ప్రాంజలి ప్రభ.. 29-04-2021
- ఆరోగ్యం - ఆధ్యాత్మికం - ఆనందం
సోయగములు -- (16 -18 )
మారుమాట వలదు ఎప్పుడూ
పేరు చెడును కదుర
చేరుకున్నవిలువ చెరపకు
మరచి చెడును బతుకు
అరిచి పెద్దగా చెప్పకు
అరుపు హాని కలుగు
ఆర్తనా దముతొ సోయగములు
ఆరునూర అయిన మరువకు
ఆర్తి విలువ తెలుపు
అర్పణతో పని కాదులే
దర్పమెపుడు వద్దు
కర్పూర వెలుగులా బతకాలి
భార మవ్వ వద్దు
బుద్ధిని బట్టి సోయగములు
కారణములు ఎన్ని ఉన్నాను
ఖర్చు అగుచు ఉండు
నోరు ఉన్నదిగదా అరిచినా
నరము వాపు పెరుగు
నారుపోసానీరు ఇమ్మంటె
నరుని బతుకు మారు
మారుమాటలతొ సోయగములు
--(())--
బ్రహ్మ జీవ తత్వ భావాలు...
సుఘందాలు పంచు పువ్వులు మాలలగును
మనోఫలకంపై అక్షర సాహిత్యం ముండును
కళ్ళు చూసిన చిత్రాలు నచ్చవచ్చును
మనసున చేరిన భావాలు నచ్చవచ్చును
చెప్పలేనట్టి ప్రకృతి అందాలు బాదుంచును
విప్పలేనట్టి మేధస్సు ఆలోచనలు మూసివేయును
మొక్కలు ఎండినా మరలా చిగురిస్తూ ఉండును
సాహిత్యం పాతధైన మల్ల చిగురిస్తూనేఉండును
రాయాలనుకుంటున్నాను నిత్యం ఆలోచనవుండును
మేధస్సు చెప్పింది తెలపాలనేది సత్యమే అగును
సర్వం మంగళకరంగా ఉండాలని ఆశ ఉండును
అందరికి చెపుతున్న తెలిసిన ధర్మమే ఇదియగును
ధర్మం ఆచరిస్తే అందరికీ సుఖమే కలుగును
అదే నేను కోరుకొనే నిత్య న్యాయ కవిత్వమగును
ఫలితం ఆశించకుండా కృషి దైవమగును
దైవం నీలోఉన్నాడు మరచిపోకు వ్రాయమనెను
ప్రేమించి పొందటానికి బతుకు ప్రేమగును
దేశ ప్రతిష్ట కోసం సహనంతో బతుకు కదులును
సర్వే జానా సుఖినోభవంతు - ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:
--(())--
తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా
మొగ్గలు
అత్యంత బలము వీరత్వం కలిగిన
స్వర్ణశోభితమైన దేహము కలవాడు
దృఢదేహుడు మారుతీ నందనుడు
దానవుని వనములన్ని దహించిన
సర్వోన్నత జ్ఞానము కలిగినవాడు
జ్ఞాన సంపన్నుడు ఆంజనేయుడు
సకల సద్గుణముల నిధి పెన్నిధియై
వానరులలోనే సర్వ శ్రేష్టమైనవాడు
దశరథ సుతుని ప్రియమైన భక్తుడు
సంద్రాన్ని గోడెక్కలా భావించి లంఘించి
రాక్షస మూకను దొమల్లా సంహరిస్తివి
రామాయణ మాలలో రత్నం హనుమ
రామకీర్తనలు వింటే భాష్ప నయనాలతో వచ్చి
రాక్షస సంహారకుడు మారుతి దీవెనలనిచ్చును
వాయుపుత్రుడు హనుమంతుడు భక్త రక్షకుడు
గురుచరణములకు మ్రొక్కి పాదధూళి ధరించితే
పురుషార్థములు పొంది రఘురాముని పొందెదరు
రామభక్త హనుమానుడు సకల శుభప్రదాయకుడు
నేను బుద్ధిహీనుడ నిన్నే స్మరించి నామం జపించి
