సీసము
జననాడి తో సేవ -తత్పురుడు సమర్ధ
వీరపుత్రుండుగా - విజయ మొందె
జ్యోతిస్వరూపుడై - సీతాసమేతుడై
వేదశాస్త్రములచే - వేద్యు డగుచు
జపమాలిక గల్గి - సచ్చిదానంద! క
మండలమును దాల్చి - మహిమ తోడ
జగముల బుట్టించి - తత్భావ సామర్ఢ్య
సంతోష మునుపంచు - సుందరాంగ
తేటగీతి
రామతారకమంత్రమై రక్తి తోడ
జెలఁగె నీ ముద్దు నామంబు చిత్తశుద్ధి
నిన్ను సేవించు నిరతము నిష్ఠ తోను
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
సీతాపతీ పద్య కావ్యము
కోటి మన్మధ రూప - కువలయదళ నేత్ర
రఘువంశతిలకమా - రామచంద్ర
కస్తూరివాసనల్ - గ్రమ్మిన దేహంబు
గల్గి నిర్మలుఁడైన - గ్రాలు వాడ
కోటిదివాకరుల్ - కోతివిద్యుల్లతల్
నికాన్తి సరిరావు - నిగమవేద్య
కౌస్తుభాలంకార - కైలాసవాసప్రి
యా సనకాది సంయమిగుణంబు
రామ నీలమేఘశ్యామ ప్రణతులొసగి
నిన్ను సేవించు భక్తుల నిఖిల దు:ఖ
పుంజంబులు బాబు పుణ్యపురుష
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు.. ౧౦౦
--(())--
nenu
ఏమిటండి అలా కూర్చున్నారు
ఎలా కూర్చోవాలె
కూర్చో వటంలో కూడా ని అనుమాటి కావాలా
అయ్యో రామ మీరు దేనిగురించో ఆలోచిస్తున్నట్లున్నారు దానిగురించి అడిగా అంతే
మనిషిలో నేను అనే అహాన్ని గురించి ఆలోచిస్తున్నాను అంతే.
ఎంత ఆలోచించిన ఇది కలియుగం " దాన్ని తొగించటం ఎవరి వళ్ళ కాదు చివరికి మృత్యువు వళ్ళ కూడా కాదు "
కొంచం వివరిస్తావా
ఒకప్పుడు ఓ ఆశ్రమవాసి నాతో అన్నాడు దైవం కోసం నేను సర్వస్వాన్నీ పరిత్యజించాను. ఇపుడు నా వద్ద ఏమీ లేవు. " ఐనా పరిత్యజించాల్సిన మరొకటి ఆయనలో ఇంకా మిగిలే ఉందనీ నిజంగా పరిత్యజించాల్సినది దాన్నొక్కటేననీ ఆయనతో అన్నాను".
అప్పుడు ఆయన ఇలా అన్నారు
ఆయన తన చుట్టూ చూసుకున్నాడు. ఆయన వద్ద నిజంగానే బాహ్యంలో ఏమీ లేవు. ఆయన వద్దనున్న వస్తువు ఆయన అంతరంగంలోనే ఉంది. అది ఆయన చేసిన పరిత్యాగంలో ఉంది. అది ఆయన కళ్ళలో ఉంది. అది ఆయన సన్యాసంలో ఉంది. అదే ఆయనకున్న "నేను ". ఆ అహాన్ని పరిత్యజించటమే అసలైన పరిత్యాగం.
తక్కిన వాటిన్నిటినీ లాగేసుకోవటం సాథ్యమే కనుక మృత్వువు సర్వస్వాన్నీ లాక్కెళ్ళి పోతుంది.ఈ అహాన్ని మాత్రమే ఎవ్వరూ లాక్కెళ్ళలేరు. ఆఖరుకి మృత్యువుకు కూడా దాన్ని లాక్కోవటం అసాథ్యం. దాన్నికేవలం వదిలి పెట్టవచ్చు. నిజమైన పరిత్యాగం.
