Friday, 6 August 2021

07-08-2021*


[06/08, 6:11 am] Mallapragada Sridevi: చిరునగవుల చిట్టి బాబుయే చిన్మయా నందుడు చేరితే చెబుతున్నాడు రారండోయ్ రారండోయ్ 

వరుస పెట్టిన వెళ్దాం వరాల చిన్నోడు నవ్వు లతో పిలుస్తున్నాడు రారండోయ్ రారండోయ్

[06/08, 6:18 am] Mallapragada Sridevi: శ్రీరక్తియు నీటి తపన హద్దులు అన్నీ

 శ్రీ రవ్వయు వెలుగు వలపు శిధ్ధులన్నీ

శ్రీ రాముడు సీత కొడుకు సిద్ధము సుమ్మీ

శ్రీ రంగని లీల వసుధ సిద్ధము సుమ్మీ

[06/08, 6:31 am] Mallapragada Sridevi: ఉచితంగా ఇవ్వడం దండుగ

పనిచూపీ పెంచడం పండుగ

కలలన్నీ చెప్పడం చెంబుగ

మనవాడే మేపడం నిండుగ

[06/08, 6:31 am] Mallapragada Sridevi: కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి రు.4 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ పైన ఉన్నది. కరోనాతో మృతి చెందిన కుటుంబాల వారు ఈ దరఖాస్తు ను నింపి మీ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సహాయం దేశం అంతా అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం వారికి కాస్త ఊరటనిస్తుంది.  దయచేసి ఈ దరఖాస్తు ఫారమ్ ను అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. కరోనా బాధిత కుటుంబాలకు తెలియజేయండి.

[06/08, 6:35 am] విశాఖ: దోచుకుంటున్నారు........!!!

ఖజానాలు......దోపిడీ ఖానాలు......

మన దవ ఖానాలు.......!

నెలమీద నెత్తురోడుతూ నీరసంతో 

నీళ్లు లేవని నోరువిప్పి అడిగినా 

ఆయమ్మకు అవుబడలే

నర్సమ్మకు తిరుబాటు లేదు.....! 

దిక్కుమాలిన సర్కారీ దవఖానా

దరిద్రం ఎక్కడో కాదు అక్కడే

కనపడింది....... !

శవాల్మీద సిల్లర గాళ్ళు

సిల్లి గవ్విస్తే కాటికి 

శవంతో పోనిచ్చేవారే .....!

రోగం కొని తెచ్చుకోరే 

కాని ఆరోగ్యం కొనుక్కోవాలి

ఆడడడుగునా ఆజ్యం పొయ్యాలి.....!

సర్కారి దవఖానాలోకి పోవాలంటే 

అదో భయం 

అక్కడంతా అయోమయం

మాయాబజారు మరిపించే వాతావరణం........ ! 

వేళకు వైద్యుడుండడు

వెతికి వెతికి చూస్తే వేళయిపోయిందని 

వదిలి పోతాడు ........!

అచ్చం శిరంజీవి ఠాగూర్ సినిమాలో,  

గణేష్ సినిమాలో ఎంకటేసు 

గుర్తుకొస్తాడే........! 

పేపంచంలో ఆలా జరిగినా 

బాగున్ను గాని .... జరగదే.......!

అందుకే సినిమాలో సూపెవి 

నాటకాలు నిజంగా సెత్తే సంకెళ్లు.....! 

మంత్రులు,మహమహులు మంచాన పడితే 

డబ్బున్న అస్పత్రికీ పోతారేం వారికీ 

సర్కారి దవ ఖానా అంటే భయమా.......?

డబ్బులుంటే డాట్టరు గారే దేముడు

డబ్బులేదంటే దారి లేక 

దారిమధ్యలో  పోయే దరిద్రుడు........!

దరి దరినా సూత్తే డాట్టార్లే డాట్టర్లు

ముట్టుకుంటే మూల్యం చెల్లించాలి

పట్టుకొని సూత్తే పట్టాలమ్ముకోవాలి.........!

