటున్నారు కాలమారుతున్నది మనతెలుగు చచ్చి పోతున్నది రామచంద్ర ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి
ఏమండి పిలిచారా
పిలవలేదు నేను చెపుతా విను
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?
దీనికి కారణం బానిస బతుకుకు ఇంగ్లీషు అవసరమని ప్రభుత్వం చెప్పుటయే, తెలుగుని వాడక పోవుటయే అంతా మన ఖర్మ.
మన తెలుగులో మాటలు లేవా ఎందుకు లేవు, చక్క గా ఉన్నాయి
కానీ మనం పలకం.
వంటింటిని......కిచెన్ చేసాం. వసారా.....వరండాగా మారింది.ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.
ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు
ఇంకా వేళ్ళ లేదా
వెళ్ళలేదండి మీరు ఎందుకో బాధపడుతున్నారండి
బాధ పడక ఏంచెయ్యాలి కట్టుకున్న పెళ్ళామే బంధువుల్ని గెష్టు లని, భోజనాన్ని లాంచ్ అని నేర్చు కొని అంటున్నది .
మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్ లే వస్తారు అనడం, .
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించే వన్నీ.......
రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం.బ్యాగ్ పట్టుకుని షాప్ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.
సరే నేనొక్కడ్నే ఇక్కడ కూర్చొని ఏమి చేసేది నేను కూడా ఆ తోటకొస్తాలే పా
మా ఆయన ఎంత మంచి వారో
శ్రీమతి మాట వినకపోతే శ్రీవారికి పస్తు అని ఎవరో కవి చెప్పారు.
ఎంచక్కా ఆడుకోక అసెల్లో ఆడుతున్నారు ఏమిటి
ఏమోనండి వచ్చినపపడి నుండి ఎదో నవ్వుతున్నారు, అరుస్తున్నారు ఎదో గేమ్ టండి
అదుగో ఆట అనక
క్షమించండి తప్పు దొర్లింది
ఎమ్ చ్చేద్దాం పిల్లలని అనలేం, పెద్దవాళ్ళను అనలేం ఎదో కాలం జరిగిపోతుంది కదా
అవునండి పిల్లలు వెళ్ళేదాకా ఆ ఇంగ్లీసు గొడవ పక్కన పెట్టండి, పిల్లలకు కోపం వస్తుంది.
అట్లాగేలే వాళ్ళ ముందు ఏమననులే
మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం పిల్లలు ఆడుకుంటున్నారుగా వాళ్ళని అలా వదిలేద్దామా ఆ ఆటలు మానమని చెప్పొద్దూ
తల్లి తండ్రులే ఆడ మంటున్నారు మనమే చేయగలం, అమ్మోమ్మా తాతాయ్య అనిపించుకుంటే చాలు
అది నిజమే
మీరేదో చెప్పా బొయ్యారు
నిన్న మన పక్కింటాయన సీతా రామయ్యగారు వచ్చి ‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది?
ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్నఅందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.
అవునండి మీరన్నది అక్షరాల నిజం
పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్ కు పంపిస్తాం. సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోవాటం లేదండి.
మనభాషను మరచిపోవద్దని గట్టిగా చెప్పు "మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ" ని మరచినవారు బాగుపడరు అని చెప్పు. .
అవునండి
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన.
అవునే పూర్వం పిట్టలదొర ఒకడొచ్చేవాడు నాలుగు బాషాలుమాట్లాడి నమ్మబలికి పాతగుడ్డలుంటే ఇవ్వమని, కొన్ని డబ్బులి ఇవ్వమని అడిగే వాడు, ఇవ్వకపోతే ఎదో రకం గొణిగేవాడు అలావుంది. .
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
ఏది మారాలంటే ఏంచెయ్యాలి మిరే చెప్పండి
అందరూ తెలుగుభాషలో చదవాలి, చదివినవారికి ఉద్యోగాలు, ఇవ్వాలి, అమ్మతల్లి (కంప్యూటర్ ) లో తెలుగులోనే వాడాలి ఉత్తరప్రత్యుత్తరాలు మన పాతగ్రంధాలు పిల్లలకు నేర్పాలి "కాశీమజిలీకధలు, తెనాలి రామకృష్ణకధలు, వివేకానంద బోధలు, భారతం, భాగవతం రామాయణం కధలు అందరికీ చెప్పాలి అదే నాకోరిక
కలలు కనకండి ఇది అక్షరాల నిజం
ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది తెలుగుదేశం దద్దరిల్లి పోతుంది.