మానవుడి వద్ద నేను, తప్ప 'అహం' తప్ప దైవానికి సమర్పింపదగ్గది మరేదీ లేదు. తక్కిన పరిత్యాగాలన్నీ భ్రమలు మాత్రమే. ఆపరిత్యజింపబడిన విషయాలు నిజంగా ఏనాడూ అతడి స్వంతంగావు గనుక. పైగా తక్కిన పరిత్యాగాలన్నీ మానవుడి అహాన్ని మరింత పెంచి ఘనీభవింప చేస్తాయి కూడా.
నేను అనే కుప్పలోంచి ఆవిర్భవించే సత్యభ్రమే అజ్ఞానం. కానీ సత్యం కోసం ఈ రాశిలోనే వెదుకుతున్న మానవుడికి ఆ భ్రమ ధ్వంసమై 'నేను' అనే పూదండలోని పువ్వులన్నీ చెల్లా చెదురుగా రాలి పోతాయి. అప్పుడు ఆ మథ్యలో నిజంగా ఉన్న దారం పువ్వు లతో అప్పటి వరకూ కప్పబడి ఉన్న ఆథారం అనే సత్యం కనిపిస్తుంది. ప్రాప్తిస్తుంది.
ఆ పువ్వులన్నిటినీ తొలగించిన తరువాత ఆ పూదండకు ఆధారంగా ఉన్న దారం నాకు మాత్రమే ఆథారంగా ఉండక అన్నింట్లోనూ అందరిలోనూ ఆథారంగా ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. నాలో ఉన్నట్లు గానే సృష్టి మొత్తం లోనూ అది ఉండి అంతర్లీనంగా వ్యాపించి ఉందనే విషయం అర్థం అవుతుంది.
నాకు నేను అనేపదం తప్ప ఏమి అర్ధం కావటం లేదు, వివరిస్తావా
నీవు 'హక్కు లేని స్థితిని' వదిలి పెట్టి ఆ హక్కును సాథించుకోవచ్చు. .'నేను'గా తయారవడాన్ని విడిచి నపుడే మానవుడు నిజమైన 'మనం ' కాగలడు.తన కేంద్రం లోని భ్రమను విడిచి పెట్టి మానవుడు నిజమైన కేంద్రాన్ని ప్రాప్తించుకోవచ్చు. మానవుడి నేను నిజం కాదు. అనేక విషయాల సంయోగమే అది. దానికంటూ ప్రత్యేక మైన ఉనికి లేదు. అనేక అంశాల సమ్మిశ్రమమే అది.
చివరగా చెపుతున్నా "నేను" అహంకారపు మరణమే పొందాలి. దివ్యత్వం నుండి దూరపు సత్యం నుండి దూరపు సృష్టి నుండి .భౌతిక కాయపు మరణాని కన్నా ముందే అహాన్ని వదిలినవాడే వాడే ధన్యుడు.
అందుకే అంటున్నా నీలో గాని, నాలో గాని "నేను" అనే పదాన్ని మరచి " మనం" అని అనుకుంటే సర్వులకు శాంతి కలుగుతుంది, చివరకు మృత్యువుకూడా భయపడుతుంది, అనగా మనలో ఉన్న అహ0కారాన్ని వదలి త్యాగబుద్ధి జీవనమునకు ఆధారం అని తెలుసుకుంటే మంచిది.
--(())--
ఏమండి మనం పంజరాన చిలుకల్లా గ బ్రతుకుటేన జీవితం. బావిలోని కప్పలాగ కదలుటేన జీవితం. అని నేను ప్రశ్న వెయ్యను. నీలోపల నీ జ్ఞానం ద్వారా పదిమందికి పంచాలి
గుండెలోన అనురాగం ప్రశ్న ఉదయించి అందరికీ జవాబు తెలియపర్చాలి.
కానీ మంత్రం, ఔషధం, సంగమం రహస్యాంగా ఉంచి మిగతా విషయాలు అందిరికి తెలియపరుచుదాం శ్రీమతి
అని పలికే శ్రీవారు
4 . మంత్రం’: ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
నమ్మకం లేనిచోట బంగారం కూడా బూడిదలాగా కనిపిస్తుంది.
