ప్రాంజలి ప్రభ హాస్యం
ఓ తండ్రి కూతురుతో బైక్ మీద వెళ్తున్నాడు. తండ్రి కూతురుకి చాకొలేట్ ఇప్పిద్దామని బండి ఆపి, "నువ్విక్కడే ఉండు, చాకొలేట్ తీసుకొస్తా, ఎక్కడ్ికి వెళ్లకు," అని షాపుకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కూతురు కనపడలేదు.
కంగారు పడి చుట్టుపక్కల చూస్తే కొంచెం దూరంలో ఓ బిల్డింగ్ ను చూస్తూ, దాని వైపే వెళ్లిపోతున్న కూతురు కనిపించింది.
వెంబడి పరుగెత్తుకెళ్లి ఆపబోతుంటే, "నన్నాపొద్దు, ఈ బిల్డింగ్ కి నాకూ ఏదో అనుబంధం ఉన్నట్టుంది, పోయిన జన్మలో అనుకుంటా.." అంటూ చెబుతోంది.
తండ్రి కూతురి చెంప మీద ఒక్కటిచ్చి, "నీ మొహం.. పోయిన జన్మకాదు, ఈ జన్మలోనే నువ్వు చదువుకుంటున్న స్కూల్ అది. ఏడాది నుండి స్కూళ్లు లేకపోయేసరికి నీకు తెలవటం లేదు," అని చెప్తే స్పృహలొకొచ్చింది..
🌻 తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు 🌻
🍃🌺వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
🌻 సుప్రభాతం: 🌻
🍃🌺నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది.
🍃🌺మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు.
🍃🌺వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు.
🍃🌺అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు.
🍃🌺మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.
🌻 శుద్ధి: 🌻
🍃🌺సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
🌻 అర్చన: 🌻
🍃🌺శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.
🍃🌺చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు.
🍃🌺అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
🌻 తోమాలసేవ: 🌻
🍃🌺తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.
🌻 కొలువు: 🌻
🍃🌺తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.
🌻 శ్రీనివాసుని కంఠమున తులసిమాలగా వకుళమాత 🌻
🍃🌺వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు, పద్మావతి ఎంతసేపటికి కుటీరమునకు రానందుకు తన పెద్దకుమారుడైన గోవిందరాజస్వామిని వకుళమాత తోడుగావెంటబెట్టుకొని ఆనందనిలయమును సమీపించి శిలగా మారిన శ్రీనివాసుని చూచి "నాయనా! శ్రీనివాసా!" అని ఆర్తనాదము చేసెను.
🍃🌺శిలలో నుండి మాటలు ఈ విధముగా వకుళమాతకు వినిపించాయి. "జననీ! నీకు ముక్తి ప్రసాదించుచున్నాను. నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు" అన్నట్లు వినిపించెను. వకుళామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమున చేరెను. అందుకే శ్రీనివాసస్వామివారిని తులసిదళములతో పూజిస్తారు. శ్రీనివాసస్వామికి తులసిదళములు అంటే చాలా ప్రీతి.
🌻 గోవిందరాజస్వామి తిరుపతి పట్టణమున వేలయుట :- 🌻
🍃🌺గోవిందరాజస్వామి, శిలగాయున్న తమ్మున్ని చూసి శ్రీనివాసా! ధనరాసులు ఎంత కొలచినను తరుగుట లేదు. ఆయాసమగుచున్నది అనగా, "సోదరా! …
🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 27 🙏
🍃🌹తప్పు చేస్తే వచ్చే నష్టం ఈ పద్యం వివరించింది
ఉ. హానికరంబునైన దనియైనగ్రహింపరు చెడ్డవాడుకన్
మానగలేరు కొంద రనుమానముగల్గియు పెద్దలైన నా
దానవు లెల్ల నా కచుని దగ్ధముజేసిన బూది కల్లునన్
మానుగ నింపి శుక్రు కిడ మత్తిలఁద్రావడె వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! సమాజంలో పెద్దలయిన సుజ్ఞానులు కూడా, కొన్ని విషయాలు, హానికరమని తెలిసీ చెడు మార్గమని భావించి కూడా ఆ తప్పులను చేసి నష్టపోతుంటారు. తెలియక చేసినా, తెలిసి చేసినా, తప్పు తప్పే కదా. నష్టం తప్పక వస్తుంది కదా....
