Tuesday, 20 April 2021

శ్రీ రామనవమి

 21/04, 11:26 am] Mallapragada Sridevi: రఘవంశ మరియు జనక వంశ వంశవృక్షము.

శ్రీరామ నవమిలో "శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వృక్షాన్ని తెలియచేసారు.

🙏రఘువంశ వర్ణన🙏

(దశరథ మహారాజు పూర్వీకులు)

చతుర్ముఖ బ్రహ్మ

మరీచి --> 

కశ్యపుడు --> 

సూర్యుడు --> 

మనువు --> 

ఇక్ష్వాకుడు --> 

కుక్షి --> 

వికుక్షి -> 

భానుడు --> 

అనరంయుడు --> 

పృథుడు --> 

త్రిశంకువు --> 

దుందుమారుడు -> 

మాంధాత --> 

సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌ 

ధృవసంధి->

భరతుడు --> 

అశితుడు --> 

సగరుడు --> 

అసమంజసుడు --> 

అంశుమంతుడు --> 

దిలీపుడు --> 

భగీరతుడు --> 

కకుత్సుడు --> 

రఘువు --> 

ప్రవృద్ధుడు --> 

శంఖనుడు --> 

సుదర్శనుడు --> 

అగ్నివర్ణుడు --> 

శీఘ్రకుడు --> 

మరువు --> 

ప్రశిశృకుడు --> 

అంబరీశుడు --> 

నహుశుడు --> 

యయాతి --> 

నాభాగుడు --> 

అజుడు --> 

దశరథుడు --> 

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.

🙏జనక వంశ వర్ణన🙏

(జనక మహారాజు పూర్వీకులు)

నిమి చక్రవర్తి --> 

మిథి --> 

ఉదావసువు --> 

నందివర్దనుడు --> 

సుకేతువు --> 

దేవరాతుడు --> 

బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.

మహావీరుడు --> 

సుదృతి --> 

దృష్టకేతువు --> 

హర్యశృవుడు --> 

మరుడు --> 

ప్రతింధకుడు --> 

కీర్తిరతుడు --> 

దేవమీదుడు --> 

విభుదుడు --> 

మహీద్రకుడు --> 

కీర్తిరాతుడు --> 

మహారోముడు --> 

స్వర్ణరోముడు --> 

హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు. 

జనకుడు --> సీత, ఊర్మిళ 

కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...

అజ మహారాజ వర్మణః పౌత్రాయ...

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ..

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం..

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...

జనక మహారాజ వర్మణః పుత్రీం...

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

[21/04, 11:28 am] Mallapragada Sridevi: 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 *శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం.* 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*ఆరాధన ( సీతారాముల విగ్రహాలకు లేదా ఫోటోకు గానీ అభిషేకం, అలంకరణ, పూజ )పూర్తి  అయినా*  *తర్వాత కళ్యాణ సామాగ్రిని* *సమకూర్చుకొని* *సీత* *రామచంద్ర  స్వామిని కళ్యాణ వేదికపై కూర్చోబెట్టి* *ఆచమనము చేయవలెను.* 


 *ఆచమ్య* 

ఓం అచ్యుతాయ నమః

ఓం అనంతాయ నమః 

ఓం గోవిందాయ నమః 


(చేతులు శుద్ధి చేసుకొని)


ఓం కేశవాయ నమః 

ఓం నారాయణాయ నమః 

ఓం మాధవాయ నమః 

ఓం గోవిందాయ నమః 

ఓం విష్ణవే నమః 

ఓం మధుసూదనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం శ్రీధరాయ నమః 

ఓం హృషీకేశాయ నమః 

ఓం పద్మనాభాయ నమః 

ఓం దామోదరాయ నమః 

ఓం సంకర్షణాయ నమః 

ఓం వాసుదేవాయ నమః 

ఓం ప్రద్యుమ్నాయ నమః 

ఓం అనిరుద్దాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 

ఓం అధోక్షజాయ నమః 

ఓం నారసింహాయ నమః 

ఓం అచ్యుతాయ నమః 

ఓం జనార్ధనాయ నమః

ఓం ఉపేంద్రాయనమః

ఓం హరయే నమః 

ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః 


 *సంకల్పం:-* 


శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! ఏవంగుణ విశేషణ విశిష్టాయాం

అస్యాం శుభ తిథౌ భగవద్భాగవత ఆచార్య  కైంకర్య రూపేనా శ్రీ సీతా రామచంద్రస్వామి పాణిగ్రహణ కర్మ కరిష్యే.