కొలిచెదను బల బుద్ధి విద్యలను ప్రసాదించుము
క్లేశము మనోవికారములు తొలగించును మారుతి
*********
1
జ్ఞాన గుణములయందు సాగరుడై
ముల్లోకాలకు ప్రకాశమందించును
జ్ఞాన గుణ తేజో ప్రదాత కపీశుడు
2
పవనసుతుడు రామదూత అయి
అత్యంత బలం శక్తి కలిగినవాడు
బల సంపన్నుడు అంజనీపుత్రుడు
3
మహా వీరుడు పరాక్రమవంతుడై
దుర్బుద్ధి కుబుద్ధి తొలగించును
బుద్ధిమంతుల మిత్రుడు బజరంగీ
4
స్వర్ణ వర్ణుడై చెవులకుండలములతో
ఉంగరాల జుత్తుతో విరాజిల్లును
బంగరుమేనితో శోభిల్లువాడు మారుతి
5
ఒక చేతిలో వజ్రాయుధము కలిగి
జంధ్యం ధ్వజముతో విరాజిల్లును
చేతధ్వజం ధరించె వాయుపుత్రుడు
6
మహా తేజస్సు ప్రతాపములు కలిగి
ముల్లోకములందు పూజింపబడును
శంకరుని తనయుడు కేసరీపుత్రుడు
7
విద్యావంతుడు చతుర గుణవంతుడై
రామకార్యంను విజయవంతం చేసెను
అతి చతురుడు శ్రీరామునికి దాసుడు
8
శ్రీరామచరితని వినాలని ఆతృత కలిగి
సీతారామలక్ష్మణుల్ని హృదిలో నిలిపెను
ప్రభువును గుండెల్లో నిలిపె రామబంటు
9
సూక్ష్మ రూపం ధరించి సీతను దర్శించి
వికట రూపం ధరించి లంకను కాల్చెను
సీతనుకనుగొని లంకనుకాల్చె మారుతి
10
భీకరరూపం ధరించి అసురులనుచంపి
శ్రీరామచంద్రుని కార్యమును నెరవేర్చెను
రాక్షస మూకను అంతంచేసె కపీశుడు
11
మృతసంజీవనితెచ్చి లక్ష్మణునిబతికించి
రఘురాముడు హత్తుకుంటే సంతసించెను
సంజీవనికై గిరినెత్తుకొచ్చె మహాకాయుడు
12
రఘుపతి నిన్ను ఎంతో గొప్పగా పొగడి
భరతుని సమాన సోదరుడివని చెప్పెను
రాముని ప్రేమాభిమానం పొందె మారుతి
13
ముల్లోకాలు నీ కీర్తిని వేనోళ్లా పొగడునని
రాముడు నిన్ను గుండెలకు హత్తుకునెను
శ్రీరామునిచే కీర్తింపబడె హనుమంతుడు
14
బ్రహ్మ సనకాదులు నీ మహిమ కీర్తించగా
నారద శారద ఆదిశేషులు నిను పొగిడిరి
ముని దేవతల మెప్పును పొందె మారుతి
15
యముకుబేరులు అష్టదిక్పాలకులుగాని
కవి పండితులు నీ మహిమలు చెప్పలేరు
భువి దివిలో కీర్తింపబడును హనుమంతుడు
16
నీవు సుగ్రీవునికి మహోపకారము చేసి
రాముతో కలిపి అతనిని రాజుని చేస్తివి
స్నేహాన్ని కలిపి సాయముచేసె మారుతి
17
విభీషణుడు నీ మాట మంత్రంగా భావించి
లంకకు రాజయ్యెనని లోకానికి విదితము
నీ మాటే రామ బాణము వేద మంత్రము
18
సుదూరపు సూర్యుణ్ణి పండుగా భావించి
గగనానికి ఎగిరిపోయి దానిని మింగెను
నింగికి ఎగిరి సూర్యుణ్ణందుకునె మారుతి
19
రామనామము జపించి ముద్రిక చేగొని
సువిశాలమైన సాగరాన్ని లంఘించెను
