Tuesday, 4 May 2021

May be an image of 1 person

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక. 05-05-2021
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
 

సోయగాలు.. కొబ్బరి
 

దాహము తీర్చుకొబ్బరి నీళ్ళు
దేహ శాంతి కొరకు
మోహము మార్చు కొబ్బరి నీళ్లు
అహము తుంచి వేయు
సహనము ఉంచు కొబ్బరి నీళ్లు
స్నేహ మవ్వు చుండు
లేలేత కొబ్బరి రుచివేరు
 

కొబ్బరి పాయసం రుచిలోన
పంబ రేగు చుండు
కొబ్బరి అన్నము తిన్నాక
ఉబ్బ సముయు పెరుగు
కొబ్బరి పచ్చడి పెళ్ళిలో
గబ్బు పట్టకుండు
కొబ్బరి మూడు కళ్ళ మహిమ
 

కొబ్బరి మట్టల పందిరి
శుభము కలుగును అని
కొబ్బరి యీనెలు బొమ్మలు
ఉబుకు వయసు చేష్ట
కొబ్బరి పాలు ఆరోగ్యము
శోభ పెంచు చుండు
కొబ్బరి పీచు పానుపుగనుు
 

--(())--


ఉద్ధురమాలవృత్తము చక్రము -
==
సూత్రము - త్రిర్భననముపరి చ వి-దుర్భయుతయగణమవ-
నేర్భవతి లలితపద-గర్భమిహ చక్రే - జయకీర్తి ఛందోనుశాసనము
లయగ్రాహిలో సరి భలములు (UIII) ఇందులో నలలములు (IIIII).
నడక - ఖండగతి (ఐదు మాత్రలు)
==
చక్ర - (భ/న/న)3/భ/య UIII IIIII - UIII IIIII - UIII IIIII - UIII UU (ప్రాసయతి)
==
మందిరము గగన మట - మందిరము వసుధ నట
మందిరము రజని నట - మందిరము వెల్గే
మందిరము శశి వెలుగు - మందిరము నిశి ఘడియ
మందిరము చిరుదివెల - మందిరము నీడే
వేగ పరుగులు జలము - వేగ పరుగు కిరణము   
వేగ తరువుకు లతలు - వేగము యె నష్టం
అందమగు పలుకులు - అందమగు చినుకులు
అందమగు కులుకులు - అందములుచిందే
పూల లొ ఘుమఘుమలు - పూలలొ రకరకములు  
పూలలొ పురుగుపరుగు  -  పులువికసించే
కాలములు జరుగుతునె కాలపు చరితములగు
గోళమువలె తిరుగును గొళ్లుమని  సాగే
నీలమగు గగనమున మేళముల చలనములు
నేలలొ ఘుమ ఘుమలుగ నెల్లరకు పెర్గే
గాలిలొ గమకములుగ గోల లగుట చరితము
చాల సొబగొసగునుట - అల్లికల సొంపై     
తెల్పుల మధురిమలుగ - వేల్పుల సరిగమలుగ   
కాల్పులు ఎకసెగలుగఁ  -  గ్రోలుచును సోంపై
తమవిధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
 


 

ఆధారము - వృత్తజాతి సముచ్చయము
ఇతర నామములు - జగత్ప్రముదితా, ధీరలలితా, లలితా, మహిషీ
==
ప్రముదితా - భ/ర/న/ర/న/గ UII UI UIII - UIU IIIU
16 అష్టి 30167
ప్రాణము ఉంది కాలమిది - మానమే మనసితా
మోనము వద్దు దాహమిది - మార్గమే వినశితా
మైనము లాగ కర్గునిది - పాకమేను సఖీ
వైనము చూపి తెల్పునిది - విద్యయే వినుసుతా
 

రాముడు సత్యమే పలుకు - రాధ సత్యము కదా
భీముడు సత్యమే పలుకు - కర్ణ సత్యము కదా
సోముడు వెన్నెలను కురువు - శోభ నింపును కదా
కాముడు నిత్యమూ కులుకు - కామితార్దము కదా
 

