*🌹. ఋగ్వేద సంహిత వచనము - 49 🌹*
*✍️. రచన : దాశరధి రంగాచార్య*
*🌻. మండలము 1, అధ్యాయము 4, అనువాకము 9, సూక్తము - 5 🌻*
*🌴 48వ సూక్తము 🌴*
*ఋషి - ప్రస్కణ్వుడు, దేవత - ఉష, ఛందస్సు - బృహతి.*
*1. ఉషా ! నీవు ద్యుపుత్రికవు. ధనముతో ఉదయింపుము. అన్నముతో ఉదయింపుము. దానముతో ఉదయింపుము.*
*2. ఉషా ! నీవు అశ్వములను, గోవులను, ధనములను కలిగించగలదానవు. నా గృహము విశాలము చేయుము. నాకు హితము చెప్పుము. సంపదలు ప్రసాదించుము.*
*3. ధనము కోరువారు సంద్రమున నావలు నడుపుదురు. అట్లే ఉదయాకాశమున ఉషోదేవి రథము నడిపించును. ఆ దేవి పూర్వము ఆ రథమును నడిపినది. ఇప్పుడు నడుపుచున్నది.*
*4. ఉషా ! నీవు అవతరించినపుడు దాతల మనసులు ద్రవించును. వారు దానములు చేయుదురు. కణ్వుడు అట్టిదాతల పేర్లు ఉషఃకాలముననే ఉచ్ఛరించును.*
*5. గృహిణి గృహమును పాలించునట్లు, జగములను పాలించు ఉష అవతరించినది. ఆమె ప్రాణుల ఆయువు హరించునది. ఆ దేవి కదలికగల ప్రాణులను నడిపించును. పక్షులను ఎగిరించును.*
*6. అన్నవతి ఉష కదలిక కలవారిని మేల్కొల్పును. యాచకులను దాతల ఇండ్లకు పంపును. నేలను మంచుతో తడుపును. కలకాలముండదు. కదిలిపోవును.*
*7. ఉష సౌభాగ్యవతి. నూరు రథములు గలది. ఆమె రవి ఉదయించు స్థానమునుండి, నూరు రథములలో మానవులకు దర్శనమిచ్చును.*
*8. ఉష ద్యుదుహిత, ధనవతి. ఆమె జగములు కనిపింపచేయును. జనులను పనులకు పంపును. చీకట్లను చిమ్మివేయును. దొంగలను తరిమివేయును. అట్టి ఉషోదేవికి సకల జగములు నమస్కరించును.*
*9. ద్యుదుహితా ! ఉషా ! నీవు సూర్యచంద్రులతో కూడి ప్రకాశింపుము. మాకు దినమున సౌభాగ్యము ప్రసాదించుము.*
*10. ఉషా ! నీవు ప్రకాశవంతమగు ప్రభాతమును కలుగజేయుచున్నావు. సర్వప్రాణుల జీవము, చలనము నీవే అగుచున్నావు. నిన్ను మేము ఆహ్వానించుచున్నాము. నీవు రథముల మీద రమ్ము. మాకు సంపదలు ప్రసాదించుము.*
*11. ఉషస్సా ! నరులు సమర్పించు అన్నమును స్వీకరింపుము. యజమానులు నిన్ను నుతింతురు. యజ్ఞములు చేతురు. వారి అధ్వరములు నిర్వహింపుము.*
*12. ఉషోదేవీ ! అంతరిక్షము నుండి సకల దేవతలను సోమపానమునకు తీసికొనిరమ్ము. మాకు అశ్వములు, గోవులు, సాహసము, ఆహారము అను సంపదలను ప్రసాదించుము.*
*13. ఉషోదేవి వెలుగులు పరుచుచున్నది శత్రువులను పరిమార్చుచున్నది. కళ్యాణములు కలిగించుచున్నది. ఆమె మాకు సుందరములు, సులభములు అగు సంపదలు అందించవలెను.*
*14. ఉషోదేవీ ! నీవు పూజనీయవు. నిన్ను పూర్వ ఋషులు వారి రక్షణ కొఱకును, ఆహారము కొఱకును స్తుతించినారు. నీవు అట్టి ఆహారముతోను, కాంతులతోను వెలుగొందుము. మేము చేయు స్తుతులను గ్రహింపుము.*
*15. ఉషా ! నీవు నీ ఉదయకాంతులతో అంతరిక్ష ద్వారములను తెరచినావు. మాకు హింసా రహితము, విశాలము, తేజోవంతమయిన గృహమును అనుగ్రహింపుము. అనేకగోవులను, అన్నమును ప్రసాదించుము.*
*16. అన్నవతీ ! ఉషా ! మమ్ము సకల సంపదలలో ముంచుము. అన్నమును, గోవులను, శత్రువును గెలిచిన కీర్తిని ప్రసాదించుము.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌺ఆశీర్వచనం ఎందుకు చేస్తారు🌺*
ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం.....
పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.....
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.
విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని,
పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.
యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు "గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు" అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.
అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా ? అవి ఫలిస్తాయా ?
తప్పకుండా ఫలిస్తాయి...
సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.
గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి...
అక్షింతల సంకేతం.....
సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు.
ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం ?
అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా ?
మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి ?
బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట.
బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.
మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.
మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.
బియ్యంలో తగినంత పసుపు, నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.....🙏🏻
మాతృమూర్తి ఋణం 🚩
#ఆది_శంకరా_చార్యులవారు
సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది.
#శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,
ఆఖరి క్షణాల్లో నాకని
ఎవరున్నారు?
🍁నాకు దిక్కెవరు "
🍁అని దీనంగా ప్రశ్నించింది.
🍁అమ్మా! ఏ సమయమైనా
🍁సరే, నీవు తల్చుకుంటే చాలు
🍁నీ ముందు వుంటాను.
🍁అన్నాడు శంకరుడు.
భగవత్పాదులు శంకరాచార్యులవారి #తల్లికి మరణకాలం సమీపించింది.
మూసిన కళ్ళు తెరవలేదు.
"నేను తలచిన వెంటనే
వస్తానన్నాడే శంకరుడు,
అని మనసులోనే తలుచుకుంటూ వున్నది #ఆర్యాంబ.
తల్లి తలచుకుంటున్నదన్న
విషయం #ఆదిశంకరులు గ్రహించారు.
వెంటనే
#శ్రీకృష్ణుని_ధ్యానించారు.
శ్రీ కృష్ణుడు ఏం కావాలని
అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తి కి #మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.
అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న #అలికిడయింది.
కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న #ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా! అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది.
బాలుని ఒంటి నిండా #ఆభరణాలను గమనించిన ఆర్యాంబ,
శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది.
బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.
అక్కడ తను అను నిత్యం పూజించే #గురువాయూరు_కృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం గమనించింది.
గురువాయూరప్పన్ నిచూసిన ఆర్యాంబ మహదానందంతో " అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసేశక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా " అని మెల్లిగాగధ్గద #కంఠంతో పలికింది.
కృష్ణుడు వెంటనే " నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా ?
#అమ్మను చూడకుండా వుండగలనా " అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.
అదే సమయానికి #శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.
ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా భాగ్యమేమని చెప్పను ?
నిన్ను #పుత్రునిగా పొంది నేను తరించాను.
🍁సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా, శంకరా!" అని కన్నీళ్ళుకార్చింది .
🍁గోపాలుని నేను నిలబెట్టడమేమిటి?
నేను జన్మించినది మొదలు
నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నెనేమీ చేయలేకపోయాను.
సాక్షాత్తు భగవంతుడే
#మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.
నేనైనా అంతే.
నేను చేయగలిగినదంతా నీదివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "
అని #మాతృదేవత_పాదాలముందు_మోకరిల్లారు_ఆదిశంకరాచార్యులవారు.
మన తల్లి తండ్రుల కు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది.
