🙏 ఉగాదికి శ్రీవారి ఆలయం ముస్తాబు 🙏
🌹తిరుమల, 2021 ఏప్రిల్ 12: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ ఫ్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం, పరిసరాలను ఫల పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు.
🌹టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 8 టన్నుల సాంప్రదాయ పువ్వులు మరియు 70 వేల కట్ ఫ్లవర్స్తో పుష్పాలంకరణలు చేపట్టారు.
🌹ఇందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన నైపుణ్యం గల కళాకారులు భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా అలంకరణలు చేశారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
: 🌻 మహా భారతం 🌻
🎈 భాగము 95 🎈
💧 భీముడిపై హిడింబ అనురక్తి 💧
🍃🌺లాక్షా గృహం నిలువునా దగ్ధమవుతోంది. ఫట్...ఫెడేళ్మని పేలిపోతోంది. కుప్ప కూలిపోతోంది. అన్నీ వినవస్తున్నాయి. అన్నదమ్ములనూ, తల్లిని గట్టిగా పట్టుకుని సొరంగ మార్గంలో పరుగుదీస్తున్నాడు భీముడు, ఆసరికే తమ నిర్గమన కుశల వార్త ఖనికునికి చేరవేశాడతను. కటిక చీకటిలో కొండలు, గుట్టలు, రాళ్ళు, ముళ్ళను అతిక్రమించి విద్యుద్వేగంతో ముందుకు దూసుకుపోతున్నాడు భీముడు.
🍃🌺తెల్లవారింది. వారణావత పౌరులంతా గుమిగూడి బూడిద పోగులయిన లక్షా గృహాన్నీ, ఆయుధాగారాన్ని ఆందోళనగా చూస్తూ కుంతి, పాండునందనుల మృత దేహాల కోసం అన్వేషించసాగారు. కాస్సేపటికి వారికి ఆరు మృత దేహాలు లభించాయి. వాటిని కుంతి, పాండునందనుల దేహాలనుకుని పరి పరి విధాల దుఃఖించారు.
🍃🌺నిజానికి అవి పురోచనుని గూఢచారిణి అయిన ఆటవిక స్త్రీ...ఆమె అయిదుగురు పుత్రుల మృత దేహాలు. ప్రజలంతా ఆ బాధలో ఉండగా అదే అదనుగా ఖనికుడు తాను ఏర్పరిచిన సొరంగ మార్గాన్ని పూడ్చేశాడు. జరిగిందంతా విదురునికి తెలియజేశాడు. పాండవులు తప్పించుకున్నారని తెలిసి విదురుడు ఆనందించాడు.
🍃🌺తర్వాత కుంతీదేవి, పాండు తనయులు వారణావత నగరంలో దుర్మరణం పాలయ్యారన్న వార్త ధృతరాష్ట్రునికి చెప్పలేక చెబుతున్నట్టుగా చెప్పి రోదించాడు విదురుడు. విన్నంతనే పెద్ద పెట్టున గొంతెత్తి ఆక్రోశించాడు ధృతరాష్ట్రుడు. గాంధారీ దేవికి తెలిసిందీ దుర్వార్త. ఆమె కూడా చాలా విచారించింది. భీష్మాది కురు వృద్ధులకి తెలిసింది. కుమిలిపోయారు వారు. దుర్యోధనాదులకు తెలిసింది. ‘పాపం పాండవులు’ అంటూ దుఃఖాన్ని నటించి చాటుగా నవ్వుకున్నారు.
🍃🌺ఇదిలా ఉండగా...సొరంగ మార్గం నుండి తప్పించుకున్న పాండవులు భాగీరథి నది దాటి దక్షిణాభిముఖులై ప్రయాణించి ప్రయాణించి రాత్రవడంతో ఓ వటవృక్షం కింద విశ్రమించారు. తల్లి కుంతి, నిద్రిస్తుంటే వారిని గమనిస్తూ కూర్చున్నాడు భీమసేనుడు. చేతులే తలగడలుగా చేసుకుని అన్నదమ్ములూ, తల్లి నిద్రిస్తుంటే ధృతరాష్ట్ర దుర్యోధనాదుల మీద ఎక్కడ లేని కోపం కలిగింది భీముడికి. పటపటా పళ్ళు కొరికాడతను.
🍃🌺అక్కడికి దగ్గరలోనే ఉంటున్న హిడింబాసురుడు పాండవేయులను పసిగట్టి ‘నరమాంసం తిని చాలా రోజులయింది’ అనుకుని పెదవులు చప్పరించి సహోదరి హిడంబను పిలిచాడు.‘‘చూశావా నరులను! బాగున్నారు. నరమాంసం తిని చాలా రోజులయింది. వెళ్ళి వారిని వధించి తీసుకునిరా! వండుకుని కమ్మగా తిందాం’’ అన్నాడు హిడింబాసురుడు.‘‘ఇట్టే తీసుకొస్తాను’’ అని అక్కణ్ణుంచి పరుగందుకుని, పాండు కుమారులు విశ్రమించిన చెట్టు చాటుకి చేరుకుంది హిడంబ. అక్కణ్ణుంచి భీమసేనుని చూసి వలపు తమకంతో నిశ్చేష్టురాలయింది. విశాల వక్షస్థలం...పెద్ద పెద్ద కళ్ళు...చెవులు...నరుడు మనోహరంగా ఉన్నాడనుకుంది.
🍃🌺ఇంతటి అందగాడు ఇంకొకడు ఈ భూ ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. సింహ మధ్యం వంటి నడుముతో...పొడుగాటి చేతులతో ఎంత చక్కగా ఉన్నాడు. హృదయేశ్వరుడంటే వీడే! వీని కౌగిలిలో ఒదిగిపోతేనే జీవితానికి అందం...ఆనందం. అన్న హిడింబాసురుని మాట విని ఈ నరులను సంహరిస్తే వచ్చేదేమీ లేదు. సంహరించక ఆ మహా బలశాలి చెంత చేరితే...అనగి పెనగి సుఖించవచ్చుననుకుని కామ రూపిణి అయిన ఆ సుందరి మరుక్షణంలోనే ఆకట్టుకునే నారీ స్వరూపం ధరించి సవిలాస మందగమనంతో అల్లనల్లన కదలివచ్చి భీమునికి సమీపంగా నిలిచింది.
🍃🌺గొంతెత్తి-‘‘అందగాడా! నువ్వెవరవు? నిద్రిస్తున్న ఆ మహా పురుషులు ఎవరు? వారితో పాటుగా నిద్రిస్తున్న ఆ మహితాత్మురాలు ఎవరు? అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు’’ అనడిగింది హిడింబ.‘‘ముందు నీ సంగతి చెప్పు! నువ్వెవరు’’ అడిగాడు భీముడు. నఖ శిఖపర్యంతం ఆమెను పరీక్షించసాగాడు.‘‘నా పేరు హిడంబ! ఈ సమస్త అరణ్యానికీ అధీశ్వరుడయిన హిడంబాసురుని చెల్లెల్ని’’ అందామె.
🍃🌺అసురుడనగానే అప్రమత్తమయ్యాడు భీముడు.‘‘నర మాంసం అంటే తెగ ఇష్టపడే మా అన్నయ్య మిమ్మల్నందరినీ వధించి తీసుకుని రమ్మన్నాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను’’ అంది మళ్ళీ. వధ అన్న మాట వినగానే ‘ఏయ్’ అంటూ అంతెత్తున లేచాడు భీముడు. పిడికిలి బిగించి హిడింబ మీదికి ఉరకబోయాడు.
🍃🌺‘‘ఆగు మనోహరా! ఆగాగు! సాంతం విను! అన్నయ్య మిమ్మల్ని వధించి తెమ్మన్నది నిజమే! కాని నిన్ను చూసిన మరుక్షణం నాలో ఆ దుర్బుద్ధి పోయింది. నీపై మరులుకొని వివశమై ఉన్నాను. ఈ జన్మకి నీవే నా ప్రాణేశ్వరుడవు. నా కోరిక మన్నించి నన్ను అనుగ్రహించాల్సిందిగా వేడుకుంటున్నాను’’ అంది హిడింబ.‘‘మా అన్న హిడింబాసురునికి నీవు భయపడనక్కర లేదు. నిన్ను నేను సంరక్షించుకోగలను.
🍃🌺చెప్పు సుందరా! ఏ కమనీయ రూపంలో నేను నీకు కావాలంటే ఆ రూపాన్ని సంతరించుకుని నీ ముచ్చట తీరుస్తాను’’ అంది మళ్ళీ. ఆ మాటలకు సన్నగా నవ్వి-‘‘పిచ్చిదానా! కన్నతల్లిని, అన్నదమ్ములను వదిలి నీలాంటి చపల కామిని వెంటబడి మదనోపభోగాలు అనుభవించడం ఉత్తమ పురుషుల లక్షణం కాదు! నేను నీతో రాను! రాలేను’’ అన్నాడు భీముడు.
🍃🌺‘‘వలచి వచ్చిన కన్యను కాదనడం భావ్యం కాదు సుందరా! ఆలోచించు’’ అర్ధించింది హిడింబ.‘‘మాటలు చాలించి వచ్చిన దారిన మరలిపో! లేకపోతే నీకే ప్రాణాపాయం’’ హెచ్చరించాడు భీముడు. అతని హెచ్చరికకు హిడింబ భయపడలేదు సరికదా జాలిగా భీముని చూస్తూ-‘‘నా ప్రాణాలకేంగాని మా అన్నయ్య రాక ముందే మీరిక్కణ్ణుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి! లేదంటే...నన్ను నమ్మితే నీ వాళ్ళను నిద్రలేపు! మిమ్మల్నందరినీ ఓ సురక్షిత ప్రాంతానికి చేరుస్తాను. లేకపోతే మీకే ప్రాణాపాయం’’ అన్నది హిడింబ.
🍃🌺ఆమె మాటలకు ఫక్కున నవ్వాడు భీముడు.‘‘నీకా భయం అక్కరలేదు. నేనుండగా నా వాళ్ళకు ప్రాణాపాయం కలిగే అవకాశమే లేదు. మీ అన్న హిడింబాసురుడే కాదు, సురాసుర సమూహాలు ఏకమై వచ్చినా చీల్చి చెండాడగల శూరుణ్ణి నేను. కావాలంటే మీ అన్నను పంపించి చూడు! ఆడుకుంటాను’’ అన్నాడు ఆమెతో....