దేహములోని తృప్తియును - దేహి యంచనె సఖీ
దాహము తీర్చుటే యుగము - ధర్మ మవ్వును సఖీ    
వాహిని వోలె దాహమిది - పారు చుండెను సఖీ
ఉహల కందకుంటివియు - ఊయలేలను సఖీ
 

ఎందుకు కోపమైతివియు - నిట్టు లుంటివి సఖీ  
ముందుగ సేవచే సితిని  - నింద లెందుకు సఖీ
పొందుకు ముందరొచ్చితిని - నీకు సమ్ముగనుయే
విందుకు తొందరే అవును - యిద్ది నీదుసుఖమే
 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
==
ఊహల కంద కుంటివిట - నోజగత్ప్రముదితా
వాహినివోలె ప్రేమ యిది - పారుచుండె ముదితా
దాహము దీర్చ వేగముగ - దాపు రమ్ము కలికీ
దేహములోని ప్రత్యణువు - దేహి యంచనె సకీ
==
రాముఁడు సత్యమే పలుకు - రాదసత్యము గదా
భీముఁడు భీషణుండరికి - విక్రమార్కుఁడు సదా
సోముఁడు వెన్నెలన్ గురియు - శోభ నింపు వరమై
నామది నందమై నిలిచె - నాప్రియుండు స్థిరమై
==
ఎందుకు నీవు కోపమున - నిట్టులుంటివి చెలీ
ఎందుకు నీవు తాపముల - నిట్టులిచ్చితివి సకీ
ఎందుకు నీవు చూడవిట - నిట్టులుండ సరియా
ఎందుకు నీవు మౌనవతి - యిద్ది నీదు మురియా
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
నేటి సమస్యా పూరణలు   
 

మైనమేదైనా కర్గు నొక్కటే
మీన వేషాల్నే చేయనొక్కటే
మానరోగాల్నే రక్షనొక్కటే
జన్మమేదైనా ధర్మమొక్కటే
భర్తగా సేవ చేసిననుఁ భారము బోధనతోను దప్పునే
భార్యగా ప్రేమ చూపినను బాధ్యత భావముతోను దప్పునే  
కార్యము ఏది చెప్పిననుఁ కక్కని ప్రార్ధనతోను దప్పునే
కర్ణుని మేన ప్రాణములు కల్గిన పార్థుని చావు దప్పునే
--(())--
 

సోయగములు
కన్నీళ్ళు కనిపించు చుండేను
ఎన్ని నాళ్ళ ఓర్పు
మన్నన గుర్తింపు లేకనే
మన్ను కమ్మి ఉన్న
నిన్నెవరు పలక రించరు
నిన్ను గాజు అనియు
అన్నెము పున్నెము ఎరుగకే
నేర్చింది వాడదు ఎండదు
 

ఆరితేరిఉన్న
పేరులెన్ని పలికినా ఆత్మ
మారకుండఉండు
సుడిగాలిఅయిన నూ వచ్చినా
తడి తగలని విద్య
జన్మమేదైనధర్మమొక్కటే  
ఆశల ఆకులు రాలేను  

