*మనోమాలిన్యం అనునది జన్మజన్మల నుండి మన మనస్సుకు అంటుకొని ఉంటున్నది. దీనిని పూజలచే పునస్కారాలతో పోగొట్టుట అసంభవం. మాలిన్యం అనగా కొన్ని పూలమొక్కలు పుట్టినపుడు లేతగా మృదువ్ఞగా ఉంటుంది. అది పెరిగి పెద్దదైనా, దాని స్వభావం మృదువ్ఞగా ఉంటుంది.*
*అలాగే కంప మొక్క పుట్టి నపుడు లేతగా మృదువ్ఞగా ఉంటుంది. పెరిగి పెద్దదైనా దాని స్వభావం కఠినంగా ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది.*
*ఈ విధంగా చెడు సంస్కారాలు మన మనస్సుకు అంటుకొని యుండుట వలన, పరమాత్మతత్వం తెలియుట లేదు.*
*కొన్ని సందర్భాలలో మన కంటికి పొర ఏర్ప డుతుంది. ఆ పొర దృశ్యం కనపడకుండా చేస్తుంది. అపుడు ఎంక్వయిరీ చేసి కంటిడాక్టర్ ఆపరేషన్ ద్వారా కంటికి ఉన్న పొర అనే మాలిన్యం తొల గించుట ద్వారా, స్వచ్ఛమైన దృశ్యాన్ని చూడగలు గుతారు. అలాగే జిజ్ఞాసువ్ఞకు భగవతత్వం తెలి యుట లేదు. అంటే ఒక్క ధ్యానం ద్వారానే మన స్సుకు పట్టిన మాలిన్యం తొలగించుట సంభవం.*
*ఈ ధ్యానం మన జన్మజన్మల చెడు సంస్కా రాలను తుత్తునియలను చేసే బ్రహ్మాస్త్రం.*
*ఈ చెడు సంస్కారాలను బాహ్య పూజల ద్వారా పోగొట్టుట అసంభవం. బాహ్య వస్తువ్ఞకు మాలిన్యం తగిలితే చేతితో పోగొట్టవచ్చును. మనస్సుకు తగిలిన మాలిన్యం, మనస్సు ద్వారానే పోగొట్టాలి. అంటే శ్వాసపై మనస్సు పెట్టాలి.*
*ఇతర మార్గమే లేదు. కాబట్టి మన శరీరావయముల ద్వారా తినగా చేతితోగాని, చెవితో గాని బాహ్య సంబంధమైన వాటి ద్వారా చెడు సంస్కారాలను పోగొట్టలేం.*
*కనపడని మనస్సుకు తగిలిన చెడు సంస్కా రాన్ని కనపడని శ్వాస ద్వారానే చెడు సంస్కారాన్ని పోగొట్టుట సంభవం.*
*నీరు, అగ్ని, భూమి, ఆకాశం, గాలి(శ్వాస) వీటిలో ప్రధాన పాత్ర వహించేది గాలి.*
*మనసు-బుద్ధి-చిత్తం-అహంకారం-జ్ఞానం. వీటిలో ప్రధానపాత్ర వహించేది మనస్సు.*
*ఇకపోతే ఆత్మ. ఈ మూడు కూడా మనకు కనపడనివి. మనస్సు కనపడదు. గాలి కనపడదు. ఆత్మ కనపడదు. కనపడని ఆత్మను పొందాలంటే కనపడని మనస్సును కనపడని (గాలిపై) అనగా శ్వాసపై ఉంచాలి.*
*ఈ విధంగా శ్వాసమీద మనసు ఉంచినట్లయితే మార్గం సుగమమౌతుంది. బహిర్ము ఖముగా పరుగెత్తే మనస్సును అంతర్ముఖం చేసి, మౌనముగా శ్వాసపై మనస్సు ఉంచాలి. ఈ విధంగా చేసే ధ్యానం విధానం వలననే మనస్సు స్వాధీన పడవలెననే గాని ఇతరత్రా కాదు.*
*ఈ విధానమైన ధ్యానం అనగా సర్వ దుఃఖ నివారిణి, రోగాల నుండి విముక్తి కల్గించే మహిమాన్వితమైన అపూర్వ ప్రక్రియ.*
*ఈ విధమైన ధ్యానం ఆదిమద్యాంత రహితంగా సాగే ధ్యానం సంభ్రమాశ్చర్యాలతో సాగుతుంది. తాను చైతన్యమై సమస్తాన్ని చైతన్యపరుస్తూ ఉంటుంది. ప్రతి అనుభవం నిత్యనూతనంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో మనం చూసేవి అనుభవించేవన్నియు గతంలో అనుభవించినవే.*
*ఈ రకమైన ధ్యానం చేయుట వలన వెరైటీగా ఉంటుంది. మానవ్ఞడు వెరైటీ కొరకు తాపత్రయపడ్తున్నాడు. దృశ్య ప్రపంచంలో వెదుకుతున్నాడు. ఒక సెకను మాత్రం వెరైటీగా అగుపడుతుంది. తర్వాత వెగటు పుడుతుంది. ధ్యానం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.*
*మనం పుట్టినప్పటి నుండి అన్నం, చారు, పాయసం ఇవన్నియు మనం అనుభవించినప్పటికి వాటి రుచిమారుట లేదు. తిన్నవే తింటున్నాం. చూసినవే చూస్తున్నాం. వెరైటీ ఏమియు లేదు.*
*ఉత్కంఠ భరితంగా సాగే ఈ ధ్యానం. సదా సంభ్రమాశ్చర్యాలతో ఎడతెరిపి లేకుండా సాగుతుంది.*
*ఈ ధ్యానమే 14 లోకాలను తన ఆధీనంలో ఉంచుకొని సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, ఈ గ్రహాలు ఆయా స్థానాల్లో యుండి వాటి యొక్క విధులు నిర్వహించేటట్లు చేస్తూ తన ఆధీనములో ఉంచుకొంటున్నది.*
***
*దానంతో శాశ్వత కీర్తి*
“అతిధి దేవోభవ !” అన్నది మన సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి అన్ని ప్రాణుల్లో ఉన్నది దైవమే. ఎవ్వరి కడుపు నింపినా, దేవుడు తిన్నట్లే !జాతి, మత, కుల, భేదాలు లేకుండా, ‘ఆకలి’ అన్నవారికి అన్నం పెట్టాలి. ఆకలిగొన్నవాడు ఎవరైనా సరే, చివరికి దొంగ, హంతకుడు అయినా సరే, అన్నం పెట్టాలి. ఆకలి విషయంలో అపాత్రుడు ఎవరూ ఉండరు. అందరూ పాత్రులే !
‘నాకంటె వేరుగా ఏదియు లేదు’, ‘సమస్త ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు వెలయుచున్నాడు.’ అను మాటలను కేవలం బుద్ధితో గ్రహించి, నోటితో వల్లించే వారు కాక స్వీయ అనుభవంతో ఆచరించి, తదనుగుణంగా జీవించే వ్యక్తులు మనక ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా భాగవతంలోని రంతిదేవుని కథ గుర్తుకొస్తుంది. ‘జన సేవయే జనార్ధన సేవగా’ భావించిన రంతిదేవుడి కధను చెప్పుకుందాము.
రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. రాజ్యాన్ని, సంపదను దానం చేసి, భార్యాపిల్లలతో అడవికి వెళ్ళాడు. దైవికంగా ఏది లభిస్తే దాన్ని తినటమే-అంతకు మించి ఆయన దేన్నీ కోరేవాడు కాడు, భవిష్యత్తవసరాల కొరకు, దేన్నీ దాచుకొనేవాడు కాడు.