🍃🌹ఎట్లనగా - నీతిశాస్త్ర రచయిత అయిన శుక్రాచార్యులు వారు కూడ మద్యపానము దోషమని తెలిసీ మద్యపానలోలురై, తన ప్రియశిష్యుని చంపి బూడిదిగా చేసి, ఆ బూడిద కలిపిన మద్యాన్ని రాక్షసువివ్వగా త్రాగి శవబూడిదను త్రాగిన అల్పుడిగా పేరు పొందాడు కదా....
🍃🌹మృత సంజీవని విద్యను మరొకరికి మాట తప్పి చెప్పిన వాడయ్యాడుకదా అందువలన దోషాల జోలికి పోకూడదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌻 మహా భారతం 🌻
🎈 భాగము 86 🎈
💧 కరినగరికి పాండుకుమారుల రాక 💧
🍃🌺మాద్రిని కనిపెట్టుకుని ఉంటూ, మృగశాప భీతి లేకుండా వేయికళ్ళతో ఎప్పటికప్పుడు భర్తను సంరక్షిస్తూనే ఉన్నది కుంతి. అయితే ఆనాడు సమారాధన సమయంలో ఆ విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. ఫలితంగా పెను ఘోరం జరిగిపోయింది. మాద్రి ఆక్రందన వినిపించగానే పరుగున వచ్చింది కుంతి. పాండురాజు మృతదేహాన్ని చూసి భోరున విలపించింది.
🍃🌺పాండుకుమారులు అయిదుగురు కూడా అక్కడికి చేరుకుని తండ్రి మరణించాడని తెలుసుకుని నిశ్చేష్టులయ్యారు.‘‘ఎందుకిలా జరిగింది? కంటికి రెప్పలా ప్రాణేశుని కాపాడవలసిన నువ్వే ఎందుకింతగా తెగించావు. నాథునికి మృగశాపం ఉన్నదన్న సంగతి నీకు తెలుసు కదా’’ బాధగా మాద్రిని నిలదీసింది కుంతి.‘‘తెలుసు! తెలిసి వేయి విధాల వారించినా ఆయన వినలేదు’’ చేతుల్లో ముఖాన్ని దాచుకుని రోదించింది మాద్రి.‘‘ప్రాణేశుడు లేకుండా నేను ఒంటరిగా…
: 🌺 తాళపత్రం 🌺
🥀 86 వ రోజు 🥀
🌻 ఉత్తరం దిశగా తల ఉంచి ఎందుకు నిద్రించరాదు? 🌻
🍃🌹ఈ సిద్ధాంతం భూవిజ్ఞాన శాస్త్రం (Geology) పై ఆధారపడి ఉంది. అయస్కాంతానికి ఆకర్షణాత్మక శక్తి ఆకర్షించే శక్తిని ఇస్తుంది. ప్రతీ అయస్కాంతానికి ఉత్తర మరియు దక్షిణ ధృవాలు ఉంటాయి.
🍃🌹ఆకర్షణాత్మక శక్తి (Magnetic Motive Force) దక్షిణము నుండి ప్రారంభమై ఉత్తర ధృవంలో అంతమౌతుంది. అయంస్కాంతంలోని మాదిరే దానికి విరుద్ధంగా దక్షిణ దృవంలో శక్తి ప్రారంభమై ఉత్తర ధృవంలో అంతమౌతుంది.
🍃🌹భూమియొక్క తీవ్రమైన అయస్కాంత శక్తి మనం నిద్రించే పద్ధతిపై ప్రభావాన్ని కలిగిస్తుంది. మానవ శరీరంలో కూడా అయస్కాంతము మరియు భూమి మాదిరే అయస్కాంత శక్తి స్థానాలు మామూలు స్థాయిలో ఉన్నాయని కనగొనబడింది.
🍃🌹ఉత్తరం దిక్కుగా తల ఉంచి నిద్రిచండం వల్ల భూమి యొక్క అయస్కాంత శక్తి స్థానాలతో మన శరీర అయస్కాంత శక్తి స్థానాలు ఘర్…
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ 🌀
🌹 86. శరణం 🌹
🌺 ఓం శరణాయ నమః 🌺
శ్రియతే ఇతి శరణమ్ ఆశ్రయించబడును. ఆర్తుల ఆర్తిని పోగొట్టువాడుగావున భక్తులచే పరమాత్మ ఆశ్రయించబడును.
:: పోతన భాగవతము - రెండవ స్కందము ::
ఉ. సర్వఫల ప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున
సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ
సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై
పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్.
ఆ భగవంతుడు అందరికీ అన్ని ఫలాలు ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులూ గలవాడు. అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు.
సుదర్శనమనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడా ఆకాశంలాగా తానొక్కడూ చెక్కుచెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఓం నమో వేంకటేశాయ! 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 27 (లడ్డూ చరిత్ర) 🎈
లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా - ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన రుచి కూడా "లడ్డూ" ప్రాచుర్యానికి కారణం.
తిరుపతియాత్ర చేసి వచ్చినవారు ఎవరైనా, లడ్డూ ప్రసాదం తీసుకు రాకుండా ఉండరు. శ్రీవారి ప్రసాదమంటే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది లడ్డూయే! దాదాపు, ఆలయ పరిసర ప్రాంతమంతా - నోరూరిస్తూ, తియ్యటి, కమ్మని, ఘుమఘుమలాడే స్వచ్ఛమైన నేతి సువాసనలు లడ్డూల నుంచి వచ్చినవే!ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా, తిరుపతి లడ్డు రుచి మాత్రం దేనికీ రాదు గాక రాదు.
ఎందుకంటే.....చక్కెరమోము గల తల్లి అయిన అలమేలుమంగ యొక్క పతిదేవుని ఎంగిలి ఇతరత్రా చేసిన లడ్డూలకు తగలక పోవడమే దీనికి కారణమేమో! అంతే గాక, ఎనభయ్యేళ్ళకు పైగా, ఒకే పద్ధతిలో, అదే పాళ్ళలో, లక్షలకొద్దీ లడ్డూలు నిరంతరాయంగా, శ్రీవారి పట్ల అచంచల భక్తితో, తయారు చేస్తుండడం వల్ల, "పోటు" బ్రాహ్మణులు ఈ విలక్షణమూ - నిత్యనూతనమూ అయిన లడ్డూ తయారీలో అత్యంత నైపుణ్యాన్ని సంపాదించారు.
తిరుమల లడ్డూకు తితిదే 2009 సం. లో పేటెంటు హక్కు సాధించుకొని, జియోగ్రాఫికల్ ఇండికేటర్ జాబితాలో చేరింది. లడ్డూ వేర్వేరు రూపాల్లో అనేక శతాబ్దాల నుంచి ఉన్నా, తీపి బూందీ ప్రసాదంగా సుమారు 1800 సం. లో విక్రయాలు మొదలై, తదనంతర కాలంలో రూపాంతరం చెందుతూ, 1940 ల్లో ప్రస్తుత లడ్డూ రూపం దాల్చుకుంది.
ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్లు తయారు చేస్తారు. ఒకప్పుడు వాడే కట్టెలపొయ్యి స్థానంలో నేడు ఆవిరి పొయ్యిలను (సుమారుగా 48 పొయ్యిలు) వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. శ్రీవారి సంపంగి ప్రాకారానికి ఉత్తర భాగాన ఉన్న "పడిపోటు" అనబడే వంటశాలలో లడ్డూలను తయారు చేస్తారు.
వంటలకు కావలసిన దినుసులన్నింటినీ "ఉగ్రాణం" అని పిలువబడే గిడ్డంగిలో భద్రపరుస్తారు. లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును "దిట్టం" అని అంటారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొలమానాన్ని "పడితరం దిట్టం" గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం, 5100 లడ్డూలను తయారు చేయడానికి సుమారుగా 830 కిలోల సరుకులను ఉగ్రాణం నుంచి "పడిపోటు"కు తరలిస్తారు.
ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు:
1. ఆస్థానలడ్డు - వీటిని ప్రత్యేక సందర్భాలలో తయారు చేసి అత్యంత ప్రముఖులకు మాత్రమే అందజేస్తారు. సాధారణంగా, ఈ లడ్డూల విక్రయం జరగదు. వీటి తయారీలో, అధిక మొత్తంలో నెయ్యి మరియు ముంతమామిడి పప్పు (సారపప్పు) వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు.
దీని బరువు సుమారుగా 750 గ్రాములు ఉంటుంది. అమోఘమైన దీని రుచిని ఆస్వాదించి తెలుసుకోవాలే గానీ, వర్ణించనలవి కాదు.
2. కళ్యాణోత్సవ లడ్డు - కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. దక్షిణ భారత దేశపు వివాహవిందుల్లో ఈ మధ్యకాలం వరకు - అంటే "క్యాటరింగ్" సంస్కృతి మొదలై సాంప్రదాయిక విందుభోజనాలు అంతరించి పోయేంత వరకు - లడ్డూ వడ్డన తప్పనిసరి.
ఈ ఆనవాయితీ - తిరుమలక్షేత్రంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవానికి ప్రసాదంగా ఇచ్చే "లడ్డూ" ద్వారానే ప్రారంభమైందని చెపుతారు. ఇలా, తరతరాలుగా మన దైనందిన జీవనంలో భాగమై పోయిన తిరుమల సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులు, ఈ లడ్డూలను – దర్శనానంతరం సంపంగిప్రాకారంలో గల "వగపడి" నందు పొందవచ్చు.
3. ప్రోక్తం లేదా సాధారణ లడ్డు - సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రా. లడ్డూలన్నింటి లోకి అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇదే!
ఇవే కాకుండా, భక్తులకు దర్శనానంతరం ఉచిత ప్రసాదంగా ఒక్కోసారి బుల్లి లడ్డూలను కూడా అందజేస్తారు. 51 వస్తువుల్ని (లడ్డూ, వడ, జిలేబి లాంటివి) ఒక "పడి"గా వ్యవహరిస్తారు. ఒక పడి చిన్న లడ్డూలను తయారు చేయటనికి కావలసిన పదార్థాలు:
1.80 కిలోల శనగపిండి,
1.65 కిలోల నెయ్యి,
4.00 కిలోల పంచదార,
300 గ్రాముల జీడిపప్పు,
160 గ్రాముల ఎండుద్రాక్ష,
80 గ్రాముల కలకండ (పటికబెల్లం),
40 గ్రాముల యాలకులు
🍃🌹అదీ శ్రీవారికీ - భక్తులందరికీ అత్యంత ప్రీతికరమైన, ఖండఖండాంతరాల ఖ్యాతి గాంచిన "తిరుపతి లడ్డూ" కథ-కమామిషు.ప్రస్తుతం ఈ లడ్డూలను పొందటం ఇప్పుడు మరింత సులువైంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సీసము
బంధము ఆశల - బహుమాన కధలేలు
బాధ్యత లు గలిగి - బంధమవ్వు
ఆత్మీయత గలిగి - ఆనంద పరుచుట
అనురాగ అమృతము - ఆత్రుతవ్వు
గురువులా బోధించి - గొప్పకు పోకుండ
గౌరవ లక్ష్యము - గోప్యమవ్వు
మిత్రునిలా ఆపదలో - మక్కువ చూపుము
లక్ష్మణా గృహముకు - దీపమవ్వు
జపము సల్పుచున్న - జన్మజన్మా౦తర
పాపసంచయములు బారద్రోలి
మోక్షమొసగుచుండు మార్గమ్ము తెల్పుము
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
No comments:
Post a Comment