మనస్సు ఎంత నిర్మలమైతే, దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.
అలాగే మంత్రం ఫలించాలంటే ధ్యానం పై స్థిరం ఏర్పడాలి ప్రశాంతత కలిగే విధంగా ఉండే ప్రదేశంలో మంత్రం సాధన చేస్తే ఫలితముంటుంది.మంత్రం నమ్మకం లేనివారికి చెప్పినా చెప్పినవారికే మన:శాంతి ఉండదు "మంత్రానికి శక్తి ఉంటుంది "
మంత్రం అంటే, ఒక నియమిత సమయంలో జపమాల త్రిప్పుతూ జపం చేయటం మాత్రమే అని పొరపడి, దానితో మాత్రమే తృప్తి పడబోకు. ఈ మంత్రం అనుష్ఠానం నీ నిత్యజీవితంలో భాగమై విలీనమైపోవాలి.
అనుష్ఠాన మంత్ర సమయంలో నీకు కలిగే పవిత్ర భావములూ, నీవు జపించే మంత్రం యొక్క అర్థంలోని పవిత్రతా నీవు లోకులతో వ్యవహరించేటప్పుడు ఆచరణలో కనిపించాలి. అదే సరియైన మంత్రా అనుష్ఠానం.
5 .ఔషధ౦:
ఔషధం యొక్క వ్యక్తీకరణ. చైతన్యం పదార్ధము ఈ సృష్టిగా పరిణమించింది, మన మనోదేహాలుగా పరిణమించిందీ చైతన్య స్వరూపంగానే. అవ్యక్తంగా ఉంటే అదే ఔషధం . వ్యక్తమైతే అదే చైతన్యం. విత్తనంగా ఉండి మొలకెత్తి మొక్కగా, చెట్టుగా మారితే అది చైతన్యం. అనారోగ్య మనిషి ఔషధం వల్ల ఆరోగ్యవంతుడుగా మారుతుంటాడు.
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
6 . సంగమం: సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
మీరు చెప్పిన రహస్య విషయాలు తెలిసినవి
కస ఆనందం గూర్చి తెలుపు.
శ్రీమతిగారు అసలు ఆనందం గూర్చి తెలుపుతా విను.
అనందము, పరమానందము. సర్వానందము అనేవి లేవని చెప్పటంలోని ఆంతర్యం... అవి మనకు భిన్నంగా లేవని, గుర్తించమనే బోధమాత్రమే. ఒక గులాబీ చెట్టుకు తన పూల గుభాళింపు విడిగా ఉండదు. ఆస్వాదించే వారికి చల్లని అనుభూతినిచ్చే, వెన్నెల చందమామకు విడిగా ఉండదు. మధుర పదార్ధంలోని తీపి దానిలో అంతర్భాగమై ఉంటుంది. అలానే మనం పరబ్రహ్మ స్వరూపమైతే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం మనలోని అంతర్భాగాలే అనుభూతి చెంది ఆనందం పొందే మార్గాలు చూపుతాయి సమయానుకూలంగా పొందేదే నిజమైన ఆనందం అని తెలుసుకో.
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (18)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండి మనం పిల్లల భవిషత్తు ఒకదారిలో పెట్టాము నీకు నేను, నాకు మీరు మిగిలాం కదా అరుచుకున్నా, నవ్వుకున్నా ఇద్దరిమధ్య ఉంటుంది జీవితం. అని నేను ప్రశ్న వెయ్యను. నీలోపల నీ జ్ఞానం ద్వారా పదిమందికి పంచాలి. మనల్ని మనపిల్లలు వేలెత్తి చూపకుండా ఉండాలి అదే నేను కోరుకునేది
అదేనెను కూడా కోరేది.
గుండెలోన అనురాగం ప్రశ్న ఉదయించి అందరికీ జవాబు తెలియపర్చాలి.
