Wednesday, 7 April 2021

stories

 

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం

🦚🦚🦚🦚🦚🦚🦚🦚

  1) విమలనిజ పదాబ్జం వేద వేదాంత వేద్యం!
   మమకుల గురుదేహం వాద్యగాన ప్రమోహం!
 రమణ సుగుణ జాలం రంగరాఢ్భాసి తనేయం!!
కమల జనుత పాదం కార్తికేయం భజామి!!


2) శివ శరవణ జాతం శైవయోగ ప్రభావం!
  భవహిత గురునాథం భక్తబృంద ప్రమోదం!
   నవరస మృదుపాదం నాద హ్రీంకార రూపం!
కవన మధుర సారం కార్తికేయం భజామి!!


3) పాకారాతి సుతా ముఖాబ్జ మధురం!బాలేందు మౌళీశ్వరం!
  లోకానుగ్రహ కారణం శివసుతం లోకేశ తత్వప్రదం!!
రాకాచంద్ర సమాన చారువదన మంభో రుహ వల్లీశ్వరం!
 హ్రీంకార ప్రణవ స్వరూప లహరీం శ్రీకార్తికేయం భజే!!

 4) మహాదేవ జాతం శరవణ భవం మంత్ర శరభం!
 మహత్తత్వానందం పరమలహరీ మంద మధురం!
   మహాదేవాతీతం సుఖ గణ యుతం మంత్ర వరదం!
    గుహం వల్లీనాథం మమ హృది భజే గృద్ధగిరిశం!!


        5) నిత్యాకారాన్నిఖిల వరద నిర్మలం బ్రహ్మతత్వం!
    నిత్యం దేవైర్వినుత చరణ నిర్వికల్పాది యోగం!
   నిత్యాఢ్యాంతం నిగమ విదిత నిర్గుణం దేవ నిత్యం!
  వందే మమ గురువర నిర్మలం కార్తికేయం!


ఇతి శ్రీసుబ్రహ్మణ్య పంచరత్నం సంపూర్ణం

🦚🦚🦚🦚🦚🦚🦚🦚
💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑
***********
💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...

💖 భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.

💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!

💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

💖 మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

💖 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

💖 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

💖 నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

💖 సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.

💖 వివాహాన్ని సుఖమయం
 చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు. పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

💖 కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేది అందులో ఒకపేజీ మాత్రమే. ఆ ఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

💖 మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

💖 భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం  అన్యోన్యం కావాలి కానీ అయోమయం కాకూడదు.

మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య

💐💐💐💐💐💐💐💐💐💐

 🌷పరమాచార్య ప్రశ్న - పవమాన ప్రతిష్ట🌷

నేను 1979 నుండి 1982 మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసాను. మా కంపెనీకి కర్ణాటకలోని బెళ్గాం ఒక మార్కెటింగ్ డివిజన్. ఒక్కసారి నేను ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళాను.

బెంగళూరు నుండి హుబ్లికి రైలు ఉదయమే చేరుకుంటుంది. కాని హుబ్లి నుండి బెళ్గాంకి వెళ్ళడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఎందుకంటే అది ప్యాసింజర్ రైలులాగా అన్ని స్టేషన్లలోను ఆగుతూ వెళ్తుంది. బెళ్గాంకి ఎవరైనా పైఅధికారులు వస్తే ఒక అధికారితో పాటు అసిస్టెంట్ మేనేజరు కూడా హుబ్లికి వచ్చి అక్కడి నుండి బెళ్గాంకి కారులో తీసుకువెళ్తారు.

ఆ మార్గంలో బ్రిటీషు వాళ్ళకి ఎదిరు నిలిచి పోరాడిన ధీరవనిత ‘రాణి చెన్నమ్మ’ పరిపాలించిన కిత్తూర్ అనే ఊరు వస్తుంది. కిత్తూర్ ఒక చిన్న పట్టణం. అప్పుడు మహాస్వామి వారు అక్కడే మకాం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూడగానే మాకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఎక్కువమంది భక్తులు లేరు. ఒక పెద్ద చెట్టు కింద స్వామివారు కూర్చున్నారు. స్వామికి కొద్ది దూరంగా భక్తులు కూర్చున్నారు. అసిస్టెంట్ మేనేజర్ కృష్ణన్ నేను స్వామివారికి సాష్టాంగం చెయ్యడానికి ఉపక్రమించాము. మమ్మల్ని వారిస్తున్నట్టుగా మహాస్వామివారు చెయ్యి చూపారు. అక్కడే నిలబడి ఉన్న శ్రీమఠం మేనేజరు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దని వారించాడు.

మాకు చాలా నిరాశ కలిగింది. కాని తరువాత నాకు అసలు విషయం తెలిసింది. ఆరోజు ఉదయం వరకు స్వామివారు తీవ్రమైన ఉపవాస దీక్షలో ఉన్నారు. అప్పుడు కనుక మేము సాష్టాంగం చేసినట్లైతే స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాచేస్తే వారి అరచేతి నుండి వెలువడే శక్తికి మేము తట్టుకోలేము కాబట్టి మహాస్వామి వారు వారించారు.

తరువాత స్వామివారు నా గురించిన విషయాలు అడుగుతూ, నా స్వస్థలం గురించి అడిగారు. అందుకు నేను తంజావూరు జిల్లాలోని అడుతురై అని చెప్పాను. నాకు అది ఎలా తెలుసు అని అడిగారు. అందుకు నేను చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని అని చెప్పాను. అలా అయితే అది మీ అమ్మగారి ఊరని, స్వస్థలమంటే అది నాన్నగారి ఊరిపేరు చెప్పాలని చెప్పారు. నా అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా కోరాను. నా స్వస్థలం గుర్తించడానికి వారు చాలా గుర్తులు చెప్పారు. కాని ఎందుకో పేరు మాత్రం చెప్పలేదు. ఆ ఊళ్ళో మా తాతగారు ఒక దేవాలయం నిర్మించారని, అందులో ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ట లేక ఆలయంలో ఉందన్న ఈ విషయం మాత్రం ఖండితంగా చెప్పారు.

నన్ను ఆ గ్రామాన్ని కనుగొని ఆలస్యం చెయ్యకుండా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ట చెయ్యవలసిందని ఆజ్ఞాపించారు. ఇదంతా జరిగిన తరువాత మాకు శ్రీకార్యం చెప్పారు ఎందుకు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దన్నారో. చాలా కొద్దిమంది మాత్రమే ఇంత దగ్గరగా స్వామివారితో మాట్లాడారని కూడా చెప్పారు.

ఆ తరువాత నేను కుంబకోణంలో ఉన్న మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారి తోబుట్టువుల్లో ఉన్నది వారొక్కరే. వారికి అప్పటికే తొంబై ఏళ్ళు పైబడ్డాయి. ఆవిడ మాటల వల్ల, కుంబకోణానికి దక్షిణాన మన్నార్ గుడికి వెళ్ళెదారిలో నన్నిలం పక్కన ఉన్న కుదమురట్టి నదికి ఆనుకుని ఉన్న థిల్లాంబుర్ మా స్వస్థలం అని తెలిసింది.

వెంటనే నేను ఆ ఊరికి వెళ్ళి చూడగా పరమాచార్య స్వామివారు చెప్పినది నిజం. తరువాత ఆ గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి, భూస్వామి నరసింహాచార్య అందరమూ కలిసి స్వామి వారి ఆజ్ఞ ప్రకారం వైదికంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశాము. రెండు దశాబ్ధాలుగా గ్రామాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నాము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానం బాగా ప్రఖ్యాతి గాంచింది. ఆరు శనివారాల పాటు పెళ్ళికాని అమ్మాయిల తల్లితండ్రులు ఇక్కడ పూజలుచేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది.

ఈ సంఘటన నా జీవితంలో చాలా అపూర్వమైనది. వారిని కలవడమే కాదు అటువంటి మహాపురుషులతో కలిసి మాట్లాడడం, వారిని దగ్గరగా సేవించుకోవడం, వారిచే ఆజ్ఞాపింపబడి ఆంజనేయ స్వామి ప్రతిష్ట చెయ్యడం, ఇవన్నీ మరపురాని సంఘటనలు.

వారి కళ్ళల్లోకి మనం తీక్షణంగా చూడలేము. అంతటి శక్తి ఉన్నది ఆ కళ్ళల్లో. ఈనాటికి నేను కళ్ళుమూసుకుంటే ఆ సంఘటన సజీవంగా నా కళ్ళ ముందు కదలాడుతుంది.

--- కె.ఎ. రాజగోపాల్, చెన్నై


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కంచిపరమాచార్యవైభవం
 

😥ఏడుపు మంచిదే🌹
    🕉️🌞🌎🏵️🌼🚩

 ఏడుపు ఆరోగ్యానికి మంచిదే! ఎందుకో తెలుసా
 ఆనందం, విషాదం... ఇవన్నీ జీవితంలో భాగమే. ఆటలు, పాటలు, స్నేహితులు మరియు కబుర్లలో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే... మరి కొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికి పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే... కొంత మంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. అయితే, ఆనందం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... విషాదం మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని, అది లేకపోతే మానవ జీవితానికి అర్థమే లేదని పరిశోధకులు చెబుతున్నారు.
 విచారంగా ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం సహజం. ఎవరైనా సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్నీళ్లు వస్తుంటాయి. వీటిని ఆనంద భాష్పాలు అంటారన్న విషయం మీకు తెలిసిందే. మనస్సులోని భావోద్వేగాలను అధిగమించలేక పోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఏడుపు ప్రతికూలంగా చిత్రీకరించబడింది. ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనము కన్నీటి గ్రంథి నుండి కళ్ళద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్ళుగా పిలుస్తాము. కన్నీళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు శాస్త్రీయంగా ఏడవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నెమ్మదిగా క్రమరహిత శ్వాస, కండరాల వణుకు మొదలైనవి. భావోద్వేగాల నుండి వచ్చే కన్నీళ్లు వేరే రసాయన కూర్పును కలిగి ఉంటాయి. కంటి నొప్పి లేదా ఇన్ఫెక్షన్ నుండి వచ్చే కన్నీళ్లకు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాసంలో, మీ మనస్సు నుండి భావోద్వేగాలు బయటకు వచ్చినప్పుడు కన్నీళ్ళ నుండి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఒత్తిడిని తగ్గిస్తుంది మనస్సు ఒత్తిడి మరియు ఆందోళన మధ్య గందరగోళ స్థితిలో ఉంటుంది, ఇది శారీరకంగా మరియు మానసికంగా మమ్మల్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఇది మనకు ఒత్తిడి నుండి విరామం ఇస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది కొన్ని పరిశోధనల ప్రకారం, కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. సహజంగా శుభ్రపరచడం భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇదియాంటీ బాక్టీరియల్ లక్షణాలు సహజ ప్రక్షాళనగా పనిచేస్తాయి. పొడి కళ్ళ చికిత్స ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే ఇది కంటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ళ పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారించవచ్చు. కళ్ళు మన అత్యంత విలువైన నిధి - నిర్లక్ష్యం చేయవద్దు.... మానసిక స్థితి మెరుగుదల ఏడుపు ద్వారా మెదడులో ఉత్పత్తి అయ్యే ఎండార్ఫిన్లు లేదా మంచి ఎమోషన్ హార్మోన్ల ఏడుపు మనస్సును తేలికపరుస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ నుండి ఉపశమనం ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే అది డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏడుపు ప్రతికూల భావోద్వేగాల నుండి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. 1. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది మూడు రకాల కన్నీళ్లు ఉన్నాయి: రిఫ్లెక్స్ కన్నీళ్లు నిరంతర కన్నీళ్లు భావోద్వేగ కన్నీళ్లు రిఫ్లెక్స్ మీ కళ్ళ నుండి పొగ మరియు ధూళి వంటి స్పష్టమైన శిధిలాలు. నిరంతర కన్నీళ్లు మీ కళ్ళను ద్రవపదార్థం చేస్తాయి మరియు వాటిని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. భావోద్వేగ కన్నీళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చు. నిరంతర కన్నీళ్లలో 98 శాతం నీరు ఉండగా, భావోద్వేగ కన్నీళ్లలో ఒత్తిడి హార్మోన్లు మరియు ఇతర టాక్సిన్లు ఉంటాయి. దీనిపై మరింత పరిశోధనలు అవసరమవుతున్నప్పటికీ, ఏడుపు మీ సిస్టమ్ నుండి బయటకు వస్తుందని పరిశోధకులు సిద్ధాంతీకరించారు. 2. స్వీయ ఉపశమనానికి సహాయపడుతుంది ఏడుపు అనేది స్వీయ-ఉపశమనానికి మీ ఉత్తమ విధానాలలో ఒకటి. ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (పిఎన్ఎస్) సక్రియం చేస్తుందని పరిశోధకులు విశ్వసనీయ మూలం కనుగొన్నారు. PNS మీ శరీర విశ్రాంతి మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఏదేమైనా, ప్రయోజనాలు వెంటనే ఉండవు. ఏడుపు ఓదార్పు ప్రభావాలను మీరు అనుభవించడానికి ముందు కన్నీరు కార్చడానికి చాలా నిమిషాలు పట్టవచ్చు. 3. తక్కువ నొప్పి దీర్ఘకాలిక కన్నీళ్ళ విడుదలల కోసం ఏడుపు ట్రస్టెడ్ సోర్స్ ఆక్సిటోసిన్ మరియు ఎండోజెనస్ ఓపియాయిడ్లు, లేకపోతే ఎండార్ఫిన్స్ అని పిలుస్తారు. ఈ అనుభూతి-మంచి రసాయనాలు శారీరక మరియు మానసిక నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఎండార్ఫిన్లు విడుదలయ్యాక, మీ శరీరం కొంతవరకు తిమ్మిరి దశలోకి వెళ్ళవచ్చు. ఆక్సిటోసిన్ మీకు ప్రశాంతత లేదా శ్రేయస్సు భావాన్ని ఇస్తుంది. ఏడుపు అనేది స్వీయ-ఓదార్పు చర్య అని మరొక ఉదాహరణ. 4. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది నొప్పిని తగ్గించడంలో మీకు సహాయపడటంతో పాటు, ఏడుపు, ప్రత్యేకంగా దు:ఖించడం, విశ్వసనీయ మూలం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు బాధపడుతున్నప్పుడు, మీరు చల్లని గాలిని చాలా త్వరగా తీసుకుంటారు. చల్లటి గాలిలో శ్వాస తీసుకోవడం మీ మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక వెచ్చని మెదడు కంటే చల్లని మెదడు మీ శరీరానికి మరియు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తత్ఫలితంగా, దు:ఖకరమైన పరిస్థితి తర్వాత మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. 5. ఇతరుల మద్దతు మీకు నీలం అనిపిస్తే, ఏడుపు అనేది మీ చుట్టూ ఉన్నవారికి మీకు మద్దతు అవసరమని తెలియజేయడానికి ఒక మార్గం. దీనిని ఇంటర్ పర్సనల్ బెనిఫిట్ ట్రస్టెడ్ సోర్స్ అంటారు. మీరు శిశువుగా ఉన్నప్పటి నుండి, ఏడుపు ఒక అటాచ్మెంట్ ప్రవర్తన. దీని పనితీరు ఇతరుల నుండి సౌకర్యం మరియు సంరక్షణ పొందటానికి అనేక విధాలుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, కఠినంగా ఉన్నప్పుడు మీ సామాజిక మద్దతు నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఓదార్పు దు:ఖించడం ఒక ప్రక్రియ. ఇది దు:ఖం, తిమ్మిరి, ఆందోళన మరియు కోపం కాలాలను కలిగి ఉంటుంది. దు:ఖించే కాలంలో ఏడుపు చాలా ముఖ్యం. ఇది ప్రియమైన వ్యక్తిని ఓదార్చడానికి మరియు అంగీకరించడానికి విశ్వసనీయ మూలానికి సహాయపడవచ్చు. ప్రతి ఒక్కరూ ఏడ్చే ప్రక్రియలో రకరకాలుగా వెళతారు. మీ ఏడుపు విపరీతమైనదని లేదా మీ దైనందిన జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తే, మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. 7. భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ఏడుపు విచారానికి ప్రతిస్పందనగా మాత్రమే జరగదు. మీరు చాలా సంతోషంగా, భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు కొన్నిసార్లు మీరు ఏడుస్తారు. యేల్ యూనివర్శిటీ ట్రస్టెడ్ సోర్స్ పరిశోధకులు ఈ విధంగా ఏడుపు భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మీరు చాలా సంతోషంగా లేదా ఏదైనా గురించి భయపడి ఏడుస్తున్నప్పుడు, అటువంటి బలమైన భావోద్వేగాన్ని అనుభవించకుండా కోలుకోవడం మీ శరీర మార్గం. 8. శిశువు శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది గర్భం నుండి శిశువు మొట్టమొదటి ఏడుపు చాలా ముఖ్యమైన ఏడుపు. పిల్లలు బొడ్డు తాడు ద్వారా గర్భం లోపల తమ ఆక్సిజన్‌ను అందుకుంటారు. ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత, వారు స్వయంగా శ్వాసించడం ప్రారంభించాలి. మొదటి ఏడుపు ఏమిటంటే శిశువు ఊపిరితిత్తులు బయటి ప్రపంచంలో జీవితానికి అనుగుణంగా సహాయపడతాయి. ఏడుపు పిల్లలు ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటిలో ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. 9. శిశువు నిద్రకు సహాయపడుతుంది ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. శిశు నిద్రపై ఒక చిన్న అధ్యయనంలో, 43 మంది పాల్గొనేవారు తమ పిల్లలను పడుకోబెట్టడానికి నియంత్రిత ఏడుపు అని కూడా పిలుస్తారు. నియంత్రిత ఏడుపుతో, పిల్లలు వారి తల్లిదండ్రుల జోక్యానికి ముందు కొన్ని నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నారు. ఏడుపు ఎక్కువ సేపు నిద్రించడాన్ని రెండింటినీ పెంచింది మరియు రాత్రి సమయంలో శిశువులు నిద్రలేచిన సంఖ్యను తగ్గించింది. ఒక సంవత్సరం తరువాత, ఏడుపు శిశువులలో ఒత్తిడిని పెంచడం లేదా తల్లిదండ్రుల-పిల్లల బంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు.

 ఎంత ఆనందంగా ఉండేవారైనా జీవితంలో ఎప్పుడో ఒకసారి విషాదాన్ని అనుభవించక తప్పదు. అలాంటి విషాదాలు ఎదురైనప్పుడే... మనిషికి తాము చేసే తప్పులేంటో విశ్లేషించుకునే అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. బాధ కలిగినప్పుడు దానిని అనుభవించటం వల్ల ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుందని.. లేదంటే, దాన్ని భరించాల్సిన అవసరమే లేదని వారంటున్నారు.

 సాధారణంగా బాధ కలిగినక్షణంలో ఏ పనీ చేయలేమనీ,
 మనస్సు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుందని అయితే నిజానికి అలా ఆలోచనలు నిలిచిపోవడం అంటూ ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు. కాకపోతే, దేనివల్ల బాధ కలిగిందో, ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచించటం వల్ల... మిగతా ఏ విషయాలపైకి దృష్టి వెళ్లదని అన్నారు.

 విషాదం కూడా మనకు మేలే చేస్తుంది. అది, గుండెల నుండి మోయలేని భారాన్ని తొలగించి, ఫ్రెష్‌గా తయారు చేయడమే గాకుండా, ఏదైనా విషయాలపై మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా స్పష్టత కలిగి ఉండేలా చేస్తుంది. కాబట్టి, హాయిగా విషాదంలో మునిగిపోండి... ఆరోగ్యంగా ఉండండి...!

🎊💦🌹🌈🦚🎉🦜
🌞🌞🌞🌞🌞
సంధ్యావందనం అంటే
🌞🌞🌞🌞🌞
వేగం గా తిరిగే ప్రతివస్తువు నుండి శబ్దం వస్తుంది. ఈ భూమి ,గ్రహాలు ,నక్షత్రాలు పాలపుంతలు నిర్ణీతవేగంతో తిరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన సత్యం. మరి ఆ శబ్దం మనకి వినపడుతున్నదా? 20Hz నుండి 20000Hz పౌనఃపున్యము( frequency)లో వున్న శబ్దతరంగాలు మాత్రమే మానవుడు వినగలుగుతాడు. అతివేగంగా తిరుగుతున్న ఈ గతిశక్తి మానవ వినికిడి శక్తికి అతీతమైనది. కానీ ధ్యానంలో వున్న విశ్వామిత్రుడు విశ్వంలో వినపడుతున్న ,విశ్వం ఉనికి కి కారణభూతమైన ఆ శబ్దాన్ని వినగలిగాడు. ఆ శబ్దాన్ని ప్రణవనాదమని (ఓంకారం) గుర్తించాడు. ఈ మధ్యనే NASA scientists  సూర్యకిరణాలలో ప్రణవ శక్తి వున్నదని ధృవీకరించారు. ఆ మూలశక్తి శబ్దరూపంలో ఓంకారమైతే ఆ శబ్దానికి రూపం వుండాలి కదా. ఆ శబ్దరూపమే సూర్యభగవానుడు.
"తత్ సవితుః వరేణ్యం" ఆ ఆ భాస్కరుడే ఉత్తమోత్తమమైనవాడు.
మరి విశ్వసృష్టిక…
🙏🙏🙏🙏🙏
వేంకటశ్వరుడు అంటే?
వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం,
త్రేతా యుగం - శ్రీరాముడుగా,
ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.
కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.
🙏🙏🙏🙏🙏

గ్రహ దోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలతో పాటు వివిధ రకాల స్నానాలు కూడా ఉన్నాయి. కుంకుమ, ఎర్ర చందనం కలిపిన రాగిపాత్రలోని నీటితో స్నానం చేయడం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ - గంధం కలిపిన నీటిని 'శంఖం'తో పోసుకుంటే చంద్ర గ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం, తిలలు కలిపిన 'రజిత పాత్ర'లోని నీటితో స్నానమాచరించడం వలన కుజ దోషాల బారినుంచి బయటపడ వచ్చును.
 
ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టిపాత్రలో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు. మర్రి, మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ 'రజిత పాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
 
ఇక నువ్వులు, మినువులు కలిపిన 'లోహపాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శనైశ్చర గ్రహ ప్రభావం నుంచి తప్పించు…
తప్పకుండా చదవండి...

🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.

🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.

🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట...

🌀 జ్ఞానమున్న వారితో  వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు  నీ విజ్ఞతను కోల్పోతావు...

🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు....
అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...

🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే,  కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..

🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..

🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు,  అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..

🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది.,
_ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు,  ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...

🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...

🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం,
ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం..

🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...?  వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...


🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..అలాగే అన్నీ అనారోగ్యసమస్యలు వేగంగా తగ్గిపోవాలని వాడే మందుల వల్ల వచ్చే ప్రమాదాలే సైడ్ ఎఫెక్ట్స్.

కందుకూరి చిన్న, పాణ్యం.

🙏🌺దక్షిణ..సంభావన..అంటే ఏమిటి 🌺🙏

🌺దక్షిణ కూడా ఒక విధమైన దానమే. దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక నిబద్ధత అనేది ఏమి ఉండదు. అనగా ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడుతుంది. అది ఒక బాధ్యత. 🌺

🌺ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన.
ఇది ఎవరికైనా ఇవ్వతగినదే కానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో, రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన.🌺

🌺ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే. దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.🌺

🌺ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను.🌺

🌺సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , ' విత్త శాఠ్యము ' లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను. 🌺

🌺బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను.🌺

🌺దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి.🌺

🌺ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఆ పురోహితులకు ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును. 🌺

🌺అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను.

ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను. 🌺

🌺రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.

సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.🌺


☘️📚☘️☘️📚☘️☘️📚☘️

శాలువా నాకెందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి


 


నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న 


వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు 


ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక 


ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు 


చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.


గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు.తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని 


జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించాడు.గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.అదే 


గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు.సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.ఆనాటి 


ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు(1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.


దురాశాపరుల మూలంగానూ,శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ 


తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ 


వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. 


తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి 


కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే,రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టాడు.ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు.అందుకే 


ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.


అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక 


దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా 


అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు 


ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన "ఆంధ్రకేసరి"టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్సులు.🙏🙏🙏🙏🙏

ఈరోజు ప్రకాశం గారి వర్ధంతి

వీలయితే మీ పిల్లలతో చదివించండి ఇలాంటి 

నిస్వార్థ పరులు పుట్టిన పవిత్రభూమి మన భారత భూమి అని చెప్పండి

No comments:

Post a Comment