ఏమిటండి అలా మాట్టాడుతున్నారు నిద్దరలోనా
తోటలోకూడా నిద్దరా
ఒక బాధ ఉన్న వాడికి నిద్ర ఎక్కడొస్తుందే, ఇది తెలుగు తల్లి ఆత్మ ఘోష నేను నిమిత్తమాత్రుడ్ని
మీరు బాధపడకండి
రోజులు మారుతాయి, మంచిరోజులొస్తాయి మన దేశాభివృద్ధికి మనపిల్లలు మనదేశానికే సేవ చేసే రోజులొస్తాయి, ఇక్కడే చదువుతాం, ఇక్కడే బతుకుతాం ఇక్కడ భాషనే మాట్లాడుతాం అని ప్రతిజ్ఞ చేస్తారండి
ఆరోజులొస్తాయా
వస్తాయండి
మిరే చూస్తారు
చూస్తానా
దిగుల పడకండి ఆ రాముణ్ణి తలచుకొని హనుమంతుని పిలవండి అన్ని ఆయనే చూసు కుంటాడు అందరికీ మాతృభాషపై ధైర్యం నూరిపోస్తాడు
ఓం శ్రీరామ్ .. శ్రీ మాత్రేనమ: ...ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమా;.. ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమా:
--(())--
'పంచ' దంపతులు!! అంటే తెలుసా?
ఈ లోకంలో..కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా..5 విధాలుగానే ఉంటారు.
మొదటిది లక్ష్మీనారాయణులు
ఈ లోకంలో..కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా..5 విధాలుగానే ఉంటారు.
మొదటిది లక్ష్మీనారాయణులు
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.
💐రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం
తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు.
రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత, ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.
మూడవది బ్రహ్మ సరస్వతుల జంట.
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం,
దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.
ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.
నాల్గవది ఛాయా సూర్యులు.
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో. ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.
ఐదవది రోహిణీ చంద్రులు.
రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది.
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.
*****
గ్రామార్వణం
ఒక వ్వక్తి ఒక గ్రామం నుండి మరి యొక గ్రామానికి వలస వెళ్ళి ఆ గ్రామం తనకు నివాసయోగ్యమైనదా... కాదా అని విచారించి ఎన్నుకొనే విధానం గ్రామార్వణం అంటారు. మనం పుట్టిన ఊరు, మన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పటి ఊరు విషయంలో గ్రామార్వణం చూడనవసరం లేదు. ఉద్యోగరీత్యా మార్పులు తీసుకునే ఊళ్ల విషయంగా గ్రామార్వణం చూడనవసరం లేదు.
వ్యాపార విషయంగాను మరియు రిటైర్మెంట్ లైఫ్ గడిపేందుకు వెళ్లే ఊరు విషయంలోను గ్రామార్వణం చూసుకోవడం శ్రేయస్కరం. ఎవరి మీద అయినా ఆధారపడి జీవనం చేయువారికి గ్రామార్వణం అవసరం లేదు.అర్వణము అంటే అచ్చి రావటం. గ్రామాలు, నగరాలు, స్థలాలు, క్షేత్రాలు కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.
ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.
వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.
శ్లో.దేశే గ్రామే, గృహే, యుద్ధే, సేవాయాం వ్యావహారికే నామరాశేః ప్రధానత్వం
జన్మరాశిఃన చింతయేల్ -అని శాస్త్ర ప్రమాణము.
ఒక వ్వక్తి ఒక గ్రామం నుండి మరి యొక గ్రామానికి వలస వెళ్ళి ఆ గ్రామం తనకు నివాసయోగ్యమైనదా... కాదా అని విచారించి ఎన్నుకొనే విధానం గ్రామార్వణం అంటారు. మనం పుట్టిన ఊరు, మన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పటి ఊరు విషయంలో గ్రామార్వణం చూడనవసరం లేదు. ఉద్యోగరీత్యా మార్పులు తీసుకునే ఊళ్ల విషయంగా గ్రామార్వణం చూడనవసరం లేదు.
వ్యాపార విషయంగాను మరియు రిటైర్మెంట్ లైఫ్ గడిపేందుకు వెళ్లే ఊరు విషయంలోను గ్రామార్వణం చూసుకోవడం శ్రేయస్కరం. ఎవరి మీద అయినా ఆధారపడి జీవనం చేయువారికి గ్రామార్వణం అవసరం లేదు.అర్వణము అంటే అచ్చి రావటం. గ్రామాలు, నగరాలు, స్థలాలు, క్షేత్రాలు కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.
ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.
వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.
శ్లో.దేశే గ్రామే, గృహే, యుద్ధే, సేవాయాం వ్యావహారికే నామరాశేః ప్రధానత్వం
జన్మరాశిఃన చింతయేల్ -అని శాస్త్ర ప్రమాణము.
దేశం గురించి, అనారోగ్య సమయాలలో, గ్రామం గురించి, గృహ ప్రవేశ విషయాలలో, సేవకుని స్వీకరించే విషయాలలో, దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి. యాత్రలకు, వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.
కనుక నామరాశినే ప్రధానంగా భావించాలి. ఇంకా ఉత్తమమైనది ఇంటి పేరున అర్వణం చూసుకోవటం మరీ మంచిది. దానివలన వారసులందరికీ అది లాభించి, యోగించే అవకాశం ఉంటుంది. అకారాది వర్గ సిద్ధాంతంగా, ధన, రుణ, సంఖ్యలనే సిద్ధాంతంగా కాకిణుల సిద్ధాంతపరంగా ఎన్నేన్నో అర్వణం చూసే విధానాలున్నాయి. పండితులు వారివారి అనుభవాలను బట్టి అనుసరిస్తూ ఉంటారు. గ్రామార్వాణానికి సులభమైన మార్గం ద్వారా తెలుసుకుందాం.
నామ నక్షత్ర రాశికి రెండు, ఐదు, తొమ్మిది, పది, పదకొండు రాశులైన గ్రామ నక్షత్ర రాశులు
చక్కగా అర్వణవౌతాయి.
గ్రామార్వాణం కట్టే మొదటి పద్దతి
రాజశేఖర్ అనే వ్యక్తికి హైదరాబాదు అర్వణం అవుతుందా?
రాజశేఖర్ పేరులోని మొదటి అక్షరం “రా” తులారాశిలోకి వస్తుంది. గ్రామం హైదారాబాద్ లోని మొదటి అక్షరం “హై” మిధున రాశిలోకి వస్తుంది. పై పట్టికలో చూపిన విధంగా తులారాశి నామరాశికి గ్రామ రాశి మిధున రాశికి సుఖాన్ని కలిగిస్తుంది. తులారాశికి మిధునరాశి తొమ్మిదవ రాశి అవుతుంది కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి హైదరాబాద్ అర్వణమవుతుంది. ‘అధికస్య అధికం ఫలం’ అన్నట్టుగా నక్షత్ర రీత్యా కూడా అర్వణమైతే ఇంకా బాగుంటుందని సంపత్ , క్షేమ, సాధన, మిత్ర, పరమ మైత్ర తారలయితే ఇంకా బావుంటుందని చెప్పే పండితులూ ఉన్నారు.
--(())--
కాలస్వరూపమే విశ్వరూపం
కౌరవులు కృష్ణుణ్ణి బంధించడానికి వచ్చినపుడు, అర్జునుడు యుద్ధభూమిలో చతికిలపడ్డప్పుడు కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించడం చూశాం. దేవతలు, రాక్షసులు మొదలైన అనేక ముఖాలతో కనిపించే రూపమది. దీని అర్థమేమిటి?
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!’’
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!’’
సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి, విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి, చేష్టలుడిగి కూలబడిపోతే, తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేశాడు.
మనిషి ఏదో ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాలంటే తనకు ఆ విషయంపై తెలిసిన పూర్తి సమాచారాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాడు. అర్జునుడికి యుద్ధభూమిలో వచ్చిన సందేహం తాను చేస్తున్న యుద్ధం గురించి. యుద్ధానికి సన్నద్ధం కావడానికి ముందు అతడే మిత్రరాజులందరితో మాట్లాడి సైన్యాలు సమకూర్చుకున్నాడు. కృష్ణుడి దగ్గరికి స్వయంగా వెళ్లి సహాయం కోరాడు. అలాంటివాడికి ఒక సందేహం. యుద్ధంలో అనేక మంది వీరులు మరణించాల్సి వస్తుంది.. అదెంత వరకు సమంజసం అని. అతనికి అప్పటికున్న అవగాహనతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక కృష్ణ భగవానుడిని అడిగాడు. బహుశా గ్రంథకర్త వేదవ్యాసుడు అర్జునుడి నోట అడిగించిన ప్రశ్న ఇది. ఇది అన్ని కాలాల్లో, అన్ని దేశాలకూ అన్వయించే ప్రశ్న. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు యుద్ధాన్ని సమర్థిస్తూ "the war to end all wars' అని వర్ణించారు. రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబుల వల్ల లక్షలాది ప్రజలు మరణించారు, ఆ సందర్భంగా అమెరికా చర్య కూడా శాంతి కొరకే అని చరిత్రకారులు చెప్పారు.
విశ్వరూపం విషయానికి వస్తే అది కృష్ణుడు అర్జునుడి సంశయాన్ని పోగొట్టడానికి చూపెట్టిన రూపం. అది నిజంగా దేవుడి స్వరూపమా..? అంటే అది భగవంతుని స్వరూపం కాదు. కేవలం ప్రకృతి రూపంలో కనిపిస్తున్న భగవంతుని శక్తి మాత్రమే. భగవంతుడు అంటే కేవలం చైతన్యం మాత్రమే ప్రకృతిలోని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే వాటి పరిణామంతో ఏర్పడిన విశ్వమే ఇది. కేవలం అర్జునుడి అవగాహన కొరకు కృష్ణుడు చూపించిన రూపమిది. రుగ్వేదంలో పురుషసూక్తం ఉంది. మనం ఏ గుడికి వెళ్లి పూజ చేయించినా అక్కడ ముఖ్యంగా వినిపించే సూక్తమిది.
‘సహస్రశీర్షా పురుషః..’ అంటూ మొదలవుతుంది. విశ్వాన్నంతా ఒకే వ్యక్తిగా కల్పించి వర్ణించిన భావన ఇది. ఈ వ్యక్తిని విరాట్ పురుషుడు అన్నారు. ఈ వ్యక్తికి వేయి తలలు అన్నారు. అంటే సరిగ్గా లెక్కపెట్టి వేయి అని కాదు. లెక్కించడానికి వీలులేని సంఖ్యలో (infinite) ఉన్న తలలు అని అర్థం. అలాగే అనంతమైన సంఖ్యలో కళ్లు, పాదాలు, అవయవాలు. ఇవన్నీ ఎక్కడివి అంటే ఇవన్నీ మనమే అన్నారు. సృష్టిలోని ప్రతీ జీవి తల, అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ఆ విరాట్ పురుషునికి చెందినవే. సృష్టి ప్రారంభం నుంచి పుట్టి, నశించిన జీవులన్నీ ఈ విరాట్ స్వరూపమే. మన శరీరంలో ఎన్నో కోట్ల జీవకణాలు పుడుతూ, మరణిస్తున్నట్లు.. ఈ విరాట్ స్వరూపంలో భూత, వర్తమాన, భవిష్యత కాలాల్లోని జీవరాశులన్నీ ఇమిడిపోయాయి. మన మిత్రులు, శత్రువులు ఇందులో భాగమే.
ఇలాంటి రూపాన్ని చూడడానికి శ్రీకృష్ణుడు దివ్యదృష్టి ఇచ్చాడట. దివ్యదృష్టి అంటే అదేదో ఒక త్రీడీ అద్దాలలాంటిది కాదు. భగవంతుని గురించి సూక్ష్మంగా ఆలోచించగలిగిన మనసునే ఈ దివ్యదృష్టిగా అభివర్ణించారు. ప్రపంచాన్ని ప్రపంచంగా, శత్రువులు, మిత్రులుగా కాకుండా భగవంతుని స్వరూపంలో చూడడమే దివ్యదృష్టి. ఈ రూపంలో అతడు చూసినదేమిటి? బ్రహ్మ, రుద్రులు, ఆదిత్యులు మొదలైన దేవుళ్లనంతా. వీరంతా వేర్వేరు వ్యక్తులు కారు. నిరంతరం జరుగుతున్న లయమే రుద్రుడు. దీనిలోనే అనేకమైన కోరలతో వికృతమైన నోళ్లతో భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారు ప్రవేశిస్తున్నారట.
భయంకరమైన కోరలతో కొందరి తలలు నలుగుతున్నాయట. అర్జునుడే ఆ రూపాన్ని చూసి కంపించిపోయాడు. నీ స్వరూపమేమిటి అని ప్రశ్నించాడు. నేను కాలస్వరూపుణ్ని అన్నాడు కృష్ణుడు. కాలప్రవాహంలో రాజ్యాలు, రాజులు అన్నీ సమసిపోతుంటాయి. గ్రీకు పురాణాల ప్రకారం కాలపురుషుడు ఒక రెక్కల రథంపై గొప్ప కొడవలి తీసుకుని లోకాన్ని నరుక్కుంటూ వెళ్తుంటాడు. అలాంటి కాలస్వరూపాన్నే ఇక్కడ అర్జునుడు చూస్తాడు.
కృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు. భీష్ముడు, కర్ణుడు మొదలైనవారంతా ఇప్పటికే నాచే చంపబడ్డారు. నీవు లేకున్నా వీరందరూ మరణించడం జరుగుతుంది. నీవు కేవలం నిమిత్తమాత్రుడుగా విల్లంబులు పట్టుకుని యుద్ధం చేయి. వీళ్లందరినీ జయించి కీర్తిపొందు అని అన్నాడు. దీనిలో ఒక శాశ్వతమైన సత్యం ఉంది. ప్రపంచంలో ధర్మానికీ, అధర్మానికీ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు పోటీపడి బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచివాళ్లు హింసకు గురవుతుంటారు.
దుర్మార్గులు లాభం పొందుతుంటారు. ధర్మానికి తీవ్రమైన గ్లాని ఏర్పడినపుడు మనిషి రూపంలోనే మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ సృష్టిలో ఉంది. ఈ ప్రక్రియను చూడటమే విశ్వరూప దర్శనం. విశ్వరూపం అంటే ప్రపంచ చరిత్రను ఒక తెరపై చూసినట్లు అవగాహన చేసుకోవడం. మనం సాధారణంగా వర్తమానాన్ని మాత్రమే చూస్తూంటాం.
అలాకాకుండా చరిత్ర మొత్తాన్ని, రాబోయే కాలాన్ని చూడటమే ఈ దర్శనం. అన్నీ మంచే చూడాలని మనం సాధారణంగా కోరుకుంటాం. కొన్ని భయంకర సత్యాల్ని చూడడానికి ఇష్టపడం. మంచి చెడు అన్నింటినీ నిర్లిప్తతతో చూడడమే విశ్వరూప దర్శనం. మొదట్లో అర్జునుడు కృష్ణుడితో ‘నన్నెందుకు ఈ ఘోరమైన కార్యానికి వినియోగిస్తున్నావు?’ అని అడిగాడు. విశ్వరూపం దర్శనం తర్వాత అతని ప్రశ్నకు సమాధానం దొరికింది.
అనంతమైన కాలచక్రంలో తాను ఒక చిన్న ముక్కను మాత్రమే అని, నిమిత్త మాత్రుడనే అని. తన ధర్మాన్ని అర్థం చేసుకుని కర్తవ్యాన్ని చేయడమే కర్మ యోగమనే పేరిట అర్జునుడికి చెప్పిన పాఠం. ప్రపంచం అనే కురుక్షేత్రంలో అంటే కార్య క్షేత్రంలో మనందరికీ వర్తించే పాఠమే ఇది.
మనకు తెలిసిన దశావతారాల లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి ఎనిమిదో అవతారం. ధర్మగ్లాని సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు. శ్రీకృష్ణుడి అవతారం కూడా లీలావతారమే! భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు. వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది. లీలావతరాల్లోని ముఖ్యమైన పదింటినే పురాణాలు దశావతారాలుగా చెబుతున్నాయి. శ్రీకృష్ణావతారం నారాయణుడి పరిపూర్ణావతారంగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా భక్తులు ఆరాధించేది శ్రీకృష్ణుడినే! శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఛాందోగ్యోపనిషత్తు. సామవేదానికి చెందిన ఈ ఉపనిషత్తు క్రీస్తుపూర్వం 8–6 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు చెబుతారు. ఛాందోగ్యోపనిషత్తులో శ్రీకృష్ణుని ప్రస్తావన, ధృతరాష్ట్రుడి ప్రస్తావన కనిపిస్తాయి. మెగస్తనీస్ తన రచనల్లో మధురలోని శూరసేనుడనే రాజు ‘హెరాకిల్స్’ను పూజించేవాడని రాశాడు. హెలియోడోరస్ శ్రీకృష్ణ భక్తుడిగా మారి, భాగవత ధర్మాన్ని అవలంబించాడు. అతడు మధ్యప్రదేశ్లోని విదిశా (ఇదివరకటి బేస్నగర్) నగరంలో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించి, దానిపై ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభుభక్తుడు హెరిడోరస్’ అని శిలాశాసనం వేయించాడు. దాదాపు ఇదే కాలానికి చెందిన మరో శాసనం మధుర సమీపంలోని మోరాలో ఉంది. ఇందులో వృష్టి వంశానికి చెందిన ఐదుగురు వీరుల ప్రస్తావన ఉంది. అందులో ప్రస్తావించిన ఐదుగురు వీరులు: బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు.
‘కృష్’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నల్లని’ అనే అర్థం ఏర్పడింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. శ్రీకృష్ణ భక్తుడైన చైతన్యప్రభు గౌడీయ వైష్ణవ తత్వానికి ప్రాచుర్యం కల్పించాడు. ‘హరేకృష్ణ’ నామాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చాడు.
చైతన్యప్రభు బోధలతో గౌడీయ వైష్ణవంలోని కృష్ణతత్వం, ‘హరేకృష్ణ’ భక్తి ఉద్యమం దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. శ్రీల ప్రభుపాదగా ప్రసిద్ధి పొందిన అభయచరణారవింద భక్తివేదాంత స్వామి తాను నెలకొల్పిన
‘ఇస్కాన్’పశ్చిమబెంగాల్లోని ‘ఇస్కాన్’ ప్రధానకేంద్రమైన మాయాపూర్లో ‘చంద్రోదయ మందిరం’ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే, కంబోడియాలోని ఆంగ్కోర్వాట్ ఆలయం తర్వాత అతి పెద్ద ఆలయం ఇదే కానుంది. దీని నిర్మాణానికి 75 మిలియన్ డాలర్లు ఖర్చవుతుండగా, ఇందులో సింహభాగం ‘ఫోర్డ్ మోటార్ కంపెనీ’ వ్యవస్థాపకుడైన హెన్రీఫోర్డ్ మునిమనవడు ఆల్ఫ్రెడ్ బీ ఫోర్డ్ ఖర్చు చేస్తున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమానికి ఆకర్షితుడైన ఆయన ‘ఇస్కాన్’లో చేరారు. అంబరీష్ దాస్గా వైష్ణవనామాన్ని స్వీకరించి, ప్రస్తుతం ‘ఇస్కాన్’ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గీతోపనిషత్తుగా ప్రసిధ్దికెక్కిన భగవద్గీతకు 18 పేర్లున్నాయి. అవి వరుసగా: 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద 13. బవఘ్ని 14. భ్రాన్తినాశని 15. వేదత్రయి 16. పర 17. అనంత మరియు 18. తత్యార్ధజ్ఙానమంజరి.
గీతోపనిషత్తుగా ప్రసిధ్దికెక్కిన భగవద్గీతకు 18 పేర్లున్నాయి. అవి వరుసగా: 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద 13. బవఘ్ని 14. భ్రాన్తినాశని 15. వేదత్రయి 16. పర 17. అనంత మరియు 18. తత్యార్ధజ్ఙానమంజరి.
మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాగా మహాభారతం భీష్మపర్వంలోని 43వ అధ్యాయం నాలుగవ శ్లోకంలో వేదవ్యాసుడు గీతలో శ్లోకాల సంఖ్య 745గా చెప్పాడు. ఇందు శ్రీ కృష్ణుడు 574, అర్జునుడు 85, సంజయుడు 41 మరియు ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పారు.
భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగము అంటారు. 1 నుండి 6 వ అధ్యాయాలను కలిపి ‘కర్మషట్కము’, 7 నుండి 12 వరకు ‘భక్తి షట్కము’ మరియు 13నుండి 18 వరకు ‘జ్ఞాన షట్కము’ అంటారు.
ఈ గీతా మహాత్మ్యాన్ని శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. కాగా, శ్రీ కృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా ప్రత్యక్షంగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు ఇంకా రథం (అర్జునుడి రథం) ధ్వజంపై నున్న ఆంజనేయస్వామి.
__(())--
బాబు బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
ఈరోజు ప్రముఖ స్వాతంత్రసమరయోధుడు.మొదటి ఇండియన్ యూనియన్ దళతమినిష్టర్ ,మొదటి కాంగ్రేసేయేతర భారత ఉపప్రధాని శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఈ సందర్భముగా ఆయన గురించి కొన్ని వివరాలతో పాటు ఆయన మనదేశానికి చేసిన సేవలను ఒకసారి గుర్తుచేసుకొందాము.
జగజీవన్ రాం గారు 1908 ఏఫ్రెల్ 5 న బీహార్ రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లా చంద్వా గ్రామం లో షోభిరామ్ ,వాసంతిదేవి అనే దంపతులకు జన్మించారు.షోభిరామ్ గారు బ్రిటీష్ ఆర్మీలో సిపాయిగా పనిచేస్తూ తన దేశపౌరులమీదే తుపాకి ఎక్కుపెట్టడం ఇష్టంలేక తన ఉద్యోగానికి రాజనామా చేసి తన ఊరిలోనే వ్యవసాయం చేసుకోనేవాడు. అయితే దరుదృష్టవశాత్తు రాం గారి ఎనిమిదో యేట కాలధర్మం చెందారు. అయితే వాసంతదేవి తన కుమారుడిని చదువు ఆపనీయకుండా కష్టపడి చదివించింది. రామ్ గారు కూడా చాలా చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకొన్నారు,
1922లో అహ్నహ టవున్ స్కూల్ నందు చేరేడు.అయితే అక్కడ అంటరాని తనమును ఎదుర్కొవలసివచ్చింది. అయినా అధైర్యపడలేదు.
అదే సమయంలో అంటరానితనానికి వ్యతిరేఖంగా మదన్ మోహన్ మాలవ్య గారు ఆ కాలేజ్ లో సమావేశము ఏర్పాటుచేశారు. మాలవ్య గారి మాటలకు ఆకర్షితుడై ఆయన శిష్యుడిగా మారిపోయారు.స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులైనారు.
అక్కడ నుండి హిందూ బెనారీస్ కాలేజ్ లోచేరినారు. తరువాత కలకత్తా యూనివర్సిటీలో చేరి బి.యస్సీ పూర్తిచేసారు. అప్పుడే సుభాష్ చంద్రబోస్ గారి సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ భాద్యత తీసుకొని విజయవంతంగా పూర్తిచేశారు.1934లో బీహార్ లో భయంకరమైన భూకంపం రాగా సహాయచర్యలలో పాల్గొని అందరు దృష్టిని ఆకర్షించారు.1935లో బీహార్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ చేయపడ్డారు.అప్పటికి మొదటిభార్య చనిపోయి రెండు సంవత్సరాలైన తరువాత ఇంద్రాణిదేవి గారితో ఇదే సంవత్సరంలో వివాహం జరిగింది. తరువాత భారతజాతీయకాంగ్రీస్ లో చేరారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 4సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.నెహ్రూ గారి కాబినేట్ లో మొదటి లేబర్ మీనిష్టర్ గానూ తరువాత కమ్యునికేషన్ ,ట్రాన్స్ పోర్టు , రైల్వేస్ మొదలగు శాఖలను సమర్థవంతంగా నిర్వహించి ,అందరిమన్నలను పొందారు.
1972లో ఇందిరాగాంధి కాబినేట్ లో లేబర్ ,ఎంప్లాయ్ మెంట్ ,రీ హాబిటేషన్ ,ఫుడ్ మరియు అగ్రికల్చర్ ,రక్షణశాఖ లను నిర్వహించారు.ఇండో-పాక్ యుద్దంలోభారత్ విజయం సాధించడంలో ఇతను పాత్రకూడా వుంది.స్వామినాధన్ ను ప్రోత్సహించి హరితవిప్లవానికి నాంది పలకేరు. అలాగే భూమి లేని పేదలకు ,సన్నకారురైతుల అభ్యున్నతికి ఇతను తీసుకొన్న నిర్ణయాలు పలువురి ప్రశంసలు పొందాయి,
అయితే 1975లో ఎమర్జన్సీకి వ్యతిరేఖంగా ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రేసు నుండి బయటకు వచ్చి డెమొక్రిటిక్ కాంగ్రీస్ ను స్తాపించారు. ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీతో అవగాహన కుదిరించుకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశ తొలి దళిత ఉపప్రధానిగా భాద్యతలు చేపట్టారు.అయితే 1979 లో భారతదేశ తొలి దళిత ప్రధాని అయ్యె అవకాశం తృటిలో కోల్పోయాడు. చరణ్ సింగ్ లాబీయంగ్ వల్ల ఈ అవకాశం పోయి రెండుసార్లూ ఉపప్రధానిగానే మిగిలిపోయారు. జూలై 6 1986లో పరమదించారు,
ఒక నిరుపేద దళితకుటుంబములో పుట్టి ,కొన్ని అవమానాలెదురైనా చలించక ,అంచలంచలగా ఎదికి ఎన్నో పదవులకు న్యాయంచేసి, ఎంతో మందికి మార్గదర్శకుడై అజాతశత్రువుగా పేరు తెచ్చుకొన్న శ్రీ బాబూ జగజ్జీవన్ రాం గారు మనందరికీ ఆదర్శవంతుడు.ప్రముఖ దళితనాయకుడు శ్రీ కాన్షిరాం గారు బాబూ గారి శిష్యుడే. అలాగే మొదటి మహిళా లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఇతని కుమార్తె గారు, ఇతని సేవలను గుర్తించిన భారతప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయసెలవుగా ప్రకటించింది.
ఈరోజు ప్రముఖ స్వాతంత్రసమరయోధుడు.మొదటి ఇండియన్ యూనియన్ దళతమినిష్టర్ ,మొదటి కాంగ్రేసేయేతర భారత ఉపప్రధాని శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఈ సందర్భముగా ఆయన గురించి కొన్ని వివరాలతో పాటు ఆయన మనదేశానికి చేసిన సేవలను ఒకసారి గుర్తుచేసుకొందాము.
జగజీవన్ రాం గారు 1908 ఏఫ్రెల్ 5 న బీహార్ రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లా చంద్వా గ్రామం లో షోభిరామ్ ,వాసంతిదేవి అనే దంపతులకు జన్మించారు.షోభిరామ్ గారు బ్రిటీష్ ఆర్మీలో సిపాయిగా పనిచేస్తూ తన దేశపౌరులమీదే తుపాకి ఎక్కుపెట్టడం ఇష్టంలేక తన ఉద్యోగానికి రాజనామా చేసి తన ఊరిలోనే వ్యవసాయం చేసుకోనేవాడు. అయితే దరుదృష్టవశాత్తు రాం గారి ఎనిమిదో యేట కాలధర్మం చెందారు. అయితే వాసంతదేవి తన కుమారుడిని చదువు ఆపనీయకుండా కష్టపడి చదివించింది. రామ్ గారు కూడా చాలా చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకొన్నారు,
1922లో అహ్నహ టవున్ స్కూల్ నందు చేరేడు.అయితే అక్కడ అంటరాని తనమును ఎదుర్కొవలసివచ్చింది. అయినా అధైర్యపడలేదు.
అదే సమయంలో అంటరానితనానికి వ్యతిరేఖంగా మదన్ మోహన్ మాలవ్య గారు ఆ కాలేజ్ లో సమావేశము ఏర్పాటుచేశారు. మాలవ్య గారి మాటలకు ఆకర్షితుడై ఆయన శిష్యుడిగా మారిపోయారు.స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులైనారు.
అక్కడ నుండి హిందూ బెనారీస్ కాలేజ్ లోచేరినారు. తరువాత కలకత్తా యూనివర్సిటీలో చేరి బి.యస్సీ పూర్తిచేసారు. అప్పుడే సుభాష్ చంద్రబోస్ గారి సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ భాద్యత తీసుకొని విజయవంతంగా పూర్తిచేశారు.1934లో బీహార్ లో భయంకరమైన భూకంపం రాగా సహాయచర్యలలో పాల్గొని అందరు దృష్టిని ఆకర్షించారు.1935లో బీహార్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ చేయపడ్డారు.అప్పటికి మొదటిభార్య చనిపోయి రెండు సంవత్సరాలైన తరువాత ఇంద్రాణిదేవి గారితో ఇదే సంవత్సరంలో వివాహం జరిగింది. తరువాత భారతజాతీయకాంగ్రీస్ లో చేరారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 4సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.నెహ్రూ గారి కాబినేట్ లో మొదటి లేబర్ మీనిష్టర్ గానూ తరువాత కమ్యునికేషన్ ,ట్రాన్స్ పోర్టు , రైల్వేస్ మొదలగు శాఖలను సమర్థవంతంగా నిర్వహించి ,అందరిమన్నలను పొందారు.
1972లో ఇందిరాగాంధి కాబినేట్ లో లేబర్ ,ఎంప్లాయ్ మెంట్ ,రీ హాబిటేషన్ ,ఫుడ్ మరియు అగ్రికల్చర్ ,రక్షణశాఖ లను నిర్వహించారు.ఇండో-పాక్ యుద్దంలోభారత్ విజయం సాధించడంలో ఇతను పాత్రకూడా వుంది.స్వామినాధన్ ను ప్రోత్సహించి హరితవిప్లవానికి నాంది పలకేరు. అలాగే భూమి లేని పేదలకు ,సన్నకారురైతుల అభ్యున్నతికి ఇతను తీసుకొన్న నిర్ణయాలు పలువురి ప్రశంసలు పొందాయి,
అయితే 1975లో ఎమర్జన్సీకి వ్యతిరేఖంగా ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రేసు నుండి బయటకు వచ్చి డెమొక్రిటిక్ కాంగ్రీస్ ను స్తాపించారు. ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీతో అవగాహన కుదిరించుకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశ తొలి దళిత ఉపప్రధానిగా భాద్యతలు చేపట్టారు.అయితే 1979 లో భారతదేశ తొలి దళిత ప్రధాని అయ్యె అవకాశం తృటిలో కోల్పోయాడు. చరణ్ సింగ్ లాబీయంగ్ వల్ల ఈ అవకాశం పోయి రెండుసార్లూ ఉపప్రధానిగానే మిగిలిపోయారు. జూలై 6 1986లో పరమదించారు,
ఒక నిరుపేద దళితకుటుంబములో పుట్టి ,కొన్ని అవమానాలెదురైనా చలించక ,అంచలంచలగా ఎదికి ఎన్నో పదవులకు న్యాయంచేసి, ఎంతో మందికి మార్గదర్శకుడై అజాతశత్రువుగా పేరు తెచ్చుకొన్న శ్రీ బాబూ జగజ్జీవన్ రాం గారు మనందరికీ ఆదర్శవంతుడు.ప్రముఖ దళితనాయకుడు శ్రీ కాన్షిరాం గారు బాబూ గారి శిష్యుడే. అలాగే మొదటి మహిళా లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఇతని కుమార్తె గారు, ఇతని సేవలను గుర్తించిన భారతప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయసెలవుగా ప్రకటించింది.
--(())--
ఉద్యోగంలో విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలు!!
భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా... భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతోందా అంటే లేకేం...
అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవుతుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.
మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా... చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే... ఎప్పటికైనా విజయం తప్పదు.
ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.
భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.
భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.
Attachment with detachment అనే సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.
చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్ ఫ్రెండ్ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత.
--(())--
భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా... భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతోందా అంటే లేకేం...
అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవుతుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.
మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా... చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే... ఎప్పటికైనా విజయం తప్పదు.
ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.
భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.
భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.
Attachment with detachment అనే సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.
చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్ ఫ్రెండ్ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత.
--(())--
No comments:
Post a Comment