  
ఆశ కర్ద మేది
పాశము బంధము అయ్యేను
వీశ మెత్తు లేదు  
జ్ఞానానికి కొల మానం లేదు
జ్ఞాన సూన్యమైన
కాలమే తెల్పుసోయగములు
--(())--
*కుక్కని 🐕 తప్పించ బోయి*
*వెంకట్ బైక్🏍️ కంట్రోల్ తప్పి*
*సైడు కాలువలో పడ్డాడు*
*కష్టపడి బైటికి చేరాడు*
*అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి💃🏻 కారు🚘 ఆపి దగ్గర కొచ్చింది.*
*బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.*
*లేదు..లేదు..నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు వెంకట్*
*పరవా లేదు !! రండి.. చెక్ చే‌స్తా !!. మా ఇల్లు🏠 ఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.*
*" థేంక్యూ !! కానీ మా ఆవిడకి🙅🏻‍♀️ ఇష్టం వుండదు." అన్నాడతను.*
*"మరోలా అనుకోకండి.  నేను నర్స్ 🤦🏻‍♀️ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.*
*ఆమె చాలా అందంగా వుంది.*
*వెంకట్  ' నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు.. మా ఆవిడ అస్సలు ఇష్టపడదు..నేనిలా చెయ్యడం.!*
*అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి వెళ్ళారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.*
*ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. రెండు రౌండ్స్ అయ్యేక "  మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా.!!" అన్నాడతను.*
*సిల్లీగా వుంది మీరుచెప్పేది.. అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే*
*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు వెంకట్*
తేటగీతి..కన్ను
మన్ను తిన్నట్టి ‌‌కన్నుగా మోన మొన్న
 కన్ను కన్నీరు కార్చిన కానరాని
వెన్ను కదిలినా కన్నుల వైన మంత
నన్ను వదలక కన్నుయే నన్ను నమ్మె....1
కన్న పుత్రుని కన్నునా కాన లేను
కన్న మమకార కన్నుయై కనబడునులె
కన్న కన్నుయే కన్నీరు కార్చి ఉన్న
కానలేనట్టి కన్నుగా కన్ను మూసె
సోయగములు
కాలము కదులుచూ ఉండును
కలలు మారుచుండు
వేలము జరుగుచూ ఉండును  
గాల మవ్వుచుండు
గోలలు పెరుగుచూ ఉండును
గోళ మవ్వుచుండు
కల్లోలపుమనిషి బతుకులో   
ఆకలి పెరుగుచూ ఉండును
రూక లేక ఉండు
వాకిలి తెరిచియే ఉండును
కాకి కూడ రాదు
చాకిరి పెరుగుచూ ఉండును
బాకి మార కుండు
కల్లోలపుమనిషి బతుకులో   
విజయము ఎప్పుడు నీవెంట
పూజ్య బావ ముంచు
నిజమును తెలిపేటి బతుకున
ఆజ్య మవ్వ కుండు
నీజాతి గౌరవము నిలిపి  
నిజము తెలుపు చుండు  
వాజమ్మ లాగ ఉండకుములే
--(())--
నేటి సమస్యను పూరణ ........
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
స్నేహ మన్నది నిత్యమూ సేతు వగును
సహన మన్నది బతుకుకు సేతు వగును
బ్రహ్మ రాతలు అనుభవ బంధ మగును
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
సత్య వాదికి దారియే ధర్మ మగును
నిత్య బుద్ధికి బోధలే బంధ మగును
బద్ద కానికి బంధనే శ్రావ్య మగును      
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
అహమ్ము విదిలించు చూడుము
సహనము నిత్యమూ సుఖాల మదిలోన మార్గము
స్నేహపు పలుకులు చూడూ
బ్రహ్మచారికి పెండ్లిపై భ్రా0తి గలిగె
--(())--
తేటగీతి పద్యాలు ... మౌనం
 మౌనమే జీవి తానికి పరమ మిత్ర
మౌనముగను ఆత్మ బలము మెరుపు వచ్చు
మౌనముయు అతీంద్రియ ముక్తిని చ్చు
మౌనమేసుఖాన్ని అనుభవమ్ము నిచ్చు
 మౌన శక్తియుక్తులతొ ఉపాయమవ్వు