ఆశ్చర్యమద్భుతం హనుమ కార్యాలు
20
జగతిలో దుర్భేద్య కష్టమైన పనులన్నీ
నీ అనుగ్రహమే వుంటే సులభమౌను
రామభక్తులకు అండ అంజనీసుతుడు
21
నీ ద్వారా మాకు రాముని దీవెనలంది
నీఆజ్ఞతోనే అతని దర్శనం లభించును
భక్తరక్షకుడు వాయుపుత్రుడు మారుతి
22
నీ శరణు వేడితే సుఖములన్నీ పొంది
భయములు తొలగి రక్షింపబడుతాము
భయభీతితొలగించి రక్షించును మారుతి
23
నీవు గర్జిస్తే ముల్లోకాలు వణుకగా
నీ తేజస్సుయే మమ్ము రక్షించును
లోకరక్షకుడు తేజోమూర్తి మారుతి
24
మహావీర హనుమాన్ నామం స్మరిస్తే
రాక్షస భూత పిశాచాలు దరిచేరవు
శిష్టజన రక్షణం మారుతీ నామము
25
వీరహనుమంతుని నామము జపిస్తే
రోగాలు కష్టనష్టాలన్ని తొలగిపోవును
సుఖములిచ్చును హనుమ నామము
26
మనస్సు కర్మలందు నిత్యం ధ్యానిస్తే
మారుతి సంకటములు తొలగించును
కష్టం హరించును హనుమద్ధ్యానము
27
తాపసులందరికి రాముడు ప్రభువై
వారి సకల కార్యాలు నెరవేర్చును
తాపసుల ప్రభువు హనుమంతుడు
28
భక్తుల మదిలోని కోరికలెరిగి తీర్చి
అర్చిస్తే జీవన ఫలాలనందించును
సేవిస్తే కోర్కెలు తీర్చును మారుతి
29
అన్ని యుగాలలో నీ మహిమచాటి
నీ వరసిద్ధితో జగతిని వెలిగించావు
సకల జగతికి వరప్రదాత మారుతి
30
సాధుసంతులు భక్తులను రక్షించి
అసుర దుష్టులను సంహరించెను
శిష్టరక్షకుడు రామభక్త హనుమాన్
31
అష్టసిద్ధులు నవనిధులు మాకిచ్చి
జానకీమాత దీవెనలందుకున్నావు
భక్తజన వరదాత ఆంజనేయుడు
32
రామనామమం రామరసం పొంది
రఘుపతికి సదా దాసుడవైతివి
రామనామరసం గ్రోలె రాంబంటు
33
నిన్నుభజిస్తే అది రాముడికేచెంది
జన్మజన్మ దుఃఖాలన్ని తొలగును
భజనతో సంతసించును మారుతి
34
రాముని భక్తితో తలచి భజించితే
మరణించి రామధామమే చేరును
శ్రీరాముడిని చేరును రామభక్తుడు
35
అన్యదేవతలను మదిలో తలచక
మారుతినికొలిచి సుఖంపొందుము
హనుమంతుడే సర్వసుఖ ప్రదాత
36
బలవీర హనుమంతుడిని స్మరిస్తే
పీడ సంకటములన్ని నశించును
సుఖం ప్రసాదించును మారుతి
37
గురుదేవునిలా కృప చూపించే
గోసాయిహనుమానుకి జయము
భజరంగ్ బలికి జయజయములు
38
వందసార్లు చాలీసా పఠించితే
బంధం తొలగి సుఖం పొందును
జన్మబంధం తొలగించును చాలీసా
39
ఈ హనుమాన్ చాలీసా చదివితే
ఈశ్వరుని సాక్షిగా సిద్ధిపొందును
అనునిత్యం పఠించాలి చాలీసా
40
తులసీదాస్ నిత్య రామ భక్తుడై
హృదయంలో నిలుపుకున్నాడు
రాముడే అతని హృదయనాథుడు
కష్టం సంకటములు తొలగించు మంగళమూర్తివై
రామలక్ష్మణసీతలతో నా హృదిలో వసించుము
పవనతనయా వాయునందనుడా హనుమంతా!
కే. పాండురంగ విఠల్
--(())--
బాహ్య
పూజకు ఏమున్నా లేకపోయినా పత్రం, పుష్పం ఫలం, తోయం ఉంటే చాలంటారు. ఈ అన్నీ
కాకపోయినా లేకపోయినా ఒక్కటైనా, ఒక్కటున్నా చాలనీ ఆర్యోక్తి. ఒక్క
ఉద్దరిణేడు జలంతో బోళాశంకరుడు సంతోషంతో తలమునకలైపోతాడు. ఒక్క తులసి పత్రంతో
అంతోటి శ్రీకృష్ణుడు పారిజాతపు రేకులా తూగిపోతాడు ఆనందంతో 'తేలి' పోతాడు.
అమ్మ స్తోత్రప్రియ, ఒక్క జపాపుష్పం సమర్పించి స్తోత్రం చేస్తే- సమస్తం దయ
చేస్తుంది. ఏ దేవుడికి ఫలాన్ని సమర్పించినా మన జీవితమే సఫలం అయిపోతుంది. ఈ
అన్నీ కలిసి ఉన్న అపురూప వస్తువొకటి మన దగ్గరుంది. అదే... మనసు మనసు ఓ
ఆకుపచ్చని పత్రం. సూర్యరశ్మి అనే భగవత్ స్పర్శతో పత్ర హరితాన్ని
సమకూర్చుకుంటుంది. మనసే ఓ పుష్పం. మానవత్వమనే మార్దవాన్ని, సౌమనస్యమనే
సౌకుమార్యాన్ని, శుభ్ర జీవనమనే సౌరభాన్ని సమకూర్చుకున్న మనసే ఓ పుష్పం. మనో
పుష్పం మనసు మధురఫలం కూడా. ఫలిత భక్తి పండిన మనసు అమృతఫలం. ఆర్ద్రత చెందే
మనసు మధుర రస ఓ స్వరూపం. అదే తోయం. తోయాన్ని చిందే మనసు. తోయాన్ని ఒలికే
మనసు. పత్రం, పుష్పం, ఫలం, తోయం... ఈ అన్నింటి సమాహారం, సమగ్ర స్వరూపం-
మనసు. ఒక్క మనసును అర్పిస్తే భగవంతునికి సమర్పించవలసినదంతా సమర్పించినట్లే.
అదే అమృత ధార, నైవేద్య క్షీర మనసునే ఎందుకర్పించాం? ఈ అన్వయాన్ని
శరీరానికో, ధనానికో, కీర్తికో కూడా చేసుకోవచ్చు కదా? కాదు. వద్దు ఆత్మ
అనేది ఇంద్రియాలకు, పంచకోశాలకు అందనిది. చెందనిది. ప్రాపంచిక ఉపకరణాలతో,
ఉపాయనాలతో పొందనిది. మనసు!? నిజమే. మనసు కూడా ఓ ఇంద్రియమే. పంచకోశాల్లోని ఓ
కోశమే. కానీ ఆత్మ వరకూఅన్వేషణ సాగిస్తూ 'నేతి నేతి' అంటూ ఇంద్రియాలనూ,
పంచకోశాలనూ పంచీకరణ చేస్తూ, అన్నింటినీ తిరస్కరిస్తూ వెళ్లాల్సి ఉంది.