సర్కారి దావఖానకి పొతే 

మందులు సూదిమాంధులు 

ఉచితంగా ఇచ్చినా 

పనిచేయడం లేదు 

ప్రాణాలే  పోతున్నాయి.......!

పెద్దోళ్ళు ఆస్పత్రికి పొతే 

అడుగు పెడితే అడుగు తీస్తే

డబ్బే డబ్బు.......!

సూది గుచ్చి సిల్లర కట్టేయి 

అంటాడు ఒకడు.......!

మందులు కావాలంటే 

ముందే కాసులు 

కావాలనేవాడు ఇంకొకడు..........!

అయినదానికి కానీదానికి 

యంత్రం ఎక్కించేసి 

ఎక్కడా ఇన లేని రోగాల 

పేర్లు సేపుతారు........!

నయామవుతాదని సేరితే 

నగ్నంగా దోపిడి చేస్తూ  

శివరకు నిశ్వాసం

నిరుకారిదాకా ఊపిరున్నాదంటూ 

ఉన్నదంత దోచి 

శవమయిదాకా సమయం గడిపి 

"సారి" సెప్పి పోతారు.........!

ఎటు తేల్చుకోలేని జీవితం

జీవితంలో పానం ఎటు పోవాలి 

ఏదారి చూసినా ఎడారి.......!

ఎక్కడా చూసినా అదే దారి

దోపిడీ దారి........!!!

మార్పు రావలంటే ఉద్యమం చెయ్యాలి 

ఊరకనే ఉత్తుత్తి ఉద్యమం కాదు 

ఊరంతా కలిసి రావాలి.........!!!

కొలచిన రామ జగన్నాధ్

విశాఖపట్నం

06.08.2021

8520005313

[06/08, 9:59 am] . Mallapragada: మనసు నిజమై..మర్కటమురా

తనువు చలమై.. ఊయలగుటే

చినుకు మెరుపై..ఆశలుడికే

కనులు పిలుపై.. ప్రేమ పలుకే


వయసు ఉడుకై... తొందరగురా

భయము పరుగై... భారమగురా

నియమ తెరపై... నాన్యతగురా

లయల వలపై.... లాస్య మగురా

        శుభోదయం       🙏

                ----------------

        మహనీయుని మాట

        -----------------------------

   శరీరానికి మరణం ఒక్కసారి

                మాత్రమే....!

                కానీ!

   మనసుకు తప్పు చేసిన ప్రతి

            సారీ మరణమే....!!

                 - గౌతమ బుద్దుడు!

----------------------------------------

😈    నేటి మంచిమాట     😈

----------------------------------------

 బడికి పోవడం మొదలయ్యాక

     తెలిసింది ఆటల విలువ.


 కాలేజీలో చేరిన తర్వాత

     తెలిసింది స్కూలు విలువ.


 ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత

      తెలిసింది చదువు విలువ.


పదవీ విరమణ చేశాక

      తెలిసింది ఉద్యోగం విలువ.


మరణానికి దగ్గరవుతున్నప్పుడు

తెలిసింది జీవితం విలువ.


ఏదైనా మన చేతిలో

ఉన్నప్పుడు తెలియదు

దాని అసలు విలువ.

                  -

🌹. తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక 🌹*

.......

* శేషాద్రి *

* 1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని  తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాము, అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది.* 

*#.అందుకే మొదటి కొండకి..శషాద్రి అని  పేరు.* 

*. వేదాద్రి *

* 2.  ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని  తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం,* 

*#.అందుకే రెండవ కొండకి ... వేదాద్రి అని పేరు.*

*. "గ"రుడాద్రి " * 

* 3.  ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి    మణిపుర చక్రాన్ని తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. "గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు.* 

*#.అందుకే మూడవ కొండకి.. . "గ"రుడాద్రి "  అనే పేరు.* 

*. అంజనాద్రి *

* 4. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి   అనాహత చక్రాన్ని తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు.  ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది.  శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది,  సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.*  