మౌన మేకాగ్రత పెరిగి మాయ మాపు
మౌన భక్తితో అసలుకు ప్రీతి పెంచు
మౌనమే మాన రక్షణ మతిగ ఉండు
 మౌనము అనగా వ్యర్ధము మరియు మెరుపు
మౌనమే సంకల్పముగా ను మనసుతో ను
మౌనశక్తి మానసిక ప్రభావ మువ్వ
మౌన మే శరీరం మీద పనియె చేయు
మౌనముయె సృష్టి స్థితి లయ ప్రభావ ముండు
మౌనముయె శ్రేష్ట సంకల్ప మగుట జరుగు
మౌనముయె ఇష్ట మగుటకు మైక మవ్వు
మౌనముతో కష్ట నష్టాలు పారిపోవు
సీస పద్యము
సత్యమనసు తెల్పి  సందర్బమునుతెల్పి
దైవమునకు తెల్పె దారి లేక
నిత్య పత్యము చేసి నిలకడ మనసుతో
నామము పఠనము నమ్మి చేయు  
నిత్య పనులనేవి నమ్రత తొ తెలిపి  
బుధ్ధితో పూజలు బతుకు కొరకు
నిత్య నడకలను  నరకము అయినను
దైవదర్శనములు  దారి కొరకు
తేటగీతి
కలత చెందియు ప్రార్ధించు కోరుచుంటి
కాస్త బద్దకమును మాపి కాపు కాయు
కాస్త ఓపిక తో అర్చనలలు చెసితి
వేంకటేశ్వర మమ్ముకాపాడు దేవ
**(())**(
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
చిన్న నాటి కధ
చిన్నతనం అంటే   షుమారు 40 సంవత్సరాలు వెనక్కి  వెడితే ---
ఆ రోజుల్లో  గ్యాస్  లేదు .
వంటంతా కుంపటి , పొట్టు పొయ్యి , కట్టెల మీదే చేసేవారు .
వేడి నీళ్ళకు గీజర్ లు ఉండేవి కావు.
దొడ్లో వెనుక  వైపు  ఇటుకలు పేర్చి  దాని మీద డేగిశా పెట్టి
కొబ్బరి డొప్పలు , కొబ్బరి  మట్టలు  వేసి పొయ్యి  రాజేసి స్నానానికి నీళ్ళు కాచుకునేవారు .
చాలా గ్రామాలకు  కరెంటు సదుపాయం కూడా  ఉండేది కాదు .
సాయంత్రం నాలుగు అయ్యేసరికి  లాంతరు , చిమ్నీలకు  ముందు రోజు పట్టిన మసి  ముగ్గుతో శుభ్రంగా  తుడిచి , వత్తులు  సరి చేసి , వాటి నిండా  కిరోసిన్  పోసి  చీకటి పడక ముందే  వెలిగించటానికి  సిద్ధం చేసుకునేవారు .
మాకు ఊహ తెలిసే నాటికి కరెంటు ఉన్నా  రాత్రి పూట  ప్రైవేటుకు  వెళ్ళే సమయంలో  లాంతరులు పట్టుకు వెళ్ళి  అక్కడ వెలిగించి  ఆ వెలుగులోనే  చదువు కునే వాళ్ళం.
వేసవి కాలం  పరీక్షల సమయంలో మేడ  మీదకు వెళ్ళి చదువుకోవాలనుకునే సమయంలో  మేడ మీద కరెంటు  ఉండేది కాదు .
లాంతరు వెలిగించి  మేడ మీదకు పట్టుకు వెళ్ళి ఆ దీపపు వెలుగులోనే  చదువుకునే వాళ్ళం.
ఈ రోజుల్లో  AC  లు , గది గదికి  ఫానులు , కరెంటు పోతే Invertor లు .
ఈ సదుపాయాలు ఆ రోజుల్లో  ఎక్కడవి ?
శివరాత్రికి  ముందే డాబా మీదకు వెళ్ళి పడుకునే వాళ్ళం.
దాదాపుగా  దసరా  వరకు  మేడ మీదే పడకలు .
ఇప్పటిలా  ఒకరి మీద ఒకరు పడి పోతున్నట్లు  ఆనించేసి ఇళ్ళు కట్టే వారు కాదు.
అపార్ట్ మెంట్  కల్చర్  ఆ రోజుల్లో  లేదు .
దాదాపుగా  అన్నీ పెంకుటిళ్ళు .
మండువా లోగిలి ఇళ్ళు .
అక్కడక్కడ  కలిగిన వాళ్ళకు మాత్రమే ఉండే డాబాలు , రెండతస్థుల మేడలు .
ఇక మేడ మీదకు వెళ్ళి  చాప దిండు వేసుకుని  పడుకుంటే  ప్రాణం ఎటు పోయేదో ?
ప్రతి ఇళ్ళల్లోనూ  చుట్టూరా కొబ్బరి చెట్లు , అరటి చెట్లు ,రకరకాల పూలు మరియు పళ్ళ చెట్లు ఉండేవి .
వాడుకున్న నీళ్ళన్నీ మొక్కల లోకి  వదిలేవారు.
మొక్కలన్నీ ఆ వాడిన నీరు పీల్చుకుని , మరి ప్రత్యేకంగా  నీరు పోయవలసిన అవసరం లేకుండా  ఏపుగా  ఎదిగేవి .
మురుగు లేదు కాబట్టి  దోమలు ఉండేవి కావు.
ఇంక  ఆ చెట్ల నుండి  వీచే  కమ్మని గాలికి  నిద్రపోతున్న ప్రాణం ఎటు
పోయేదో , ఉదయాన సూర్య భగ వానుడు  తన వేడి  వాడి కిరణాలతో చుర్రు చుర్రు మని పించే దాకా  మెలుకువ వచ్చేది కాదు .
ఈ రోజుల్లో  దోమలకు , వాటి వల్ల వచ్చే రోగాలకు  భయపడి , కిటికీలన్నీ తలుపులతో సహా మూసుకుని , Jet లు , All Out లు వెలిగించి ,ఫాన్ మరియు AC కూడా  వేసుకుని  ఆ పొగ మరియు ఈ AC తో  ఉక్కిరిబిక్కిరై  ముక్కులు మూసుకు పోయి , ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ కాలుష్యాల గాలులు పీల్చడం వలన , తల అంతా పట్టుకు పోయి  ఉదయాన్నే ఏ బకరా దొరుకుతాడా  ఎవడి మీద విరుచుకుపోదామా ? అనే  రీతిన   చికాకుగా తయారవుతున్నాము.
ఇంక  భోజనాల విషయం .
కలిగిన వాళ్ళిళ్ళల్లోనే ఉదయాన కాఫీలు , టిఫిన్లు .
అదీ  ఇంటి  యజమాని  యజమానురాలు మాత్రమే  తీసుకునే వారు .
మిగిలిన  వాళ్ళందరికీ  రాత్రి  మిగిలిన చద్దన్నాలు , తర్వాణి  అన్నాలే .
అమ్మమ్మ కాని , బామ్మ కాని  వేసవి శలవులకు వచ్చిన పిల్లలందరినీ  తమ చుట్టూ  కూర్చో పెట్టుకుని , మధ్యలో పెద్ద కంచం పెట్టుకుని ఆ చద్దన్నంలో కొత్తగా  పెట్టిన కొత్తావకాయ బాగా నెయ్యి వేసి కలిపి  ముద్దలు  పెట్టేవారు .
తర్వాత రాత్రి మిగిలిన చారు కాని పులుసు కానీ రాచిప్ప లోనుండి  తీసి  చద్దన్నం లో కలిపి  అందరికీ  ముద్దలు పెట్టేవారు .
అప్పుడు  దాదాపు  అందరిళ్ళల్లో ఆవు ఉండేది .
అందరికీ  సరిపడేలా  శేరున్నర , రెండు శేర్లు పాలు ఇచ్చేది .
వంటంతా అయిపోయాక బొగ్గుల మంట బాగా తగ్గాక మట్టి కుండలో  పాలు పోసి  సన్నని మంటన  ఎర్రగా  దళసరిగా  తొరక కట్టేలా పాలు కాచి , పళ్ళెంలో నీళ్ళు పోసి  బాగా కాచిన పాలకుండ అందులో పెట్టి , పాలు  తోడు వేయటానికి అనువుగా ఉన్న  వేడిలో  పెరుగు బిళ్ళ అందులో వేసి  తోడు పెట్టేవారు .
ఉదయాని కల్లా  ఆ పెరుగు గట్టిగా  జున్ను ముక్కలా తోడు కునేది .
ఉదయాన్నే  ఒక పొడవాటి  కర్రకు పెరుగు చిలికే కవ్వం కట్టి  కొద్ది నీళ్ళు పోసి  కవ్వంతో వెన్న చిలికే వారు .
దాదాపుగా  సవాశేరు అంటే  350 గ్రాముల వెన్న వచ్చేది .
ఆ  వెన్న గట్టిగా   గుండ్రంగా పెద్ద ముద్దలా చేసి , ఆ మజ్జిగ  కుండలోనే వేసే వారు .
మధ్యాహ్నము  దాకా ఆ వెన్న మజ్జిగలోనే  తేలుతుండేది .
అలా  కుండలో చేసిన మజ్జిగతో కాని , లేదా మీగడ పెరుగు వేసి కాని  చద్దన్నంలో  ముద్దలు కలిపి , ఆవకాయ కలిపిన ముక్కలు కంచం అంచులతో  తుంపి  చిన్న చిన్న ముక్కలుగా  చేసి మీగడ పెరుగు అన్నం ముద్దలో  పైన నంచు కోవడానికి పెట్టి , అందరికీ  పెట్టే వారు .
ఆహా !!  ఏమి  రుచి .
వర్ణించ  నా తరమౌనా ?
మళ్ళీ  మరోసారి  ముచ్చటించుకుందాం . సేకరణ...
Ooooooooooooo
ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా  కొన్ని జోక్స్.1. రాజు గోపితో ఆ సీను గాడు పెళ్లికాకముందు లవర్ పక్కన కూర్చుని చెరువులో  రాళ్లు వేస్తూ మాట్లాడేవాడు పెళ్లి చేసుకున్నాక బియ్యంలో రాళ్లు ఏరుతూ వాడి లో వాడే మాట్లాడు కుంటున్నాడు. రాళ్లకి వాడికి ఏమిటో అవినాభావ సంబంధం.రాళ్లన్ని మళ్ళీ వాడి దగ్గరికే తిరిగి వచ్చాయి.
2. టీచర్:ఒరేయ్ రాము హాస్పిటల్ అంటే అర్థం ఏంటి రా? స్టూడెంట్: భూమి నుండి నరకానికి వెళ్లేటప్పుడు మధ్యలో వచ్చే టోల్ ప్లాజా సార్.
3. టీచర్: ఒరేయ్ రాము పులికీ మేకకీ తేడా ఏంటి? రాము; మొదటిది క్రూర జంతువు రెండోది కూర జంతువు  మేడం.
4. పాప: నాన్న కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా. తండ్రి: అవునమ్మా.పాప:మరి వాళ్లు వెళ్లిపోవాలంటే?? నాన్న: మీ అమ్మ  అరవాలి.
--(())--