🍃🌺నరులను వధించి తెస్తానని చెప్పి వెళ్ళిన చెల్లెలు ఎంతకీ రాకపోయేసరికి కీడెంచి మేలెంచిన హిడింబాసురుడు పళ్ళు పట పట కొరికి ఒక్కదుటన భీముణ్ణి సమీపించి, అతన్నే కోరగా కోరికగా చూస్తూ నిలుచున్న హిడింబను గమనించి-‘‘ఎవడే వీడు? వీణ్ణెందుకే అంత ఇదిగా చూస్తున్నావు? కామావేశంతో అన్న ఆకలి మాటే మరిచిపోయావంటే నిన్నేం చేసినా పాపం లేదే! నిన్ను...నీతో పాటు వీరందరినీ ఈ క్షణమే ఏం చేస్తానో చూడు! ఒక్కుమ్మడిగా అందరినీ సంహరించి నా ఆకలి తీర్చుకుంటాను’’ అంటూ చెల్లెలి జుట్టు పట్టుకో బోయాడు హిడింబాసురుడు.
🍃🌺తప్పించుకుని భీముని వెనుక నిలిచింది హిడింబ. ప్రాణ భిక్ష పెట్టమన్నట్టుగా అతన్ని చూసింది. ‘నీకేం పర్వాలేదన్నట్టుగా’ కళ్ళార్చి హి డింబకు అభయ ప్రదానం చేసి, ఆమె మీదికి వస్తోన్న హిడింబాసురుని ఒంటి చేత్తో పట్టి నిలిపాడు భీముడు.
🍃🌺భీముడిపై హిడింబ అనురక్తిలాక్షా గృహం నిలువునా దగ్ధమవుతోంది. ఫట్...ఫెడేళ్మని పేలిపోతోంది. కుప్ప కూలిపోతోంది. అన్నీ వినవస్తున్నాయి. అన్నదమ్ములనూ, తల్లిని గట్టిగా పట్టుకుని సొరంగ మార్గంలో పరుగుదీస్తున్నాడు భీముడు, ఆసరికే తమ నిర్గమన కుశల వార్త ఖనికునికి చేరవేశాడతను. కటిక చీకటిలో కొండలు, గుట్టలు, రాళ్ళు, ముళ్ళను అతిక్రమించి విద్యుద్వేగంతో ముందుకు దూసుకుపోతున్నాడు భీముడు.
🍃🌺తెల్లవారింది. వారణావత పౌరులంతా గుమిగూడి బూడిద పోగులయిన లక్షా గృహాన్నీ, ఆయుధాగారాన్ని ఆందోళనగా చూస్తూ కుంతి, పాండునందనుల మృత దేహాల కోసం అన్వేషించసాగారు. కాస్సేపటికి వారికి ఆరు మృత దేహాలు లభించాయి. వాటిని కుంతి, పాండునందనుల దేహాలనుకుని పరి పరి విధాల దుఃఖించారు. నిజానికి అవి పురోచనుని గూఢచారిణి అయిన ఆటవిక స్త్రీ...ఆమె అయిదుగురు పుత్రుల మృత దేహాలు. ప్రజలంతా ఆ బాధలో ఉండగా అదే అదనుగా ఖనికుడు తాను ఏర్పరిచిన సొరంగ మార్గాన్ని పూడ్చేశాడు.
🍃🌺జరిగిందంతా విదురునికి తెలియజేశాడు. పాండవులు తప్పించుకున్నారని తెలిసి విదురుడు ఆనందించాడు. తర్వాత కుంతీదేవి, పాండు తనయులు వారణావత నగరంలో దుర్మరణం పాలయ్యారన్న వార్త ధృతరాష్ట్రునికి చెప్పలేక చెబుతున్నట్టుగా చెప్పి రోదించాడు విదురుడు. విన్నంతనే పెద్ద పెట్టున గొంతెత్తి ఆక్రోశించాడు ధృతరాష్ట్రుడు.
🍃🌺గాంధారీ దేవికి తెలిసిం
దీ దుర్వార్త. ఆమె కూడా చాలా విచారించింది. భీష్మాది కురు వృద్ధులకి తెలిసింది. కుమిలిపోయారు వారు. దుర్యోధనాదులకు తెలిసింది. ‘పాపం పాండవులు’ అంటూ దుఃఖాన్ని నటించి చాటుగా నవ్వుకున్నారు. ఇదిలా ఉండగా...సొరంగ మార్గం నుండి తప్పించుకున్న పాండవులు భాగీరథి నది దాటి దక్షిణాభిముఖులై ప్రయాణించి ప్రయాణించి రాత్రవడంతో ఓ వటవృక్షం కింద విశ్రమించారు.
🍃🌺తల్లి కుంతి, ధర్మరాజాదులు నిద్రిస్తుంటే వారిని గమనిస్తూ కూర్చున్నాడు భీమసేనుడు. చేతులే తలగడలుగా చేసుకుని అన్నదమ్ములూ, తల్లి నిద్రిస్తుంటే ధృతరాష్ట్ర దుర్యోధనాదుల మీద ఎక్కడ లేని కోపం కలిగింది భీముడికి. పటపటా పళ్ళు కొరికాడతను. అక్కడికి దగ్గరలోనే ఉంటున్న హిడింబాసురుడు పాండవేయులను పసిగట్టి ‘నరమాంసం తిని చాలా రోజులయింది’ అనుకుని పెదవులు చప్పరించి సహోదరి హిడంబను పిలిచాడు.
🍃🌺‘‘చూశావా నరులను! బాగున్నారు. నరమాంసం తిని చాలా రోజులయింది. వెళ్ళి వారిని వధించి తీసుకునిరా! వండుకుని కమ్మగా తిందాం’’ అన్నాడు హిడింబాసురుడు.‘‘ఇట్టే తీసుకొస్తాను’’ అని అక్కణ్ణుంచి పరుగందుకుని, పాండు కుమారులు విశ్రమించిన చెట్టు చాటుకి చేరుకుంది హిడంబ. అక్కణ్ణుంచి భీమసేనుని చూసి వలపు తమకంతో నిశ్చేష్టురాలయింది. విశాల వక్షస్థలం...పెద్ద పెద్ద కళ్ళు...చెవులు...నరుడు మనోహరంగా ఉన్నాడనుకుంది.
🍃🌺ఇంతటి అందగాడు ఇంకొకడు ఈ భూ ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. సింహ మధ్యం వంటి నడుముతో...పొడుగాటి చేతులతో ఎంత చక్కగా ఉన్నాడు. హృదయేశ్వరుడంటే వీడే! వీని కౌగిలిలో ఒదిగిపోతేనే జీవితానికి అందం...ఆనందం. అన్న హిడింబాసురుని మాట విని ఈ నరులను సంహరిస్తే వచ్చేదేమీ లేదు.
🍃🌺సంహరించక ఆ మహా బలశాలి చెంత చేరితే...అనగి పెనగి సుఖించవచ్చుననుకుని కామ రూపిణి అయిన ఆ సుందరి మరుక్షణంలోనే ఆకట్టుకునే నారీ స్వరూపం ధరించి సవిలాస మందగమనంతో అల్లనల్లన కదలివచ్చి భీమునికి సమీపంగా నిలిచింది.గొంతెత్తి-‘‘అందగాడా! నువ్వెవరవు? నిద్రిస్తున్న ఆ మహా పురుషులు ఎవరు? వారితో పాటుగా నిద్రిస్తున్న ఆ మహితాత్మురాలు ఎవరు? అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు’’ అనడిగింది హిడింబ.
🍃🌺‘‘ముందు నీ సంగతి చెప్పు! నువ్వెవరు’’ అడిగాడు భీముడు. నఖ శిఖపర్యంతం ఆమెను పరీక్షించసాగాడు.‘‘నా పేరు హిడంబ! ఈ సమస్త అరణ్యానికీ అధీశ్వరుడయిన హిడంబాసురుని చెల్లెల్ని’’ అందామె. అసురుడనగానే అప్రమత్తమయ్యాడు భీముడు.‘‘నర మాంసం అంటే తెగ ఇష్టపడే మా అన్నయ్య మిమ్మల్నందరినీ వధించి తీసుకుని రమ్మన్నాడు.
🍃🌺అందుకే నేను ఇక్కడికి వచ్చాను’’ అంది మళ్ళీ. వధ అన్న మాట వినగానే ‘ఏయ్’ అంటూ అంతెత్తున లేచాడు భీముడు. పిడికిలి బిగించి హిడింబ మీదికి ఉరకబోయాడు.
🍃🌺‘‘ఆగు మనోహరా! ఆగాగు! సాంతం విను! అన్నయ్య మిమ్మల్ని వధించి తెమ్మన్నది నిజమే! కాని నిన్ను చూసిన మరుక్షణం నాలో ఆ దుర్బుద్ధి పోయింది. నీపై మరులుకొని వివశమై ఉన్నాను. ఈ జన్మకి నీవే నా ప్రాణేశ్వరుడవు. నా కోరిక మన్నించి నన్ను అనుగ్రహించాల్సిందిగా వేడుకుంటున్నాను’’ అంది హిడింబ.‘‘మా అన్న హిడింబాసురునికి నీవు భయపడనక్కర లేదు. నిన్ను నేను సంరక్షించుకోగలను.
🍃🌺చెప్పు సుందరా! ఏ కమనీయ రూపంలో నేను నీకు కావాలంటే ఆ రూపాన్ని సంతరించుకుని నీ ముచ్చట తీరుస్తాను’’ అంది మళ్ళీ. ఆ మాటలకు సన్నగా నవ్వి-‘‘పిచ్చిదానా! కన్నతల్లిని, అన్నదమ్ములను వదిలి నీలాంటి చపల కామిని వెంటబడి మదనోపభోగాలు అనుభవించడం ఉత్తమ పురుషుల లక్షణం కాదు! నేను నీతో రాను! రాలేను’’ అన్నాడు భీముడు.‘‘వలచి వచ్చిన కన్యను కాదనడం భావ్యం కాదు సుందరా! ఆలోచించు’’ అర్ధించింది హిడింబ.
🍃🌺‘‘మాటలు చాలించి వచ్చిన దారిన మరలిపో! లేకపోతే నీకే ప్రాణాపాయం’’ హెచ్చరించాడు భీముడు. అతని హెచ్చరికకు హిడింబ భయపడలేదు సరికదా జాలిగా భీముని చూస్తూ-‘‘నా ప్రాణాలకేంగాని మా అన్నయ్య రాక ముందే మీరిక్కణ్ణుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి! లేదంటే...నన్ను నమ్మితే నీ వాళ్ళను నిద్రలేపు! మిమ్మల్నందరినీ ఓ సురక్షిత ప్రాంతానికి చేరుస్తాను. లేకపోతే మీకే ప్రాణాపాయం’’ అన్నది హిడింబ.