ఒకసారి నలభై ఎనిమిది రోజులు తినటానికి గానీ, తాగటానికి గానీ ఏమీ లభించలేదు. నలభై తొమ్మిదవ రోజు ఏదో కొంత ఆహారం లభించింది. దాన్ని తినటానికి తాను, కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. అంతలోనే ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. ఆహారాన్ని ఆయనకిచ్చాడు రంతి దేవుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్లిపోయాడు అతిథి. మరికొంత సేపటికే ఒక శూద్రుడొచ్చాడు. రంతిదేవుడు ఆతని ఆకలి తీర్చాడు. ఆ శూద్రుడు వెళ్లిన వెంటనే ఒకడు కుక్కలను తీసుకొని వచ్చి తన ఆకలిని, ఆ కుక్కల ఆకలిని తీర్చమని కోరాడు. తన వద్ద మిగిలిన ఆహారంలో రంతిదేవుడు అతనికి, అతని కుక్కలకు ఇచ్చాడు. ఇక కేవలం కొంత పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని తాగి ఆకలి మంటను ఆర్పటానికి సిద్ధపడింది ఆ కుటుంబం. అంతలోనే ఎంతో దీనావస్థలో నున్న ఒక చండాలుడొచ్చాడు. వాని పరిస్థితి గమనించిన రంతిదేవుడు తన వద్ద ఉన్న పాయసాన్నంతా అతనికిచ్చివేశాడు ”బ్రహ్మార్పణం” అంటూ. నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటూ, స్పృహ తప్పిపోతాడు రంతిదేవుడు. మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.
నీతి : కుల, మత, జంతు వివక్ష లేకుండా, తాను ఆకలితో ఉన్నా , ప్రాణాలు పోతున్నా లెక్కచెయ్యక రంతిదేవుడు చేసిన త్యాగం చరిత్రలో అతని పేరును శాశ్వతంగా నిలిపింది. దానగుణంతో దైవాన్నే నేలకు దించాడు రంతిదేవుడు. మనం కూడా, అన్నం తినేముందు కనీసం ఒక్కరి ఆకలైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలి.
నారదుడు ఎవరు? జన్మరహస్యం ఏంటి?వీణాతంత్రులు మీటుతూ, నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుణ్ని ‘కలహ భోజనుడు’ అని పిలుస్తారు. ఆయన గొప్పతనం, చరిత్ర తెలిస్తే ఎవరూ అలా అనరు. పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచినవాడు నారదుడే.
వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన కథను చెప్పి ప్రేరణ కలిగించినవాడు. ‘నేను ఇంతటి వాడిని ఎలా కాగలిగానంటే... గత జన్మలో సన్యాసులు నాకు ఉపదేశించిన జ్ఞానమే. కాబట్టి నువ్వు భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే విన్నవారు కూడా నాలాగే ఉత్తర జన్మలో మహా జ్ఞానులు, భక్తులు కాగలరు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు’ అని తన కథను చెప్పాడు.
నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది. ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు. బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. ‘వారికి సేవలు చేస్తూండ’మని యజమాని నారదుడికి పురమాయించాడు. సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడ్డారు. దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించారు. మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు. ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి.
పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ క్రూరసర్పాలు, ప్రాణులను చూసినా ‘ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపదా రాదు. నాకేమిటి భయం?’ అనుకుని ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామాత్రంగా అయింది. అశరీరవాణి ’ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ, నా గురించే చెబుతూ, పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఒకరోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు. ఆ తరవాత నీవు బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.
ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ. ’మహతి’ అనే వీణను ఇచ్చాడు. ఆ వీణపై నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం... ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు. దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్కల్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజాల్లో, కార్యాల్లో నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. ‘భక్తి సూత్రాలు’ రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటాడు.
ఆ కథ విన్న వ్యాసుడు పొంగిపోయి ‘నారదా’ మంచిమాట చెప్పావు. ఇప్పుడు నేను భగవంతుడి గురించి, ఆయన విశేషాలు, ఈ బ్రహ్మాండాల ఉత్పత్తి, ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి రచన చేస్తాను. వీటిని చదివిన, విన్నవారు నీలాగే తరించిపోవాలి’ అని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంబించాడు.
సేకరణ-ఈనాడు
[20/04, 6:00 am] తెలుగు1: హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు.
‘రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం’ అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములను అనుష్టించి జీవితములోనికి అనుభవంగా తెచ్చుకున్న మహానుభావుడు. ఆంజనేయస్వామి చతుర్వేదములు, వేదాంగములు, సకల శాస్త్ర పురాణములు ఔపోసన పట్టాడు. యజుర్వేద హృదయము తెలిసిన హనుమ, వ్యాకరణ, గాంధర్వ విద్యలలో ఆరి తేరినవాడు. అందుచేతనే,
“బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్”, హనుమంతుని నామమం తలచినంతనే, బుద్ధికుశలత, బలం, కీర్తి, ధైర్యం, శక్తి, చక్కగా పొందికగా మాట్లాడగల శక్తి మొదలగునవి కలుగుతాయి.
సుందరకాండ విశిష్టత: ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. బ్రహ్మాండపురాణం ఈ కాండమును “సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః” అని, “బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి” అని, “అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్” అని ప్రశంసించింది.
సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ. భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది.
సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథః
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?
అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.
మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు ఆమె వసించును కావున ఇది సుందరకాండ.మైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి – రామాయణ రహస్యములు’ అనే పుస్తకాంలో అభిప్రాయపడ్డారు.
తతో రావణనీతాయహ్ సీతాయహ్ శత్రుకర్షనహ్
ఇయెష్ట పదమన్వెష్ణుం చారణచిరితె పథి
సుందరకాండ ‘తత్’ అనే పదంతో కూడిన పైపద్యంతో మొదలవుతుంది. తత్ అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసనచేయాలో సుందరకాండ వివరిస్తుంది. అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు.
అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము:
సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము. ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు
తేటగీతి
పిల్లలకు చేరలేకపోతున్న నీతి కథలు..మనం పిల్లలకు చెప్పే నీతి కథలు వారికి జీవిత పాఠాలని నేర్పే గొప్ప సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హదయాలలో మంచి నడవడిని గురించి, ఐకమత్యం గురించి, మంచి చెడులను గురించి, సమయస్ఫూర్తి గురించి, దేశభక్తి గురించి తెలియచేస్తూ, వారి హదయంలో చెరగని ముద్ర వేస్తాయి ''నీతి కథలు''.
పిల్లలకి కథలంటే ఎంతో ఇష్టం. ''అనగనగా ఒక రాజు...'' అని మనం కథను చెప్పడం ప్రారంభించగానే వారు కథను వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. మనం చెప్పే కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన, అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోతుంది. కథను వినేటప్పుడు వారు బయటి ప్రపంచాన్ని మర్చి పోతారు. వాళ్ళ ముఖకవళికలు గమనిస్తూ మనం కూడా మన హావభావాలు మార్చుతూ చెపుతున్నప్పుడు వారిలో కలిగే ఆనందాన్ని వర్ణించలేం.
కానీ నేడు విశ్వవ్యాప్తంగా... అస్తవ్యస్తమైన ఉమ్మడి కుటుంబాలు, తీరిక లేని పనులు, ప్రతి క్షణం డబ్బు కోసం ఆరాటం.. ఇలా జీవితం అంతా ఉరుకులు, పరుగులు. ఈ నేపథ్యంలో పిల్లలు కథలకు దూరం కాకూడదంటే, సాంస్కృతిక వారసత్వంగా వారికి అందుతున్న కథలు కోల్పోకూడదంటే ఆ భాధ్యతను మొదట తల్లిదండ్రులు, తర్వాత పాఠశాలలోని ఉపాధ్యాయులు భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంది
''చూసే'' కథనం కంటే, ''వినే'' కథనంలో పిల్లల ''ఊహాశక్తి'' ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందోననే కుతూహలం వారిని ఆలోచింపచేస్తుంది. వారికి మరింతగా ఊహించే అవకాశం కలుగుతుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు. కుటుంబ వ్యవస్థలో పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఎవరికీ ఉండడం లేదు. పిల్లలకోసం కేటాయించే సమయం కూడా లెక్క ప్రకారం, రోజుకి ఇంత అని ఇస్తున్న తల్లిదండ్రులున్న ఈ హైటెక్ యుగంలో పిల్లలకు అందాల్సినంత ఆప్యాయత అందడం లేదు. ఉన్న తక్కువ సమయములో పిల్లలతో అనుబంధాన్ని పెంచేందుకు కథలు చెప్పడం ఎంతగానో తోడ్పడుతుంది. తల్లిదండ్రులు ముందుగా కథలను విని వాటిని తామే హవభావాలతో చెప్పగలిగితే పిల్లలతో తల్లిదండ్రులకు కూడా ఒక ఆప్యాయతతో కూడిన అనుబంధం పెంచడానికి కథలు చెప్పడం తోడ్పడుతుంది.
విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మన కథలలో పంచతంత్ర కథలు, పెదరాశి పెద్దమ్మ కథలు, మర్యాద రామన్న కథలు, భట్టి విక్రమార్క కథలు, భేతాల కథలు, కాశీమజిలి కథలు, జానపద కథలు, అంతులేని కథలు ముఖ్యమైనవి.
ప్రాచీన భారతీయ కథకుల యొక్క సృజనాత్మకతకు, ఊహాశక్తికి, కథాకథనాలకు సాటిలేని మేటి ఉదాహరణగా ఎన్నో కథలు నిలిచాయి. శతాబ్దాలుగా భారతీయ సాహిత్యంలో చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత, ఉత్సాహ భరితంగా సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే మాత్రమే కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తికి తర్కాన్నీ, వివేచననూ పరిచయ చేస్తాయి.
ప్రాచీన భారతీయ కథా కౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిన కథలనేకం ఖండంతరాలను దాటి ప్రపంచ నలుమూలలా విస్తరించాయి. ''పంచతంత్రం'' కథలను పరిశీలిస్తే ప్రతి జంతువు, ప్రతి పక్షి పాత్రలు పాత్రదారులుగా ఉన్నాయి. కానీ కథలు మాత్రం దేనికదే విడికథగా ఉండి, ప్రతికథకూ ప్రారంభమూ, ముగింపూ వేర్వేరుగా ఉంటాయి. ప్రతి కథలో ఒక నీతి లేదా ఒక మంచి తప్పకుండా ఉంటాయి. పిల్లలకు సులభంగా అర్థమై తక్కువ సమయంలో ముగిసేలా ఉంటాయి. జంతువులతో పక్షులతో మాట్లాడించి కథను కోనసాగించిన విష్ణుశర్మ, చిన్నయసూరి లకు తెలుగు వారందరు రుణపడి ఉన్నారు.
ఉమ్మడి కుటుంబాలుంటే తాతా, నాన్నమ్మ, అమ్మమ్మలు కథలు చెప్పేవారు. ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు ఈ బాధ్యతను స్వీకరించాలి. కథలలో వివిధ ప్రాంతాలలో వాడే ప్రత్యేక పదాలు, గ్రామీణ పదాలు, పర్యాయపదాలు, సామెతలు ఉండి చిన్నారులకు భాషపై పట్టు కలిగిస్తాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అమూల్యమైన గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది ''పిల్లలతో'' ఎక్కువ సమయం గడపడం మాత్రమే అని గుర్తించాలి. కానీ నేడు అదే లేక పోవడం విచారకరం. ప్రతి ఒక్కరూ బిజీ బిజీ అంటూ పిల్లల కోసం కొంత సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. గతంలోకి ఒకసారి వెళ్లి చూస్తే.. పని భారం ఉన్నప్పటికీ, రాత్రి సమయాల్లో తప్పకుండా తలిదండ్రులు తమ పిల్లలకు కథలు చెపుతూ గడిపేవారు. కానీ నేటి యుగంలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న తల్లిదండ్రులు తాము విన్న అ చిన్ననాటి కథలను జ్ఞాపకం చేసుకొని పిల్లలకు చెప్పే ఓపిక, సమయం లేదనుకోవడం విచారకరం. అ మాట కొస్తే కథలు వినడం చిన్నారులకు ఎంత అవసరమో, చెప్పడం అమ్మా నాన్నలకు అంతే అవసరం. ఎందుకంటే కథలు చెప్పడం మనం ఆపేస్తే, అవి క్రమంగా అంతరించిపోతాయి. అంతరించి పోయిన ఆ కథలతో పాటు మన అస్తిత్వం, మన చరిత్ర అంతరించిపోతుంది. చిన్నపిల్లలకు కథలు చెప్పడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉండే పెద్దవారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మన భారతీయ చరిత్ర, పురాణాలు పరిశీలిస్తే చిన్నతనంలో వారి తల్లి చెప్పిన కథల వల్ల ప్రేరణ పొందామని ఎందరో గొప్పవారు తెలియచేశారు.
ప్రతి చిన్నారీ తెలియని అనేక విషయాలు తెలుసు కోవాలంటే, వారిలో సృజనాత్మకత పెరగాలంటే వారికి కథలు చెప్పడం అనేది ఒక అద్భుతమైన విధానం. నేటి పిల్లలకు అటు పాఠశాలల్లో లేదా ఇంట్లో కానీ కథలు వినడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు సంవత్సరాలు నిండడంతోనే చిన్నారులను పాఠశాలలో చేర్చడం, ర్యాంకుల కోసం పరిగెత్తించడంతోనే జీవితం గడిచిపోతున్నది.
కథలు పిల్లలలో వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.
తెలుగు సాహిత్యంలో చిత్ర విచిత్రాలైన మలుపులతో, వినోదభరితంగా ఉండి మంచి నడవడికను తెలియచేస్తున్నాయి. కాబట్టి పెద్దలంతా వారి చిన్నారులకు నీతి కథలు నేర్పిస్తూ, వారిని మిగిలిన పిల్లలకు చెప్పేలా ప్రోత్సహిస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్కు చేయందించాలి. తద్వారా సృజనాత్మక, మానవీయ సమాజానికి పాదులు చేయాలి.
రఘుపతిరావు గడప
బేలను చుసిన మగండు ఏమని అనకున్
కాలము తీరిన పడంతి ఏడ్పుయు మనియెన్
సీలము కోరిన మగండు తెల్పక తెలిపెన్
పాలును చూచిన పడంతి బావురు మనియెన్....
ఆలన లేకయు మగండు లేకయు మనిషై
ఏలను బత్కును ముగించు కోకయు జలమై
కాలము బట్టియు ఆడించు దైవము తెలిపెన్
పాలును చూచిన పడంతి బావురు మనియెన్...
గాలము వేసిన మనస్సు ఏమియు చెయకే
వేళను తృప్తియు మనస్సు కిచ్చియు బతికే
ఏలన ఆశల మనస్సు బిడ్డ కనకయే
పాలును చూచిన పడంతి బావురు మనియెన్.
ఆలికి శాపము తెగించు వేషము సలిపే
వేలకు తిండియు లెనందు బిడ్డను నలిపే
పాలకు పాపము తలంచి కోపము తెలిపే
పాలును చూచిన పడంతి బావురు మనియెన్.
సీసము.. కరోణా
నిరుడు లేనిదనేది నేడు చెప్పిన ఏది
మారదు బ్రతుకులో మార్పు రాదు
మనుజలెందరొ నేడు మాయకు చిక్కేను
నెరుగని మాటలు నేడు చిక్కె
ఉడుధుడు కడుగులు ఊట బావులగును
తలపులేని తలము తైల మవ్వు
కాలమందు ను నేడు కాలిపోవు బతుకు
గాలికూడాలేని కాల మయ్యె
వన్నెచిన్నల బ్రతుకులో కష్టాలు వేగమయ్యె
అన్న మన్నది లేకయే బాధలు అల్ప మాయే
చిన్న దన్నది రోగము పెద్దదై చలువ చేయు
మోన మన్నది జనులలో సేవలు మాయ లగును
విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
--(())--
సాహిత్యం (2): ऊँ!
-----
"సీ.
-----
స్వర్ణగిరినిఁబోలు శంకరతేజుఁడు
సూర్యశిష్యుండును శ్రుతినిధియును
అర్ణవలంఘనహనుమంతవీరుఁడు
సీతమ్మ సన్నిధిఁ జేరెనంత
పూర్ణవిజ్ఞానియు భూరిదేహమువాఁడు
లంకనుదహియించె గొంకులేక
దుర్ణ( / ర్న ) యదనుజులదునుమాడెదురములో
రామాజ్ఞఁబాటించి రహినినొసఁగె..
గీ.
--
భావిధాతయు నవవిధభాగ్యదాత
అష్టసిద్ధులమూలుఁడు కష్టహంత
భయదశక్తిసంహరణుఁడు జయవరదుఁడు !
అట్టి సుందరు భజియింతు హర్షహృదిని !!! "
------------
ఒక మహిళ షాపింగ్కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.