*కృష్ణుడు మరియు ఒక దొంగ కథ*


బ్రాహ్మణుడు  ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం ప్రసంగిస్తున్నారు.ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, మూల దాక్కున్నాడు.


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.


బ్రాహ్మణుడు భయపడి ‘నా దెగ్గర ఏమీ  లేదు ‘ అని అన్నారు.దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దెగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.


బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దెగ్గరకి రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు   వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లలి దెగ్గిరకి వెళ్ళాడు దొంగ.


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది.అతను వెళ్లి బాల కృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగల గానే, దొంగ చేసిన పాపములన్నీ  కరిగి పోయాయి. “ఎంత అదృష్టవంతుడో కదా దొంగ ! “బాల కృష్ణుడిని ,ఆ దొంగ అమ్మాయకంగా ,”ఎవరు నువ్వు?” అని అడిగాడు. అమాయకంగా కృష్ణుడు ‘నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది, నన్ను వదిలి వెళ్ళిపో ‘ అన్నాడు. దొంగ, ‘దురాచానాలతో నిండి ఉన్న నా మనస్సు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను.  నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు ‘ “అని ప్రాతిధేయ పడ్డాడు.అప్పుడు బాల కృష్ణుడు, దొంగకి అతను  వచ్చిన పనిని గుర్తుచేసి, తను వేసుకున్న నగలన్నీ  ఇచ్చాడు. అప్పుడు దొంగ, ‘ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా ?’అనిఅడిగాడు. దానికి కృష్ణుడు  ‘ఏమి కోప్పడదు , ఎందుకంటే నా దెగ్గర  చాలా నగలు ఉన్నాయి.


 నేను నీకంటే పెద్ద దొంగని. కాని, నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా , ఎవ్వరు పట్టించు కోరు. నన్ను ప్రేమగా ‘చిత్తచోరా’ అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకోటి ఏమిటి అంటే, నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకెళ్తున్నాను “ అని జవ్వాబు చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. తరువాత చుస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.


ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని  అనుగ్రహించావు ,కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని నిరాశతో బాధపడ్డాడు.అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘నీవు భాగవత పురాణమును  కేవలము ఒక కథగా చదివావు, కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం ,సమ్పపొర్న శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను.”

నీతి:

పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి.

No comments:

Post a Comment