🍃🌺ఆమె మాటలకు ఫక్కున నవ్వాడు భీముడు.‘‘నీకా భయం అక్కరలేదు. నేనుండగా నా వాళ్ళకు ప్రాణాపాయం కలిగే అవకాశమే లేదు. మీ అన్న హిడింబాసురుడే కాదు, సురాసుర సమూహాలు ఏకమై వచ్చినా చీల్చి చెండాడగల శూరుణ్ణి నేను. కావాలంటే మీ అన్నను పంపించి చూడు! ఆడుకుంటాను’’ అన్నాడు ఆమెతో.
🍃🌺నరులను వధించి తెస్తానని చెప్పి వెళ్ళిన చెల్లెలు ఎంతకీ రాకపోయేసరికి కీడెంచి మేలెంచిన హిడింబాసురుడు పళ్ళు పట పట కొరికి ఒక్కదుటన భీముణ్ణి సమీపించి, అతన్నే కోరగా కోరికగా చూస్తూ నిలుచున్న హిడింబను గమనించి-‘‘ఎవడే వీడు? వీణ్ణెందుకే అంత ఇదిగా చూస్తున్నావు? కామావేశంతో అన్న ఆకలి మాటే మరిచిపోయావంటే నిన్నేం చేసినా పాపం లేదే! నిన్ను...నీతో పాటు వీరందరినీ ఈ క్షణమే ఏం చేస్తానో చూడు! ఒక్కుమ్మడిగా అందరినీ సంహరించి నా ఆకలి తీర్చుకుంటాను’’ అంటూ చెల్లెలి జుట్టు పట్టుకో బోయాడు హిడింబాసురుడు.
🍃🌺తప్పించుకుని భీముని వెనుక నిలిచింది హిడింబ. ప్రాణ భిక్ష పెట్టమన్నట్టుగా అతన్ని చూసింది. ‘నీకేం పర్వాలేదన్నట్టుగా’ కళ్ళార్చి హి డింబకు అభయ ప్రదానం చేసి, ఆమె మీదికి వస్తోన్న హిడింబాసురుని ఒంటి చేత్తో పట్టి నిలిపాడు భీముడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:08 am, 14/04/2021] +91 94414 08564: 🌻 ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు 🌻
🍃🌺'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’- ఈ శ్లోకం జగత్ ప్రసిద్ధం....
🍃🌺దీని అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) , కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలిసికుందాం...
🍃🌺 1) అయోధ్య:-
అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.
🍃🌺 2) మధుర:-
మాధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.
🍃🌺 3)మాయ:-
దీనినే హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే మ…
[7:09 am, 14/04/2021] +91 94414 08564: 🌻 దానధర్మాలు 🌻
🍃🌺లోకంలో ఎన్నడూ స్థిరంగా ఉండనివి కొన్ని ఉన్నాయి. ఏనుగు చెవులు, రావి ఆకులు, సముద్రపు అలలూ... అలాంటివే! వాటన్నింటినీ మించి అస్థిరమైనది- ధనం! డబ్బు అంతటి నిలకడ లేనిది మరొకటి లేదు. సంపదకు ప్రతీక ‘లక్ష్మి’. లక్ష్మీదేవికి ‘చంచల’ అని పేరు. అది ఎక్కడ దాచినా దాగదు. దొంగలపాలు కావచ్చు. అగ్నికి ఆహుతి కావచ్చు. తుదకు రాజే ప్రజోపయోగార్థం లాక్కోవచ్చు.
🍃🌺‘న్యాయార్జిత విత్తం’ కొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం. అధర్మ సంపాదన ఓటికుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు.
🍃🌺వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి ఏం చెప్పాడు?
‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే!...
🍃🌺వాళ్లంతా సిరి మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ల పేరైనా మిగిలి ఉందా? కానీ మహా త్యాగమూర్తులైన శిబి చక్రవర్తి వంటివారిని మాత్రం మరచిపోలేదు గదా’ అని గురువుక…
[7:11 am, 14/04/2021] +91 94414 08564: 🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 39 🙏
🍃🌹లేనివానిని అడిగితే వచ్చే ప్రయోజనం ఈ పద్యం వివరించింది
ఉ.మంటిది ముంతలేక బ్రతిమాలుచు కొంగులుగట్టిముష్టి కిం టింటికి బోవువానినొక యిత్తడిపాత్రనుఁ గోర దెచ్చునే వంటయెచేయలేదనిన వానిని భోజనమొక్క ముద్దయే వెంటనె బెట్టిపంపుమని వేడినయట్టులె వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! అతను ఏమీలేని ముష్టివాడు. వానికి యాచించుటకు చివరకు మట్టిముంత కూడ లేక కట్టుకున్న కొంగు గుడ్డలో ముష్టిని పెట్టుకుంటున్న అభాగ్యుడతడు.
🍃🌹అతనిని యిత్తడి పాత్రను ఇవ్వమని యాచిస్తే అతడు దానిని యివ్వగలడా. ఎటువంటి పరిస్థితులలో వాడిచ్చుట జరుగదు. అతనిని ఆలా కోరడం ఎలా వుంటుందంటే.
🍃🌹నేను అసలు ఈ రోజు వంట చేయలేదయ్యా అని అనేవాడి వద్దకు వెళ్ళి ఒక ముద్ద భోజనం వెంటనే పెట్టి పంపుమని వేడుకొంటే ఎలావుంటుందో అలాగ వుంటుంది. కాబట్టి లేనివానిని అడిగితే ప్రయోజనం శూన్యం.
🙏🙏🙏…
[7:12 am, 14/04/2021] +91 94414 08564: 🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 9 🎈
🌻 అంతఃపురం 🌻
🍃🌺సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం వుండే అంతఃపుర భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు వున్న ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు కల ఏనుగులు రక్షణ కార్యంలో వున్నాయి. ఆయుధ పాణులయిన యోధులు అప్రమత్తంగా తిరుగుతున్నారు. మకర, తిమింగల, మహాసర్ప సమృద్ధమయిన సాగరంలా ఉన్నదది. యమ, వరుణ, కుబేర, దేవేంద్ర భవనాలను అధఃకరిస్తున్నది.
🍃🌺రావణుని భార్యలందరూ అక్కడ వున్నారు. ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీజనం కూడా ఆ భవనంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
🍃🌺విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షేశుడయిన కుబేరుడు తీవ్ర తపస్సుచేసి బ్రహ్మను సంతుష్టుని చేసి' విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని ఓడించి రావణుడు దీనిని సాధించాడు.
🍃🌺మేరు మందర గిరిశిఖర సదృశమయిన గోపుర సమూహాలతో అలరారుతోంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు. స్ఫటికమణులతో రూపొందించిన గవాక్షాలు. పగడాలు, మణులు, ముత్యాలతో నిండి అక్కడి నేల అంతా కాంతు లీనుతున్నది. రక్త చందనాలేపనంతో లేతసూర్య కాంతితో వెలుగుతోంది, రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. ఆప్త బంధువుకి విందుకోసం చేసినట్లున్నాయి.
🍃🌺ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది.గ్రామ, నగర, సౌధ చిత్రా లలంకరించిన తివాసీ పరచి ఉంది.
🍃🌺ఆ భవనంలో తెల్లని రాజహంసలవలె అగరు ధూమం వ్యాపించి శోభావహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది.
🍃🌺చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలా ఉంది. అక్కడి బంగారు దీపకళికలను తదేకంగా చూశాడు.చూసి లోపలకు సాగుతున్నాడు హనుమంతుడు.
🍃🌺రంగు రంగుల చీరలతో వివిధ విధాలయిన ఆభరణాలతో అలరారే నారీమణులు అర్థరాత్రివరకూ ఆసవాలు సేవించి, నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో వున్న సరోవరంలా వున్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన పద్మాలమీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖపద్మాలచుట్టూ భ్రమిస్తాయి.
🍃🌺తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకుని నేలకు జారిన తారాగణాల వలె వున్నారువారు.సడలిన కేశబంధాలు, చెదరిన అంగ భూషణాలు, జారిన పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటకు కరగిన తిలకాలు. పాన వ్యాయామ సమయంలో తెగిన ముత్తెపుసరులు.
🍃🌺జారిన వసనాలు, పట్టు సడలిన వడ్డాణాలు, తెగిపోయి ఊడి పడి పగిలిన కుండలాలు.
🍃🌺ఏనుగులు నలగ తొక్కిన లతామతల్లులవలె ఉన్నారు. చంద్రకిరణ శోభ లీనే ముత్యాలహారాల కిరివంకలా ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలు గోచరించాయి.
🍃🌺వారి అలంకారాలలో వైడూర్యమణులు రాజహంసలవలె, బంగారు హారాలు చక్రవాకాలవలె కనిపిస్తూంటే, హంసలూ చక్రవాకాలూ విహరించే నదులవలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి.
🍃🌺వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత కమలాలుగా, శృంగారక్రియలే మకరాలుగా, తనుద్యుతులే తటాలుగా వారందరూ నదీ దేవతల్లా వున్నారు.
🍃🌺కొందరి చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ భ్రమ గొలుపుతోంది. కొందరి నిట్టూర్పులకే వారి చేలాంచలాలు ముఖంమీద ఆడుతున్నాయి. అవి రంగు రంగుల పతాకాలవలె ఉన్నాయి.
🍃🌺ఆ గాలిసోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి. ఆ మహిళల కాంతిగంధానికి తోడు మధుపానగంధం కలిసివచ్చే వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి.
🍃🌺మద్యపాన వివశలయిన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూంటే, ఆ సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు.
🍃🌺మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపధానాలుగా కొందరు, ఎదుటి ఆమె వక్షస్థలం మీద తలవుంచి ఒకతే, దాని ఒడిలో తలపెట్టి యింకొకతె, తొడలమీద, పిరుదులమీద అలా ఒకరికి తెలియని మైకంలో ఒకరు హాయిగా నిద్రిముద్రలో వున్నారు. ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు.
🍃🌺తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలె వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నవారు నారీమణిహారంలా ఉన్నారు.
🍃🌺వసంత వాయువుకు కదలియాడే లతలు, పూవులు, ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరి నొకరి బంధించుకున్నారు.
🍃🌺ఎవరి అవయవాలు ఏవో, ఎవరి అలంకారాలు ఏవో, ఎవరి కేశాలంకారం యేదో తెలియకుండా ఉంది. బంగారు దీపాలవలె వున్నారు.