కానీ దానం , మానం , అవమానం, రహస్యాంగా ఉంచి మిగతా విషయాలు అందిరికి తెలియపరుచుదాం శ్రీమతి
అని పలికే శ్రీవారు
దానం: దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.
అయినా మన దగ్గర ఉన్న ధనం విషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనాన్ని దానం చెయ్యాలి. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. దానం చెయ్యాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.
దానం అనేది ఒక్కటే కాదు అనేకం అందులో ముఖ్యమైనవి " అన్నదానం, కన్యాదానం, గోదానం,భూదానం,హిరణ్యదానం, వస్త్రదానం .......
ఇక
మానం: మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.
ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు : మనిషి యొక్క మానాన్ని కాపాడుతాయి
-దైవం యందు సంపూర్ణ నిష్ట, -ఆత్మలో ధృడత, -ఆలోచనలో పరిపక్వత, -మనుస్సులో సంతుష్టత, -బుద్దిలో పరిపక్వత, -సంస్కారములో శ్రేష్టత, -దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, -కర్మలలో ప్రావీణ్యత, -సేవలో నమ్రత, -వ్యవహారములో సరళత, -స్నేహములో ఆత్మీయత, -ఆహారములో సాత్వికత, -జీవితములో సత్యత, -వ్యక్తిత్వములో రమణీయత
-నిద్రలో నిశ్చింతత.
ఈ గుణాలను మనస్సులో భద్రపరచుకొని, ఆలోచనలను, బుద్దులను, వ్యవహారశైలిని సంపూర్ణంగా మార్చుకొని వాటిని అన్నిటిని పాటించి సాత్విక గుణాన్ని పాటించి ఆ భగవంతుడైన సర్వేశ్వరుడు పరమాత్మస్వరూపుడిని హృదయంలో సాక్ష్యాత్కరించుకోవాలి. మానవ జన్మను సార్థకత చేసుకోవాలి. అసలుసిసలైన మానవ జన్మలక్ష్యాన్ని గుర్వానుగ్రహంతో ఈ జన్మలోనే పొందవచ్చును!!
ఇక చివరిది
అవమానం: అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతమ నేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం కదా. కుటుంబంలో చిన్న పెద్ద విషయాలు తలుచుకొని అవమానమని భావిస్తే మన:శాంతికి కరువవుతారు, అందరు విరోధులుగా అగుపడుతారు.
చీమ దైవాన్ని ప్రార్ధించి వరం కోరింది కొట్టగానే చావాలని దేవుడు తధాస్తు అంటూ అంతర్ధానమయ్యాడు అంతే ఆ చీమ ఆశతో ఒకడిని కుట్టింది అంతే దెబ్బకు చచ్చింది. అంటే అవమానం బహిర్గపరిసే వాడి చావు వాడు తెచ్చుకున్నట్టే.
అవునే
చాలా చక్కగా చెప్పావు
ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.
మొత్తానికి రహస్యజ్ఞానం అంటూ నా మెదడుని తినేసావే
చాలా చిక్కని కాఫీ తీసుకురా
తాగాక మరో కధ ఆలోచిద్దాం.
మీకు ఇదేపనే బజారుకు పోయాయి కూరలుతెండి
కడుపులో కాస్త ఆహరం పడితే మెదడుకు పదును వస్తుంది
ఇదేమన్నా వజ్రమా అరగదీస్తే మెరవటానికి దానికన్నా గొప్పది
అయితే కాఫీ తగి వెళతానే
హమ్మయ్యా ఇప్పుడు మీరు దారిలోకి వచ్చారు
ఆ మూడుముళ్ల ఎప్పుడు నీ మెడలో వేసానో అప్పటినుంచి నాదారి నీ దరియే కదే
నోట్లోవేలేసుకున్న చిన్నపిల్లోడికి చెప్పండి మీమాటలు నాకు కాదు అంటూ నవ్వి కాఫీ అందించింది
కాఫీ చాలా చాలా బాగుంది
త్రాగందే
నీ కళ్ళను బట్టి చెప్పగలనే
ఏమన్నారు
నిజమేనే కాఫీ చేదుగా ఉంది
ఐ వంట్లో షుగర్ ఉంది అదేవేసుకొని త్రాగండి
అంటూ ఒకటే నవ్వులు ... నవ్వులే నవ్వులు .. కళ్ళంబడి నీళ్లు
--(()))--
ఆణి ముత్యాలు.