వారి దివ్యాశిస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని
#జగద్గురు_శ్రీ_ఆది_శంకరాచార్యులవారు_యీలోకానికి_సందేశమిచ్చారు.🚩🚩
🙏🙏మాతృ దేవో భవ 🙏🙏
ప్రదోష కాల మహిమ ..
🙇🏻🙇🏻🙇🏻🌸🌸🌸🙇🏻🙇🏻🙇🏻
సాధారణంగా మనకు రోజులో పూర్వసంధ్య, మాధ్యమిక సంధ్యా, ఉత్తర సంధ్యా చాలా విశేషమైన కాలాలు, అందులో పూర్వ, ఉత్తర సంధ్యలు భగవద్ ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి, ఇక అందునా ఉత్తర సంధ్యా ఆతర్వాత చెసే ప్రదోషపూజ చాలా విశేశం అవింది. పూర్వసంధ్యా (సూర్యోదయం) సమయంలో పడుకొని ఉన్న మహా పాపం ఐతే కాదు కాని ఓకేవేల ఉత్తర సంధ్యా, ప్రదోష సమయాల్లో (సూర్యాస్తమయం తర్వాతి 3 ఘడియలు- 3*24=72 ని!!) ఈశ్వరారదన చెయ్యనివాడు, మనుష్య ఉపాదిలోకి వచ్చి గొప్ప అవకాశాన్ని చేజార్చుకునవాడు అవుతాడు.
ప్రదోషానికి అంత విలువ ఎందుకు అంటే శివుడు ఆ సమయంలో వృషభారూఢుడై ఆకాశంలో తిరుగుతూ భూమండలంలో కొన్నికొన్ని ప్రదేశాల్లో దిగుతాడు, ఆనంద తాండవం చేస్తాడు అని పురాణం చెపుతుంది. ఆ సమయంలో సమస్త దేవతలు ఈశ్వర నృత్యానికి అనుగుణంగా ఏదో ఒక వాయుధ్యాలు చేస్తారు,, అందరూ ఈశ్వరుడి నృత్యం చూస్తూ పరమ పారవశ్యంలో వుంటారు,, అందుకే ప్రదోషం అంటే శివారాధన కొరకే.
ప్రదోషం అంటే అంత గొప్ప సమయం, అందునా ప్రదోష సమయంలో తప్పక వెళ్ళ వలిసిన దేవాలయం శివాలయమే, ఎందుకు అంటే అందరూ దేవుళ్ళు ఒకేచోట చూసే భాగ్యం అప్పుడు శివాలయంలో కలుగుతుంది. అప్పుడు అందరూ శివుని నృత్యంలో తాదాప్యత చెంది పరమ సంతోషంతో వుంటారు.
🌸🌸🌸🧘🏻🧘🏻🧘🏻🌸🌸🌸
మహా మృత్యుంజయ మంత్ర పఠనం 🙏🏻🌸🙏🏻
🌸🌸🌸🧘🏻🧘🏻🧘🏻🌸🌸🌸
అందుకే ప్రదోషం సమయం లో పూజ, పంచాక్షరి మంత్ర జపం , మృత్యుంజయ మంత్ర జపం లేదా శివ నామస్మరణ తప్పక చెయ్యాలి, ఇది చెయ్యకపోతే మనుష్య జన్మలోకి వచ్చి గొప్ప అవకాశాన్ని జరవిడుచుకున్నవాడు అవుతాడు.
ప్రదోష సమయంలో తినటం, తాగటం, మాటడటం నిషిద్ధం, ఇక ఆ సమయంలో తమో గుణ రాజోగుణ సంభందమైనవి చేయటం, ఆలోచించటం, మహా పాపాల కింద్రాకు వస్తాయి.
హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అంతటి రాక్షసులు ఏ కారణంగా పుట్టారు అంటే వారి తల్లి దితి తన భర్త కశ్యప ప్రజాపతిని ప్రదోషసమయంలో చేరి భోగిద్దాం అని ప్రేరేపిస్తుంది, కశ్యపుడు మహజ్ఞ్యాని, సప్తరుషుల్లో ఒకరు ఆయన వారించి, దానివల్ల లోక కంఠకులు, ధర్మ విరుద్ధంగా ఉండేవాళ్ళ, విష్ణు ద్వేషులు పుడతారు అని అన్నాడు, ఐనా సరే నా కోరిక తీరాల్సిందే అని ఆవిడ పట్టు బట్టటం తో వారు సంగమించారు, అందుమూలంగా శివుడికి అపచారం జరిగింది, జగములు ఎలే సర్వేశ్వరుడు భూమిమీద పయనిస్తుండగా మనం నమస్కారం చేయకపోవడం ఒక తప్పు, భోగించడం ప్రదోష సమయంలో నిషిద్ధ కర్మ,
ఈశ్వరుడి పక్కన ఉన్న రుద్రాగణంలో భద్రాబాధ్రులు చూసి దానికి ఫలితంగా లోకకంఠకులు మహా రాక్షసులు పుట్టేలా ఫలితాన్ని ఇచ్చేసారు.
ప్రదోష కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరుచుకుందాం .. ఆ శివ నామ స్మరణ తో ..
🙇🏻🙇🏻🙇🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻
🌼ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు🌼*
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - *శనివారం, మంగళవారం మరియు గురువారం*.
*పురాణ కథ ప్రకారం*
ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.
*స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:*
1. తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
2. మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
3. పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
4. తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
5. కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
*పంచముఖ హనుమాన్:*
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.
1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.
🐵 *హనుమంతుడి సందేశం ?*🐵
హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.
హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట –
‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని.
కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు.
మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు.
ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!
*బిల్వవృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం*..
🌿🌿🌿🌸🌿🌿🌿🌸🌿🌿🌿🌸
ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి,ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు.
తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది.అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతి ని ప్రార్థించకుండా పొరపాటు చేసింది.
అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి.
లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరీ జపం చేద్దామను కున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడం తో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది.
ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండిదివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు.
ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయ సాగింది.
అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరు కోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు.
మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది....స్వస్తి...🙏🌹🎻
🌿🌿🌿🌸🌿🌿🌿🌸🌿🌿🌿🌸
తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు.
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు.
అదే మాడవీధులుగా మారింది.
ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు.
శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు.
1.తూర్పు మాడ వీధి.
ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి.
శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.
ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న
(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు.
ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.
క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు.
మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.
2.దక్షిణ మాడ వీధి
ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట .
ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది
ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి.
ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.
దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది .
తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.
3.పడమర మాడ వీధి.
ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి
ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.
4.ఉత్తర మాడ వీధి.
ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు.
ఏది ఏమైనా
పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.
ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి.
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
తిరుమల ప్రధాన ఆలయం లో వినిపించే ఓం నమో వేంకటేశాయ మహా మంత్రం యధా రీతిగా
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది .
ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది.
తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది.
ఆమె సమాధి
తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.
ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతార
ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.
ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.
*శ్రీ శ్రీనివాసా గోవిందా || శ్రీవేంకటేశా గోవిందా*
*గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా*
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
*దీపారాధన-పరిహారాలు*
ఈ పరిహారాల్లో దేన్నైనా... ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.
1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం
2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
3. వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
4. శని భగవాన్ ప్రతికూలమై తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే....!! తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి, యథాశక్తి శ్రీరామనామ జపం చేయాలి.
🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛
*మజ్జిగ - మహా పానీయం*
🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛
“మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. “
“ పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. “
“స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడు అయ్యాడు. “
“మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు”
*యోగ రత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది.
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!*
వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు.
అ౦దుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవు తు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.
చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.
*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”:*
ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.
*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:*
పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. *భావ ప్రకాశ* వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
*#ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి:#*
*చక్కగా “చిలికిన మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి* తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. *ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు*.