🍃🌺ఇందరినీ రావణుడు తన పరాక్రమంతోనే తెచ్చాడు. కొందరు మాత్రం రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితులనెవరినీ తీసికొని రాలేదు. ఇతరుల యందు అనురాగం వున్న ఆడదాన్నీ తేలేదు.
🍃🌺వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. అందరినీ చూస్తూ హనుమంతుడు అనుకున్నాడు.
🍃🌺వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీ దేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థమయేది. ఎంతటివాడయినా సీతాపహరణంతో తుచ్చుడయాడు రావణుడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[7:37 am, 14/04/2021] +91 94414 08564: 🌻 బుధవారం గరుడుని - పూజిస్తే నాగదోషం పోతుందని చెబుతున్నారు పండితులు... 🌻
🍃🌺బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
గరుడాళ్వార్ నారాయణ స్వామికి వాహనధారుడు, గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి.
అందుకే బుధవారం పూట గరుడాళ్వార్ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఆలయంలోనే కాకుండా... ఇంట్లోనూ రోజూ గరుడాళ్వార్ను తలచి పూజ చేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి...
🍃🌺చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి, వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది, సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి, తర్వాతే స్వామిని దర్శించుకోవాలి.
🍃🌺ఇది వైష్ణవ ఆగమ పద్ధతి, ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు...
🌻 గరుడాళ్వార్ దర్శనం: 🌻
🍃🌺ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి.
సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం,
మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది,
బుధవారం శత్రుభయం వుండదు...ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి,
శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది,
శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది...
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
[6:58 pm, 14/04/2021] +91 94414 08564: 🌻 మహా భారతం 🌻
🎈 భాగము 96 🎈
💧 భీమ హిడింబాసురుల సంగ్రామం 💧
🍃🌺చెల్లెలి మీదవిరుచుకుపడబోతున్న హిడింబాసురుని అడ్డగించి-‘‘ఆగాగు! ఏమన్నావు ఏమన్నావు? నీ చెల్లెలుతో పాటు మా అందర్నీ ఒక్కుమ్మడిగా తింటావా! రా మరి’’ అంటూ కుడి చేతి పిడికిలి బిగించి, దాన్ని ముద్దిడి, తర్వాత అదే పిడికిలితో హిడింబాసురుని ముఖం మీద గట్టిగా ఒక్కటిచ్చాడు భీముడు. ఆ దెబ్బకి హిడింబాసురుడికి ఏదీ కనిపించలేదు. అంతా చీకటి మయం అనిపించింది.
🍃🌺‘‘రాక్షసి అయినా స్త్రీ కాబట్టి ఈ హిడింబ మీద ఈగను కూడా నేను వాలనివ్వను. మాకు స్త్రీలంటే చాలా గౌరవం’’ అంటూ హిడింబాసురుని మళ్ళీ కొట్టాడు భీముడు.‘‘ఏది పడితే అది తిని బాగా బలిశావు. నీలాంటి వాణ్ణి చంపి మృగాలకు ఆహారంగా వేస్తే సంతోషిస్తాయవి’’ అంటూ మళ్ళీ భీముడు కొట్టబోయేంతలో ఆసరికి తేరుకున్న హిడింబాసురుడు, అతన్ని గట్టిగా ఎదుర్కొన్నాడు. భీముడి రెండు చేతుల్నీ విర…
[6:59 pm, 14/04/2021] +91 94414 08564: 🌺 తాళపత్రం 🌺
🥀 96 వ రోజు 🥀
🌻 నక్కకూత చెడు శకునమా? 🌻
🍃🌹నక్కకూత చెడు వార్తలను తెస్తుందని భారతీయులు విశ్వసించేవారు. నక్కకు మన కంటికి కనిపించని దయ్యాలు మరియు యక్ష కిన్నరాది దేవతలను చూడగల శక్తి ఉంది అని చెబుతారు.
🍃🌹మన పూర్వులు అరణ్య ప్రాంతాలకు మరియు చిట్టడవులకు సమీపంలో నివసించేవారు. కావున ఈ విశ్వాసం ప్రబలడానికి అవకాశమేర్పడింది.
🍃🌹జంతువులు ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా సంభోగేచ్చ కలిగి తోడును కోరినప్పుడు కూతలు వేస్తాయి. నక్కలు సహజంగా భయపడినప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు కూతలు వేస్తాయి. తోడు తన సమక్షంలో ఉన్నప్పుడు కూడా అవి కూతలు వేయడం కద్దు. కొన్ని సార్లు సంబోగం వల్ల గాని కడుపు నిండా తిన్న సంతృప్తి వల్ల కానీ నక్కలు కూతలు వేస్తాయి.
🍃🌹ఇలాంటి సమయంలో అవి క్రూరంగా ఉండి దాడి చేయడానికి అవకాశముంది.
🍃🌹కావున పెద్దలు పిల్లలను భయపెట్టి అదుపు చేయడానికి నక్కలు దయ్యాలను లేక యక్ష కిన్నరాది అతీంద్రియ శక్తులను చూసి కూత పెడుతున్నాయని చెప్పి వారిని ఇంటి నుండి బయటకు వెళ్ళనీయకుండా చేసి వారిని ప్రమాదం నుండి కాపాడేవారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:02 pm, 14/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 🌀
🌹 96. సర్వేశ్వరః 🌹
🌺 ఓం సర్వేశ్వరాయ నమః 🌺
సర్వేషాం (ఈశ్వరాణాం) ఈశ్వరః ఈశ్వరులగు ఎల్లవారికిని ఈశ్వరుడు.
:: మాండూక్యోపనిషత్ ::
ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోఽన్తర్యామ్యేష
యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ॥ 6 ॥
🍃🌹ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే సర్వజ్ఞుడు, ఇతడే అంతర్యామి, ఇతడే అంతటికీ కారణము. ఇతడే సమస్త భూతముల యొక్క ఉత్పత్తిలయాలకు స్థానము.
🙏
🌻 రేపు మత్స్య జయంతి 🌻
🍃🌺ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు. మత్స్య జయంతి చైత్ర బహుళ తదియ నాడు జరుగుతుంది.
🍃🌺బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’ అని అంటారు.
🌻 మత్స్యావతారం అసలు కథ 🌻
🍃🌺వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని న…
🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 10 🎈
🌻 పట్టమహిషి : శయనాగారం 🌻
🍃🌺సాగి సాగి హనుమంతుడు ఏనుగు దంతాలతో, పదారు వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక, వైడూర్య, రత్నాలతో అలంకృతమయిన శయ్యను చూశాడు. ఒకవంక చంద్రకాంతితో తెల్లని గొడుగు. మరొక వంక సూర్యకాంతితో, అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం. శయ్యమీద అజిన చర్మం.
🍃🌺అగరు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు. తెల్లని వింజామరలతో అందగత్తెలు.
🍃🌺ఆ శయ్యమీద మేఘసన్నిభుడైన మహావీరుని చూశాడు. పొడుగాటి బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు, చీనాంబరం, శరీరమంతా మంచిగంధపుపూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపు కాంతుల మేఘంలా వున్నాడు.
🍃🌺లతా, తరుశోభితమయిన మందరగిరిలా ఉన్నాడు. హాయిగా మధుపానం చేసి, మదవతీ పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాడు.
🍃🌺కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు. బుస కొడుతున్న కోడెత్రాచులా వున్నాడు. ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి, మరొక వేదిక మీదకు నడిచి చూశాడు.మత్తేభం అధివసించిన ప్రస్రవణగిరిలా ఉంది, రావణుడు నిద్రిస్తున్న ఆ శయ్య ఇంద్ర ధనుస్సులా వున్నాయి వాని బాహువులు.
🍃🌺దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు, వయుధాన్ని ఢీకొని గట్టి బొప్పికట్టి వున్నాయి. విష్ణుచక్రపు రాపిడికూడా అనుభవించాయి.
🍃🌺చక్కగా, బలిసి, మంచి కణుపులతో, సర్వలక్షణ లక్షితములై అలరారుతున్న గోళ్ళతో, వ్రేళ్ళతో ఆ బాహువులు అయిదు పడగలపాములా ఉన్నాయి. వాటికి మంచిగంధపు పూతలున్నాయి. మందరగిరిమీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తున్న మహాసర్పాలవలె వున్నాయి.
🍃🌺అంతటా సురపొన్న సౌరభం, పొగడపూల పరిమళం. మధుర మదిరాగంధం - అది అంతా ఆ రావణుని నిశ్వాసవాయువే.మణి, రత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులీనే కుండలాలు.రక్త చందనాల కృతం, మణిహార భూషితం అయిన విశాల వక్షస్థలం పసుపురంగు పంచె, తెల్లని ఉత్తరీయం.చూస్తున్నాడు హనుమంతుడు.
🍃🌺గంగానది ఒడ్డున విశ్రమించే ఏనుగులా వున్నాడు. మినుముల రాశిలా ఉన్నాడు. నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు.
🍃🌺ఆ రాక్ష సేంద్రుని పాద సమీపంలో కొందరు భార్యలు. వారు చంద్రవదనలు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంగల వనితలు కొందరు ఆయన కటి ప్రాంతంలోనూ, భుజసీమ దగ్గరావున్నారు. వారందరితో గృహం తారాశోభితమయిన ఆకాశంవలె ఉన్నది.
🍃🌺అలసి, అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట, కొందరు. ఒకతె నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది.నదిలో తరంగాలతో కదలిపోయి నావ చాటున చేరిన కమలం వలె. ఒక కమలముఖి వీణను కౌగలించుకుని ఉంది.
🍃🌺పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక మదవతి.చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాద్యాన్ని చుట్టుకుని పడుకుంది.
🍃🌺ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది.
🍃🌺మరొకతె మద్దెల నానుకుని నిద్రించింది. భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకతే కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది, భేరీ వాద్యాలింగనంతో, ఒకతె వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్న దొక పూబోణి పగలకొట్టిన కుండనీటిలో తడిసి.సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రౌఢ ఒకతె ఒక చంద్రానన మరొక సుశ్రోణిని కౌగలించుకుని పరవశంతో నిద్రిస్తున్నది.
🍃🌺కామ తీవ్రతగల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీ వాద్యాలను ఆలింగనం చేసుకున్నారు.
🍃🌺ఆ రమణీయ రమణీగణంలో అందరికంటె విశిష్టంగా, అత్యంత సౌందర్యంతో, మణి రత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా, సువర్ణకాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఈమెయే అనుకున్నాడు.