క్యాషియర్ ఆమె బ్యాగు లో
ఒక టీవీ రిమోట్ గమనించాడు.
అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..
"మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్ను మీతో తీసుకువెళతారా?" అని.
ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."
అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.
#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!
#కథ ఇంతటితో అయిపోలేదు ..!
క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.
ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!
"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.
అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”
#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.
#కథ కొనసాగుతుంది ..!
భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.
#నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!
#కథ ఇంకా అయిపోలేదు ..!
స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం,
"మీ మొబైల్ ఫోన్కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!
#నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ..!
#కథ_కొనసా....గుతుంది ..!
ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను బయటకు తీసింది.
అది తన భర్త ఫోన్.
ఆమె దానిని రిమోట్ కంట్రోల్తో బాటుగా తీసుకుని వచ్చేసింది.
ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.
#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..!
#కథ_కొనసాగుతుంది ..!
ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.
ఒక నోట్ తలుపు మీద అతికించబడి ఉంది.
అందులో ఇలా రాసి ఉంది ..!
"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..! అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు
#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁
#తెలివి_ప్రతిభ_అనేది_ఇకరి_సొత్తు_కాదు 🙈🙈🙈
శుభోదయం ఫ్రెండ్స్..... 😊💐
రమణుల మహాసమాధి చిత్రాలు(#అరుణాచల శ్రీ #రమణ_మహర్షి వారు)
1950, ఏప్రియల్ 14, శ్రీ వికృతి నామ సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నాడు భగవాన్ రమణ మహర్షి భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. చైత్ర బహుళ త్రయోదశి, భగవాన్ రమణులు మహాసమాధి చెందిన రోజు, ఆ సందర్భంగా ఉదయం రమాణాశ్రమంలో భగవాన్ ఆరాధానోత్సవాలు నిర్వహిస్తారు.
మహాసమాధి చెందేనాటికి రమణుల దేహం చాలా బలహీనపడింది. అసలు లేవలేకపోయింది. ఆహారం కూడా స్వీకరించలేదు. రాత్రి 8 గంటలకు, తమని కూర్చోబెట్టమని రమణులు అన్నారు. (కూర్చోబెట్టడమంటే దిండుని ఆనుకుని కూర్చోవడమే. శరీరం సహకరించలేదు). మూతపడి ఉన్న కుడి కన్ను నుంచి చెంపైపైకి ఎందుచేతనో నీళ్ళు ధారగా కారసాగాయి. పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని తుడుస్తూ ఉన్నారు. భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించటం కష్టంగా ఉంది. ఇంతలో హాలులో కూర్చున్న జనం 'అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా' అంటూ పాడసాగారు. ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయింది. (తన తండ్రి అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళిపోతున్నానే ఆనందం ఏమో!) ఇంతలో ఆకాశంలో ఒక దివ్యమైన, ప్రకాశవంతమైన కాంతి పుంజం అద్భుతకాంతులు విరజుమ్ముతూ ఆ చోట (ఆ ఆశ్రమం నుంచే) నుంచి పైకి లేచి, ఈశాన్యం దిశగా అరుణాచాల శిఖరం దిశగా పయనించి వెళ్ళిపోయింది. దీన్ని దేశదేశాల ప్రజలు దర్శించారు. అదే సమయంలో 8-47 నిమిషాలకు (రాత్రి) భగవాన్ దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది. అరుణాచలేశ్వరుడు వెలిగించి జ్ఞానజ్యోతి (భగవాన్ రమణులు) తన సహజ రూపంలో (జ్యోతి రూపంలో) జనులందరూ చూస్తుండగా, వెళ్ళి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. అవధూత, అవతారమూర్తి, జీవన్ముత్కుడు, దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు భౌతిక దేహాన్ని విసిరివేశారు.
రమణుల మహాసమాధి చిత్రాలను ఫోటో తీసింది హెర్ని కార్టిర్ (1908-2004), ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫోటొగ్రాఫర్, ఆధునిక ఫోటోజనర్లిజం పితామహుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన రమణుల మహాసమాధికి ముందు ఏప్రియల్ 1950 లో అరుణాచలం వచ్చారు. ఆయనే ఈ చిత్రాలను తీసు భద్రపరిచారు. ఈ సృష్టిలో ఏదీ కాకతాళీయం ఉండదు. కార్యముంటే కారణముంటుందని వేదాంతం ప్రకటించింది. బహుసా రమణులే ఈ సమయానికి వీరిని ఇలా ఇక్కడకు రప్పించి, మనలాంటి వారిని అనుగ్రహించడానికి ఈ కార్యం జరిపించారేమో!
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏🙏🙏🙏🙏
[14/04, 10:04 pm] Kant's Rso: *తప్పక చదవండి*🙏
*కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్ర స్ధాయిలో ఉంది*.
పాజిటివ్ ఉన్నవారికి సిటిలో ఏ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకటానికి కనీసం రెండు మూడు రోజుల వ్యవధి తీసుకుంటూ ఉంది. పరిస్ధితి తీవ్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగులన్నీ కాన్సిల్ చేస్తున్నాయి. న్యూజిలాండ్ ఇండియాను రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి రాకపోకలు నిషేధించింది. ప్రస్తుతం ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి లో మనం ఉన్నాము. దయచేసి, దిగువ తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకోండి.
1. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా బలంగా ఉంది. తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మాస్క్, సానిటైజర్ తప్పనిసరిగా వాడండి.
2. ఏ పబ్లిక్ ఫంక్షన్స్ కూ వెళ్లకండి, కోవిడ్ చాలా తీవ్రస్థాయిలో ఉంది హైదరాబాదులో, మిగతా చోట్లానూ. పండుగలూ, ప్రయాణాలు మానుకోండి.
3. గొంతునొప్పి, సడన్ గా గొంతు పట్టేసినట్టు ఉండడం, తలనొప్పి, స్వల్ప జ్వరం, పొడిదగ్గు, జలుబు... దేన్నీ అలక్ష్యం చెయ్యకండి. వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోండి. డాక్టర్ల సలహాతో వైద్యం మొదలు పెట్టండి, జాగ్రత్తగా ఇంట్లో ఒక గదిలో ఉంటూ, మందులు వాడుతూ, మీకుటుంబ సభ్యుల స్ధితిగతులను కూడా గమనిస్తూ ఉండండి.
4. కోవిడ్ ఎలాంటి వ్యాధంటే, దీనికి నాలుగైదు రోజులు అవకాశమిస్తే, ఇది మీ ఊపిరితిత్తులను పాడుచేస్తుంది. ముఖ్యంగా షుగర్, బిపి ఉన్నవారు జ్వరమే కదా అని తాత్సారం చెయ్యవద్దు. అది ప్రాణాంతకంగా మారవచ్చు. క్వారంటైన్ చేస్తారేమో, ఫ్లాట్స్ వారు ఏమైనా అంటారేమో అన్న భయాలొద్దు. సంకోచాల కంటే జీవితాలు చాలా ముఖ్యం.
5.పాజిటివ్ ఉన్నవారు పల్స్ ఆక్సీమీటర్ తో మీ ఆక్సిజన్ లెవెల్స్ ను నిరంతరం మానిటర్ చేసుకోండి. 93% కు తగ్గితే హాస్పిటల్ కు వెళ్లడం తప్పనిసరి.
6. మీ ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే, మిగతా వారిని చుట్టాలు, ఫ్రెండ్స్ ఇళ్లకు పంపకండి, మీ ఇంటికి అలా ఎవరినీ రానివ్వకండి.సున్నితంగా వారించండి.
7. వీలున్నంత వరకు బయటకు వెళ్లడం, తగ్గించాలి. పాజిటివ్ ఉన్నవారు ఎంత అత్యవసరమైన పనులున్నా బయటకు వెళ్లకుండా ఐసొలేషన్ లో ఉండడం మంచిది.మిగిలిన కుటుంబ సభ్యలు క్వారంటైన్లో ఉండాలి. మొదటిరోజు నుంచి శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా ఫలితం వాటి ఉంది.