తిరస్కరించేందుకు వస్తు వివేకం, వస్తు విభజన చేయాలంటే మనకు మనసు
"సహకరిస్తుంది. ఈ అన్నీ వదిలిపోయాక, అన్వేషణ కొంతమేర ఫలించాక మనసును
అమనస్కం చేయాల్సి ఉంది. కాలిలోని ముల్లును తీసిన మరో ముల్లును మనం
పారవేయవలసి ఉన్నట్లు. అయితే మరి... పత్రం, పుష్పం, ఫలం, తోయం... వీటి
అవసరమేమిటి? నిజమే. మనం మనోబుద్ధి స్థాయిలో ఉన్నంతవరకూ ఇంద్రియాకర్షక
వస్తువులనే భగవంతునికి అర్పించవలసి ఉంది- కాదు... అర్పిస్తాం. క్రమేణా
భగవంతుని అప్రమేయత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని గ్రహించే కొద్దీ ఆయనకు
ఏమి అర్పించాలో అర్థమవుతుంది. మనలోని, మన బయటి ఏ వస్తువులూ ఆ
అప్రమేయత్వాన్ని అందుకునేంత, దానికి అందించేంత పరిమాణంతో గానీ,
ప్రమాణంతోగానీ లేవు పరిమితమైన ఉపకరణాలతో పరికరాలతో అంతటి సర్వాంతర్యామికి
తగిన స్థాయిలో మనం ఏమీ సమర్పించలేం. ముఖ్యంగా బాహ్య వస్తుజాలాన్ని
ఏమర్పించినా భగవంతుడు దానికి శతాధికంగా తిరిగి మనకు అందజేస్తాడు. అదే మనసు
నర్పిస్తే మాత్రం దాన్ని లుప్తం చేస్తాడు. ఆత్మలో లయం చేస్తాడు. ఆత్మను
తెలియజేస్తాడు
మనసు అమనస్కమైతేనే ఆత్మ అర్థమవుతుంది. ఆత్మ భావన అనుభూతమవుతుంది.
అమనస్కం... మనసు లేకుండాపోవటం. ఎలా? నిరంతర ఆలోచనా ప్రవాహమే మనసు. ఆలోచనలను
అరికడితే, ఆపేస్తే- అదే అమనస్కం. ఇదెలా సాధ్యం! ఆలోచన లేకుండా జాగృతే
లేదుకదా!? ఆలోచనలను ఏకాగ్రపరచినప్పుడు, ఒకే విషయం మీద నిలిపినప్పుడు-
ఆలోచనలు (మనసు) ఏకోన్ముఖం
అవుతాయి. పరిపరి విధాల పాకులాట
ఆగిపోతుంది.
ఒకే చోట, ఒక బిందువు కేంద్రంగా ముడివడి సుడివడి- సుళ్లు తిరిగే నీటి
వెల్లువ సుడులు సుడులుగా తిరిగి తిరిగి లోలోపలికి లయమై
అంతర్జానమైపోయినట్లు..
ఆలోచనల ప్రవాహమూ ఒకేచోట కేంద్రీకృతమై అక్కడే తిరిగి తిరిగి క్రమంగా
లోపలికి జారిపోతూ అసలు అంతర ప్రవాహంతో మమేకమైపోతుంది. అంతా ఒకడే అయినప్పుడు
ప్రత్యేక ఉనికి, ఉపాధి, బాధ, వేదన, ద్వైతం, అన్యతా భావం.. ఏమీ ఉండవు. ఆ
అనంత సాగరపు, ఆ ఆత్మకాసారపు అణువణువులో, కణకణంలో తానూ
ఒకటిగా కలగలిసిపోతుంది. అదే అమనస్కం. ఇలాంటి స్థితిని పొందేందుకే యోగులు, ధ్యానులు, సాధకులు- మనసునే పరికరంగా సాధన చేసి, ఆ మనసునే సాగనంపుతారు పుట్టుక స్థానానికి పట్టుపట్టి అంపకం పెడతారు. ఈ ప్రక్రియకు దోహదపడే ఉద్దేశంతోనే కాబోలు- భగవంతుడు ఆ మనసునే కోరతాడు
No comments:
Post a Comment