🍃🌺అనుకున్న క్షణంలో ఆయన కపి ప్రకృతి విజృంభించింది. తోక నేలకు కొట్టాడు. తోకను ముద్దు పెట్టుకున్నాడు.
🍃🌺గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు.
ఇది 9, 10 సర్గలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JXtwBspDRRF98sXzHkjgka
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 15.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
అవినీతికి పాల్పడేవారికి చివరకు మిగిలేది ఆవేదనా.... అవమానాలే
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించినదట ఇదేమి విచిత్రమో! నిజంగా చిత్రమే! మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎదుటి వారి లోపాలను చూస్తాడు!!
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
🌺 తాళపత్రం 🌺
🥀 95 వ రోజు 🥀
🌻 ఆవు పేడపై కాలు పడితే తీపి భక్ష్యాలు లభిస్తాయనడంలోని అంతరార్థమేమి? 🌻
🍃🌹భారతీయ రైతుల్లో ఈ విశ్వాసం ప్రబలిఉంది. ఆవుపేడ సహజమైన ఎరువు. దాన్ని విస్తృతంగా వ్యవసాయానికి వాడడం జరుగుతుంది. అయితే ఆవుపేడను తాకకుండా ఓ రైతు తన పనులు నిర్వహించలేడు.
🍃🌹ఒక రైతు పొలంలో బాగా పని చేస్తే, మంచి ఫలితము లిఖిస్తుందని ఈ మాటలో ఉన్న ఆంతర్యం. కష్టించి పనిచేసిన రైతుకు మంచి పంట లభిస్తుంది. మన మందరం మన నిత్య అవసరాలకై మరియు ఆహారానికి పని చేస్తాము.
🍃🌹మనం న్యాయ పూరితంగా ఆర్జించిన ధనం దానితో కొన్న ఆహారం తీపి భక్ష్యాలంతటి రుచికరంగా ఉంటాయి.
🍃🌹కావున ఈ పై నానుడి కష్టించి పని చేయడాన్ని ఆదర్శంగా సూచిస్తుంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 🌀
🌹 95. అజః 🌹
🌺 ఓం అజాయ నమః 🌺
న జాయతే ఇతి జనించువాడు కాదు. ఇందు 'న జాతో న జనిష్యతే' (ఋగ్వేదము 1.81.5) - 'ఇతః పూర్వము జనించలేదు; ఇకముందు జనించబోవువాడు కాదు' అను శ్రుతి ఇచట ప్రమాణము.
:: భగవద్గీత - జ్ఞాన యోగము ::
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥ 6 ॥
🍃🌹నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముగలవాడను, సమస్తప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపఱచుకొని నా మాయాశక్తిచేత పుట్టుచున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 36 (నిజనేత్ర దర్శనం) 🎈
"కంటి నఖిలాండతతి కర్తనధికుని గంటి -
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి...."
🍃🌹అంటూ, అన్నమయ్య కీర్తించిన, మహా మహిమాన్వితమైన శ్రీవారి నిజనేత్ర శోభను దర్శించడం పూర్వ జన్మ సుకృతం.
🍃🌹ప్రతి గురువారం జరిగే నిజనేత్రదర్శనోత్సవం లో స్వామివారు సన్నటి నామాలతో, విప్పారిన నేత్రాలతో, ఆభరణాలు లేకుండా, కేవలం ధోవతి - పైపల్లెవాటుతో, మెడలో రెండు కంటెలతో, బుగ్గన పచ్చకర్పూరపు దిష్టిచుక్కతో, సొగసైన తలగుడ్డతో, నిరాడంబరంగా ఉంటారు.
🍃🌹నల్లని మేనుతో మెరిసి పోతూ, ద్వాపరం నాటి ఆ నల్లనయ్యే కలియుగంలో ఈ శ్రీనివాసునిగా ఉద్భవించాడనే జగద్విదితమైన సత్యాన్ని దృఢపరుస్తారు. అందువల్లనే కొందరు నిజనేత్ర దర్శనాన్ని 'గోపాలుని దర్శనం" అని కూడా అంటారు.
🍃🌹గోమాతతో అనుబంధం, గొల్లల సాన్నిహిత్యం, పాలు-పెరుగుల సేవనం - ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే, ఆ నల్లనయ్యే ఈ చక్కనయ్య అనే నమ్మకం మరింత బలపడట్లేదూ? నిజనేత్ర దర్శనానికి సంబంధించి ఓ ఆసక్తి కరమైన అంశం స్థానికంగా వెలుగులో ఉంది.
🍃🌹తిరుమలలో ఉన్నటువంటి సిబ్బంది, వ్యాపారులు - అందరూ, గురువారం నాడు మరింత జాగ్రత్తగా, ఏ విధమైన పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతారట. ఎందుకంటే, స్వామివారు సన్నటి నామాల కారణంగా వికసిత నేత్రాలతో ఉండడం వల్ల, ఏ తప్పు జరిగినా వెంటనే గమనిస్తారని వారి నమ్మకం.
🍃🌹మిగతా రోజుల్లో అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్నంత మాత్రాన ఆ సర్వాంతర్యామికి, సహస్రనేత్రుడికీ – మనం చేసే తప్పొప్పులు కనబడటం లేదనుకోవడం కేవలం అజ్ఞానం!
🌻 పూలంగి సేవ 🌻
పూలంగి సేవకే పూలెన్నొ తెచ్చేము!
మా భక్తి సీమలో పూమాల లల్లేము!"
🍃🌹పూలంగి అంటే పువ్వుల అంగీ. అనగా పుష్పాలనే వస్త్రాలు గా ధరించడం. గురువారం నాడు జరిగే మరో సేవ పూలంగి సేవ.
🍃🌹రాత్రి 8 గం. లకు జరిగే ఈ సేవ పూర్తిగా ఏకాంతం. జియ్యంగార్లు అందించే పూలమాలలను అర్చకులు శ్రీవారిమూర్తికి వస్త్ర రూపంగా, ఉత్తరీయ రూపంగా, ఆభరణ రూపంగా, కిరీట-శంఖు-చక్రాల రూపంగా, మొత్తం పుష్పమయంగా,శోభాయమానంగా అలంకరిస్తారు.
🍃🌹స్వామి వారు పూల అంగీని తొడిగినట్లుగా, కోటి రెట్ల సౌందర్యంతో, నవ మన్మథునిలా కను విందు చేస్తారు. వైష్ణవాలయాలను పుష్పమండపం, జ్ఞానమండపం, త్యాగమండపాలు గా వర్గీకరిస్తారు. తిరుమల పుష్పమండప మన్న మాట.
🍃🌹ఈ క్షేత్రంలో పూచే పువ్వులన్నీ, పూర్వ జన్మల్లో మహా భక్తులు, సిద్ధపురుషులు, మునిపుంగవులే. వారి వారి పూర్వజన్మ పుణ్యఫలాల ననుసరించి వారీ జన్మలో పూవులుగా పూచి స్వామి వారికి అలంకృత మవుతున్నారు. అందువల్లనే, తిరుమలలో పుష్పాలన్నీ స్వామికే చెందుతాయనీ, వేరెవ్వరూ పూలు అలంకరించు కోరాదనే సాంప్రదాయం అమల్లో ఉంది.
🍃🌹సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరింప బడిన స్వామివారిని దర్శించుకుంటే, జన్మాంతర వాసనలన్నీ పోయి, గత జన్మల పాపాలన్నీ పటాపంచ లవుతాయని భక్తుల నమ్మిక.
🍃🌹గురువారం నాడు జరిగే వారపు సేవలైన తిరుప్పావడ సేవ, నిజనేత్రదర్శనం, పూలంగి సేవలు సమాప్తం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 14.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
"విజయాల నుండి వినయాన్ని , పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు."
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
"ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది."
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
🌻 భగవంతుని ధ్యానించు 🌻
🍃🌺 భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది.
🍃🌺 ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి.
🍃🌺 చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు.
*ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.
‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.
🍃🌺 ‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.
‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.
🍃🌺 ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. *శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ *అపరిమితమైన వెలుగు.
ఎప్పటికో మెలకువ వచ్చింది.
🍃🌺 కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.
🍃🌺 అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.
🍃🌺 భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది.
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼
🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 40 🙏
🍃🌹భువిలో కొందరు ధనవంతులు ఏ పరిస్థితిలో దానం చేస్తారో ఈ పద్యం వర్ణించి చెప్పింది.
ఉ. మేడలు గల్గియున్ననయమే గని యెవ్వఁడొసంగం డెప్పుడున్ వీడక పట్టికొట్టు నవివేకుల కోడక యిత్తు రీయిలన్ దూడలు పాలుద్రాపునెడ దూటుచు మూతుల గ్రుమ్మకున్న చే పీడవు గోవులంచు జగమెల్ల నెఱుంగదె వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! మేడలు మిద్దెలు కల్గి బాగా సంపాదించిన కొందరు ధనవంతులు ధర్మమార్గాన్ని అనుసరించి దానం చేయడం ముఖ్యమని తెలియదు. అడిగితే లేదని యంటారు.
🍃🌹కాని వారిని పట్టుకొని కొట్టి హింసించి బాధించిన వారికి అడిగిన వెంటనే అన్నీ ఇవ్వడం చేస్తారు. అది అంతేకదా- ఆవుల పొదుగులో చేపు వచ్చి పాలనివ్వాలంటే వాని దూడలు ముందుగా దానిని మూతులతో తన్ని నోటితో దూటుచు పొదుగును బాధించవలసిందేకదా.
🍃🌹అపుడే కద ఆవులు పాలనిస్తాయి. అలాగే కొందరు ధనవంతులు హింసిస్తేనే వారి …
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 37 (శుక్రవారం అభిషేకం) 🎈
"కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని!"
🍃🌹అన్న కీర్తనలో, అన్నమయ్య - శుక్రవారాభిషేకం సందర్భంగా శ్రీవారికి జరిగే ఉపచర్యలన్నీ ముగ్ధ మనోహరంగా వర్ణించాడు. ఆ వాగ్గేయకారుని వర్ణన ముందు, మనం చెప్పుకునే అభిషేక ముచ్చట్లన్నీ, చంద్రుని ముందు దీవిటీ లాగా వెల వెల బోతాయని తెలిసీ, స్వామివారి మీద భారం వేసి ఈ సాహసానికి పూనుకుంటున్నాం.