 *శ్రీ సీతా రామచంద్ర స్వామి పాణిగ్రహణ కర్మణి కంకణ ధారణం కరిష్యే* 


(రెండు దారములతో గాని , ఐదు దారములతో గాని రెండు కంకణములను తయారుచేసి వాటికి మామిడి ఆకులను చుట్టి పసుపుతొ తడిపి వాటికి షోడషోపచార పూజను చేయవలెను )


 *ఓం కంకణ దేవతాయై శ్రియై నమః.* 

ధ్యాయామి. ఆవాహయామి . ఆసనం సమర్పయామి . అర్ఘ్యం సమర్పయామి . పాధ్యం సమర్పయామి . ఆచమనీయం సమర్పయామి.

స్నానం సమర్పయామి.

స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి . 

వస్త్ర యుగ్మం సమర్పయామి . 

ఊర్ధ్వ పుండ్రాన్ సమర్పయామి . 

దివ్య శ్రీ చందనం సమర్పయామి . 

పుష్పై పూజయామి. 

ధూప మాఘ్రాపయామి. 

దీపం సందర్శయామి. 

నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మంగళ నీరాంజనం సమర్పయామి.


( రామచంద్ర స్వామి వారి కుడి చేతికి, సీతమ్మ వారి ఎడమ చేతికి ఈ కంకణములను ధరింప చేయాలి.)


శ్రీ రామచంద్ర స్వామినః పాదౌ ప్రక్షాళయామి.


ఆచమనీయం సమర్పయామి.


( స్వామి వారికి పాదప్రక్షాళన చేసి , ఆచమనీయం సమర్పించాలి. )


 *శ్రీ రామచంద్ర స్వామినః* *ఉద్వాహ కర్మణి యజ్ఞోపవీత* *ధారణం కరిష్యే.* 

 

ఓం యజ్ఞోపవీత దేవతాభ్యోనమః ధ్యానవాహనాది షోడషోపచార పూజాం కరిష్యే.


( యజ్ఞోపవీతములకు షోడషోపచారపూజను చేయాలి. )


యజ్ఞోపవీతములకు చందనాదులర్పించి స్వామి వారికి ఎడమ భుజం పైనుంచి కుడిభుజం క్రిందకు వచ్చునట్లు ధరింపచేయాలి.


( శ్రీ రామచంద్ర స్వామి తనకు కన్యను అన్వేషించుమని పంపుతున్నట్లుగా భావించి నలుగురు లేదా ఇద్దరూ లేదా ఒక బ్రాహ్మణునికి దక్షిణతాంబూలం ఇవ్వవలెను.)

( బ్రాహ్మణుడు లేని ఎడల ఒక ఆసనం పైన దక్షిణతాంబూలం సమర్పించి తర్వాత ఎవరైనా బ్రాహ్మణోత్తమునకు సమర్పించవలెను.) 


 *శ్రీ సీతారామచంద్రుల ప్రవరలను అనుసంధించాలి* 


 *శ్రీ రామచంద్రస్వామి ప్రవర :-* 


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణో నప్రై.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవస్య అజమహారాజవర్మణః పౌత్రాయ.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు వాషిష్టమైత్రావరుణ కౌడిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ట గోత్రోద్భవాయ 

 *శ్రీ రామచంద్రపరబ్రహ్మణే వరాయ.* 


 *సీతా ప్రవర :-* 


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వరరోమరాజవర్మణో నప్త్రీమ్.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం హ్రస్వరోమమహారాజ వర్మణో  పౌత్రీమ్.


చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం జనకమహారాజ వర్మణో పుత్రీమ్. 

 

చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ఆంగీరస ఆయస్య గౌతమత్రయార్షేయ  ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం

*సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం*         *సీతాదేవి నామ్నీమ్* 

 *మిమామ్ కన్యామ్.* 

 

వృణీధ్వం....వృణీమహే

( అని కర్త ఉచ్చరించాలి. )

 

 *శ్రీ రామచంద్రః ఉద్వాహకర్మణి మధుపర్కం సమర్పయామి.* 

( పెరుగు , తేనె కొబ్బరికుడుకలో కలిపి మూడుసార్లు స్వామి,అమ్మవార్లకు సమర్పించాలి. )

 *అమ్మవారికి ,స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించాలి* 

తర్వాత కర్త దంపతులు కుడుకదక్షణతో యుక్తంగా దోసిలిలో పట్టుకుని మహాసంకల్పం చదువుతూ నీటిని సన్నగా ధారపోస్తూ కింద ఒక పాత్రలో పడేటట్లు పోయాలి.)


 *మహా సంకల్పం :-* 


"భగవతో మహాపురుషస్య శ్రీ లక్ష్మీ నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాభ్రియమానస్య అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజౌ వాయ్వాకాశాది ఆవరణైః ఆవృతేస్మిన్ మహతి బ్రహ్మండ ఖండ యేర్మధ్యే ఆధార శక్త్యాది అష్ట దిగ్గజోపరి ప్రతిష్టితే ! అతల వితల సుతల తలాతలాది సప్తలోకానాం అథోభాగే ! ఐరావత పుండరీక వామనాది అష్టదిగ్దంన్తి తుణ్డా దండోత్తంబితే ! ఇంద్రాగ్ని యమాది అష్ట దిక్పాలక పరిపాలితే ! అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాది అనేక విశేష దేశభాషా భూమిపాలవిచిత్రే !