********""
మోక్షం
1) నిత్యకృత్యాలు తీర్చుకుంటే పాపం కానీ పుణ్యం కాని వస్తుందా?రాదు, అవి కేవలం శారీరక అవసరాలు మాత్రమే.
2) చదువుకుంటే పాపము కానీ, పుణ్యం కానీ వస్తుందా? రాదు, జీవనోపాధి లభించి, మన కాళ్ళమీద మనం నిలబడి స్వతంత్రంగా జీవనం కొనసాగించే స్వేచ్ఛ వస్తుంది.
3)సంపదవల్ల పాపం కాని పుణ్యం కానీ వస్తుందా? రాదు, కేవలం మమకారం పెరుగుతుంది.
4) బంధుత్వాల వల్ల పాపము కానీ పుణ్యం కానీ వస్తుందా? రాదు, కేవలం వారి అవసరాలు తీర్చే అవకాశం లేదా మన బాధ్యత నిర్వహించే అవకాశం వస్తుంది.మరి పాపము పుణ్యం ఎలా వస్తాయి?మనం ఇతరులకి చేసే వ్యవహారం తో వస్తాయి."పర పీడనం పాపం, పర హితం పుణ్యం".
5) పాపము, పుణ్యము వల్ల మోక్షం వస్తుందా రాదు. మన సంప్రదాయం ప్రకారం పాపం వల్ల నరకము, పుణ్యం వల్ల స్వర్గం వస్తాయి.స్వర్గము అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా. డబ్బులు ఉన్నంతవరకు ఫైవ్ స్టార్ హోటల్ లో నివాసము. డబ్బులు అయిపోయాయి అంటే హోటల్ నుండి బయటకు రావాలిసిందే. స్వర్గం కూడా అంతే. పుణ్యము ఉన్నంతవరకు అక్కడ ఉంటాము. పుణ్యం అయిపోతే, తిరిగి భూలోక ప్రయాణం. ఎందుకంటే తిరిగి పుణ్యం సంపాదించాలిగా.కాబట్టి పుణ్యం వల్ల మోక్షము రాదు. పాపం మోక్షానికి ఆటంకం కాదు.మరి మోక్షం దేని వల్ల వస్తుంది. కేవలం జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం అంటే అబేధ దర్శనం. అంటే బేధ దృష్టి లేకపోవడం. శారీరక స్పృహ, వ్యక్తిత్వ స్పృహ, ఉన్నంతవరకు బేధ దృష్టి పోదు. కేవలం ఆత్మ స్పృహ మాత్రమే బేధదృష్టిని తొలగిస్తుంది. దినికి ముందు తన పట్ల తనకి ఉన్న అభిప్రాయాలు పోవాలి. ఇంత వరకు మనని మనం ఒక శరీరం గానే భావించాము, లేదా ఒక వ్యక్తిత్వ అంశంగా భావించాము. ఇలా కాకుండా మనని మనము ఒక ఆత్మ స్వరూపంగా భావించాలి. అందరిలో అదే (ఆత్మచైతన్యం) ఉందని భావించాలి. ఈ జ్ఞానం మోక్షాన్ని ప్రసాస్తుంది.
"********
ఒక రోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి విచ్చేసాడు. ఇద్దరూ అనేక విషయాలను చర్చించారు. వశిష్టుడు వీడుకోలు చెప్పినప్పుడు విశ్వామిత్రుడు , వశిష్టునికి కలకాలం జ్ఞాపకం వుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని తన వేయి సంవత్సరాల తపశ్శక్తిని ధారపోశాడు.
వశిష్టుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.
ఆ తర్వాత మరి కొన్నాళ్ళకు వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చాడు. వశిష్టుడు విశ్వామిత్రుని కి
సకలోపచారాలు చేస్తాడు.
పుణ్యమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు గురించి మాత్రమే మాట్లడుకున్నారు. వీడ్కోలు సమయాన వశిష్టుడు ,విశ్వామిత్రుని కి బహుమతిగా అంతవరకు వారు మాట్లాడుకున్న విషయాల పుణ్యఫలాన్ని యిస్తున్నాను అన్నాడు.
ఇది విన్న విశ్వామిత్రుని ముఖం చిన్న బోయింది. 'మీరు నాకిచ్చిన వేయి సంవత్సరాల తపః ఫలం,
యీ అర రోజు మాటల పుణ్యఫలం ఎలా.సమమౌతాయని ఆలోచిస్తున్నారా' అని వశిష్టుడు అడిగాడు.
విశ్వామిత్రుడు అవునని తలవూపాడు. ఈ విషయంగా బ్రహ్మదేవుని అడిగి తెలుసుకుందామని ఇద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళేరు. బ్రహ్మకి జరిగినది
చెప్పేరు.
ఈ విషయంగా నేను తీర్పు చెప్పలేను. శ్రీ మహావిష్ణువు ని అడగమని చెప్పాడు బ్రహ్మ. వారు శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్ళి అడిగారు. నా కంటే కూడా తపోబలాన్ని గూర్చి పరమశివునికి బాగా తెలుసు. పరమశివుని అడిగితే ఆయనే సరిగ్గా జవాబివ్వగలవాడని అని అన్నాడు శ్రీ మహావిష్ణువు.
వారిద్దరూ అక్కడనుండి కైలాసం చేరుకొని తమ సందేహం తీర్చమని వేడుకొన్నారు. పరమశివుడు కూడా మీ సందేహం తీరాలంటే పాతాళలోకంలోని ఆది శేషువే తీర్చాలని చెపుతాడు.
వశిష్టుడు ,విశ్వామిత్రుడు పాతాళలోకానికి వెళ్ళి ఆదిశేషువును తమ సందేహం తీర్చమని అడిగారు. ఆదిశేషువు ఆలోచించి సమాధానం చెప్పడానికి కొంచం వ్యవధి కావలసి వున్నది. నేను బదులు చెప్పేదాకా నేను మోస్తున్న యీ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయ వలసి వుంటుంది.
తలమీద పెట్టుకుంటే బరువుగా వుంటుంది, కనుక , ఆకాశం లో నిలబెట్టి వుంచండి అని అన్నాడు. విశ్వామిత్రుడు వెంటనే తన వేయి సంవత్సరాల
తపః ఫల శక్తిని ధార పోస్తాను. ఆ తపఃశ్శక్తితో, భూమి ఆకాశంలో నిలబడుతుంది అని అన్నాడు.అయితే, భూమిలో ఏ చలనం రాలేదు. అది ఆదిశేషుని తలపై అలాగే వుంది. అప్పుడు వశిష్టుడు అన్నాడు.
అర్ధగంటసేపు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను, ఆ శక్తితో భూమి ఆకాశం లో నిలబడాలని కోరుకుంటున్నానని అన్నాడు.
వశిష్టుడు అలా అనగానే ఆదిశేషువుతలమీద వున్న భూమి అంతరాన నిలబడింది.
ఆది శేషువు తిరిగి భూమిని తన తలమీద .పెట్టుకొని యిద్దరు మహర్షులు వెళ్ళవచ్చునని అంటాడు.
అడిగినదానికి బదులు యివ్వకుండా వెళ్ళమంటే? దాని అర్ధం ఏమిటని ఇద్దరు ఋషులు ఒకే సారి అడిగారు.
మీ ఎదురుగానే నిరూపణమయింది, చూశారు కదా, యింక వేరే తీర్పు చెప్పడానికి ఏమున్నది?
వేయి సంవత్సరాల తపోశక్తి ధారపోసినపుడు కదలని భూమి ఒక అర్ధ గంటకాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం ధారపోయడం వలన ఆకాశం లో నిలబడడం మీరు గమనించారు.
"సజ్జన సాంగత్యం వలన, సత్చింతన వలన కలిగిన పుణ్యమే, తపోబలం యిచ్చే ఫలం కన్న మిన్న " అని ఆదిశేషువు తీర్పు యిస్తాడు.
No comments:
Post a Comment