🍃🌹శ్రీవేంకటేశుని మూలమూర్తికి ప్రతి శుక్రవారం ఉదయం 3.30 గం. ల నుండి 5 గం. ల మధ్య శుక్రవార అభిషేకం జరుగుతుంది. అభిషేక సమయంలో ఆభరణాది అలంకారాలు లేకుండా ఉన్న స్వామివారి మూర్తి యొక్క సొబగులు వర్ణించడం మహామహుల తరం కూడా కాదు.
🍃🌹తీర్చిదిద్ది నట్లుండే పెదవులు, సంపెంగ వంటి ముక్కు, వికసించిన పుష్పంలా ఉండే ముఖారవిందాన్ని వీక్షిస్తూ భక్తజనులు మైమరచి పోతుంటారు. అభిషేక సేవ పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తే - పల్లవరాణి "సామవై" భోగశ్రీనివాసుని వెండి ప్రతిమను బహూక రించినప్పటి కాలం, అనగా 614 వ సం., ముందు నుండీ, విశేష సందర్భాల్లో ఈ అభిషేకోత్సవం జరిగేది.
🍃🌹తరువాతి కాలంలో ప్రతి రెండవ శుక్రవారం (పక్షానికో సారి) జరిగేది. అయితే, 11 - 12 వ శతాబ్దాల్లో భగవద్రామానుజుల వారు - స్వామివారి వక్షఃస్థలంలో "బంగారు అలమేలు మంగ" ప్రతిమను అలంకరింప జేసిన శుక్లపక్ష ద్వాదశి ఉత్తరఫల్గుణీ నక్షత్ర శుక్రవారం నాటి నుండి, ప్రతీ శుక్రవారం ఈ అభిషేక సేవ నిరాఘాటంగా జరుగుతూ వస్తోంది.
🍃🌹ప్రాతఃకాల ఆరాధన పూర్తి కాగానే, అర్చకులు తెర వేసి శుక్రవార అభిషేక నిమిత్తం, ఏకాంతంగా శ్రీవారికి సంకల్పం చేస్తారు. ఉపచారాలు సమర్పించి, అష్టోత్తరశత నామార్చన కూడా చేస్తారు. అభిషేకానికి ముందుగా శ్రీవారి ఊర్ధ్వపుండ్రాన్ని (తిరునామం) అర్ధభాగానికి తగ్గించి సూక్ష్మ ఊర్ధ్వపుండ్రంతో ఉంచుతారు.
🍃🌹ఉత్తరీయాన్ని తొలగించి స్నాన కౌపీనాన్ని ధరింప జేస్తారు. ఆ సమయంలో పరిచారకులు శీవారి సన్నిధానంలో రెండు వెండి గంగాళాల గోక్షీరం, మరో రెండు గంగాళాల బంగారుబావి శుద్ధాదకం సిద్ధం చేస్తారు. జియ్యంగార్లు అందించే క్షీరంతో నిండి ఉన్న శంఖుపాత్రలను అర్చక స్వాములు స్వీకరించి, పండితులు వేదపారాయణం జరుపుతుండగా, క్షీరాభిషేకం చేస్తారు.
🍃🌹అప్పుడు, శ్రీవారి వరదహస్తం నుండి జాలువారే గోక్షీరాన్ని పాత్రల్లో స్వీకరించి తరువాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. తరువాత చందనాన్ని శ్రీవారి దక్షిణహస్తం పై సమర్పించి, శ్రీవారి హస్తరేఖాంకితం చేసి అర్చకులు, జియ్యంగార్లు స్వీకరిస్తారు.
🍃🌹పిమ్మట అర్చకులు పరిమళ పాత్రను తీసుకుని, ఆ పరిమళద్రవ్యాన్ని స్వామివారి కిరీటాన్నుండి ప్రారంభించి శరీరమంతా పూసి నలుగు పెడతారు. ఈ పరిమళ ద్రవ్యం పునుగు, జవ్వాది, కస్తూరి వంటి సుగంధద్రవ్యాల మిశ్రమం.
"పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చెమల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని!!"
🍃🌹అనే కీర్తనలో అన్నమయ్య శ్రీవారిని అభిషేక నిమిత్తం సిద్ధం చేసే ఘట్టాన్ని ముగ్ధమనోహరంగా వివరించారు.
🍃🌹తరువాత, మహాభక్తుడు తిరుమలనంబి వంశీయులు తెచ్చి సిద్ధంగా ఉంచిన ఆకాశగంగ తీర్థంతో, తదుపరి శుధోదకంతో, స్నానాన్ని ప్రారంభించి స్వామివారి తిరుమేను పైనుండి పరమళ ద్రవ్యంతో కలిసి జాలు వారుతున్న అభిషేక ఉదకాన్ని అవయవాల వారిగా, ఆయుధాల వారిగా స్వీకరించి ఆ పవిత్ర తీర్థాన్ని తరువాత భక్తులకు ప్రసాదిస్తారు.
🍃🌹ఆ తరువాత పసుపుతో శ్రీవారి వక్షస్థల మహాలక్ష్మికి కూడా అభిషేకం జరుగుతుంది. ఏ యుగం లోనో బ్రహ్మాది దేవతల కోరిక మేర, కలియుగ మానవుల కోసం వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని, వక్షఃస్థల లక్ష్మితో సహా దర్శించే మహద్భాగ్యం శుక్రవార అభిషేక సమయంలో మాత్రమే కలుగుతుంది. శ్రీవారి మెడలో ఉన్న బంగారు అలమేల్మంగకు కూడా తరువాత అభిషేకం జరుగుతుంది.
🍃🌹తదనంతరం శ్రీవారికి 108 కలశాల శుధ్ధ జలంతో అభిషేకం పూర్తి చేస్తారు. ఈ అభిషేక తీర్థాన్ని ప్రధాన అర్చకుడు పాత్రలలో సేకరించి, మొదట తన శిరస్సును సంప్రోక్షించుకుని, సన్నిధానంలో ఉన్న ఇతర అర్చకులు, ఏకాంగి, ఆచార్యపురుషులు, ఆలయ అధికారుల మీద "భూతో భవః" అంటూ ప్రోక్షణ చేస్తారు.
🍃🌹తరువాత అర్చకులు తెరవేసి శ్రీవారికి ఉన్ శాత్ అనబడే 24 మూరల పొడవు గల సరిగంచు పట్టు ధోవతిని ధరింప జేస్తారు. ఆలాగే 12 మూరల ఉత్తరీయాన్ని వల్లెవాటుగా వేస్తారు.
🍃🌹వెంటనే శ్రీవారికి గోనవనీతం (వెన్న, పంచదార) నివేదన చేసి, ముఖవాసం (కస్తూరి తాంబూలం) సమర్పిస్తారు. తరువాత పచ్చకర్పూర హారతినిస్తూ, తెర తొలగిస్తారు. తరువాత, మళ్ళీ తెరవేసి ఏకాంతంగా ఊర్ధ్వపుండ్రం, వస్త్రాలంకార సేవలు కావించి భక్తుల సందర్శనార్థం తిరిగి తెర తీయడంతో, అభిషేక సేవాకార్యక్రమం పూర్తవుతుంది.
🍃🌹అభిషేకానంతరం గడ్డం బొట్టు మాత్రం అలంకరించరు. శ్రీవారి శుక్రవార అభిషేక దర్శనంతో, భక్తుల జన్మ జన్మాంతర పాపాలన్నీ శుభ్రంగా కడిగి వేసినట్లు తొలగిపోవడమే కాకుండా, ఆరోగ్య - ఐశ్వర్య - సంపదలు సమృద్ధిగా కలుగుతాయని ప్రతీతి.
🍃🌹అత్యంత దుర్లభమైన ఈ సేవలో పాల్గొనాలనే ప్రగాఢవాంఛ శ్రీనివాసుని ప్రతి భక్తునికీ ఉంటుంది. అయితే, శీవారి అనుగ్రహం పొందిన ఏ కొద్ది మందికో మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది. అకుంఠిత భక్తి విశ్వాసాలతో, అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఎందరో భక్తలు నిరూపించారు.మనమూ ప్రయత్నిద్దాం కృషితో నాస్తిః దుర్భిక్షం!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌻 మహా భారతం 🌻
🎈 భాగము 97 🎈
💧 ఘటోత్కచుని జననం 💧
🍃🌺శాలి హోత్ర మహాముని ఆశ్రమంలో ఆకలి, దాహం లేనివారై అద్భుత ఆనందాన్ని అనుభవిస్తున్న కుంతీదేవి, పాండవేయుల ఎదుట కోరినంతనే కృష్ణద్వైపాయన మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆ మహితాత్ముడలా ప్రత్యక్షమయ్యే సరికి జననీ సహితులై పాండవేయులు ఆయనికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించారు. అనంతరం ఆ వేదరాశి ఆనతికై నిరీక్షించారు.‘‘దుర్యోధనుని దుర్బోధలు ఆలకించి ధృతరాష్ట్రుడు మిమ్మల్నందరినీ హస్తినా పురం నుంచి వారణావతానికి పంపించాడు.
🍃🌺అక్కడ లాక్షా గృహాన్ని విడిది చేసి మీకు అపకారాన్ని తలపెట్టాడు. జరిగిందంతా నాకు తెలుసు! జరగబోయేదీ తెలుసు! అందుకే మిమ్మల్ని హెచ్చరించాలనే వచ్చాను. మీరంతా ధర్మాధర్మ వేత్తలు. మంచి వారు. అయినా పురాకర్మ పరిపాకం వల్ల ఇటువంటి బాధలకు లోనవుతున్నారు. అయితే ఈ బాధలు ఎంతో కాలం మీరు భరించాల్సిన అవసరం లేదు. త్వరలో మీరు సామ్రాజ్య భోగాలు అనుభవిస్తారు’’ అన్నాడు వ్యాసుడు.
🍃🌺కుంతీదేవితో పాటుగా ధర్మరాజాదులంతా ఆ మౌని మాటలు వినసాగారు.‘‘కొంత కాలం పాటు ఈ ఆశ్రమంలోనే ఉండండి! తర్వాత బ్రాహ్మణ వేషధారులై ఏకచక్ర పురంలో ఆవాసం ఏర్పరుచుకోండి! ఆ తర్వాత సంగతి ఆ తర్వాత. ఈ లోపు నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను’’ అని పౌత్రులందరినీ గట్టిగా కౌగలించుకున్నాడు. కన్నీటితో కట్టెదుట నిలుచున్న కుంతీదేవితో-‘‘తల్లీ! చింతించనవసరం లేదు! నీ జేష్ఠనందనుడు...ఈ యుధిష్ఠిరుడు సమస్త మహీ మండలానికి సార్వభౌముడై జేగీయమానంగా పరిపాలన కొనసాగిస్తాడు.