భాగీరథీ గౌతమీ నర్మదా యమునాది పుణ్య నదీ పవిత్రితే ! అయేథ్యా మథురామాయా కశీ కాంచ్యాది సప్తపుణ్య పురీ విరాజితే ! పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండలే కలియుగే ప్రథమ పాదే ! జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే , గంగాగోదావర్యోః మధ్యదేశే అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్లపక్షే నవమీ తిథౌ సౌమ్య వాసరః వాసరే శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణే , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ కర్కాటక లగ్న సుమూహూర్తే , అభిజిత్ శుభలగ్నే సాలంకృత సహిణ్యోదక కన్యాదాన మహం కరిష్యే."


సీతా నామ్నీమ్ మిమాం కన్యాం సర్వాభరణ శోభితాం ! దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోక హితాయ వై !

భగవతో వరదాభయ హస్తే ప్రదాయ.


 *లోకాచార ప్రకారేణ మంగళాష్టకాని పఠేత్..* 


 *మంగళాష్టకములు :-* 


 *1* ) 

తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ! విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పతే తేజ్ఘ్రియుగం స్మరామి!!

సావధానస్సుముహూర్తే సావధానాస్సులగ్నే సావధానాః!!


 *2* ) 

గంగాసింధు సరస్వతీచ యమునా గోదావరీ నర్మదా !

కృష్ణా భీమరధీచ ఫల్గుసరయూ శ్రీ గండకీ గోమతీ ! కావేరీ కపిలా ప్రయాగ విరజా వేత్రావతీ త్యాదయో ! నాద్య శ్శ్రీహరి పాదపంకజభువాః కుర్వంతునా మంగళమ్ !!


 *3* ) 

శ్రీరామం జనకాత్మజా సురగురుం ప్రత్యజ్ముఖం ప్రాజ్ముఖం ! దోర్భ్యామంజరి మంచితైశ్చ వనితామాపూర్వమూక్తాఫలై ! 

నానారత్న విరాజమాన కలశై రానీయతం సాగరాత్ ! సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్సదా మంగళమ్ !!


 *4* )

శ్రీ మన్నీరజా మనః సరసిజా ప్రాభాత పద్మాకరా బ్రహ్మేద్రాది సురోత్తమాంగమనిశం రాజత్పందాంభోరుహః దైత్యేంద్ర ప్రమదేభరాన్మృగవరః

ప్రహ్లాద సంరక్షకః

శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరీః కుర్యాత్సదా మంగళమ్ !!


పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసీతారామచంద్రస్వామియోః  పాణీగ్రహణ కర్మణి మాంగళ్య ధారణం కరిష్యే.


( మంగళసూత్రములను తీసుకుని అక్షితల పళ్ళేమునందు ఉంచి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి పసుపు, కుంకుమలతో శ్రీ సూక్త , లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజించాలి. )


ఓం మాంగళ్య దేవతాభ్యోనమః , అర్ఘ్యాది షోడశోపచార పూజాం సమర్పయామి.

మాంగళ్య పూజ పూర్తైన తర్వాత మంగళసూత్రాలను తీసుకుని 


 *"మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా !* 

 *కంఠే బధ్నామి సుభగే త్వం జీవ ! శరదాం శతం !! "* 


మంగళసూత్రాలను శ్రీరామచంద్రస్వామి వారి హస్తమునకు స్పృశింపచేసి  సీతాదేవికి ధరింపచేయాలి.


ఆచారం కొరకై తలంబ్రాలను కర్తలిరువురూ ఒక్కొక్కరి తరపున తీసుకుని శ్రీసీతారాములకు ధరింపచేయాలి.తర్వాత శ్రీరామచంద్రస్వామి వారి ఉత్తరియపు అంచునందు, అలాగే సీతాదేవి అమ్మవారి కొంగు చివరియందు తాంబూలములను ఉంచి ముడివేయవలెను.


తదుపరి శ్రీసీతారామచంద్ర స్వామి పెరుమాళ్ళకు ఆరగింపు చేసి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ,మహా హారతి ,మంత్రపుష్పం సమర్పించవలెను.


 *మంగళాశాసనం:-* 


లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్స వక్షసే !

క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం !!


శ్రీ యః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం !

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం !!


కమళాకుచకస్తూరి కర్థమాంకిత వక్షసే !

యాదవాద్రి  నివాసాయ సంపత్పుత్రాయ మంగళం !!


నీలాచలనివాసాయ నిత్యాయపరమాత్మనే !

సుభద్రాప్రాణనాథాయ జగన్నాథయ మంగళం !!


స్వోచ్చిష్టమలికా బందగందబందుర జిష్ణవే !

విష్ణచిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళం !!


శ్రీనగర్యాం మహాపూర్యాం తామ్రపర్ణ్యూత్తరే తటే !

శ్రీ తింత్రిణీమూలధామ్నే శఠగోపాయ మంగళం !!


శేషోవా సైన్య నాథో వా శ్రీపతిర్వేతి సాత్వికైః !

వితర్క్యాయ మహాప్రాజ్ఞ్యేః

భాష్యకారాయ మంగళం !!


తులామూలావతీర్ణాయ తోషితఖిల సూరయే !

సౌమ్యజామాతృమునయే శేషాంశాయాస్తు మంగళం !!


మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే !

చక్రవర్తి తనూజాయై సార్వభౌమయ మంగళం !!


మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై !

సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్క్రతాయాస్తు మంగళం !!


మా నో హిగ్ంసీజాతవేదో గామశ్వం పురుషం జగత్ !

అభిభ్రదఘ్న ఆగహి శ్రీ య మా పారిపాలయ !!


తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్శంతి సూరయః ! 

దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగ్ం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం !!


పర్యాప్య్తా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యప్యై సర్వస్య జత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి !!


ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభయ దీమహీ !

తన్నో రామచంద్ర ప్రచోదయాత్ !!


ఓం మహాదేవ్యైచ విద్మహే రామపత్నైచ దీమహి !తన్నో సీతా ప్రచోదయాత్ !!


దేవస్య అనంతభోగోస్తు...

దేవ్యాః అనంతభోగోస్తు....


మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం జనార్దన !

యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే !!

ఉపచారపదేశేన కృతనహరహర్మయా !

అపచారాపదేశేన సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ !!



స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిశాః !

గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం 

లోకాస్సమస్తాః సుఖినోభవంతు !!


కాయేన వాచ మనసేంద్రియైర్వా

బుద్ద్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ !

కరోమి యద్యస్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామి !!


తీర్థప్రసాద వినియోగం.

 

*శుభం..భూయాత్...* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

[21/04, 11:36 am] Mallapragada Sridevi: శ్రీరామనవమి 🙏


శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు ...అది ఆయన పుట్టినరోజు కూడా .

 చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం .

మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం .

శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా  

నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ?

నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన 

 చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు , ఆద్యుడు 

 ఆ దివ్య ముహూర్త రూపకర్త , సృష్టికర్త భక్తరామదాసు .

ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం .

రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు . అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు . భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు 

అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి .(శ్రీరంగం మాదిరిగా ).

పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహిత లో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా  రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు . అదే చైత్ర శుద్ధ నవమి . అవతార పురుషులు , దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన  ఒక శ్లోకం అయిన ...."ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్ ". (   పరమ  పురుష సంహిత )

అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం .

రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు .

ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం . అందుకు ఆద్యుడు , రూపకర్త , ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు .

వాల్మీకి రామాయణం లో కానీ  , పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు .

నాడు భద్రాచలం లో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై , చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా 

శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ....ఆ ముహూర్తనిర్ణయ 

స్థల 

 కేంద్ర బిందువు భద్రాచలం  కాగా , ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు 🙏

భద్రాచలం లో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నం లో  నిర్వహిస్తారు . అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం ....ఇది దోషరహిత ముహూర్త సమయం .....దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు . 

అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం  శ్రీరామనవమి వేడుక 🙏


జై శ్రీరామ్ 

🙏🙏🙏

శ్రీరామనవమి

భారతీయ సంస్కృతిని చాటి చెప్పే మహా గ్రంథాలు రామాయణ, భారత భాగవతాలు. ప్రజల  నిత్య జీవితాలను భారతం ప్రదర్శిస్తే, దివ్యమైన జీవితం ఏ విధంగా గడిపి భగవంతుణ్ణి చేరుకోవచ్చో భాగవతం తెలియజేస్తుంది. మానవుడు ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా గడపాలో రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది.

యావత్‌ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావత్‌ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి


‘ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది‘-  ఇది బ్రహ్మవాక్కు. అది ఎప్పటికీ సత్యమే. శ్రీరాముడు... వేదం ప్రవచించిన ధర్మానికి ప్రతిరూపం కావడమే దీనికి కారణం. ‘వేదః ప్రాచేతసాత్‌ ఆసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా’ అన్నాడు వాల్మీకి.  శ్రీ మహా విష్ణువు మానవ రూపంలో శ్రీరామునిగా అవతరించాడు. మానవులకు ఉండే సహజ లక్షణాలనే ప్రదర్శించాడు. తాను భగవంతుణ్ణని ఆయనకు తెలిసినా, బ్రహ్మాది దేవతలూ, ఋషులూ ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పినా... తాను మానవుణ్ణనీ, దశరథ కుమారుడిననీ ఆయన ప్రకటించాడు.

మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు. వాల్మీకి ఘంటం నుంచి జాలువారిన శ్రీరామ కథా సుధాపానం చేసి తరించినవారు ఎందరో!  రామాయణంలోని ప్రతి శ్లోకం మంత్రాత్మకమైనదే. శ్రీరామ నామ మహిమనూ, రామనామ తత్త్వాన్నీ మేళవించి... శ్రీరాముణ్ణి పురుషోత్తముడు అన్నారు. 

‘వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని

వేదః ప్రాచేత సదాసీత్‌ 

సాక్షాద్రామాయణాత్మనా’ అన్నాడు వాల్మీకి. వేదాల ద్వారా తెలుసుకోదగిన పరమ పురుషుడే దశరథ తనయునిగా జన్మించాడు. వేదాలే వాల్మీకి ద్వారా శ్రీమద్రామాయణంగా ఆవిర్భవించాయి. శ్రీరామ నామ మహిమ గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. రామ మంత్రంలో... అష్టాక్షరి, పంచాక్షరి మహా మంత్రాల నుంచి ‘రా’, ‘మ’ అనే అక్షరాలు కలిసి రామ నామ తారకమంత్రం రూపొందింది. శివకేశవులు అభిన్నులనే అద్వైత సిద్ధాంతానికి ఇది ప్రతీకగా పెద్దలు చెబుతారు. వశిష్ఠ మహర్షి కూర్చిన ఈ తారక మంత్రాన్ని ఎందరో మహనీయులు జపించి సాఫల్యం పొందారు. 

ప్రకృతి శక్తులను పరిరక్షించే దైవీయ శక్తులను ప్రేరేపించి, తద్వారా లోక కల్యాణాన్ని సాధించడమే భగవత్తత్వం. ఆ తత్త్వాన్ని లోకానికి చాటి చెప్పడానికి రామునిగా విష్ణువు అవతరించాడు. జగద్రక్షణ చేశాడు. ధర్మ ప్రతిష్ఠాపనమే రామాయణంలోని విశిష్టాంశం. రామాయణం ద్వారా మానవ జీవితాలకు ఇహాన్నీ, పరాన్నీ అందించడమే వాల్మీకి సంకల్పం. సాధారణ మానవుడు పరిణతి చెంది, పరిపక్వతను సాధించడానికి దోహదపడే మహా గ్రంథం రామాయణం. అది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గ్రంథం. దేశ విదేశాల్లో రామాయణానికి అనువాదాలూ, అనుకరణలూ, అనుసృజనలూ అనేకం వచ్చాయి. ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన గ్రంథం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

తెలుగులోనూ ‘భాస్కర రామాయణం’, ‘మొల్ల రామాయణం’ తదితరాలు ఎంతో ప్రముఖమైనవి. గద్య, పద్య రూపాల్లో అనేక రామాయణాలు ఆవిష్కృతం అయ్యాయి. ‘ముని ఋణము దీర్చ దీని రచింతు’ అంటూ ‘రామాయణ కల్పవృక్షా’న్ని రచించి, తెలుగు సాహితీ నందనవనంలో కల్పవృక్షాన్ని నాటారు విశ్వనాథ సత్యనారాయణ. జానపదుల పాటలకూ రామాయణ కథ ఊపిరి అయింది. రాముని మేలుకొలుపులు, పవళింపులు, ఉర్మిళ నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు... ఇలా ఎన్నో పాటలు జానపదుల జీవితాల్లో భాగమయ్యాయి.

రాముడు తమకే కాదు, సర్వ జగత్తుకూ రక్షకుడనే భావన వారి హృదయాల్లో ప్రతిష్ఠితం కావడమే దీనికి కారణం. అలాగే రాజ్య పాలనకు సంబంధించిన ప్రధానమైన విషయాలు అయోధ్య కాండలో... శ్రీరామ, భరతుల సంవాద రూపంలో ఉంటాయి. భరతుణ్ణి రాముడు కుశల ప్రశ్నలు వేస్తూనే ఎన్నో విషయాలు ముచ్చటిస్తాడు. ప్రభుత్వాలు, అధికారులు ఎలా నడచుకోవాలో ఈ కాండలోని నూరవ సర్గ వివరించింది. 

సీతా వియోగం సందర్భంలో... మానవునిగా జీవిస్తున్న రాముడి దీన స్థితిని  ‘సుపధానంతు గచ్ఛంతం తిర్యంతోపి సహాయతే కుపధానంతు గచ్ఛంతం సోదరోసి విముంచతి’ అంటూ వాల్మీకి అద్భుతంగా చెబుతాడు. మంచి మనసున్న మానవుడికి సమాజమే కాదు, ప్రకృతి అంతా వెన్నంటి ఉంటుంది. 

‘రామాయణం’ అంటే ‘రాముని ఆయనం’. రాముడు నడచిన మార్గం. ఆ మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, జీవితాల్లో ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం పదే పదే ఉపదేశిస్తుంది. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక, పారలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు. కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి.

అలాగే రామాయణంలో ఎన్నో యజ్ఞ రహస్యాలు ఉన్నాయి. మానన సంబంధాలు ఎలా ఉండాలో, సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో శ్రీముని కథ చెబుతుంది. మానవుడిగా శ్రీరాముని ఆదర్శవంతమైన ప్రయాణాన్ని మననం చేసుకొని,  అందరూ అనుసరిస్తే ఉత్తమ మానవ సంబంధాలు నెలకొంటాయి. ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది.

‘రామాయణం’ అంటే ‘రాముని ఆయనం’. రాముడు నడచిన మార్గం. ఆ మార్గం ఆదర్శవంతమైన మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ, జీవితాల్లో ధర్మ మార్గాన్ని అనుసరించాలనీ రామాయణం పదే పదే ఉపదేశిస్తుంది. ధర్మం ఎన్నో సూక్ష్మమైన అంశాలతో కూడుకున్నది. లౌకిక, పారలౌకిక విషయాలు రామాయణం నిండా ఉన్నాయి. మానవ సంబంధాలు. కుటుంబ ధర్మాలు, పాలనా ధర్మాలు, మానవీయ అంశాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి.

*తెలుగు ప్రాంజలి ప్రభ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు*

దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట. శ్రీరాముడు సత్యపాలకుడు,ధర్మాచరణం తప్పనివాడు,ఏకపత్నీ వ్రతుడు,పితృ,మాతృ,నిగ్రహం,సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు.అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం.

 శ్రీరాముడు మనిషిగానే పుట్టాడు, మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు.. మరి రాముడు దేవుడెలా అయ్యాడు?

రాముడు.. దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్ట సుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా.. ప్రజల్ని పరిపాలించాడు. మరి.. మనందరికీ ఆదర్శప్రాయుడు ఎలా అయ్యాడు? పురుషోత్తముడిగా ఎలా మారాడు?

శ్రీరాముని జీవితం మొత్తం.. మానవులకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. ఎప్పుడెలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టినవాళ్లతో ఎల మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత.. అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు.. ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో తెలియజేస్తుంది. కులం, మతం లాంటి సామాజిక అడ్డుకట్టల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువతో పాటు శత్రువుతో కూడా మిత్రుత్వం ఎలా పొందాలో వివరిస్తుంది శ్రీరాముని జీవనశైలి.

అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు:

పంచేయాద్రిలపై పూర్తి నియంత్రణ కలిగిన వాడు.. శ్రీరాముడు.. ఆలోచనాపరుడు.. అహంకారం లేని వాడు.. శ్రీరాముడు.. ఆత్మశత్రువుని జయించేవాడు.. శ్రీరాముడు..అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. కామం, కోపం, అత్యాశ, అసూయ లాంటి అవలక్షణాలున్న రావణాసురిడిని వధించడం ద్వారా.. ఆ లక్షణాలన్నింటిని రాముడు వధించాడని అంటారు. శ్రీరాముని పాద స్పర్శతో.. మన నేల ధన్యమైందని చెబుతుంటారు.

తండ్రి మాట జవదాటలేదు, నిత్యం.. సత్యమే పలికాడు:

శ్రీరాముని గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటడు. నిత్యం.. సత్యమే పలికేవాడు. హిందువులకే కాదు.. ఇతర మతాల వారికి కూడా శ్రీరాముని గొప్పతనం తెలిసే ఉంటుంది. ఆ అయోధ్య రాముడు.. కేవలం ఆధ్యాత్మిక, చారిత్రక మూర్తి మాత్రమే కాదు. మంచితనానికి, దయకి, నమ్మకానికి.. చిహ్నం లాంటివాడు. అందుకే.. శ్రీరాముడు ఆదర్శపురుడయ్యాడు.

రాముడి జీవితం ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది:

శ్రీరామచంద్రమూర్తి జీవితం మొత్తం.. ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది. మనిషిగా జన్మించాక.. అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధు, మిత్రులతో ఎలా వ్యవహరించాలి.. ప్రజలతో ఎలా మమేకమైపోవాలి.. కష్ట, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలన్న వాటిని ఆచరించి.. చూపించిన వాడు శ్రీరాముడు.

ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులకు:

తల్లిదండ్రుల గారాలపట్టీ అయిన శ్రీరాముడు.. 17 ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట అడవులకు వెళ్లమంటే. మరో మాట మాట్లాడకుండా వెళ్లాడు. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి.. ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే.. రాజుగా పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గరపడగానే.. పద్నాలుగేళ్లు వనవాసం చేయమంటే.. ఒక్క నిమిషం ఆలోచించకుండా అడవులకు వెళ్లాడు శ్రీరామచంద్రప్రభువు. జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. అన్నది కూడా మన అయోధ్య రాముడే. కన్నతల్లి, జన్మభూమి.. స్వర్గంతో సమానమన్నాడు కాబట్టే.. రాముడు ఉత్తమ పురుషుడయ్యాడు.

రాముడు ఏకపత్నీవ్రతుడు:

ఒక అన్నగా.. తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు రాముడు. ఆయన తమ్ముళ్లు కూడా.. అన్న పట్ల అదే రకమైన ప్రేమతో ఉన్నారు. తల్లులు వేరైనా.. ఏనాడూ తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు. శ్రీరాముని కాలంలో.. రాజులకు ఎంతోమంది భార్యలు ఉండేవారు. అలాంటి సమయంలో కూడా.. రాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరు సంపాదించాడు. దాదాపు 11 వేల ఏళ్లు.. అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రప్రభువు.. సీతాదేవిని తప్ప మరో మహిళను వివాహమాడలేదు. ఆనాటి నుంచే.. ఒక భార్యను కలిగి ఉండాలనేది.. కట్టుబాటుగా మారింది. చాలా మంది.. రాముడే ఆదర్శంగా ఒకరినే వివాహమాడారు.

శ్రీరాముడు లోకారాధ్యుడు ఎందుకైనాడు? భగవంతుడనా? పురుషోత్తముడనా? ఎవరి విశ్వాసాలు వారివి. రెండూ సత్యాలే కావచ్చు. నమ్మినవారికి నమ్మినంత. నాణెమునకు బొమ్మా బొరుసు ఉన్నట్లే శ్రీరాముడిలో నారాయణతత్త్వముంది, నరతత్త్వము వుంది.

శ్రీరాముడు మాత్రం తను ఒక సాధారణ మానవుడిగానే గడిపాడనడంలో సందేహమేమాత్రమూ లేదు. రామో విగ్రహవాన్ ధర్మః- ‘రాముడు ధర్మము మూర్త్భీవించినవాడ’ని ఎలా చెప్తామో అతడొక ‘మూర్త్భీవించిన ఆదర్శము’ అని కూడ చెప్పాలి. రాముడు మానవమాత్రుడిగానే తన జీవితకాలంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఃఖానుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని కొనసాగించాడు. జాతికి, మానవాళికి అదే ప్రేరణ. స్ఫూర్తి కూడా. అందుకే ఆయనొక ‘జాతీయ మహానాయకుడు’. డా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడ రాజ్యాంగ మూలప్రతిలో రామపట్ట్భాషేకము, రామసేతు వంటి చిత్రాలకు స్థానం కల్పించారు.

శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు. దైవంగా భావించే ధార్మికులు, ఆధ్యాత్మికులు కూడ దీన్ని అంగీకరిస్తారు. ఏది ధర్మమో దానిని దైవంగా భావించడం హిందూ జీవన పద్ధతి. శ్రీరాముడు మానవుడే అనే విషయాన్ని నారద వాల్మీకులే స్పష్టం చేశారు. తన ఆశ్రమానికి నారదుడు వచ్చినపుడు వాల్మీకి ఆయనతో- ‘మీరు లోక సంచారం చేస్తుంటారు కదా! ఈ లోకంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థవంతుడు, సదా ప్రియదర్శనుడు, సర్వ ప్రాణికోటికి హితుడు, తేజోవంతుడు, జితక్రోధుడు, ధైర్యవంతుడు, దేవతలు కూడ భయపడే పరాక్రమవంతుడైన మానవుడెవడైనా ఉన్నాడా? ఉంటే తెలియజేయండి’ అని అడిగినపుడు-

బహవో దుర్లభాశ్ఛైవ యే త్వయా కీర్తితా గుణాః

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతాః అని..

ఇట్టి సద్గుణ సంపన్నుడైన మానవుడు లభించడం దుర్లభమే. కాని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు మాత్రం దీనికి మినహాయింపుగా- శ్రీరాముడనే రాకుమారుడు ఉన్నట్టుగా చెప్పాడు. దీనిని బట్టి రాముడు వేసిన ప్రతి అడుగులో ఒక మానవోత్తముడు గోచరిస్తాడు. అతనిని ఆశ్రయించిన సద్గుణ సంపద కారణంగా దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.

శ్రీరాముడు ప్రజాపతులతో, బ్రహ్మతో సమానుడే కాని ప్రజాపతి కాడు, బ్రహ్మకాడు అన్నాడు. శత్రువులను, దుర్మార్గులను చీల్చి చెండాడి జీవకోటిని, ధర్మాన్ని పరిరక్షిస్తాడు, తన ధర్మాన్ని ఆచరిస్తాడు. స్వజనులను రక్షిస్తాడు. వేదవేదాంగాల తత్వాన్నాకళింపు చేసుకొన్నాడు. ధనుర్విద్యలో నిష్ణాతుడు అని శ్రీరాముని గురించి చెప్పాడు. సమస్త సద్గుణములు రాముడి నాశ్రయించి యున్నాయని అర్థం. అందుకే ఆయన పురుషోత్తముడు, మానవోత్తముడు, నరోత్తముడు. రాముని మానవ జీవన విధానాన్ని, కార్యసాధకతను, ఆదర్శాన్ని అడుగడుగునా మనం గమనించవచ్చు.

శ్రీరాముడు దైవీశక్తి సంపన్నుడని రామాయణాది గ్రంథాలు వర్ణించినా రాముడెక్కడా తన జీవితంలో దైవీశక్తిని ఉపయోగించుకోలేదు. ఒక మానవుని వలె తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. తన భుజబలాన్ని, తన మేధస్సును, తన విద్యలను తాను నమ్ముకున్నాడు. 14 ఏళ్ల పాటు వనవాసమంతా కాలి నడకనే సాగింది. సీతానే్వషణ సుగ్రీవుని సహాయము, హనుమంతుని శక్తి సామర్థ్యములతోనే జరిగింది. సముద్రమును దాటవలసి వచ్చినపుడు కూడా వానరుల సహాయంతో సేతువును నిర్మించి దానిమీదుగా లంకకు వెళ్లాడు తప్ప ఎక్కడా మహిమలను, మాయలను ఉపయోగించలేదు. రావణ వధానంతరం అయోధ్యకు బయలుదేరి గంధమాదన పర్వతం దగ్గర దిగి ఋషిమునుల ఆశీస్సులు పొందిన శ్రీరాముడు వేదవేదాంగ విద్యా సంపన్నుడు. పరమ శివభక్తుడైన రావణుని చంపినందువల్ల కలిగే పాపమునకు ప్రాయశ్చిత్తంగా రామేశ్వరంలో సైకత శివలింగ ప్రతిష్ఠ చేశాడు. యుద్ధంలో శత్రువును చంపితే పాపం కలుగదు. కాని రావణుడు పరమశివ భక్తుడనే భావనతో లోక కళ్యాణార్థం రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. మానవుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయో శ్రీరాముడి మనస్సులో గూడ అలాగే పరిభ్రమించడంతో అలా వ్యవహరించాడు. అవసరాన్ని బట్టి శక్తిని, యుక్తిని, మేధస్సును ఉపయోగించాడు. 

శ్రీరామునికి గుడి కడుతున్నాం. కట్టాల్సిందే తప్పులేదు. ఎందుకు కట్టాలి? ఆయన సద్గుణములు, ఆదర్శము రాశిపోసిన మానవమూర్తి కాబట్టి. రామాలయం అనగానే రాముని మూర్తి, ఆయన గుణములు ప్రజల మనస్సులోకి రావాలి. అందుకోసం విగ్రహ ప్రతిష్ఠలు. గుడి గోపురాల నిర్మాణం చేయడం భారతీయ సంప్రదాయంగా నెలకొన్నది. దుష్టత్వానికి, దుర్మార్గానికి ప్రతీకలైన వాటికి ఈ భూమిమీద ఆదరణ లేదు. అలాగే ప్రపంచంలో ఏ దేశమూ చెడును ప్రోత్సహించకూడదు. పోషించకూడదు కూడ.

అయితే గుళ్లు, గోపురాలు కట్టి పూజలు చేస్తుంటే సరిపోదు. పూజ చేస్తున్న సమయంలో ఆ సద్గుణాలన్నీ మదిలో మెదులుతుండాలి. రామోభూత్వా రామం యజేత్. రాముడిని పూజిస్తున్నామంటే తాము కూడ అంతటి ఉన్నతులు కావడానికి ప్రయత్నించాలి. ప్రతి మనిషీ రాముడు కావాలి. ప్రతి అణువూ రామతత్త్వమే. అంటే ధర్మతత్త్వమే. మానవత్వమే ధర్మం. అదే దైవము. అదే భారతీయము. అదే హైందవము. సనాతనము కూడ.

రామ కళ్యాణము చేస్తున్నారు, చేయాలి. కళ్యాణము శుభప్రదము. సమాజానికి శుభం కలగాలనే ఆకాంక్షతో కళ్యాణం చేయాలి. శ్రీరాముడు ఏ భేదాలు, వైషమ్యాలు లేని సమరసతా, సమైక్యతా బాటలో నడిచి- మనకు బాట చూపించాడు. అంటరానితనం వంటి దురాచారాలను నిర్మూలించుకుంటూ, కుల విభేదాలను తొలగించుకుంటూ, సంపూర్ణ భారతీయ సమాజం సామూహికంగా రామకళ్యాణం జరుపుకోవడమే జాతికి శ్రేయస్సు.

*ప్రాంజలి ప్రభ కు టుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు*

No comments:

Post a Comment