*#.అందుకే నాలుగవ కొండకి.. .అంజనాద్రి  అని పేరు.* 

*. వృషభాద్రి * 

* 5. #.ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి   విశుద్ధ  చక్రాన్ని తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు,  భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది . ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ.* 

*#.అందుకే ఐదవ కొండకి.. . వృషభాద్రి  అని పేరు.* 

*. వేంకటాద్రి * 

* 6.#. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు #.కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు  అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు.  పరమశాంతి కలుగుతుంది.* 

*#.అది ఆరవ కొండ.. . వేంకటాద్రి  అని పేరు.*

*. నారాయణాద్రి * 

* 7. #.తరువాత సాధకుని కుండలిని శక్తి  సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇంక  అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా #తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు.* 

*#.అందుకే ఏడవ కొండకి.. . నారాయణాద్రి  అనీ పేరు.* 

*#.ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం.**

*****

*#.ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లని కూడా పరిశీలిన  చేస్తే అర్ధం అవుతుంది, అవన్నీ ఇలా  8,16,24,32.... (multiples of eight) లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగయోగం చెయ్యమని చెపుతున్నట్లు అన్వయించుకోవచ్చు.*   


*ఎందుకంటే అష్టాంగయోగం అంటే..*

*యమ,  నియమ,  ఆసన,  ప్రాణాయామ,  ప్రత్యాహార,  ధారణ,  ధ్యాన సమాధి. 🌼*


*🙏. భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో బాలాజి మనందరికి కళ్ళ ముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం,*

*🙏🙏. తెరవకపోతే నరులం. 🌼🌹🌼*

🌹 🌹 🌹 🌹 🌹

[06/08, 6:55 pm] . Mallapragada: చక్కని చుక్కగా మనసు మేలును చేయుచు వచ్చె సుందరీ

యాకలి దీర్చగా దలచి యంగన సాగెను సద్ది మూటతో

వేకువ సాక్షి గా పనులు వేగము సాగుట సత్య పల్కుగా

మక్కువ నేస్తమే విషయ వాంఛను తీర్చియు నిత్య సత్య మై

[07/08, 7:25 am] . Mallapragada: సమయ మిదేననీ యనుట సౌఖ్యము పొందుట సర్వులందునన్

సమరము యేననీ యనుట సర్వము తప్పుయు తెల్పుచుండుటన్

విముఖత చూపుటే విషయ వాంఛలు నందును శాంతి పొందుటన్

జమున ను జూడగా విజయ శాంతి లభించె జయప్రదమ్మునన్

[: క్షేమ మనువాద మెప్పుడు క్షౌరమవదు

క్షమయు ఉన్న ను సర్వులు క్షేమం మగును

ఏమి చెప్పినా ధర్మము ఏమియగునొ

పాము పగబట్ట లేదుర పండితుండ

[07/08, 7:41 am] . Mallapragada: ఎదురుగా ఉన్నా ఎందరి కడుపులు లొ ఆకలి తీర్చే ను

వెదురు బొంగులా గ వేణుగానమ్మే చేయలేకున్నాను

బెదురు చూపులతో బెడిసి కొట్టకుండు ముసలి వయసు బతుకు

కుదురు మల్లెనేను కాలముతో బతుకు జీవ సమాధి యే

.....

 విశాల విశ్వ మందునే

విషేష దివ్య మన్నదే

వినోద మున్షి భావమే

వివాదమయ్యె లక్షణం


సరాగరాగమందిరం

విశేష భావ సుందరం

సకాలమోక్షయవ్వనం

సుమాలి ఆశ బంధనం


అనంత పద్మనాభ యే

అనుంగు వేద మంత్ర మే

సుధా సుమాల బంధమై

అకాలమృత్యు మాపుటే


ప్రయాణమే ప్రమాదమే

ప్రకోపమే ప్రకంపణం

ప్రకాశమే ప్రభంజనం

ప్రసాదమే ప్రభుత్వమే

ప్......