🍃🌺రాజసూయాశ్వమేథాది మహా క్రతువులెన్నో నిర్వర్తించి గొప్పవాడై వర్థిల్లుతాడు’’ అన్నాడు వ్యాసుడు. ‘చాల’న్నట్టుగా నమస్కరించి కన్నీళ్ళు తుడుచుకుంది కుంతి. హిడింబను చూశాడు వ్యాసుడు.‘‘ఈ హిడింబ అసలు పేరు కమలపాలిక. మన భీమసేనుని సాహచర్య భాగ్యం వల్ల అచిరకాలంలోనే ఈమెకు ఓ నందనుడు ఉదయిస్తాడు. అత్యద్భుత పరాక్రమశాలి ఆ కుమారుడు ఆపత్కాలంలో మిమ్మల్ని కాపాడుతాడు’’ అని పాండు కుమారులను వీడ్కొని అదృశ్యమయ్యాడు వ్యాసుడు.
🍃🌺శాలిహోత్రా ఆశ్రమంలో రాత్రివేళల ఉంటూ పగటి పూట నదీ సైకత స్థలాలలోను, సాంద్రశీతల అటవీ ప్రదేశాలలోను, ప్రశాంత గుహలలోను హిడింబా భీమసేనులు విహరించసాగారు. ఇద్దరూ అభీష్ట మన్మథ భోగాలు అనుభవించసాగారు. కమల పాలిక మనోజ్ఞ మానినీ రూపం ధరించి భీమసేనునికి అపూర్వానందం కలిగించింది. కొద్ది కాలానికి హిడింబ సద్యోగర్భాన ఘటోత్కచుడు ఉదయించాడు. అతడు అమేయ బల పరాక్రమశాలి. భీకరుడు. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద చెవులు, వాడి కోరలతో పుట్టీ పుట్టగానే అంతెత్తున ఎదిగి భీమసేనునికి ఆశ్చర్యం కలిగించాడు.
🍃🌺జుత్తులేకుండా నున్నగా కుండలా ఉన్న తలను చూసి హిడింబ-భీములు కుమారునికి ‘ఘటోత్కచ’ అని నామకరణం చేశారు. కావాల్సిన రూపాన్ని క్షణాల్లో సంతరించుకోగల మాయావి ఘటోత్కచుడు శస్త్రాస్త్ర విద్యా విశారదుడై అపార పిశాచ రాక్షస గణానికి అధీశ్వరుడయ్యాడు. ప్రప్రథమ పౌత్రుడయిన ఘటోత్కచుని చూసుకుని కుంతీదేవి ఎంతగానో ఆనందించింది.
🍃🌺కొన్నాళ్ళకు-‘‘పిశాచ రాక్షస గణాలతో కలసి నేనిక దట్ట మయిన అడవుల్లో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండలేను. క్షమించండి! అవసరమయినప్పుడు నన్ను స్మరిస్తే చాలు! వచ్చి మీ ముందు వాలతాను’’ అని చెప్పి పాండవేయుల అనుమతి తీసుకుని ఘటోత్కచుడు మాతృ సహితుడై ఉత్తర దిశాభిముఖంగా వెళ్ళిపోయాడు.
🍃🌺వారలా వెళ్ళిపోవడంతో పాండు తనూజులు కూడా శాలిహోత్రుని అనుజ్ఞ స్వీకరించి విదర్భ, మర్త్య, త్రిగర్త, కీచకాది దేశాలు దాటి ఏకచక్రపురానికి చేరుకున్నారు. అక్కడ ఓ బ్రాహ్మణుని గృహంలో నివసించసాగారు. నార బట్టలు ధరించి, జటాజినధారులై, బ్రహ్మచర్యాన్ని అవలంభిస్తూ పాండవేయులుభిక్షుక వృత్తి స్వీకరించారు.
🍃🌺సంపాదించిన భిక్షాన్నాన్ని ప్రతి రోజూ మాతృదేవత కుంతి ముందు పోగు పొయ్యడం పాండవులకు పరిపాటి. ఆ రాశిని రెండు భాగాలు చేసి, ఒక భాగాన్ని భీమసేనునికి సమర్పించి మిగిలిన భాగంతో ధర్మరాజాదులతో పాటు తనూ ఆకలి తీర్చుకోవడం కుంతీ వంతు అయింది
🍃🌺ఒకనాడు ధర్మ అర్జున నకుల సహదేవులు భిక్షాటనకై వెళ్ళిపోగా భీముడు ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణుని ఇంటి నుంచి ఏడుపులు వినవచ్చాయి. ఏమయిందో ఏమో భార్యా బిడ్డలతో పాటుగా బ్రాహ్మణుడు రోదిస్తున్నాడు. ఆ రోదన కుంతీదేవి చెవిన పడింది. దాంతో భీమసేనుని మేల్కొలిపి-‘‘బ్రాహ్మణునికేదో పెద్ద కష్టమే వచ్చి పడింది. పాపం ఆ ఇంట అంతా ఏడుస్తున్నారు.
🍃🌺అడిగిన వెంటనే ఇల్లు ఇచ్చి మనల్ని ఆదుకున్నందుకుగాను ఆ కష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది’’ అంది కుంతీదేవి.‘‘అయితే వెళ్ళి విషయం వివరంగా తెలుసుకుని రా! అది ఎలాంటి కష్టమైనా తీరుద్దాం’’ అన్నాడు భీముడు. ఆ మాట పట్టుకుని కుంతీద…
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 🌀
🌹 97. సిద్ధః 🌹
🌺 ఓం సిద్ధాయ నమః 🌺
🍃🌹నిత్య నిశ్పన్నరూపత్వాత్ సిద్ధః త్రైకాలికమును, కారణరహితమును అగుచు అనుభవగోచరమగు (చిదాత్మక) రూపము కలవాడు అగుటవలన విష్ణువు 'సిద్ధః' అనబడుచున్నాడు. నిరతిశయరూప, సర్వ వస్తువులందలి సంవిద్రూప, ఫలస్వరూపమైన "సిద్ధి" ఈతడే.
🍃🌺ఇతర సిద్ధులు అనగా అణిమ, గరిమ, లఘిమ మున్నగునవి, సిద్ధులు కాని స్వర్గప్రాప్తికూడా నశించునవేయగుటచేత - శాశ్వతసిద్ధి ఆ పరమాత్మయే!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[7:18 pm, 15/04/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 38 (నిజపాద దర్శనం) 🎈
🍃🌹ప్రతి శుక్రవారం అభిషేకానంతరం, అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించి వెళ్ళిన తరువాత నిజపాద దర్శనం అనే ఆర్జితసేవ ప్రారంభ మవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు స్వామివారి పాదాలను ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా చూడవచ్చు. మిగిలిన వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజిల్లుతూ ఉంటాయి.
🍃🌹మూలమూర్తిని శ్రద్ధగా గమనిస్తే, శ్రీవారు దక్షిణహస్తంతో తన పాదద్వయాన్ని సూచిస్తుంటారు.
🍃🌹వామహస్తం కటి భాగాన, కుడివైపు తిరిగి నేలకు సమాంతరంగా ఉంటుంది. అంటే, భక్తులు తన పాదాల్ని శరణు వేడితే, వారిని తన వామహస్తంతో అక్కున చేర్చుకుంటానని సందేశమిస్తున్నా రన్నమాట. అందువల్లనే, శ్రీవారి పాద దర్శనంతో పాపాలు పటాపంచలౌతాయని తరతరాల నమ్మిక.
🍃🌹శ్రీవారి పాద దర్శనం సర్వ పాప విమోచనం.బ్రహ్మ కడిగిన ఆ పాదాలు కనికరిస్తే కానిదే ముంటుంది?
🌻 వస్త్రాలంకారసేవ 🌻
🍃🌹ఈ ఆర్జిత సేవ కూడా ప్రతి శుక్రవారం అభిషేకానంతరం జరుగుతుంది. అర్చకులు ముందుగా - భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలను శ్రీవారికి ధరింపజేసి, వారిని ఆభరణాలతో అలంకరిస్తారు. ఇదంతా ఏకాంతంగా జరుగుతుంది.
🍃🌹వస్త్రాలంకార మరియు అభిషేక సేవల్లో పాల్గొన్న భక్తులను నైవేద్యం తరువాత, నూతన వస్త్రధారుడైన వేంకటేశుని దర్శించటానికి అనుమతిస్తారు. శ్రీవారికి సడలింపు జేసిన వస్త్రాన్ని, విమాన ప్రదక్షిణ మార్గంలో ఉన్న సబేరా అనే గదిలో భద్రపరుస్తారు.
🍃🌹స్వామి వారి అలంకరణకు కావలసిన ఇతర సామగ్రి, ఏకాంతసేవలో ఉపయోగించే వెండి మంచం, మొదలైనవన్నీ కూడా ఈ గది లోనే భద్ర పరుస్తారు. అత్యంత ప్రముఖులు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు వారికి ఈ సడలింపు చేయబడిన వస్త్రాన్ని మేల్చాట్ వస్త్రంగా బహూకరిస్తారు.
🍃🌹అందుకే ఈ సేవను మేల్చాట్ వస్త్రసేవ అని కూడా అంటారు. శ్రీవారి సేవలన్నింటిలో ఖరీదైన ఈ సేవ నిమిత్తం ఒక జంటకు ప్రస్తుతం రూ.12,250 చెల్లించాలి. తిరునామంతో పాటుగా, శ్రీవారి గడ్డం కూడా కర్పూరంతో అలంకరింప బడి ఉండటం మనం చూసే ఉంటాం.
🍃🌹అలాగే, శ్రీవారి మహాద్వారానికి కుడివైపుగా (మందిరంలోకి వెళ్తూంటే) అలంకరింప బడిన గడ్డపారను కూడా తరచూ ఆలయాన్ని సందర్శించేవారు గమనించే ఉంటారు. వీటన్నింటికీ సంబంధించి ఓ ఆసక్తికరమైన కథను, మరో మహా భక్తుడు భక్తశిఖామణి అనంతాళ్వార్ గురించి తెలుసుకునే ముందు, ప్రతి సోమవారం నాడు జరిగే విశేషపూజల గురించి తెలుసుకుందాం.
🌻 విశేషపూజ 🌻
🍃🌹ఈ ఆర్జిత సేవ, ప్రతి సోమవారం ఉదయం 6 గం. లకు సంపంగి ప్రదక్షిణం లోని కళ్యాణ మంటపంలో, ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప స్వామి వారికి జరుప బడుతుంది. 1991వ సం. లో ఈ సేవ ప్రవేశపెట్ట బడింది.