8. టీకాలు వేయించుకున్నా కోవిడ్ రాదన్న గారెంటి లేదు, వారికీ వస్తోంది. ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గినా తిరిగి రాదన్న నమ్మకం లేదు. ఇన్ఫెక్షన్ బలంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ వచ్చినా పానిక్ అవకండి, ధైర్యంగా సానుకూల దృక్పథంతో ఉండండి.
9. ట్రీట్ మెంట్ కి ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా ఐదు నుంచి పది లక్షల కన్నా తక్కువ కావట్లేదు. ఎంత డబ్బు, పరపతి ఉన్నా తీవ్రత పెరిగేదాకా ఉంటే ఉపయోగం లేదు.
10. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవసరాలేవో, అత్యవసరాలేవో నిర్ధారించుకుని తప్పనిసరి అయితే తప్ప ఇల్లు కదలకపోవడం మంచిది.
*ఇవన్నీ మిమ్మల్ని అలర్ట్ చెయ్యాలని , మీ భద్రత కోసం చెబుతున్నవి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశ వదిలేసుకుని,* *మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రస్తుత పరిస్ధితుల్లో మీ కర్తవ్యం!*
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్, బెంగళూరు:
వడివేల్ - వెణ్ పొంగల్
చాలా సంవత్సరాల క్రితం తిరుత్తణి కొండపై బైరవ సుబ్రమణ్య అయ్యర్ ప్రసాదం దుకాణం నిర్వహించేవారు. ఆ దుకాణంలో పనిచేసేవాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. విపరీతమైన పని వల్ల నాకు ఒకసారి జ్వరం వచ్చింది. సమయం గడుస్తున్న కొద్దీ జ్వరం చాలా ఎక్కువ అయ్యింది. రాత్రి పదింటికి ఇంటికి చేరుకోగలను అనుకుని చిన్నగా మెట్లు దిగడం మొదలుపెట్టాను. నిదానంగా నడుస్తూ అక్కడక్కడ కూర్చుంటూ ఎలాగైతేనేమి చివరి మెట్టు వద్దకు వచ్చాను.
దేవాలయ పుష్కరిణి వద్ద ఒక మేనా నిలిపి ఉండడం గమనించాను. ఆ వైపు నుండి ఒక వ్యక్తి నాకేసి వస్తున్నాడు. అతను నన్ను “కొండపై నుండి వస్తున్నరా?” అని అడిగాడు. నేను అవునన్నాను. సరే నాతో రండి అని మేనావద్దకు తీసుకునివెళ్ళాడు. నేని కొద్దిగా మేనాలోపలికి తొంగిచూసాను. పరమ శాంత స్వరూపంతో మహాస్వామివారు నాకు దర్శనమిచ్చారు. నన్ను నేను మరచిపోయి భక్తితో చేతులు జోడించి నిలబడిపోయాను.
“నీవు కొండపైనుండి వచ్చావా? దేవాలయం తెరిచి ఉన్నదా?” అని అమహాస్వామి వారు అడిగారు. చాలా వినయంతో “దేవాలయం మూసివేసారు స్వామి” అని బదులిచ్చాను. “అక్కడ ప్రసాదాల దుకాణం ఉన్నదా?” అని అడిగారు. నేను “అది కూడా మూసివేసారు” అని చెప్పగా వారు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత మహాస్వామి వారు నాతో, “నన్ను మోసిన వీరందరూ ఆకలిగా ఉన్నారు. వారికి పుత్తూరులోను, నగరిలోను అహారం దొరకలేదు. నేను వారికి తిరుత్తణిలో ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది అని చెప్పాను. ఇక్కడికి రాగానే పుష్కరిణి గట్లపై ఉన్న హోటళ్లలో కూడా వారికి ఆహారం దొరకలేదు” అని మహాస్వామివారు చెప్పగా నాకు ఏమి చేయాలో తోచలేదు.
నేను జ్వరంతో బాధపడుతున్నప్పటికి దీని గురించి తరువాత అలోచిద్దాం అనుకుని స్వామివారితో, “మహాస్వామివారు ఆజ్ఞాపిస్తే నేనే స్వయంగా వారికి ఆహారం తయారుచేస్తాను” అని చెప్పాను. స్వామివారు ఆశ్చర్యంతో “ఈ రాత్రప్పుడు నువ్వు ఏమి చెయ్యగలవు?” అని అడిగారు. ”నేను కొండపైనున్న ప్రసాదాల దుకాణంలో పనిచేస్తాను. వాళ్ళకోసం వెణ్ పొంగల్(వెన్న పొంగలి) తయారుచేస్తాను” అని చెప్పాను. మహాస్వామివారు ”అలా అయితే సరే. నేను మెట్లమార్గం గుండా కొండ ఎక్కుతాను. వాళ్ళని మామూలు మార్గం ద్వారా రమ్మని చెప్తాను. నువ్వు వెళ్ళి త్వరగా అహారం సిద్ధం చెయ్యి. వెళ్ళు!!”
స్వామివారు ఆ చివరి పదం “వెళ్ళు” అని అనగానే అప్పటిదాకా ఉన్న జ్వరం, అలసట మాయమయ్యాయి. ఎక్కడాలేని ఉత్సాహం వచ్చేసింది. ఏదో పరుగుపందెంలో పాల్గొంటున్న వాడిలా ఒక్క ఉదుటున వెళ్ళి పైకి చేరుకున్నాను. ఆరోజు మా యజమాని లేరు. నేను విషయమంతా వారి భార్యకు చెప్పాను. ఆ సాధ్వి నాతో, “నువ్వు కిందకు వెళ్ళినది డాక్టరుకు చూపించుకోవాడానికే కదా! ఆ వైద్యనాథుడే నీ జ్వరాన్ని పోగొట్టి నీకు అనుజ్ఞ ఇచ్చిన తరువాత నన్ను అడగడం దేనికి? ఇది మనందరి ఉన్నతి కొరకు జరిగిన సంఘటన. నువ్వు సంతోషంగా వెళ్ళి ఆహారం తయారుచెయ్యి” అని చెప్పారు. వెంటనే నేను పొయ్యి వెలిగించి ఆహారం తయారు చెయ్యడం మొదలుపెట్టాను. అక్కడ పడుకొని ఉన్న అతణ్ణి లేపి ఆహారం, చెక్క తెడ్డు, తినడానికి మందార ఆకులు, పొంగల్ లో నంచుకోవడానికి పులికైచల్ (చింతపండు పులుసు) తీసుకుని వెళ్ళడానికి సహాయం తీసుకుని దేవాలయ ధ్వజస్థంభం దగ్గరకు వెళ్ళాము.
కొన్ని నిముషాల తరువాత పరమాచార్య స్వామివారు వచ్చారు. మొత్తం దేవాలయ ప్రాకారాలు అన్ని విద్యుత్ వెలుగులతో నిండిపోయాయి. మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో దేవస్థానం అధికారి కృష్ణ రెడ్డియార్, ఆలయ పరిపాలనాధికారి కులశేఖర నాయుడు, ఆలయ ఉద్యోగులు, పండితులు మహాస్వామివారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారు చుట్టూ చూసారు. నేను వెళ్ళి వారిముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను.
స్వామివారు “ఆహారం తయారు అయ్యిందా?” అని అడిగారు. నేను, “తయారు చేసి ఇక్కడకు తీసుకుని వచ్చాను” అని బదులిచ్చాను. “సరే నువ్వు వీరికి వడ్డించిన తరువాత లోపలికి రా” అని అన్నారు. నేను మేనా మోసే బోయీలను కూర్చోమని చెప్పి ఆకుల్లో వేడి వెణ్ పొంగలి వడ్డించాను. “ఇది మీకోసమే తయారుచేశాను. నంచుకోవడానికి పులికైచల్ కూడా ఉంది. కడుపునిండుగా తినండి. నేను ఆలయంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను.
పరమాచార్య స్వామివారు గర్భాలయం వద్ద నిలబడి ఉన్నారు. నేను వారిని దర్శించగనే కళ్ళు నులుముకుని తేరిపారగా చూసాను తనిగైమలై మురుగన్ ఎవరు పరమాచార్య స్వామి ఎవరు అని నిర్ధారించుకోవడానికి. మహాస్వామిని అలా దైవగురువు, జగద్గురువుగా చూడడంతో కళ్ళ నీరు ఆపుకోలేకపోయాను. దర్శనానంతరం స్వామివారు బయటకు వచ్చారు.
నేను వెళ్ళి వారి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడ్డాను. స్వామివారు నాతో, “వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు రుచిగా బాగా చేశావు. వాళ్ల కడుపు నింపావు” అని అన్నారు. నేను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసాను. నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు స్వామివారు.
”ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రామనామం జపించు” అని చెప్పి నన్ను ఆశీర్వదించినప్పుడు సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది.
--- యస్. బలరామ రావు, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
#కంచిపరమాచార్యవైభవం*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"మర్యాదగా వినడం,
వివేకంతో సమాధానమివ్వడం,
ప్రశాంతంగా ఆలోచించడం,
నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం
ప్రతి మనిషికీ అవసరం."
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"ప్రతి చిన్నపనిలో కూడా శ్రద్ధ అలవడితే జీవితమే మధురంగా మారిపోతుంది.
అలాగే మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనసులో స్వార్ధం దూరమవుతుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[12/04, 4:43 pm] Sriram: *ఆరు రుచులు ఆరోగ్య రహస్యం* 🌺
ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది. వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.
మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షడ్రుచులు అంటారు. అవి మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు (కారం), తీక్తం (చేదు), కషాయం (వగరు). ఆరోగ్యపరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి.
ఉగాది పచ్చడిలో ఆరోగ్యం..
వేప పూవు ఉగాది పచ్చడిలోని ప్రధాన ద్రవ్యం. దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు. అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం.
🌸 *తీపి* 🌸
వాత, పిత్త హరిణి. తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి పోషిస్తుంది. తల్లి పాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది.
🌺 *పులుపు* 🌺
వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చెందిస్తుంది.
🌸 *ఉప్పు* 🌸
వాతహరిణి. మలబద్ధకాన్ని నివారించి ఆకలిని పెంపొందిస్తుంది. కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. శుక్రనాశకంగా పనిచేస్తుంది.
🌺 *కారం* 🌺
ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కాని ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి.
🌸 *చేదు* 🌸
కఫహారం, పిత్తాహారం, క్రిమిహారం, జ్వరహారం. విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
🌺 *వగరు* 🌺
శేలష్మ, రక్త, పిత్తాల బాధను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. అధిక స్రావాలను ఆపుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రకణాలను నష్టపరుస్తుంది.
🔻 *బెల్లం (తీపి):* జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్నిస్తుంది. వీర్యవృద్ధి కలిగిస్తుంది.
🔻 *కొత్త చింతపండు (పులుపు):* తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది. విరేచనకారకం, వాపును ఐక్యం చేస్తుంది.
🔻 *ఉప్పు:* కఫహారం, విషాహారం, మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది.
🔻 *మిరియాలు (కారం):* కఫవాతహారం, ఆకలిని పెంచుతుంది. శుక్రకణ నాశిని.
🔻 *వేపపూవు (చేదు):* కఫ పిత్తాదులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
🔻 *పచ్చిమామిడి (వగరు):* కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతోపాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం.
🍲 *ఉగాది పచ్చడి తయారీ విధానం...!*🍲
ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం.
బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
*ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:*
వేపపువ్వు- తగినంత
చిన్న చెరుకు ముక్క - 1
చిన్న కొబ్బరి ముక్క -1
అరటిపళ్లు- 2
చింతపండు - తగినంత
చిన్న మామిడికాయ- 1
బెల్లం- 100 గ్రాములు
పచ్చి మిరపకాయ - 1
ఉప్పు- తగినంత
నీళ్లు - సరిపడా
*తయారీ విధానం:* 🍎🍍🍊
ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్నితీసి పెట్టుకోవాలి. తగినన్నినీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.
🌴🎋🌿 🍃🌾🍃 🌿🎋🌴
[12/04, 4:44 pm] Sriram: 🙏🙏🙏🙏🙏
🌼🌼🌼🌼🌼
శివలింగం గురించి వివరణ ఇవ్వండి?
శివుడిని మనం అనేక రూపాల్లో ఆరాధన చేస్తాం .ఏ దేవతారాదనైనా శాస్త్రం రెండు రకాలుగా విభజించింది.సాకార రూపం ,నిరాకార రూపం అని.సాకారము కానీ,నిరాకారము కానీ ఏకైక స్వరూపం శివ లింగం.అందుకే శివ లింగాన్ని అరూప రూపి లేదా అవ్యక్త వ్యక్తం అన్నారు.శివ అనగా శాంతము(ఇంకా అనేక అర్థాలున్నాయ్ మంగలం, చతుర్దమ్,తాప ఉపశమనం,etc).లింగం అనగా గుర్తు.
శివ లిగం అంటే శాంతికి,మంగలమునకు గుర్తు.
శివ లింగం ఈ సకల సృష్టి కి గుర్తు.అందుకే లింగానికి అభిషేక సమయంలో పఠించే రుద్రాధ్యాయా నికి ముందు ""ఆపాతల నభాస్థలాన్త్ భువన బ్రహ్మాండ మావి స్ఫురత్
జ్యోతి స్పాటిక లింగ""అన్నారు.పాతలం నుండి ఆకాశం వరకు వ్యాపించివున్న జ్యోతి లింగాన్ని ధ్యానం చేస్తాము.అంటే ఈ సర్వ సృష్టి కి గుర్తు లింగం.అందుకే ఈ సృష్టిలో ఏదైనా లింగాకారంగా ఉంటుంది.భూమి,సూర్యుడు,చంద్రుడు,గ్రహాలు,వాటి కక్షలు,పాలపుంతలు,block hole కి ఆకారం కనుక్కుంటే అది,సమస్త సృష్టి లింగాకారంగానే ఉంటుంది.ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే మనలో వుండే జీవుడు కూడా లింగాకారంగా నే ఉంటాడు."అదో నిష్ట్యా వితస్థాన్తి నాభ్య ముపరి తిష్ఠతి జ్వాల మాలకులంబాతి".మన నాభి దగ్గర చిటకన వేలు పెట్టి జానెడు దూరం నాభి పై భాగాస్నా పెడితే మన బొటన వేలు ఎక్కడ తాకుతూ వుంతుందో అక్కడే వడ్ల గింజ కోన భాగంలో 10 వ వంతు , అంత చిన్నగా జీవుడు దీపం రూపంలో ఉంటాడు అని వేదం.ఆ జీవుడు కూడా లింగకారియే ఎందుకంటే దీపం లా అని చెప్పింది వేదం క్కబట్టి దీపం ఏ ఆకారంలో వెలుగుతుంది లింగాకారం.i.e jevudu కూడా లింగమే అందుకే వీర శైవ సంప్రదాయంలో అక్కడ (జీవుడు వుండే స్థానంలో)లింగం తాకే లాగా మెడలో వేసుకుంటారు.అలా వేసుకుంటే వారు శివమయం అయ్యారు అని గుర్తు.
శివలింగం అని మాములు గా అంటున్నాం కానీ ఇందులో మూడు భాగాలు నిక్షిప్తం అయి ఉన్నాయి అవి బ్రహ్మ పీఠం,పానవట్టం, లింగము అని.బ్రహ్మ పీఠం అనగా పానవట్టం నిలపడానికి ఉంచే పీఠం.లింగ రూపాన్ని బట్టి (మనకు చాలా రకాలైన లింగాలు ఉన్నాయి)దీనిని బయటకు గాని,లోపలికి గాని ఉంచటం జరుగుతుంది.ఉదహణకు సహస్ర లింగాన్ని పెడితే బ్రహ్మ పీఠం బయటకు ఉండాలి,ఉమ మహేశ్వర లింగం ,నగరేశ్వర లింగం అయితే బ్రహ్మ పీఠం లోపలికి ఉంటుంది.ఈ శివలింగం పెట్టె పీఠం బ్రహ్మకు ప్రతీక.
పానవట్టం విష్ణువు స్వరూపం అని చెప్తారు.కాబట్టే పరమ శివ భక్తుడు విష్ణు ద్వేషి అయిన రావణుడు విష్ణు స్వరూపమైన పానవట్టం లేకుండా ఆరాధన చేసేవాడు అని పురాణోక్తి.ఇప్పటికి కొన్ని పూర్వ వీర శైవ దేవాలయాలు చూస్తే పానవట్టం ఉండదు.ఇకపోతే లింగం సాక్షాత్ గా పరమ శివ స్వరూపం.అంటే మనం శివలింగం అంటే పరమేశ్వరుడు అని ఆరాధన చేస్తున్నాం కానీ ఇందులో బ్రహ్మ ,విష్ణు,మహేశ్వర ఆరాధన జరుగుతుంది.ఏ పూజలోనైన(అర్చకుడు బ్రహ్మ,శివార్చన ఐతే చేసేవాడు విష్ణువు,విష్ణూవు అర్చన అయితే చేసేవాడు శివుడు),ఏ గ్రంధములలో నైనా(రామాయణంలో చూస్తే రాముడు విష్ణువు,హనుమ శివుడు,జాంబవంతుడు బ్రహ్మ),వీరు ముగ్గురు లేకుండా వుండరు.
శివలింగం యొక్క ఇంకొక రహస్యం లింగం పరమేశ్వరుడు,పానవట్టం అమ్మవారు ఇద్దరి కలయిక శివలింగం.అనగా ప్రకృతి పురుషుల కలయిక.
శివలింగంలో లింగం పదార్థం నకు.పానవట్టం శక్తి కి గుర్తు .పదార్థం శక్తి కలయిక శివలింగం.అంటే సృష్టి మొత్తం పదార్థం (matter)శక్తి(స్థితి శక్తి,గతి శక్తి)(energy)కలయిక.
ఇలా అనేక నిర్వచనాలు ఉన్నాయి.కానీ ఇప్పటికి ఇవి తెలుసుకున్నాం వీటిని బాగా ఆలోచన(తత్వం ఆలోచనామృతం) చేయండి ,ధ్యానం చేయండి ఇంకా అనేకమైన శాస్త్రీయవిషయాలు మీకు తెలుస్తాయి అన్నింటిని ఇక్కడ పెట్టడం కష్టం.
శివలింగ నిర్మాణం:
శివ లింగ నిర్మాణము ను బట్టి అది ఏ లింగమో చెబుతారు. దాదాపు గా సామాన్య మునుష్యులు(తప శక్తి లేని వారు) ప్రతిష్ట చేసే లింగాలకు బ్రహ్మ పీఠం, పానవట్టం ,లింగం ఒకే ఎత్తులో ఉంటాయ్.
కానీ ఆగమాల్లో ఆ లింగ నిర్మాణాన్ని బట్టి ఆ లింగం ధ్యాన లింగమో, రుద్ర లింగమో,అఘోర లింగమో, అభయ లింగమో(నిల్చినీ అభయహస్తం ఇచ్చే లింగమో),భోగ లింగమో,..నిర్ణయం చేస్తారు.కొన్ని చోట్ల లింగము పానవట్టం కంటే రెండింతలు ఉంటుంది దానిని జ్ఞాన లింగంగా చెప్తారు ఇలా అనేక లింగాలు ఉన్నాయి.మీరు ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్ళినపుడు ఉన్న అనేక లింగాలు గమనించండి.వాటి పేర్లు రాసుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది.
ఇవి కాక చేసిన పాపముల ప్రాయశ్చిత్తమునకు ఏవేవీ ఎంత పరిమాణంలో ఉన్న లింగాలను ప్రతిష్ట చేయాలో చెబుతారు.ఇలా అనేక లింగముల నిర్మాణాన్ని శిల్పశాస్త్రం,ఆగమ శాస్త్రాలు నిర్ణయం చేస్తాయి.
ఇవి కాక పంచ భూత లింగలు(పృథ్వీ, జల,వాయు,ఆకాశ, అగ్ని లింగాలు) అని ఉన్నాయి.మాములుగా ఎత్తుగా గుండ్రంగా వుండే లింగాకారం ,వెడల్పుగా ముక్కోణాకారంగా,పంచకోణాకారంగా,అష్ట కొనాకారంగా ,భగకారంగ(యోని అకృతిలో) అవి పంచ భూత లింగాలు.వీటిని శ్రీశైల దేవాలయం వెనుక భాగాన,శ్రీకాళహస్తి లో చూడవచ్చూ.ఇవి కాక ఇంకా 12 రకాల లింగాలు ఉన్నాయి సహస్ర లింగం,బాణా లింగం వంటివి యెన్నో ఉన్నాయి.
ఈ లింగకార నిర్మాణం అనేది గొప్ప శాస్త్రం మరియు వీటిని తప శక్తి ద్వారా అర్థం చేసుకోగలం.
వీటి నిర్మాణం ఇలాగే ఎందుకు జరగాలి అనే దానికి కూడా శాస్త్రం సమాధానం చెబుతుంది.మనకు ఆ శాస్త్రీయ దృష్టి లేక తెలుసుకోలేక పోతున్నాము.
సరే శివ లింగ తత్వం, శివ లింగ నిర్మాణం ఎలా వున్నా మనం శివలింగారాధన ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి.ఇక్కడ ఆరాధన మొత్తం చెప్పకున్న ఆరాధనలో వచ్చే లోపాలు మాత్రం వివరిస్తాను.
1.ఇతర దేవతారధనకు లింగారాధనకు ప్రధాన బేధం ఉంది ఇతర ఆరాధన ల వల్ల సాలోక్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి లోకం ప్రాప్తించటం ex:విష్ణువు-వైకుంఠం,కృష్ణుడు@రాధ-గోలోకం,సాకార శివుడు- కైలాసం),సారూప్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి వంటి వేషం),సామీప్య( ఎవరిని ఆరాధన చేస్తే వారితో కలిసి దగ్గర గా తిరిగే అదృష్టం) స్థితులు లభిస్తాయి.కానీ లింగారాధన చేస్తే సాక్షాత్తుగా తానే శివుడు అవుతాడు .అంతే కాదు ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే శివుడు కానీ వాడు శివుణ్ణి అర్చన చేయలేడు. వాడిలో శివ తేజస్సు ఉంటేనే , వాడు శివార్చన చేయగలడు అని శాస్త్రం"న రుద్రో రద్రమర్చయేత్".
అందుకే మన శాస్త్రం శివార్చన చేసే వారికి నియమోల్లంఘనాన్ని అంగీకరించింది.అంటే మన సంప్రదాయంలో ""కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ:"" అని సన్యాసి కనిపిస్తే ఎవరైనా నమస్కరించవలసిందే అని కానీ శామ్భవ దీక్షలు ,పాశుపత దీక్షలో ఉండి నిరంతర శివార్చన ,శివాభిషేకం చేసే వారు సన్యాసులకు నమస్కారం చేయరు.ఎందుకంటే వారు శివుడే అయి వుంటారు కాబట్టి.
2. మొదట పానవట్టం నకు పూజ చేసిన తర్వాతనే లింగ పూజ చేయాలి
3. శివలింగాభిషేకం చేసేటప్పుడు ఒక్క లింగాన్ని పెట్టి అభిషేకం చేయవద్దు(సాలగ్రామం తో కలిపి అభిషేకం చేయవచ్చూ)
4. శివ లింగం పై ఒక మారేడు దలన్నాయిన,పువ్వునైన,గంధము నైనా పెట్టి మాత్రమే అభిషేకం ప్రారంభిచాలి.
5. అభిషేక జలములకు అమృత ముద్ర ,గరుడ ముద్ర చూపినప్పుడే ఆ జలములు అభిషేకమునకు పనికి వస్తాయి.
6. అభిషేక జలములను మహాన్యాసం కానీ,లఘు న్యాసం కానీ,అర్చకులు మాత్రమే తొక్కవచ్చూ .మిగతా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అభిషేక జలములకు గాని,ఈశ్వర నిర్మాల్యాన్ని గాని తొక్క కూడదు.
7.కనీసం లఘు న్యాసమైన చేసుకోకుండా శివ లింగాభిషేకం చేయకూడదు.
8. పంచామృత అభిషేకం లో ప్రతి ఒక్క పదార్థం తర్వాత శుద్ధ జలములతో అభిషేకం చేయాలి.
9.పానవట్టం నకు కూడా అభిషేకం చేయాలి(కొందరు మొత్తం లింగం మీద మాత్రమే నీరు పోస్తారు.పానవట్టం పార్వతి అని గుర్తుంచుకోవాలి.
శివలింగం గూర్చి,శివ లింగ నిర్మాణం గురించి ఆగమాల్లో చాలా శాస్త్రీయంగా ,వైజ్ఞానికంగా చెప్పారు.వేదాలు ముఖ్యన్గా రుద్రము(నమక చమకం) శివ తత్వాన్ని వర్ణన చేశాయి.శివాభిషేకం అంటే ఏమిటి? ఎలా చేయాలి?రుద్రాధ్యాయ అంతరార్థం ఏమిటి?మనం తెలియక చేసే పొరపాట్లు ఏమిటి తర్వాత చూద్దాం.
ఇలా శివలింగ తత్వం గురుంచి ఎంతైనా చెప్పుకోవచ్చూ. ఎప్పుడైనా equipment సహకరిస్తే చక్కగా వీడియో చేసి పెడతాను.
శివోహం శివోహం శివోహం
🌼🌼🌼🌼🌼
🙏🙏🙏🙏🙏
*అర
చేతిలో ఐదు తీర్థాలు :*
*ైంైంైంైంైంైంైంై*
👉 అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది. ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.
👉 కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని
'ఓమ్ కేశవాయస్వాహా, '
'ఓమ్ నారాయణాయస్వాహా, '
'ఓమ్ మాధవాయస్వాహా',
అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు.
👉 ఈ సందర్భంలోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.
👉 చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే బ్రహ్మతీర్థం అని అంటారు.
👉 చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.
👉 అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని దాన్ని అగ్ని తీర్థం అని అంటారు.
👉 చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.
👉 ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.
👉 ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.
👉 సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది.
👉 పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం పితృతీర్థం అనబడుతున్నది.
👉 ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో...
[14/04, 6:25 am] +91 94917 74979: *బుధవారం గరుడునిని పూజిస్తే నాగదోషం పరార్..*
👉 బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గరుడాళ్వార్ నారాయణ స్వామికి వాహనధారుడు. గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి. అందుకే బుధవారం పూట గరుడాళ్వార్ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆలయంలోనే కాకుండా.. ఇంట్లోనూ రోజూ గరుడాళ్వార్ను తలచి పూజ చేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి.
👉 చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది. సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి. తర్వాతే స్వామిని దర్శించుకోవాలి. ఇది వైష్ణవ ఆగమ పద్ధతి. ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
*గరుడాళ్వార్ దర్శనం:* ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి. సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం, మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది. బుధవారం శత్రుభయం వుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది.
[16/04, 7:45 am] +91 94917 74979: *శ్రీ*
॰॰॰॰॰॰॰
*ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?*
>>>>>>> ॐ <<<<<<<
“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.
“శ్రియ మిచ్దేద్దు తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.
మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.
నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.
ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.
[16/04, 9:04 am] +91 99850 01339: *🌼 ప్రసాదములు 🌼*
1)కుశలాన్నం =పులగం
2)చిత్రాన్నం=పులిహోర
3)క్షీరాన్నం=పరమాన్నం
4)పాయసం=పాయసం
5)శర్కరాన్నం= చక్కెరపొంగలి
6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి
7)దధ్యోదనం= పెరుగు అన్నము
8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం
9)శాకమిశ్రితాన్నం=కిచిడీ
10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం
(గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)
12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు
13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి
14)మధురపానీయ=పానకం
15)పృథక్=అటుకులు
16)పృథకాపాయస=అటుకుల పాయసం
17)లాజ=పేలాలు
18)భక్ష్యం= పిండివంటలు
19)భోజ్యం= అన్నము మొదలగునవి
20)వ్యంజనం=పచ్చడి
21)అపూపం=అరిసెలు లేదా అప్పములు
22)మాషచక్రం= గారెలు
23)లడ్డుక,= లాడూలు
24)మోదకం= ఉండ్రాళ్ళు
https://chat.whatsapp.com/Fxe5j0yW77O09N95bynLzG
*🌼నివేదనల పేర్లు🌼*
1)చూతఫలం=మామిడిపండు
2)ఖర్జూర= ఖర్జూరం.
3)నింబ=వేప
4)నారింగ=నారింజ
5)భల్లాతకీ=జీడిపప్పు
6)బదరీ=రేగు
7)అమలక=ఉసిరికాయ
8)శుష్కద్రాక్ష=కిస్మిస్
9)అమృత లేక బీజాపూరం= జామపండు
10)ఇక్షుఖండం=చెఱకుముక్క
11)కదళీఫలం,రంభా ఫలం=అరటిపండు
12)నారికేళం=కొబ్బరికాయ
13)జంభీర= నిమ్మ పండు
14)దాడిమీ=దానిమ్మపండు
15)సీతాఫలం= సీతాఫలం
16)రామఫలం= రామఫలము
17)కపిత్త=వెలగ పండు
18)శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు
19)మాదీ ఫలం=మారేడు పండ్లు
20)జంభూఫలం=నేరేడు
21)వాతాదం= బాదము పప్పు
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం కొరకు తప్పక చవవలసిన అత్యుత్తమ స్తోత్రం
ఋగ్వేదం లోని - శ్రీ సూక్తం
https://youtu.be/ZshKXy1yehw
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
[16/04, 9:31 am] +91 99850 01339: పులిహోర ఆవకాయ తయారీ విధానం :-
కావలసినవి;
పచ్చి మామిడి కాయలు - 2( పెద్దవి),
సాల్ట్ : 75 గ్రాములు,
పసుపు: 1/2 స్పూన్,
ఆవపిండి - 125 గ్రాములు .
కారం -- 75 గ్రాములు.
పులిహోర ఆవకాయ లో పోపునకు కావలసిన పదార్థములు :-
నువ్వులనూనె - 150గ్రాములు .
ఎండుమిరపకాయలు - 8
పచ్చిశనగపప్పు - రెండు స్పూన్లు,
మినపప్పు - రెండు స్పూన్లు,
ఆవాలు - 1+1/2 స్పూన్
కరివేపాకు - గుప్పెడు,
ఇంగువ - పావు స్పూను.
తయారీ విధానము :-
ముందుగా కాయలు కడిగి గుడ్డతో శుభ్రంగా తుడిచి , మధ్యకు తరిగి లోపలి టెంక లేదా జీడి తీసి వేసి చిన్న ముక్కలు చెక్కు లా తరుగుకోవాలి.
తర్వాత ఒక బేసిన్ లో తరిగిన ముక్కలు వేసుకుని ,అందులో పసుపు మరియ ఉప్పు వేసి చేత్తో బాగా కలుపుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి . ఉప్పు తగలగానే ముక్కల నుండి ఊట వస్తుంది,.
తర్వాత స్టౌ మీద ఒక గిన్నె పెట్టి గ్లాసు నీళ్ళు పోసి , నీళ్ళను బాగా మరగనివ్వాలి .
తర్వాత స్టౌ ఆపి ఆ నీళ్ళలో ఆవపిండి మొత్తము వేసి గరిటెతో బాగా కలిపి , ఈ మిశ్రమమును ఒక పళ్ళెంలో వేసి , ఒక గంటన్నర సేపు ఎర్రని ఎండలో ఎండ పెట్టాలి .
ఇప్పుడు విడిగా బేసిన్ లో సిద్ధంగా ఉంచుకున్న ముక్కలలో మొత్తము కారం వేసి బాగా కలుపుకోవాలి .
తర్వాత స్టౌ మీద మూకుడు పెట్టి మొత్తము నువ్వులనూనె పోసి నూనెను బాగా కాగనివ్వాలి .
ఆ తర్వాత అందులో ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసుకుని పోపు వేసుకోవాలి .
ఇప్పుడు ఆ వేడి వేడి పోపు ను కారం కలిపిన మామిడి ముక్కలలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .
ఈ విధముగా పోపు కూడా వేసి కలిపిన ముక్కల లోని వేడి బాగా చల్లారిన తర్వాత విడిగా ఎండపెట్టిన ఆవపిండి ముద్దను తీసుకుని వచ్చి ఈ పోపు వేసిన ముక్కలలో వేసుకుని , గరిటెతో బాగా కలుపుకోవాలి .
బాగా చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 2-3 నెలలు నిల్వ వుంటుంది.
*
No comments:
Post a Comment