ఒక అతిథి మనింటికి వస్తున్నాడూ అంటే...
ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాం...
అలాంటిది భగవంతుడు మన మనసులోకి రావాలి అంటే...
మనం ఇంకెంత పవిత్రంగా ఉండాలి???
🙏 ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం...
సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది...
కానీ పోగొట్టుకోవడానికి ఒక్క సెకండు చాలు......
🙏 ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మీరు నిర్ణయించాలి అంటే...
అతను చేసిన గొప్ప పనుల్ని మీరు చూడవద్దు...
అతడు చేసే సర్వ సాధారణమైన పనుల్ని చూడండి....
🙏 బంధం బరువు కాకూడదు...
ప్రేమ విరక్తి అవ్వకూడదు...
మాటతో విసుగు పుట్టకూడదు...
ప్రవర్తనతో పరువు పోకూడదు...
🙏 నిమిషం మారవచ్చు...
గంటలు మారవచ్చు...
నెలలు మారవచ్చు...
సంవత్సరాలు మారవచ్చు...
కానీ మనం చేసిన మంచీ, చెడూ మారవు...
చెడు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది...
మంచి కాపాడుతూనే ఉంటుంది...
🙏 అర్థం చేసుకునే మనసు...
క్షమించే గుణం...
చేతులు కలిపే స్నేహం...
ఓదార్చే హృదయం...
ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు...
🙏 పిలిచే హృదయం కన్నా...
తలచే హృదయం గొప్పది.
పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది...
తలచే హృదయం లో అభిమానం ఉంటుంది...
🙏 ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా...
కర్మలను చేస్తారో...
వాళ్ళే నిజమైన సన్యాసిగా, యోగిగా మారుతారు.
సర్వేజనా సుఖినోభవంతుః...
సేకరణ. మానస సరోవరం
రామ రావణ యుద్ధం తర్వాత హనుమంతుడు సంజీవని మూలిక తెచ్చినందుకు తనకు టి.ఎ. బిల్లు ఇవ్వమని అకౌంట్స్ సెక్షను లో బిల్లు సబ్మిట్ చేశాడు. దానికి ఆడిటర్ మూడు కారణాలతో రిజక్ట్ చేశాడు.
1) హనుమంతుడు వెళ్ళేముందు అప్పుడు రాజు భరతుడి పర్మిషన్ లేదు.
2) హనుమంతుడు గ్రేడ్-2 ఆఫీసర్ అతను గాలిలో ప్రయాణించుటకు అనుమతిలేదు.
౩) సంజీవని మూలిక తెమ్మంటే సంజీవని పర్వతం తెచ్చాడు కనుక అనుమతి లేకుండా అదనపు లగేజి తెచ్చాడు కనుక టి.ఎ. ఇవ్వడానికి కుదరదు.
దీనికి హనుమంతుడు విచారించి రామున్ని వేడుకున్నాడు రాముడు అకౌంట్స్ సెక్షన్ ను పునపరీశిలించమన్నాడు.
హనుమంతుడు నారదుని సలహా మేరకు అకౌంటెంట్ కు టి.ఎ.బిల్లులో 20% కమీషన్ ఇస్తా అనగానే బిల్లును క్రింది కారణాలతో చెల్లించారు.
1) హనుమంతుడు వెళ్ళినప్పుడు భరతుడు రాజు అయినప్పటికీ రాముని చెప్పులు రాజ్యం ఏలుతున్నవి కావున రాముడే రాజు. కాబట్టి రాముని పర్మిషన్ ఉంది ఇవ్వవచ్చు.
2) అత్యవసర సమయంలో అధికారి అనుమతితో గ్రేడ్-2 ఉద్యోగి వాయు ప్రయాణం చేయవచ్చును.
౩) సంజీవని పర్వతం ఎక్స్ ట్రా లగేజి కాదు ఎందుకంటే హనుమంతునికి మూలిక తెలియక పొరపాటున వేరొకటి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళడం కన్నా ఒకేసారిలో పని పూర్తి అయింది.
ఈ వివరణతో హనుమంతుని బిల్లు పాసయ్యంది.
రాముడు షాక్స్...
అకౌంట్స్ డిపార్టుమెంటు రాక్స్...
హ్యాపి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్.....🤣🤣🤣🤣🤣
మీరెంటొ మీరె తెలుసుకొండి *సరదాగా*.. ..
(Just for fun)😊😊
1. ఎవరైతే profile pic ని స్థిరంగా ఉంచుతారో వారు శాంత స్వభావం కలవారు. 😊
2. ఎవరైతే చీటికి మాటికి profile. pic మారుస్తారో వారు చంచల మనస్తత్వం కలవారు. 🤗 😇
3. చిన్న పోస్టులు పెట్టుకున్న వారు చిన్నవాటికి కూడా సంతోషంగా ఉంటారు. 🤩
4. అస్తమానం దినచర్యని పోస్ట్ చేసే వాళ్లు కొద్దిగా పైత్యo కలవారు. 🤓
5. ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండేవాళ్లు పెద్ద మనసు కలవారు.💖
6. ఎప్పుడూ ఏ పోస్ట్ ని. like చెయ్యని వాళ్లు అహంకారం కలవారు. 🤥
లేదా ముటముటలాడుతూ ఉండేవారు. 😗
7. ప్రత్యేకమైన పోస్టులకు జవాబు ఇచ్చేవారు ఎదుటివారి భావనలు గౌరవించేవారు. మరియు సరదాగా వుండేవాళ్ళు. 🤝
8. ఇక్కడి పోస్టులు అక్కడికి, అక్కడి పోస్టులు ఇక్కడికి విసిరే వాళ్లు రాజనీతజ్ఞత కలవారు. 🧐
9. ఏదైనా పోస్టు చూడగానే వెంటనే open చేసేవాళ్లు restless గా ఉంటారు. 🙇 🙇
10. పాత పోస్టులు మళ్లీ మళ్లీ పెట్టేవాళ్లు. ఉద్దండులు లేదా విసిగించే వారు. 😜 🤤
11. ప్రక్క వారి పోస్టులకు ఇంకా response ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తన పోస్టులతో dominate చెయ్యాలని చూసేవారు కొద్దిగా. స్వార్థ స్వభావం కలవారు లేదా కీర్తికాంక్ష కలవారు. 😾 🤑
12. మెసేజ్ లు చదివి కూడా జవాబు చేసే అలవాటు లేని వారు సంకుచితమైన స్వభావం కలవారు. 😕 😏
13. ఎప్పుడూ ఏదీ షేర్ చెయ్యని వాళ్లు పిసినారులు. 👎
14. పెద్ద పెద్ద పోస్టులు మరియు వీడియోలు చూడని వాళ్లు చాలా బద్దకం కలవారు. 😴. 😞
15. చాలా groups లో తిరిగే వాళ్లు పేరు ప్రఖ్యాతులు ఆశించే వాళ్లు అయి ఉంటారు. 👑. 🎓
16. నొప్పించక,. తానొవ్వక facebook ను నేర్పుగా వాడేవారు యశశ్వులు. 🤫 👍
[05/04, 6:21 am] +91 94917 74979: *అల్ఫాహరం తిని పూజ చేయవచ్చా?*
భోజనం చేసిన తరువాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు.
మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది.
ఆదోషం స్నానం చేస్తే కాని పోదు.
ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు
శాస్త్ర ఆధారం (గౌతమ స్మృతి)
*దేవాలయాలలో ఎన్ని మార్లు ప్రదక్షిణ చేయాలి.*
దేవాలయములో ప్రదక్షిణ చేయునపుడు అమ్మవారి దేవాలయములో ఒకసారి
సూర్యుడి దేవాలయంలో ఏడుసార్లు
విష్ణువు దేవాలయంలో నాలుగు సార్లు
వినాయక దేవాలయంలో మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.
[05/04, 6:21 am] +91 94917 74979: *🌸ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు🌸*
'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’- ఈ శ్లోకం జగత్ ప్రసిద్ధం....
దీని అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) , కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలిసికుందాం...🛸
*🌸1) అయోధ్య:-*
అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.
*🌸2) మధుర:-*
మాధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.
*🌸3)మాయ:-*
దీనినే హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.
*🌸4)కాశీ:-*
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు.
*🌸5) కాంచీపురం:-*
దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తి స్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.
*🌸6)అవంతిక:-*
భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.
*🌸7) ద్వారవతి:-*
అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.
🙏🏻
*మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి*
🥀 1. అర్ధ దోషం
🥀 2. నిమిత్త దోషం
🥀 3. స్ధాన దోషం
🥀 4. గుణ దోషం
🥀 5. సంస్కార దోషం.
ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.
*అర్ధ దోషం*
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకవ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతోవున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతాచెప్పి, ఆడబ్బును తిరిగిచ్చేసాడు శిష్యుడిని "ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?" అని అడిగాడు. శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు". అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.
*నిమిత్త దోషం*
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు. ఆహారంమీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి.
భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధంముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచిమంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. "ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించి నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?"అని అనుకొన్నది.ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు, "అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను. నా స్వీయబుధ్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నాబుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను" అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.
*స్ధాన దోషం*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడినవంట కూడా పాడైపోతుంది. యుధ్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు. దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను"అని అన్నాడు. కనుక మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.
*గుణ దోషం*
మనం వండే ఆహారం సాత్వికఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.
*సంస్కారదోషం*
ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.
[04/04, 12:45 pm] +91 92904 61512: మనం 60 పడిలోని సిటిజన్లం.
*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
ఇక ఐశ్వర్యాలంటారా ..
• ఇంటి గడపలలో మనవరాళ్ళ గజ్జల
చప్పుడు, మనవళ్ళ ఆటల కేరింతలు "ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో
ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు
*ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు.
ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న
పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి
చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
• పెదాలు పండించే
నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే
ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం.
ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా
ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు
మన *ఐశ్వర్యం*.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం.
ఐశ్వర్యం*.
[04/04, 3:50 pm] +91 79955 81289: *ఇది చదవండి చాలా బాగుంటది good message*
మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ... ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!!
మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .
🌷 *1* . *తల్లి*
మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... 👩🦱తల్లి మొదటి అద్భుతం.
🌷 *2* . *తండ్రి*
మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు
మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు
దుఃఖాన్ని తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.
🌷 *3* . *తోడబుట్టిన* *వాళ్ళు*
మన తప్పులను వెనుకెసుకురావాడానికి...
మనతో పోట్లాడడానికి... మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు...
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺
🌷 *4* . *స్నేహితులు*
మన భావాలను పంచుకోడానికి..
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...
ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం. 🌚🌝👨✈️🕺
*🌷5* . *భార్య* / *భర్త*
ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది
కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే... ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది 🌜
భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం .
🌷 *6* . *పిల్లలు*
మనలో స్వార్థం మొదలవుతుంది..
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...
వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..
వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది..
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు... 🙏
పిల్లలు ఆరో అద్భుతం
అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?
🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు*
వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది..
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం
మళ్ళీ పసిపిల్లలం...🏃🏃♀️👩🔧👨💼👨🎓👩🎓 అయిపోతాం
వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀
🌹ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం...
కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి
చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.
అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ...🙏
No comments:
Post a Comment