🍃🌹శ్రీ మలయప్పస్వామి కళ్యాణమంటపానికి వేంచేసిన తరువాత, వైఖానస ఆగమ శాస్తోక్తంగా హోమాలు నిర్వహించిన పిదప, స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తదనంతరం, భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.
🍃🌹శనివారం, ఆదివారం ప్రత్యేక సేవలు ఏమీ ఉండవు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 శుభోదయం 🌻
--------------------
తేదీ :- 16.04.2021
::::::::::::::::::::::::::::::::::::::::::::
🌹 మహనీయుని మాట 🌹
::::::::::::::::::::::::::::::::::::::::::::
"లక్ష్యం ఉన్నతమైతే కష్టం బాధించదు.
కొండ ఎక్కాలనే సంకల్పం ఆయాసాన్ని లెక్కచేయదు.
ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే పునాదిరాళ్ళు."
:::::::::::::::::::::::::::::::::::::::::
🌺 నేటి మంచి మాట 🌺
:::::::::::::::::::::::::::::::::::::::::
"నీ తప్పును ఈ
రోజు కప్పిపుచ్చగలిగినా రేపటి భవిష్యత్తులో దాని పర్యవసానాల నుండి తప్పించుకోలేవు."
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌻 లక్ష్మీదేవి ని "శుక్రవారమే" ఎందుకు పూజించాలి......? 🌻
🍃🌺రాక్షసుల గురువు "శుక్రాచార్యుడు". ఈ "శుక్రాచార్యుల" పేరుమీదుగానే "శుక్రవారం" ఏర్పడిందని మన పురాణాలు చెబుతున్నాయి.!!
🍃🌺శుక్రాచార్యుడి తండ్రి "భృగుమహర్షి". ఈ"భృగుమహర్షి" బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు! ఇతడు "లక్ష్మీదేవి"కి తండ్రి కూడా! అందుకే"లక్ష్మీదేవి"కి "భార్గవి" అని పేరు! ఈ విధంగా లక్ష్మీదేవికి "శుక్రాచార్యుడు" సోదరుడు ! అందుకే ఆమెకు "శుక్రవారం" అంటే ప్రీతికరమైనది !!
🍃🌺"లక్ష్మీదేవి" రూపురేఖలలో..... వస్త్రధారణలో"రంగులకు" కూడా ప్రాధాన్యం వుంది. "లక్ష్మీదేవి" ఎక్కువగా "ఎరుపు" "ఆకుపచ్చ" రంగు వస్త్రాలను ధరించినట్లు మనకు కన్పిస్తుంది. "ఎరుపు" రంగు "శక్తి"కి , "ఆకుపచ్చ"రంగు "సాఫల్యత"కు.... "ప్రకృతి"కి చిహ్నాలు.
🍃🌺"ప్రకృతి"కి "లక్ష్మీదేవి" ప్రతినిథి అందుకే "ఆమె"ను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక "లక్ష్మీదేవి" బంగారు "ఆభరణాలు" ధరించినట్లు కన్పిస్తుంది."బంగారం" ఐశ్వర్యానికి సంకేతం. "ఐశ్వర్యాధిదేవత" లక్ష్మీదేవి కాబట్టే ఆమెను "బంగారు ఆభరణాలతో" అలంకరిస్తారు.
🍃🌺"విష్ణువు" ఆరాధనలోనూ..."లక్ష్మీ" పూజకు ప్రాధాన్యం ఉంది."లక్ష్మీదేవి" అనుగ్రహంతో కానీ "విష్ణుమూర్తి"ని దరిచేరలేరు. "లక్ష్మీదేవి" ప్రసన్నత లేకుంటే "విష్ణువు" భక్తులకు అందుబాటులో ఉండరు.
🍃🌺"సదాచారం" "సత్ప్రవర్తన" "లక్ష్మీదేవి" కి ఆహ్వానాలు.ఈ రెండూ ఉంటే ముందు "లక్ష్మీదేవి" అనుగ్రహం. తద్వారా "విష్ణుమూర్తి"అనుగ్రహం కూడా పొందవచ్చు.
🌷ఓం శ్రీ మాత్రే నమః🌷
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🌻 దక్షిణ..సంభావన..అంటే ఏమిటి? 🌻
🍃🌺దక్షిణ కూడా ఒక విధమైన దానమే. దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక నిబద్ధత అనేది ఏమి ఉండదు. అనగా ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడుతుంది. అది ఒక బాధ్యత.
🍃🌺ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన.ఇది ఎవరికైనా ఇవ్వతగినదే కానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో, రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన.
🍃🌺ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే. దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.
🍃🌺ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను.
🍃🌺సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , ' విత్త శాఠ్యము ' లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను.
🍃🌺బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది.
🍃🌺కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను.
🌻 దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి. 🌻
🍃🌺ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఆ పురోహితులకు ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును.
🍃🌺అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను.
🍃🌺ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను.
🍃🌺రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.
🍃🌺సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 41 🙏
🍃🌹సజ్జన సాంగత్య మహిమ ఈ పద్యంలో చెప్పబడింది
ఉ. తుంటరియైన సాధువులతో గడుమైత్రి వహింప ధర్మముల్
వెంటనె లభ్యమంది గుణవేద్యతబొంది చరింపకుండునే అంటిడ పుల్పు మాన్చి రుచి నంది రసాలము తత్ఫలంబులన్ బంటకు దెచ్చి నిల్పి గుణవంతము జేయదె, వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! తుంటరివాడయినా, ఎంత అల్లరివాడయినా, సాధువులతో కలసి తిరిగి వారితో సాంగత్యము కల్గి వుండినట్లయితే వాని తుంటరితనం తొలగిపోయి, ధర్మాలన్నింటిని యెఱింగిన వాడవుతాడు.
🍃🌹ఇంకనూ గుణవంతుడయి, జీవితంలో మంచి పేరు పొందుతాడు.
అది అంతే మరి. మామిడి అంటును పుల్లగా వున్నదానిని తీసుకొనివచ్చి తీయమామిడి అంటుతో కలిపి అంటుకట్టినట్లయితే ఆ మామిడి అంటుకు పూర్వమున్న పులుపంతా సమసిపోయి మంచి తీయందనము కల్గిన రసాల ఫలాలను ఆ మామిడి అంటు ఇస్తుంది కదా...
🍃🌹అలాగే మంచివారలతో కలసి మెలసి తిరిగితే చెడ్డవాడు కూడ మంచివాడుగా మారి పేరు ప్రఖ్యాతులు పొందగలడు. సజ్జన సాంగత్యం అంత మహిమ కలిగి వుంటుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 సుందరకాండ 🙏
🎈 భాగము 11 🎈
🌻 పానశాల 🌻
🍃🌺మరుక్షణంలో ఆ మహామహుని బుద్ధి పనిచేయడం మొదలు పెట్టింది.రామ వియోగంలో ఉన్న సీత అన్న పానాలు ముట్టదు; అలంకారాలూ, నిద్రా ఆమె దరి జేరవు. దేవేంద్రుడయినా సరే, ఆమె వానిని కన్నెత్తి చూడదు. ముల్లోకాలలో రామునివంటి పురుషు డుండనప్పుడు సీతాదేవి పరపురుషునివైపు ఎందుకు చూస్తుంది, అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు.
🍃🌺అక్కడ ఆటలాడి, పాటలు పాడి, నాట్యం చేసి, తెగత్రాగి అలసిన నారీజనం కొందరు మద్దెళ్ళమీద, మరికొందరు పీటలమీద, మరెందరో తివాసీలమీద పడి నిద్రిస్తున్నారు.
🍃🌺అందరూ అందకత్తెలే చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్ర మర్యాద లెరిగినవారే, హాయిగా సంయోగసుఖంతో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు. ఇందరు స్త్రీల నడుమ, గోగణ మధ్యంలో వృషభరాజులా ఉన్నాడు, రావణుడు. ఆడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు.
🍃🌺పానశాల ప్రక్కకు చూశాడు హనుమంతుడు.దున్నపోతుల, అడవిపందుల, లేళ్ళ మాంశాలు పోగులు పోగులుగా ఉన్నాయి, వెండి పాత్రలలో, బంగారు గిన్నెలలో తింటూ తింటూ విడిచిన నెమళ్ళ,కోడిపెట్టల మాంసాలున్నాయి. సగం సగం ఆరగించిన చకోరాలు, చేపలు, మేకలు.
🍃🌺షడ్రసోపేతమయిన వంటకాలు, పువ్వులు. పళ్ళు...... రకరకాల మద్యాలు, బంగారు కమండలువులలో ఉన్నాయి. మణులు పొదిగిన వెండి చెంబులు, బంగారు' పాన పాత్రలు.కొన్ని పాత్రలలో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా ఆరగించినవి, కొన్ని యింకా ముట్టకుండా నిండుగా తొణికిసలాడుతున్నవి.
🍃🌺త్రాగుతూ మత్తులో బోర్లగిల పడవైచిన కుండలు, కమండలాలు. వాటికి యెడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు.మళ్ళీ వెనుదిరిగాడు.
🍃🌺అక్కడ స్త్రీలు ఒకరి చీర లొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు, ఒకరి నొకరు దగ్గరగా కౌగలించుకుని నిద్రిస్తున్నారు.మధురమయిన మద్యపు వాసనతో, మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనం అంతా వ్యాపిస్తున్నాయి.
🍃🌺స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు ఛాయ మేనివారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు; కాని, జానకీ దేవి కనపడలేదు.
🍃🌺ఆ దశలో వున్న స్త్రీలను చూసిన హనుమంగుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంతఃపురంలోని నారీడను, పయిగా' ఆచ్ఛాదనలు లేకుండా వున్నారు. పరస్త్రీని చూడడమే పాపం! కాగా ఈ స్థితిలో చూడడం మరెంత పాపం, అయితే యిందరు సుందరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి వికారానికి లోనుకాలేదు. ఇంద్రియాలన్నిటిలో ప్రధానమయినది మనస్సు, అది నిశ్చలంగానే ఉంది.
🍃🌺పయిగా సీతాదేవిని స్త్రీ జన మధ్యంలో గాక ఎక్కడ వెదకాలి? స్త్రీని వెదకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెడతామా! నా మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనక పాపభీతి లేదు.
🍃🌺దేవ, గంధర్వ, నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సీతాదేవి జాడలేదు. పానశాల విడిచి యీవలకు వచ్చాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment