సీతాపతి పద్యకావ్యము
సీసము
అర్థ మైన అనర్ధ - మాపుశక్తి ఎవరు
పరమార్ధ భక్తియే - పుడమి యందు
సర్వార్ధ సాధన - సామరస్యమగు
సత్కర్మ జీవితం - సహజ మందు
అర్ధమయినపుడు - అర్ధించు చర్చయే
అర్ధము కాకుంటే - అన్య మనసు
అర్ధాంగి కోరిక - అర్ధము చుట్టునే
సాగేను లక్ష్మణా - చతుర డీవు
తేటగీత
మంచి మాటఏ వైరాన్ని మార్పు చేయు
మంచి చూపుఏ అనుబంధ మనసు యగును
మంచి వ్యక్తిత్వ జీవితం మార్చి వేయు
స్నేహమే మన చిరునవ్వు సరళ మొవ్వు
--(())--
ऊँ!
-----
"సీసమాలిక..
-----
నమకచమకనుతినామజపాదుల నభిషేకమొనరింతు నవ్యయాత్మ !
పంచాక్షరీ మంత్రపఠనమ్ముఁజేయుచు పూర్ణభక్తిమతుల..
భోలెనాథ
బిల్వదళాలతో భీమశంకరదేవ
పూజలుసేయుదు భూరివరద
నారికేళాదులు నాగభూషణ..నీకు
నైవేద్యముగనిత్తు నందివాహ
కాయేన మనసాచ కళ్యాణకారుఁడ
కైంకర్యమొసఁగెద కాలరూప
వాగ్రూపసేవలు వామదేవభవఘ్న
నిండుమనంబున నీకునిడుదు
గీ.
--
పార్వతీపతి! భూతేశ ! సర్వనామ
సర్వజగతిని కావుమ పర్వదాత
వందనములందుకొనుమయ్య..స్కందజనక
భక్తమందార లయకార భస్మకాయ !!! "
----------
🙏🙏🙏
సీసము
దైవము యందును సంపూర్ణ నిష్టయు
సంకల్ప దృష్టియు - సంక్ర మించు
మనసున సంతసం - మధురిమం గామారు
పరిపక్వత వలన - ప్రేమ కలుగ
బుద్ధిలో మార్పుయు - బుధ్ధత్వ భావన
సంస్కార మందును - శ్రేష్టతేను
మాటలు కధలుగా - మధురిత చూపియు
సేవలో నమ్రత -సరళతవ్వ
తేటగీతి
నిద్ర లోనిశ్చితము కల్గు నిజము గుండు
జీవి తములోన సత్యత జాగృతగును
స్నేహమ్ములోన ఆత్మీయ స్వాగతమ్ము
సేవలోనమ్రత కలిగి సేవ చేయు
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (16)
ఏమిటండి మీరు చదివేది
మానవ జన్మలో ఏవి రహస్యంగా ఉంచాలి, ఏవి బహిర్గతం చెయ్యాలి, అనేవిషయంపై అనేకమంది అనేక విధాలుగా తెలియపరిచారు.
ఏమోనండి నాకు మాత్రం ఏమి తెలియదు, మనమధ్య రహస్యాలు ఎందుకండి, ఆ విషయాలు ఇప్పుడు అవసరమా.
అవసరము కాదనుకో, అయినా తెలుసుకుంటే మంచిదనే భావన, మనమధ్య మంచిది కదా, అందుకే నాకు తెలిసిన విషయాలు తెలియపరుస్తాను.
తొమ్మిది విషయాలలో మానవ జన్మ రహస్యంగా ఉంచాల్సిందే, అలా ఉంచకపోతే జీవితం దుర్లభం అది తెలుసుకోవాలి ఇది నా వాక్కు కాదు పెద్దలవాక్కు.
ఈ తొమ్మిదింటిని రహస్యంగా దాచాలంటారు..అవి ఏవి చెప్పండి
ఉడికించాక
అవి
ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, మరియు అవమానం
అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.
అందులో " ఆయువు, విత్తము, ఇంటిగుట్టు," ఈరోజు వివరించుతాను తెలుసుకో.
భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.రేపటి గురించి ఆలోచించటం అనవసరం. జరిగేది జరగక పోవచ్చు, జరగంది జరగవచ్చు అన్నీ విషయాలు కాలం పరిష్కరిస్తుందని నమ్మి జీవితం సాగించాలి.
1 . "ఆయువు". జరుగుతున్న సంఘటనలు జన్మపరిపక్వతకు వయసు "ఆయువు" చాలా ముఖ్యమైనది పదే పదే వయసు సుఖానికి అడ్డు రాదు. అనారోగ్యాన్ని బట్టి వయసు బయటపడు.
ప్రతిఒక్కరు రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండ గలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు." బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం," ఇలా చెప్పారు వయసును ఏ పరిస్థితిలో లెక్కించక మనసుని బట్టి కాలాన్ని బట్టి నడుచుకోవాలి.
నిజమేనండి మీరు చెప్పఁది. మరి రేండోది ఏది వివరించండి
2 . విత్తము
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు.
‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే.
‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.అందుకే కదా
అవునండి మీరు చెప్పేది నిజం అందుకే "మొగవారి జీతం ఆడవారి వయసు అడగకుండా
జీవితం సాగించాలన్నారు కదా
అవునే నీవు చక్కగా చెప్పావు
దేనియెడల, ఎవరి యెడలా 'ప్రత్యేకత'ను కలిగి ఉండొద్దు, నీలో ఉన్న దేవుడ్ని గమనించు మంచి మార్గంలో బతక గలిగితే అదే మోక్ష స్థితి. డబ్బు కోసం వెంపర్లాడితే నిన్ను, నీకుటుంబాన్ని , దేశాన్ని నాశనం సుహాసినవాడౌవుతావు.
అందుకే నే చెప్పేది రహాస్యంగా ఉంచటం : 'ఆచరణ' అనేది గొప్ప ఉపన్యాసము..
3 . ఇంటిగుట్టు: ఏ పరిస్థితిలో ఇంటిగుట్టు ఈశ్వరుడు కూడా తెలుసుకోలేనివిధంగా ఉంచాలి
అంటే ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.
సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.
మగడా వయసు చెప్పద్దన్నావు, దానం గూర్చి వద్దన్నావు, ఇంటిగుట్టు విప్పద్దన్నావు మిగతావి
ఓ నా ఆలోచన పరురాలా, నా ముద్దుల శ్రీమతి
వేడి కాఫీ నా చేతిలో పెడితే "ఉఫ్ ఉఫ్" అనకుండా తాగ్గలనా, ఎదో నాశ్రీమతి తెచ్చింది సానుభూతిగా తాగి నోరు కాల్చుకోగలనా
ఎందుకండీ వెటకారపు మాటలు, మీరు
అట్లాగే రామయాణంలో విభీషణునితో లంకేశ్వరుడు చనిపొయ్యేముందు లంక గుట్టు తెల్పి లంకకేచేటు తెచ్చావురా అని తెల్పాడు
నిజమేనండి మిగతావి " కంచంలో అన్నం తో పాటు కూర పప్పు పచ్చడి పొడులు ఇంకా సాంబారు ఉన్నా అన్ని కలిపి ఒకే సారీతినలేము కదండీ, అట్లాగే
కొన్ని విషయాలు నిదానంగా వింటేనే అర్ధమవుతాయి.
సరి సరే మీ అర్ధపు మాటలు వింటూవుంటే అక్కడ కాఫీ పొంగిపోతుంది తర్వాత మీరు పొంగిపోతారు
నిజమా ..... ఆ నిజమే
--(())--
🌻 దేవాలయంలో బలి పీఠం ఎందుకు ఉంటుంది ? 🌻
🍃🌹ప్రతి దేవాలయంలో కూడా బలిహరణం కొరకు పీఠాన్ని పెడతారు. అక్కడికి మేళతాళాలతో వచ్చి అన్నాన్ని ఉంచుతారు. దేవాలయం వివిధ స్థాయిలలో సమాజానికి ఉపయుక్తం అవుతుంది. అందుకే దేవాలయ ప్రాంగణంతో సంబంధం లేనివాళ్ళు కానీ, దేవాలయం వల్ల ప్రయోజనం పొందని వాళ్ళు కానీ సమాజంలో ఉండరు. దేవాలయ వ్యవస్థకు అంత గొప్పతనం ఉంటుంది. దేవాలయంలో మూడు రకాలుగా లోక సంక్షేమాన్ని వ్యక్తం చేస్తారు. ఎలా అంటే
🍃🌹1. ప్రసాదము: ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఆ ప్రసాదాన్ని తీసుకుంటే బుద్ధియందు మన సమస్యకు విరుగుడు తోచేటట్లుగా చేయగలిగినటువంటి శక్తి ప్రచోదనం అవుతుంది. అందుకని ప్రసాద వితరణ కొరకు ఈశ్వరనివేదనమైన పదార్ధం పంచిపెట్టడం.
🍃🌹2. ప్రతిరోజూ హోమం చేస్తారు. అప్పుడు అగ్నిముఖంగా హవిస్సులు ఇస్తారు. ఆయా దేవతలు హవిస్సు అందుకుని ప్రసన్నులై ఆ ఊరు అంతటికీ సకాలంలో వర్షాలు పడతాయి. దేవతానుగ్రహంతో ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తులు ప్రతిరోజూ యజ్ఞయాగాదులు, హోమాలు, క్రతువులు చేయలేకపోవచ్చు. కానీ అందరికీ అందడం కోసమని చెప్పి హోమ ప్రక్రియ ద్వారా దేవతలకు హవిస్సు ఇవ్వడం అనేది కూడా దేవాలయంలోనే జరుగుతుంది.
🍃🌹ఒక్కొక్క పెద్ద పెద్ద దేవాలయం ఉంటే అక్కడ హోమం చేస్తారు. గణపతి దేవాలయం – గణపతి హోమం జరుగుతుంది. అమ్మవారి దేవాలయం – ప్రతిరోజూ దుర్గాహోమమో, చండీ హోమమో, జరుగుతుంది. శివాలయం – ప్రతిరోజూ రుద్రహోమం చేస్తారు. విష్ణ్వాలయం – నారాయణ హోమం చేస్తారు. ఇలా దేవతలను ఉద్దేశించి హోమం చేసి హవిస్సులు ఇస్తారు.
🍃🌹3. ఇక మూడవది బలిహరణ మంటపం. దేవాలయంలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగే బలిపీఠం అని ఉంటుంది. ఈశ్వరుడికి నైవేద్యం పూర్తయిన తర్వాత మహా నైవేద్యం పెట్టిన పదార్థంలో కొంత తెచ్చి ఆ బలిహరణ మంటపాలపై ఉంచుతారు. అవి దేవాలయాలలో వివిధ ప్రదేశాలలో ఉంటాయి. బలి భుక్కులు అంటారు. అవి ఎవరు తినాలి అంటే అన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చినవే. ఉగ్ర భూతములు ఉంటాయి. పిశాచాదులు.
🍃🌹అవి కూడా తిరుగుతూ ఉంటాయి. వాటికీ అన్నం కావాలి. అవి తింటాయి. కాకులు మొదలైన పక్షులు తింటాయి. ఒక్కొక్కచో పిల్లులు లాంటివి తిరుగుతూ ఉంటాయి. అవి కూడా తింటాయి. దేవాలయంలో వాటికి స్థానం లేదు అని లేదు. పక్షి కూడా అక్కడికి వచ్చి నాలుగు మెతుకులు తిని వెళ్తుంది.
🍃🌹అంటే ఏ మంత్రంతోటీ సంబంధం లేకుండా దానికి అధికారం ఉన్నదా? లేదా అన్న సంబంధం లేకుండా శౌచము దానికి ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా దేవాలయంలోకి అవి ప్రవేశించవచ్చా? ప్రవేశించ కూడదా? అన్న సంబంధం లేకుండా దానివల్ల దేవాలయానికి పవిత్రత తగ్గుతుంది అన్నా కూడా అది కూడా వచ్చి తినడానికి అమంత్రకంగా ఎక్కడ పదార్ధం పెడతారో దానిని బలిహరణ మంటపాలు అంటారు.
🍃🌹అవి వచ్చి తింటాయి. అక్కడ కూర్చుని భక్తులు ప్రదక్షిణాలకు వస్తే దేవాలయం మీదకో, ధ్వజస్తంభం మీదకో వెళ్ళి రెట్టలు వేస్తాయి, అరుస్తాయి. వీటన్నింటి చేత దేవాలయానికి శక్తి తగ్గుతుంది. అప్పుడు కుంభాభిషేకం చేస్తారు మళ్ళీ తప్ప వాటికి ప్రవేశం లేదు అని మాత్రం విడిచిపెట్టరు. ఉగ్రభూతాలు కూడా తినడానికి ఏ మంటపం మీద అన్నం పెడతారో దానిని బలిహరణ మంటపం అంటారు. దేవాలయంలో మేళతాళాలతో వెళ్ళి పెడతారు.
🍃🌹ఆంతరంగా ఆ బలిహరణ మంటపం ఎందుకు ఉంచుతారు అంటే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ బలి పీఠం మీద యొక బలి ఇచ్చి లోపలి వెళ్ళాలి. ఏది బలి ఇవ్వాలి అంటే అరిషడ్వర్గములను బలి ఇవ్వాలి. అరి శత్రువు. ఏవి మనలను బాధ పెడుతున్నాయో ఆ ఆరు – కామక్రోధలోభమోహమదమాత్సర్యములు. ఈ ఆరింటిని బలిపీఠం మీద విడిచిపెట్టేసి దేవాలయంలోకి వెళ్ళాలి.
🍃🌹ఈ ఆరు విడిచి పెట్టి దేవాలయంలోకి వెళ్ళడం అన్న మాటకు అర్థం దేవాలయంలో నా వెనక వాడికన్నా, నా ముందు వాడికన్నా అధికుడిని అన్న భావన నీకు కలగరాడు. అందరూ ఎంతో నేనూ అంతే. ఆయన బిడ్డలలో నేనూ ఒక బిడ్డని అన్న భావనతో లోపలకు వెళతారు. దేవాలయమే ప్రత్యేకంగా ఆహ్వానించి తీసుకువెడితే పూర్ణకుంభం పెట్టి తీసుకువెళ్తారు.
🍃🌹కాబట్టి బలిమంటపం మీద ఏది బలి ఇచ్చి వెళ్ళాలి అంటే మన అరిషడ్వర్గాలను బలి ఇవ్వాలి. అందుకే దేవాలయ ఆగమంలో బలిపీఠానికి అత్యంత ప్రధానమైన స్థానం. శైవాగమంలో శివాలయం ఉంటే ఆ ఆలయంలో శివలింగం ఉన్న గోపురానికి స్థూల లింగము అని పేరు. పైకి గోపురం వంక చూస్తే చాలు శివుని దర్శనం ఫలితంలో ఎనిమిదవ వంతు ఫలితం ఇస్తారు. మూలలింగం అంటారు.
🍃🌹ఆలయం లోపల ఉన్నటువంటి లింగం – ఆ లింగాన్ని చూస్తే సూక్ష్మ లింగం అంటారు. ఆలయ దర్శనం ఫలితంలో ఎనిమిదవ వంతు ఫలితాన్ని సూక్ష్మ లింగ దర్శనానికి ఇస్తారు. పైన ఉన్న స్థూల లింగము, ఆలయంలో ఉన్న సూక్ష్మ లింగము కాకుండా మూడవది భద్రలింగము. బలిహరణ మంటపం భద్రలింగం. …
🌻 పితృదేవోభవ 🌻
🍃🌹దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో...’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.
🍃🌹తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది. ‘పుత్ర శబ్దానికి- తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.
🍃🌹‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు... అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు... అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు... ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.
,🍃🌹అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.
🍃🌹అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం. ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే! కాబట్టే విగ్రహవాక్యం- ‘తల్లియును తండ్రియును’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం. ‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే- భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.
🍃🌹కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’లను మొదటి రెండుగా చెబుతారు. వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక! ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక! లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.
🍃🌹అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!
🍃🌹అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ. ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!
🍃🌹అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన. శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం !!
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
: 🌻 ఈరోజు లక్ష్మీదేవి జయంతి 🌻
🍃🌺ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి , స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు.
🍃🌺మనం నివశించే ప్రాంతాల్ని , ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని , ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని , సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం....
🍃🌺క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు , అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.
🍃🌺విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తఫః ఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.
🍃🌺లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు , చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని , అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.
🍃🌺అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ , ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.
🍃🌺లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు , ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు.
🍃🌺జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి , తామస మన్వంతరంలో భూమినుండి , రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి , చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.
🍃🌺పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై ”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక” అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.
🍃🌺దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి , ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.
🍃🌺క్షీరసాగర మధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా , తరువాత సురభి అనే కామధేనువు , ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం , పిమ్మట ఐరావతం , కల్పవృక్షం , వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం.
🍃🌺భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము , మేధస్సు , ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 28 🙏
🍃🌹ఈ పద్యం శౌర్యవంతుని గొప్పదనం ఎటువంటిదో వివరించింది
ఉ. ఎందఱుశౌర్యహీను లెదురేగిన విక్రమధుర్యు నాజిలో
మ్రందగంజేయఁ జాలరు క్రమంబుగ గుంపులుగూడి మూగినన్
పొందుగ సర్వజాతిమృగపుంజ మరణ్యములోన సింహరా
జుందగదాకి యెట్టులిల సుస్థిరతంగను వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! పరాక్రమవంతునిగా ప్రఖ్యాతి పొందిన ధైర్యవంతుని శౌర్యహీనులు ఎంతమంది గుంపులు గుంపులుగా సంఖ్యాబలంతో ఎక్కువగా వుండి యెదుర్కొనినప్పటికిన్నీ యుద్ధంలో ఆతనిని గెలువలేరు. అపజయాన్నే వారు పొందుతారు.
🍃🌹అదెలాగంటే- అరణ్యంలో రాజయిన సింహాన్ని ఆ అరణ్యంలో మృగజాతి సర్వమూ కలసి గుంపుగా వచ్చి యుద్ధానికి తలపడి? ఎదుర్కొన్నప్పటికీ అవి ప్రాణాలు పోగొట్టుకుంటాయి తప్ప ఆ మృగరాజును గెల్వలేవుకదా...
🍃🌹అలాగే శౌరవ్యవంతుని ఎందరు శౌర్యహీనులు లెక్కకు మిక్కిలిగా నెదుర్కొన్నా గెలవలేరు. అపజయాన్నే పొందుతారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుందరకాండ 🙏
అంజనానందనం వీరం జానకీ శోకనాశనమ్!
కపీశమ్ అక్షహంలారు వందే! లంకా భయంకరమ్ ||
🍃🌺సుందరకాండ ఎందుకు చదవాలి? అని కొందరు ప్రశ్నిస్తారు.
🍃🌺ఆదికవి వాల్మీకి మునిచంద్రుడు సైతం ముచ్చటపడిన “కాండ" కనుక సుందరకాండ చదివి తీరాలి.
🍃🌺శ్రీరామచంద్రుని బాల్యం, విద్య,వివాహం చిత్రించి దానికి “బాలకాండ" అనీ, సీతారాములు అయోధ్య వదిలేవరకూ జరిగిన కథకు “అయోధ్యకాండ" అనీ, వారి వనవాస విశేషాలను వివరించే సన్నివేశాలకు “అరణ్యకాండ" అనీ, రామ లక్ష్మణులు కిష్కింధా నగరంలో గడిపిన జీవితగాథకు “కిష్కింధాకాండ" అనీ, రామరావణ సంగ్రామ కథాభాగానికి “యుద్ధకాండ" అని పేర్లు పెట్టిన వాల్మీకి మహర్షి కిష్కింధా - యుద్ధ కాండల మధ్య జరిగిన విశేషాలకు “సుందరకాండ" అని నామకరణం చేశారు.
🍃🌺నిజానికి దీనికి అన్వేషణ కాండ అనీ, హనుమత్కాండ అనీ పేరు పెట్టవచ్చు. మహాకవులెవరయినా యిది వ్రాసి ఉంటే! కాని ఆయన “కవి” మాత్రమే కనక కావ్యదృష్టితో “సుందరకాండ" అన్నాడు. ఇందుకు అనేకులు అనేక కారణాలు చెపుతారు.
🍃🌺ఇందులో ప్రప్రథమంగా హనుమంతుని విశ్వరూప సౌందర్యం, ఆయన సేవాధర్మ సౌందర్యం ఉన్నాయి.
🍃🌺ప్రపంచంలోని సర్వనగర నిర్మాణాన్ని తలదన్నే లంకానగర సౌందర్యం, ఆ నగరంలో ఉన్న కమనీయ కామినీజన సౌందర్యం ఉన్నాయి. దశకంఠరావణుని రాజసవీర సౌందర్యం ఉంది.
🍃🌺ఈ పాంచభౌతిక సుందరత్వం అంతనూ తృణప్రాయంగా చూడగల జానకీ “శీలసౌందర్యం ” ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. ఇన్నిటితో వాల్మీకి మునిచంద్రుని కవితాశిల్ప సౌందర్యం ఇక్కడే నిక్షిప్తమయి ఉంది.
🍃🌺అన్నిటినీ మించి ఆత్మహత్యకు సన్నద్ధులయిన “జానకీ . హనుమంతుల" ప్రాణరక్షణ సౌందర్యం గోచరిస్తుంది.
🍃🌺ప్రతి మానవుడికీ జీవితం మీద ఆశ కల్పించే సన్నివేశాలున్నందు వల్లనే ఇది చదవాలి. పారాయణం చెయ్యాలి నిత్యం.
🌻 శ్రీమద్రామాయణం 🌻
🍃🌺విద్వాంస భూషితమూ, వీరయోధ విలసితమూ అయిన ఆయోద్యానగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే పేరుగల ముగ్గురు భార్యలవల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులు కలిగారు.
🍃🌺వీరిలో పెద్దవాడయిన రామచంద్రుడు తండ్రిమాట ప్రకారం అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకీ, తమ్ముడు లక్ష్మణుడూ కూడా వచ్చారు.
🍃🌺పదమూడు సంవత్సరాల కాలం అరణ్యంలో మునీశ్వరుల ఆశ్రమాలను దర్శిస్తూ, సాధుహింసకులయిన రాక్షసులను సంహరిస్తూ కాలం గడిపాక, ఒకనాడు లంకేశ్వరుడయిన రావణుడు (మాయచేసి మారీచుని సాయంతో) సీతను అపహరించాడు.
🍃🌺భార్యా విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధచేరి సుగ్రీవునితో స్నేహంచేసి, వాలిని సంహరించాడు. అనంతరం వానరులందరూ సీతాన్వేషణకు నాలుగు దిక్కులకూ వెళ్ళారు. వారిలో అంగదుని నాయకత్వాన దక్షిణ దిశకు వచ్చిన యోధులలో హనుమంతుడు సముద్రం దాటడానికి సన్నద్ధుడయాడు. ఇది మొదటి నాలుగు కాండలలో కథ,
🍃🌺ఇక రేపటి నుంచి చదవండి, అయిదవదయిన సుందరకాండ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 మహాశివుడికి ఇల్లూవాకిలీ లేదంటారు? కదా! 🙏
🍃🌺బోళా శంకరుడైన మహాశివుని మీద ఎన్నో వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి. క్షుప మహారాజు మొదలు శ్రీనాథుడు లాంటి కవీశ్వరుల వరకూ ఏదో సందర్భంలో శివుని అపహాస్యం చేశారు.
🍃🌺శివుడు ఇల్లూవాకిలీ లేని నిరుపేదవాడని, భిక్షాటన చేస్తాడని, ఒంటికి జంతుచర్మం మాత్రం చుట్టుకుంటాడని, ఒకచోట స్థిరంగా ఉండకుండా బికారిగా స్మశానంలో సంచారం చేస్తుంటాడని, బూడిద రాసుకుంటాడని, తిరిపెమునకు ఇద్దరు భార్యలా అని - ఈ వరసన ఎన్నో నిందలు, అవహేళనలు ఉన్నాయి.
🍃🌺కానీ, మహాశివుని రూపం, చేష్టల వెనుక మర్మం ఉంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందాం...
🍃🌺భిక్షాటన సన్యాసి లక్షణం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఏమీ లేకపోవడం లేమికి నిదర్శనం కానేకాదు. లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, మోహాలు, వ్యామోహాలు అన్నీ కూడా మిధ్య.
🍃🌺నాది, నేను అనే అహంకారం మనిషిని ఎదగనీయదు. ఈ భవబంధాల్లో పడితే, కుడితిలో పడ్డ ఎలుక చందమే అవుతుంది. బంధాలు, వ్యామోహాలలో చిక్కుకుంటే ఇక పారమార్థిక చింతన ఉండదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే మహాశివుడు బిక్షాటన చేశాడు.
🍃🌺మహాశివునికి లేమి అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. కుబేరునికి అష్ట సిద్ధులు, నవ నిధులు ఇచ్చింది శంకరుడే. ఆదిశంకరునికి వస్తువులమీద, సంపదల మీద ఎలాంటి భ్రాంతి, వ్యామోహం లేదు.
🍃🌺శివునికి ఇల్లు లేకపోవడం ఏమిటి? విశ్వమంతా ఆయన ఇల్లే... ఇంకా చెప్పాలంటే, భక్తుల హృదయాల్లో ఆయన నివాసం ఉంటాడు.
🍃🌺మహాశివుడు అనామకుడు అనుకునేవాళ్ళు అజ్ఞానులు. లయకారుడు అయిన శివుడు లేకపోతే సృష్టి అనేది లేదు. శివునికి ఆద్యంతాలు లేవు. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు. మహాశివుని అఖండ శక్తిని అర్ధం చేసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇక తక్కినవారికి ఏం సాధ్యమౌతుంది.
🍃🌺ముల్లోకాలను కనిపెట్టుకుని ఉండాల్సిన మహాశివునికి ఒకచోట స్థిరంగా కూర్చోడానికి ఎలా వీలవుతుంది? నిరంతరం సంచరిస్తూనే ఉండాలి. ఒక మహా బాధ్యతను పనిలేనితనంగా చిత్రించుకోవడం అవివేకం.
🍃🌺మహాశివుడు భక్త సులభుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. మహాశివుడు ఏకంగా హాలాహలాన్ని గరళంలో దాచుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం.
🍃🌺మహాశివుడు తలచుకుంటే సర్వ సంపదలూ ప్రసాదించగలడు. ఆగ్రహం వస్తే, అమాంతం అన్నిటికీ భస్మం చేయగలడు. త్రిమూర్తుల్లో ఒకడైన మహాశివుని అపహాస్యం చేయడం అంటే, అంతకంటే అపహాస్యం మరేదీ లేదు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🌻 పూజ ఎందుకు చేయాలి??? 🌻
🍃🌹 ఈ ప్రశ్న చాలామంది నోటి వెంట వస్తుంది, లేక రోజు చేసే వారికి మనసులోనైనా వస్తుంది ... దానిగూర్చి ఒకసారి పరిశీలిద్దాం...
🍃🌹పూజ అంటే భగవంతుని కి ప్రధానంగా 64 ఉపచారాలు చేయాలి....
ప్రతిరోజూ కష్టం అంటే కనీసం షోడశోపచారములు చేయాలి.
🍃🌹 ఈ పదహారు ఉపచారాలు ఎలా ఉంటాయి అంటే మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నారనుకోండి.
మన ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ చేస్తే కూడా అలా ఉండాలి. అది యాంత్రికంగా చేసేది కాదు, ఉమా మహేశ్వరులను రోజూ పూజ చేస్తారనుకోండి.
ఆవాహయామి - అక్కడే ఉందిగా విగ్రహం. క్రొత్తగా రమ్మనడమేమిటి? కాదు. స్వామీ! రండి కూర్చొండి.
మన మంటపంలోకి ఆయన ఎక్కుతున్నారు అన్న భావన.
🍃🌹ఆసనం సమర్పయామి - సింహాసనంలో కూర్చోండి. ఈ ఉపచారాలు చేస్తున్నప్పుడు మనం విగ్రహానికి కాదు చేస్తున్నది మనస్సులో ఎదురుగా పరమేశ్వరునికే ఇస్తున్నానన్న భావన చేత పారవశ్యాన్ని పొందాలి,
🍃🌹అంతసంతోషాన్ని పొంది చిట్టచివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీటమీదనుంచి లేచి బయటికి వచ్చాము...మనిషి పుట్టుకనుంచి శరీరం విడిచి పెట్టడం వరకు పదహారు సంస్కారాలు.
🍃🌹చంద్రుడికి పదహారు కళలు, పూజలో పదహారు ఉపచారాలు, పదహారు చేయడానికి సమయం లేకపోతే కనీసంలో కనీసం అయిదు చేయాలి...
గంధపుష్పధూపదీపనైవేద్యాలు... "పంచసంఖ్యోపచారిణీ".
🍃🌹అనంతకోటి సుఖాలు మనం అనుభవిస్తున్నాము అంటే అయిదు ఇంద్రియాలలోనుంచే. ఈ అయిదు ఇంద్రియాలు పరమేశ్వరుడిచ్చాడు, విచ్చలవిడిగా వాడుకున్నాము...నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు, నిద్రలో మళ్ళీ ఈ ఇంద్రియాలకీ శక్తినిచ్చాడు,
నిద్రలేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి?
🍃🌹ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి, అందుకే పూజ ప్రాతఃకాలంలో, దీపంతో పూజ ప్రారంభం.
ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నాము, సాత్త్విక భావనతో ఉన్నాము కాబట్టి సాత్త్విక పదార్థాలని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తుoడాలి,
🍃🌹స్పర్శను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చల్లటి చందనాన్ని అనులేపనం చేయాలి,
చెవులతో ఎన్నో విని మురిసిపోతున్నాము. వీటికి కృతజ్ఞత చెప్తూ పువ్వులతో ఉపచారం చేయాలి,
🍃🌹అన్నింటికన్నా పెద్ద గౌరవం ప్రసాదానికి ఇస్తారు...ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే కళ్ళద్దుకొని నోట్లో వేసుకోవాలి. పువ్వులకొరకే తుమ్మెదలు ధ్వని చేస్తాయి, పువ్వు కనపడితే ధ్వని ఆపి మకరందం త్రాగుతుంది. ఆ నామములు చెప్పడం చేత మనస్సు వికసనాన్ని పొందాలి.
🍃🌹అందుకే వినేటటువంటి చెవులు ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. అనంతమైన సుఖాలు అనుభవించడాని ఈ అయిదు ఇంద్రియాలే కారణం.
🍃🌹ఈ అయిదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్లీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా! ముందు నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంలాగా.
ప్రొద్దున పూజ చేసి ఇంద్రియాలను వాడుకోవడం మొదలుపెడతాడు.
🍃🌹అంటే ఈ శరీరాన్ని ప్రసాదంగా వాడుకుంటున్నావు, ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడౌతాడు.
ఎవడు పూజ చేయడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు.
🍃🌹మనం భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మనం పూజ చేసినట్లే అపుడే అందరo కూడా పూజనీయులౌతాము... లోకంచేత గౌరవింపబడే శీలవంతులౌతాము...
🍃🌹భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకని పూజలో అయిదు ఉపచారాలు, ఆయనకి లేక కాదు. మనయొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి ఈ పంచోపచారాలు చేస్తాం.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼
ఉద్దాలకుడు ఒక ముని అతని భార్య భార్య చండి భర్త ఏమి చెప్పినా చండి దానికి
వ్యతిరేకంగా చేస్తూ వుంటుంది, గురువుగారి సలహా మేరకు ఆయన తండ్రి ఆబ్ధికం చేయదలిచి, భార్యతో నేను రేపు మా తండ్రిగారి ఆబ్దికం చేయబోవడం లేదు అన్నాడు.అందుకు ఆవిడ అదెలా చెయ్యరు?చెయ్యవలిసిందే అంటుంది.ఇంకా అలాగే నేను ఆబ్దికానికి కావలిసిన సరుకులు తేను,బ్రాహ్మలను పిలవను అంటే ఆమె అన్నిటికీ చేయవలిసిందే అని అంటుంది.. , ఆబ్దికం సక్రమంగా జరుగిపోయింది.అంతా సరిగా జరిగిపోయిందన్న ఆనందం లో పిండాలను నదిలో కలపాలి అంటాడు ఉద్దాలకుడు.చండి పిండాలను నదిలో ఎలా కలుపుతారు?అంటూ పెంట కుప్ప మీద పారవేస్తుంది., ఆయన కోపం పట్టలేక ఆమెను శిలగా మారమని శాపం యిస్తాడు.,
ఆ తరువాత.........
శిలగా మారిపోతున్న చండికి పశ్చాత్తాపం కలుగుతుంది. పూర్తిగా మారకముందే భర్త కాళ్ళ మీద పడి క్షమించి శాప విముక్తి ప్రసాదించమని వేడుకుంటుంది.
అనేక వేల సంవత్సరాల తరువాత కృష్ణుడి అనుంగు శిష్యుడైన నరుడి (అర్జునుడి) కరస్పర్శతో నీకు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఉద్ధాలకుడు.
కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు రాజసింహాసనం అధిరోహించాక అశ్వమేధయాగం చేస్తాడు. ఆ సమయంలో అశ్వం వెనకాల రక్షణగా అర్జునుడు పోతూ వుంటాడు. అట్లా పోతూ దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పెద్ద కొండలాగా పడి వున్న శిల కనిపించగా అశ్వాలకున్నసహజగుణం వల్ల రాయి కనిపించగానే యాగాశ్వం శరీరం రాతికి రుద్దుకుంటూ గోక్కుంటుంది.
అంతే వెంటనే ఆ గుర్రం శరీరం ఆ రాతికి అతుక్కు పోతుంది. అర్జునుడి సైన్యం గుర్రానికి నిద్ర వచ్చి మత్తుగా పడుకుందేమో అనుకుంటారు. కాని అక్కడి నుండి బయటకు రావటానికి గింజుకుంటున్న గుర్రాన్ని చూసి సైనికులు రాతి నుండి
విడదీయటానికి విశ్వప్రయత్నం చేస్తారు.కానీ విఫలులౌతారు..
అంతా రాక్షస మాయ అనుకుంటారు. అశ్వమేధ యాగానికి అంతరాయం కలిగిందని అర్జునుడికి దిగులు పట్టుకుంటుంది.
ఆ గుర్రాన్ని రాయి నుండి విడదీసే ప్రయత్నంలో దానికి బాధ కలుగుతూంది కానీ అది ఆ శిలనుండి విడివడదు.ఏమి చెయ్యాలో తోచక తిరుగుతున్న అర్జునుడికి ఆ చుట్టుపక్కల మున్యాశ్రమం కనిపించింది.ఆ ఆశ్రమములో సౌభరి అనే ముని వుంటాడు. ఆయనకు తన సమస్యను వివరిస్తాడు అర్జునుడు.
సౌభరి చండి వృత్తాంతం వివరించి శాపవశాత్తు శిలగా మారిన చండికి శాప విముక్తి కలగటానికి ఇంకా కొన్ని ఘడియల సమయం వుంది . ఇంత వరకు నీ సైనికులే విడదీయటానికి ప్రయత్నం చేశారు . నువ్వు వెళ్ళి ఆ శిలను ముట్టుకో అన్ని సర్దుకుంటాయి అంటాడు. ముని మాటలు విన్న అర్జునుడు చండిదేవికి ఉద్దాలకుడికి మనస్సులోనే నమస్కరించుకొని శిలను ముట్టుకుంటాడు.
వెంటనే చండికి శాప విముక్తి కలిగి "కృష్ణుడి అనుచరుడివి. నీ పవిత్ర స్పర్శ చేత నా పాపం తొలిగి పోయింది" అని కృతఙ్ఞతా భావంతో అర్జునుడ్ని ఆశీర్వదిస్తుంది.
ఇంతలో ఉద్ధాలకుడు అక్కడకు చేరుకొని భార్యా సమేతంగా వెళ్ళిపోతాడు.
అర్జునుడు అశ్వమేధయాత్ర కొనసాగిస్తాడు.
OooooO
ఏడుపు ఆరోగ్యానికి మంచిదే! ఎందుకో తెలుసా
ఆనందం, విషాదం... ఇవన్నీ జీవితంలో భాగమే. ఆటలు, పాటలు, స్నేహితులు మరియు కబుర్లలో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే... మరి కొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికి పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే... కొంత మంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. అయితే, ఆనందం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... విషాదం మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని, అది లేకపోతే మానవ జీవితానికి అర్థమే లేదని పరిశోధకులు చెబుతున్నారు.
విచారంగా ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం సహజం. ఎవరైనా సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్నీళ్లు వస్తుంటాయి. వీటిని ఆనంద భాష్పాలు అంటారన్న విషయం మీకు తెలిసిందే. మనస్సులోని భావోద్వేగాలను అధిగమించలేక పోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఏడుపు ప్రతికూలంగా చిత్రీకరించబడింది. ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనము కన్నీటి గ్రంథి నుండి కళ్ళద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్ళుగా పిలుస్తాము. కన్నీళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు శాస్త్రీయంగా ఏడవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నెమ్మదిగా క్రమరహిత శ్వాస, కండరాల వణుకు మొదలైనవి. భావోద్వేగాల నుండి వచ్చే కన్నీళ్లు వేరే రసాయన కూర్పును కలిగి ఉంటాయి. కంటి నొప్పి లేదా ఇన్ఫెక్షన్ నుండి వచ్చే కన్నీళ్లకు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాసంలో, మీ మనస్సు నుండి భావోద్వేగాలు బయటకు వచ్చినప్పుడు కన్నీళ్ళ నుండి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఒత్తిడిని తగ్గిస్తుంది మనస్సు ఒత్తిడి మరియు ఆందోళన మధ్య గందరగోళ స్థితిలో ఉంటుంది, ఇది శారీరకంగా మరియు మానసికంగా మమ్మల్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఇది మనకు ఒత్తిడి నుండి విరామం ఇస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది కొన్ని పరిశోధనల ప్రకారం, కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. సహజంగా శుభ్రపరచడం భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇదియాంటీ బాక్టీరియల్ లక్షణాలు సహజ ప్రక్షాళనగా పనిచేస్తాయి. పొడి కళ్ళ చికిత్స ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే ఇది కంటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ళ పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారించవచ్చు. కళ్ళు మన అత్యంత విలువైన నిధి - నిర్లక్ష్యం చేయవద్దు.... మానసిక స్థితి మెరుగుదల ఏడుపు ద్వారా మెదడులో ఉత్పత్తి అయ్యే ఎండార్ఫిన్లు లేదా మంచి ఎమోషన్ హార్మోన్ల ఏడుపు మనస్సును తేలికపరుస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ నుండి ఉపశమనం ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే అది డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏడుపు ప్రతికూల భావోద్వేగాల నుండి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. 1. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది మూడు రకాల కన్నీళ్లు ఉన్నాయి: రిఫ్లెక్స్ కన్నీళ్లు నిరంతర కన్నీళ్లు భావోద్వేగ కన్నీళ్లు రిఫ్లెక్స్ మీ కళ్ళ నుండి పొగ మరియు ధూళి వంటి స్పష్టమైన శిధిలాలు. నిరంతర కన్నీళ్లు మీ కళ్ళను ద్రవపదార్థం చేస్తాయి మరియు వాటిని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. భావోద్వేగ కన్నీళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చు. నిరంతర కన్నీళ్లలో 98 శాతం నీరు ఉండగా, భావోద్వేగ కన్నీళ్లలో ఒత్తిడి హార్మోన్లు మరియు ఇతర టాక్సిన్లు ఉంటాయి. దీనిపై మరింత పరిశోధనలు అవసరమవుతున్నప్పటికీ, ఏడుపు మీ సిస్టమ్ నుండి బయటకు వస్తుందని పరిశోధకులు సిద్ధాంతీకరించారు. 2. స్వీయ ఉపశమనానికి సహాయపడుతుంది ఏడుపు అనేది స్వీయ-ఉపశమనానికి మీ ఉత్తమ విధానాలలో ఒకటి. ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (పిఎన్ఎస్) సక్రియం చేస్తుందని పరిశోధకులు విశ్వసనీయ మూలం కనుగొన్నారు. PNS మీ శరీర విశ్రాంతి మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఏదేమైనా, ప్రయోజనాలు వెంటనే ఉండవు. ఏడుపు ఓదార్పు ప్రభావాలను మీరు అనుభవించడానికి ముందు కన్నీరు కార్చడానికి చాలా నిమిషాలు పట్టవచ్చు. 3. తక్కువ నొప్పి దీర్ఘకాలిక కన్నీళ్ళ విడుదలల కోసం ఏడుపు ట్రస్టెడ్ సోర్స్ ఆక్సిటోసిన్ మరియు ఎండోజెనస్ ఓపియాయిడ్లు, లేకపోతే ఎండార్ఫిన్స్ అని పిలుస్తారు. ఈ అనుభూతి-మంచి రసాయనాలు శారీరక మరియు మానసిక నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఎండార్ఫిన్లు విడుదలయ్యాక, మీ శరీరం కొంతవరకు తిమ్మిరి దశలోకి వెళ్ళవచ్చు. ఆక్సిటోసిన్ మీకు ప్రశాంతత లేదా శ్రేయస్సు భావాన్ని ఇస్తుంది. ఏడుపు అనేది స్వీయ-ఓదార్పు చర్య అని మరొక ఉదాహరణ. 4. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది నొప్పిని తగ్గించడంలో మీకు సహాయపడటంతో పాటు, ఏడుపు, ప్రత్యేకంగా దు:ఖించడం, విశ్వసనీయ మూలం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు బాధపడుతున్నప్పుడు, మీరు చల్లని గాలిని చాలా త్వరగా తీసుకుంటారు. చల్లటి గాలిలో శ్వాస తీసుకోవడం మీ మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక వెచ్చని మెదడు కంటే చల్లని మెదడు మీ శరీరానికి మరియు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తత్ఫలితంగా, దు:ఖకరమైన పరిస్థితి తర్వాత మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. 5. ఇతరుల మద్దతు మీకు నీలం అనిపిస్తే, ఏడుపు అనేది మీ చుట్టూ ఉన్నవారికి మీకు మద్దతు అవసరమని తెలియజేయడానికి ఒక మార్గం. దీనిని ఇంటర్ పర్సనల్ బెనిఫిట్ ట్రస్టెడ్ సోర్స్ అంటారు. మీరు శిశువుగా ఉన్నప్పటి నుండి, ఏడుపు ఒక అటాచ్మెంట్ ప్రవర్తన. దీని పనితీరు ఇతరుల నుండి సౌకర్యం మరియు సంరక్షణ పొందటానికి అనేక విధాలుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, కఠినంగా ఉన్నప్పుడు మీ సామాజిక మద్దతు నెట్వర్క్ను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఓదార్పు దు:ఖించడం ఒక ప్రక్రియ. ఇది దు:ఖం, తిమ్మిరి, ఆందోళన మరియు కోపం కాలాలను కలిగి ఉంటుంది. దు:ఖించే కాలంలో ఏడుపు చాలా ముఖ్యం. ఇది ప్రియమైన వ్యక్తిని ఓదార్చడానికి మరియు అంగీకరించడానికి విశ్వసనీయ మూలానికి సహాయపడవచ్చు. ప్రతి ఒక్కరూ ఏడ్చే ప్రక్రియలో రకరకాలుగా వెళతారు. మీ ఏడుపు విపరీతమైనదని లేదా మీ దైనందిన జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తే, మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. 7. భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ఏడుపు విచారానికి ప్రతిస్పందనగా మాత్రమే జరగదు. మీరు చాలా సంతోషంగా, భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు కొన్నిసార్లు మీరు ఏడుస్తారు. యేల్ యూనివర్శిటీ ట్రస్టెడ్ సోర్స్ పరిశోధకులు ఈ విధంగా ఏడుపు భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మీరు చాలా సంతోషంగా లేదా ఏదైనా గురించి భయపడి ఏడుస్తున్నప్పుడు, అటువంటి బలమైన భావోద్వేగాన్ని అనుభవించకుండా కోలుకోవడం మీ శరీర మార్గం. 8. శిశువు శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది గర్భం నుండి శిశువు మొట్టమొదటి ఏడుపు చాలా ముఖ్యమైన ఏడుపు. పిల్లలు బొడ్డు తాడు ద్వారా గర్భం లోపల తమ ఆక్సిజన్ను అందుకుంటారు. ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత, వారు స్వయంగా శ్వాసించడం ప్రారంభించాలి. మొదటి ఏడుపు ఏమిటంటే శిశువు ఊపిరితిత్తులు బయటి ప్రపంచంలో జీవితానికి అనుగుణంగా సహాయపడతాయి. ఏడుపు పిల్లలు ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటిలో ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. 9. శిశువు నిద్రకు సహాయపడుతుంది ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. శిశు నిద్రపై ఒక చిన్న అధ్యయనంలో, 43 మంది పాల్గొనేవారు తమ పిల్లలను పడుకోబెట్టడానికి నియంత్రిత ఏడుపు అని కూడా పిలుస్తారు. నియంత్రిత ఏడుపుతో, పిల్లలు వారి తల్లిదండ్రుల జోక్యానికి ముందు కొన్ని నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నారు. ఏడుపు ఎక్కువ సేపు నిద్రించడాన్ని రెండింటినీ పెంచింది మరియు రాత్రి సమయంలో శిశువులు నిద్రలేచిన సంఖ్యను తగ్గించింది. ఒక సంవత్సరం తరువాత, ఏడుపు శిశువులలో ఒత్తిడిని పెంచడం లేదా తల్లిదండ్రుల-పిల్లల బంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు.
ఎంత ఆనందంగా ఉండేవారైనా జీవితంలో ఎప్పుడో ఒకసారి విషాదాన్ని అనుభవించక తప్పదు. అలాంటి విషాదాలు ఎదురైనప్పుడే... మనిషికి తాము చేసే తప్పులేంటో విశ్లేషించుకునే అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. బాధ కలిగినప్పుడు దానిని అనుభవించటం వల్ల ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుందని.. లేదంటే, దాన్ని భరించాల్సిన అవసరమే లేదని వారంటున్నారు.
సాధారణంగా బాధ కలిగిన క్షణంలో ఏ పనీ చేయలేమనీ,
మనస్సు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుందని అయితే నిజానికి అలా ఆలోచనలు నిలిచిపోవడం అంటూ ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు. కాకపోతే, దేనివల్ల బాధ కలిగిందో, ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచించటం వల్ల... మిగతా ఏ విషయాలపైకి దృష్టి వెళ్లదని అన్నారు.
విషాదం కూడా మనకు మేలే చేస్తుంది. అది, గుండెల నుండి మోయలేని భారాన్ని తొలగించి, ఫ్రెష్గా తయారు చేయడమే గాకుండా, ఏదైనా విషయాలపై మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా స్పష్టత కలిగి ఉండేలా చేస్తుంది. కాబట్టి, హాయిగా విషాదంలో మునిగిపోండి... ఆరోగ్యంగా ఉండండి...!
[29/03, 3:59 pm] +91 92904 61512: విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం ఒకటి కర్ణాటకలో సక్లేషపూర్ అనే గ్రామంలో గ్రామస్తులు వేటి గురించో తవ్వుతూ బయటపడింది.
అదృష్టవశాత్తూ తవ్వకాలలో ఎక్కడా దెబ్బ తగలకుండా విగ్రహం పూర్తి రూపంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది హొయసల కాలంలో చెక్కబడిన వాసుదేవుడు లా కనిపిస్తున్నాడు.. చుట్టూ వున్న అర్చి వంటి దానిలో అందమైన సూక్ష్మ మైన దశావతారాలను కూడా చెక్కారు గమనించండి!
అప్పటి విదేశీయుల మొఘలుల (ముస్లిం లు ), బ్రిటిష్ ( క్రిస్టియన్ లు) దండయాత్రలు నుండి కాపాడుకోవడానికి బహుశా భూమి లోతుల్లో ఇసుక పారల మధ్య ఈ విగ్రహాన్ని భద్రంగా దాచి ఉంటారని అందుకే పూర్తి రూపంలో లభించింది అని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు.
[01/04, 11:19 am] Kant's Rso: *శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"ఎముకలు బలంగా ఉన్న వాడు బలవంతుడు కాదు.
ఎముకలేని నాలుక బలంగా ఉంటేనే బలవంతుడు."
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు.
కష్ట కాలం లోనే మిత్రులు ఎవరో తెలుస్తుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[02/04, 11:13 am] Kant's Rso: *శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"నీ భవిష్యత్తు యొక్క బలం
నీ గతం యొక్క కష్టాల పై ఆధారపడి ఉంటుంది.
నీ ప్రతి కష్టానికి బాధకు
ఒక ప్రయోజనం తప్పక ఉంటుంది."
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"పూల సువాసన మట్టికి అంటుతుంది.
కానీ మట్టి వాసన పూలకి అంటుకోదు.
అలాగే మంచివారి సహవాసంతో చెడ్డవాడు సజ్జనుడుగా మారవచ్చు కానీ...
దుర్మార్గుడి దుర్గుణాలు మంచి వానికి అంటవు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[05/04, 2:15 pm] +91 90526 93310: *త్వరలో అంతరించబోతున్న పాత తరం... 😢🙏*
రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.
అవును ఇది ఒక చేదు నిజం ।
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు
ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!
అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
స్నేహంగా మెలిగే వాళ్ళు!
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !
వాళ్ళు ....
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....
.
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
మీకు తెలుసా ?
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.లేదంటే .....
.లేదంటే .....
.లేదంటే .....
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం
ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే
లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..
*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!*
తప్పులను సరిదిద్దగలది సంస్కారమే
సర్కారు చేసే చట్టాలు కాదు....🙏
*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[06/04, 7:22 pm] Kant's Rso: *ప్రమాదం కాపుకాసుకుని ఉంది*.
*ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి! జాగ్రత్తగా ఉండండి!*
అందరికీ నమస్కారం🙏
*మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.*
*ఒక సర్వే ప్రకారం..... *
*మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. *
*టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు. *
*అందుచేత.....*
*దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి! *
*తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి!*
*చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి! *
*ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి!*
*ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి! *
*చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి*!
*ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి!*
*అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి!*
*వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.*
*వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి!అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు*
*మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు! లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు! వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి!*
*ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి!*
*అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి! *
*ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి*.
*ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి!*
*స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి*.
*ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.*
*అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి!*
*వాకింగ్ కూడా మానేయండి!*
*ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి!*
*నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.*
*ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి! *
*సమస్త లోకా: సుఖినో భవంతు*!
[07/04, 11:45 am] +91 98660 97761: మత పిచ్చోళ్ళ కోసం సైఫ్ అలీ గోరే సయ్యద్ రాసిన అద్భుతమైన కవిత...
నేను ముస్లిం అయితే ఏమిటి?
నువ్వు హిందువైతే ఏమిటి?
నీ గుడిముందు బిచ్చగాళ్ళు హిందువులే అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు
మసీదు ముందు ఫకీర్లు ముస్లిములే అయినా నేను హత్తుకోను.
నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా
నేను ఎన్ని రోజా లు పాటించినా
నువ్వు టాక్స్ ఎగ్గోట్టెందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో
నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను.
నీ మంత్రాలు సంస్కృతం అయినా
నా సూరాలు అరబ్బి అయినా
మన పిల్లల్ని ఇంగ్లీషు మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు
నాకూ లేదు.
నువ్వు గుడికెళ్ళే దారిలో
ఏ గుంతల రోడ్డులో ధక్కా ముక్కీలు తింటూ వెళ్తావో
నేను అదే కంకర తేలిన నాసిరకం రోడ్డులో మసీదు కు వెళ్తాను.
నీ పండగలకు ఏ వెజ్ వంటలు చేసుకోవాలన్నా
నా పండుగులకు ఏ నాన్ వెజ్ వంటలు వండుకోవాలనుకున్నా
కిరాణ కొట్టులో ధరల పట్టికలు ఇద్దరికి భయపెడుతూనే ఉంటాయి.
నువ్వు కళ్ళ మధ్య ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ
నేను కళ్ళ లో ఏ సుర్మా పూసుకున్నా కానీ
ఎవరి కళ్ళు కూడా
ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయి .
నువ్వు నదులలో పుణ్య స్నానం ఆచరించాలన్నా
నేను నదుల ఒడ్డున ఏ మసీదు లో వజూ చేసుకోవాలన్నా
కలుషితమై ఎండిపోతున్న ఈ బురదనీళ్ళే మనకు దిక్కవుతుంటాయి .
నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా
నేను ఏ పాయసం చేసుకోవాలనుకున్నా
ఇద్దరి వి నీళ్ళ క్యాను కొనుక్కునే బతుకులై నిరీక్షిస్తుంటాయ్.
నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా
నేను వాస్తు లేక ఇళ్ళు కట్టుకున్నా
మన ఇంటి ముంగిట డ్రైనేజులు మన సహనాల్ని పరీక్షిస్తూనే ఉంటాయి .
పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవడం
సారే జహాసే అచ్చా అని నేను పాడుకోవడమే కానీ
స్వేచ్చగా ఊపిరి తీసుకోలేక
పోల్యూషన్ కు ఇద్దరం ముక్కులు మూసుకోని తిరుగుతూనే ఉంటాం .
రోజూ గోమూత్రం తాగినందుకు నీకు ఎవడూ జీతం ఇవ్వడు
పవిత్ర జం జం నీళ్ళు తాగినందుకు నాకు ఎవడూ తనఖా ఇవ్వడు
నేను ఏ గడ్డం అరబ్ వాని వద్దకు వెళ్ళినా
ఇదే స్వర్గాదపి గరియసి నువ్వు అనుకున్నా
మనం చెమట చుక్కలు చిందించనిదే మనకెవడూ బువ్వ పెట్టడు.
నువ్వే పండుగ నవరాత్రులు చేసుకున్నా
నేను ఏ పండుగ మాసాలు చేసుకున్నా
బ్లాక్ మనీ దొంగల్ని ఏ పాలకులు కూడా పూర్తిగా పట్టుకోలేడు అని ఒప్పుకుంటాము
నీ సంప్రదాయం లో పిల్ల పెళ్ళిచేసినా
నా తరీఖా లో బేటి పెళ్ళి చేసినా
మా లో మంచోడు దొరుకుతాడొ లేదో అనే ఇద్దరం భయపడుతూ వెతుకుతుంటాం.
మనిద్దరికి తెలుసు
వర్షాకాలం వస్తుందంటే కాగితం పడువల ఆనందం పోయి
మన అపార్ట్మెంట్లు ఎప్పుడు మునుగుతాయో ఫికర్
నీకు ఉంది నాకు ఉంది
మనిద్దరికి తెలుసు
నా గజల్ ఖవ్వాలి లాగే
నీ తియ్యని ఆలాపన ఏదో ప్రమాదం లో ఉంది .
మనమిద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది.
మనిద్దరికి తెలుసు
నేను ముస్లిం అయితే ఏమిటి ?
నువ్వు హిందువు అయితే ఏమిటి?
మేం ఇద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటున్నది
నువ్వు అమెరికా పోయినా
నేను ఏ అరబ్ కు వెళ్ళినా
మనమంత భారతీయులం
హిందు ముస్లిం భాయి భాయిలం.
కావునా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం మనం ఒకరినొకరు దూషించుకోవద్దు.
No comments:
Post a Comment