: కవులకు కరువైంది కవితలు కొరతైంది కధలు అటక లెక్క

చెవులకు ఇంపుగా చేయు కవితలే వి చెత్త సినిమా లే

భవుని రూపంలో భాగ్యసీమలోన భద్ర రచనలివియె

శివుని మాయలన్ని సంఘమందు వెలుగు ధర్మ ధీక్ష పరమె

కుందేలు తెలివి   (కథ) -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

 

ఒక అడవిలోని జంతువులు కాయకష్టం చేసి ఆహారం సంపాదించుకోవాలని నియమం పెట్టుకున్నాయి.  వాటిలో   కుందేలు వ్యవసాయం చేయాలనుకుంది. అది తెలివైనది కూడా. రాళ్లు రప్పలతో నిండిన భూమిని చదును చేసి పంట పండించాలనుకుంది.  

ఒక చిలుక సాయంతో దగ్గర్లోని రైతునడిగి కేరట్లు, వేరుశెనగ విత్తనాలను  తెచ్చుకుంది కుందేలు. ఎలా పండించాలో రైతు సలహా అడిగింది.  అతడు  చెప్పినట్టే చెయ్యగా  కొన్నాళ్ళకి  కుందేలు పొలంలో పంట బాగా పండింది. 

వారం రోజుల్లో పంట చేతికొస్తుందనగా  ఒక ఉదయం కొంగ బావ ఎగురుకుంటూ  కుందేలు దగ్గరకు వచ్చింది. ‘నీ పొలంలో ప్రక్క అడవి నుండి వచ్చిన   ఎలుగుబంట్లు తిరిగాయి. మొక్కలు వాలిపోయాయంది’. ఎలుగుబంట్లు చేసిన  పనికి బాధపడింది కుందేలు. ఇన్నాళ్ల కష్టం వృధా కాకూడదనుకుంది. ఒక దుడ్డుకర్ర తీసుకుని భుజం మీద వేసుకుని  చేను చుట్టూ కాపలా కాయడం మొదలుపెట్టింది. 

అయితే  అడవిలో చెడ్డ  పేరున్న  పందికొక్కు, ఎలుక, ఉడుత,తొండ కూడా ఉన్నాయి. అవెప్పుడూ  సోమరిగా తిరుగుతూ దౌర్జన్యంగా మిగతావాటి ఆహారం లాక్కునేవి.  

 కుందేలు పొలంలో కేరెట్లు, వేరుశెనగ బాగా పండాయని  తెలిసింది. అవి  చేనులో  మేయడానికి బయల్దేరాయి.  అక్కడ కాపలా ఉన్న కుందేలును చూశాయవి. తమని చూసి నోరుమూసుకుని కూర్చోవాలే తప్ప అడిగితే కొట్టాలని అనుకున్నాయి.  దర్జాగా కుందేలు దగ్గరకి  వెళ్లి “ఈ రోజు  ఇక్కడే మా భోజనం” అన్నాయి గర్వంగా.   

వాటిని  ఆపడం తన తరం  కాదని కుందేలుకి బాగా తెలుసు. అవి కావాలనే  కొట్లాటకు వచ్చాయని అర్ధమయ్యింది.  తెలివిగా ఆలోచించి తరిమెయ్యడం తప్ప మరొక మార్గం కనబడలేదు దానికి. మరుక్షణం ఒక పథకం వేసుకుంది.   “అలాగే కానివ్వండి  మిత్రులారా ! మీ నలుగురు  తిన్నంత మాత్రాన పంటలో ఏ మాత్రం తరుగుతుందిలే! మీరు  తినబోయే ముందు ఒక్క మాట చెబుతా.  ప్రక్కకు వస్తారా?” అని పందికొక్కు , ఎలుక, ఉడుతల్ని  మాత్రమే పిలిచింది. 

తినడానికి అది   ఒప్పుకుందన్న సంతోషంలో ఉన్నాయవి. ఏమీ ఆలోచించకుండా వెళ్లాయి. వాటితో “మీ ముగ్గురు ఒక్కలాగే కనిపిస్తారు నా కంటికి. మధ్యలో  తొండ ఎందుకు? మీరు ముదిరితే కూడా మీ లాగే ఉంటారు కానీ తొండ అలా కాదే !  ఊసరవెల్లి అవుతుంది. అలాంటి  దాంతో మీకు స్నేహమా? దాన్ని పంపించెయ్యండి” అంది.

కుందేలు చెప్పింది సబబే ననుకుని కర్ర తీసుకుని తొండని దూరంగా తరిమేసి వచ్చాయవి.   

ఈసారి పందికొక్కు, ఎలుకలని  ప్రక్కకి  పిలిచింది కుందేలు.  “మీరిద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తారు నాకు. రంగు, రూపుల్లో  ఒక్కటే తీరు. వీపు నిండా చారలతో, చెట్లమీదే గడిపే ఉడుతతో మీకు స్నేహమేమిటి? నా చేనులో ఉడుత దిగడం నాకు ఇష్టం లేదు. దాన్ని తరిమేయండి” అంది.

పందికొక్కు, ఎలుక కలసి ఉడుతను తరిమేసాయి.  ఏదో  చెప్పబోయిన ఉడుతను మాట్లాడనివ్వలేదవి.   మిగిలింది పందికొక్కు, ఎలుక. రెండూ బలిసి ఉన్నాయి కనుక ఎదిరించడం కష్టమేమో అనుకుంది కుందేలు. ఈసారి   పందికొక్కును  ప్రక్కకు పిలిచి “చూడడానికి కొండలా అంతెత్తున ఉంటావు. నువ్వు నడుస్తుంటే మృగరాజులా  అడుగులు పడతాయి.  నీ మీసాలు, దర్పం ఎలుకకు ఎక్కడవి? కలుగులో దాక్కుని పరిగెత్తే దానితో నీకు స్నేహమా? నీతో కలసి ఎలుక తినడం చూడలేను. దాన్ని పంపించేసి  నువ్వు  తిను” అంది కుందేలు. 

పందికొక్కు పొంగిపోయింది. ఎలుకని వెళ్లిపొమ్మంది.  ఎలుక మాట్లాడబోయింది కానీ ప్రక్కనున్న కర్రతో దాన్ని కొట్టి   ‘నీ మొహం చూపించకు.పో!”  అని తరిమేసింది పందికొక్కు.    

మిగిలింది పందికొక్కు మాత్రమే  కావడంతో కుందేలుకి  ధైర్యం వచ్చింది. దుడ్డు కర్ర ఎత్తి పందికొక్కు వీపు మీద గట్టి  దెబ్బ వేసి “కష్టపడి నేను పండించుకుంటే సోమరిపోతులా  తిరుగుతూ  పంట  తిందామని వచ్చావా?   మరొకసారి ఇటువస్తే చచ్చేలా బాదేస్తాను.  బయటికి నడు” అంది కుందేలు. 

పందికొక్కు బిక్కచచ్చిపోయి పరుగు తీసింది.  “హమ్మయ్య . ఈ రోజుకి వాటిని తరిమేసాను. ఇంకోసారి వస్తే మరొక ఉపాయంతో పంపించేస్తాను తప్ప చేనుని వదులుకోను. తెలివుంటే ఎలాంటి ఆపదనైనా సులభంగా గట్టెక్కవచ్చు” అని మనసులో అనుకుని ఊపిరి పీల్చుకుంది కుందేలు. 

   ------*****-------

కుశల కర్మలు అంటే మంచి పనులు. అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు. ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈ రెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. కుశల ధర్మాలు మనకి శాంతిని ఇస్తాయి. అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి.

అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదోఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు. ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది. కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. నడవాలి. 

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు. ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి...

‘భగవాన్‌! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి.

వానినుండి ఎలా బైటపడగలం’’ అని అడిగేవారు. అప్పుడు బుద్ధుడు... ‘మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి’ అంటూ వాటి గురించి చెప్పాడు. అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి  నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి.

అలాంటి వానికి సంపద నష్టం, కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం. అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి. పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి.

మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది. అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు. అని చెప్పాడు బుద్ధుడు. ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు!

వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.

ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.

పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము” అని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.

అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.

శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు  అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు

.......

[06/08, 6:04 pm] +91 94901 53801#day41


శ్రీమాత్రే నమః


సౌందర్యలహరి శ్లోకం 40


తటిత్త్వంతం శక్త్యా తిమిరపరిపంథిఫురణయా

స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషమ్ ।

తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం

నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ ॥ 40 ॥


అర్థం


మణిపూరక చక్రములో అసుముకున్న అంధకారములో మెరుపులా ప్రకాశిస్తున్న భగవతీ! స్వాధిష్ఠానములో అగ్నికి దగ్ధమైన లోకాలకు తన వర్షధారలతో తడుపుతున్నది. నవరత్నాలు ధరించి ఇంద్రధనస్సులా మెరుస్తున్నది. నల్లని మేఘములా ఉండి మేఘరూపములో ఉన్న పశుపతిని ధ్యానిస్తున్నది.


తేగీ।

చీకటి మణిపూరములోన  జిలుగుమెరుపు

చంచలమగు సౌదామిని  జలము కురుయు।

కలసి శివుని శమించు జగములు బ్రోచు

కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥


వివరణ:

మణిపూరంలో పదిదళాలతో ప్రకాశించే చక్రముంది. ఇది జలతత్త్వమున్నది. దీని పది దళాలలో స్వాధిష్ఠాన, ఆధార చక్రాలకు ప్రతీకగా కూడా ఉంది.


ఇక్కడున్న దేవి మూడు ముఖములతో, వజ్రం, శక్తి, దండము, అభయముద్ర ధరించియుంది. ఆమెకు గూఢాన్నమంటే ప్రీతి. ఈమె డామరి మొదలైన శక్తులతో కలిసి ఉంది. ఈమె లాకినీ అన్న పేరు గల యోగిని.


లలితా నామాలలో మణిపూరాబ్జనిలయా నుంచి లాకిన్యంబా స్వరూపిణి వరకూ నామాలు ఈ దేవి గురించి చెప్పినవి.


స్వాధిష్ఠాన మహా సంవర్తాగ్ని వల్ల దగ్ధమైన లోకాలను శివశావానిలు అమృతధారలలో తడుపుతారు. శివుడు మేఘరూపములో, అమ్మవారు మెరుపు సౌదామినిగా ఉంటారు. వీరు ఇక్కడ తటిత్వంతుడు, తటిత్వతి పేర్లతో పిలవబడతారు.


చక్రాల వివరణ:


షట్చక్రాలలో తత్త్వాల గురించి తంత్రశాస్త్రంలో

ఆధారచక్రం- పృథ్వీతత్త్వం

స్వాథిష్ఠానములో జలతత్త్వం

మణిపూరంలో అగ్నితత్త్వం

అనాహతమమ-వాయు

విశుద్ధి - ఆకాశముగా  చెప్పబడింది.


ఇది పంచభూతాలైన ఆకాశ-వాయు-అగ్ని-జ్వల-పృథ్వి తత్త్వాలకు అణుగుణముగా చెప్పబడింది.


కొంత చక్రాల గురించి తెలిసినవారికీ ఇదే వరుస క్రమము తెలుసు.


అయితే మనకు సౌందర్యలహరిలో జగద్గురువులు స్వాధిష్ఠానికి అగ్నితత్త్వము, మణిపూరముకు జలతత్త్వము చెప్పారు. ఈ విధమైన మార్పు కేవలం స్వాధిష్ఠాన మణిపూరకాలకే చెప్పబడింది. (దీని గురించి కొంత అయోమయం కలుగుతుంది. కాని 9వ శ్లోకమైన మహీం మూలాధారే…లో చెప్పేయున్నారాయన…. కమపి మణిపూరే యని)


మానవశరీకము షోమసూర్యాగ్నిమయము.

సోమమంటే చంద్రుడు, సూర్యుడు, అగ్ని కలిసినదే మానవ శరీరము. మూడు ఖండాలుగా ఉంటుంది. ఈ విషయమే మనకు త్రిశతిలో కూడా కనపడుతుంది. పంచదశిలో కూడా ఇదే వివరణ చెబుతారు.


విశుద్ధి నుంచి పైకి చంద్రలోకము. నుదురు నుంచి పైకి జ్యోతిర్లోకము.

అనాహతము - మణిపూరము సూర్య, 


స్వాదిష్ఠాన ఆధారచక్రములు అగ్నితత్త్వములు.


కాబట్టి స్వాదిష్ఠానము అగ్ని తత్త్వము గా చెప్పబడింది. 

అయినా అందులో జలము పాళ్ళ తేడాతో ఉంటుంది.

మణిపూరములో జలము, అగ్ని ఉంటాయి.


(నారాయణుడికి నాభి నుంచి పద్మముదయించినదంటే అక్కడ జలతత్త్వముంది కాబట్టే.) 

ఇదీ ఒక యోగ ప్రక్రియ. దీనిని కూడా పాటించవచ్చును.


దీనిని పరిశీలిస్తే లొల్ల లక్ష్మీధరులన్న పెద్దల వ్రాసిన వ్యాఖ్యలో చెప్పినది -మణిపూరం

జలతత్త్వామైనది. స్వాధిష్ఠాన అగ్ని నుంచి మేఘములుదయించి వర్షించునికడ.


మణిపూరం మణులతో కూడి ఉంటుంది. సూర్యఖండంలో ఉంటుంది. ఇక్కడి జలం మీద ఇంద్రదనస్సు ఏర్పడి ఉంటుంది. దీనికి అల్లెత్రాడు ఉండదు. మేఘస్వరూపుడైన రుద్రుని ధనస్సుకు అల్లెత్రాడు ఉండదని అరుణోపనిషత్తు చెబుతుంది. ఇక్కడ అంటే మణిపూరంలో భగవతి స్థిరమైన మెరుపులా ఉంటుంది. స్వాధిష్ఠానములోని అగ్నికి జల్వము నుంచి మేఘాలుత్పన్నమై మణిపూరం, స్వాధిష్ఠానముల మధ్య ఉంటాయి అని వివరణ 

ఇచ్చారు.


మణిపూరంలో జలమూ ఉంది, అగ్ని ఉన్నా, జలతత్త్వాన్ని సాదనచేసి స్వాధిష్ఠానములో అగ్నిని సాధన చెయ్యటం వలన త్వరగా సాదనలో పూరోగమించవచ్చని జగద్గురువులు ఈ మార్గం ఉపదేశించారు. శంకరులకు పరమగురువైన గౌదపాదులవారి సుభగోదయస్తుతిలో కూడా మణిపూరం జలతత్త్వంగా సూచించారు.

ఒక విషయము గమనించాలి- చక్రాల తత్త్వాల గురించి మార్పు సూచించినా, చక్ర క్రమము మాత్రము వ్యాసాదుల క్రమమే స్వీకరించారు శంకరులు. (ఆకాశ-వాయు-అగ్ని-జలము-పృథ్వీ). ఎందరో పెద్దలు యోగములో ఇదో పద్ధతిగా అంగీకరించారు. జగద్గురువులు సూచించారంటే అది మనకు తెలియనది తెలియచేస్తున్నారన్నది మనము గ్రహించాలి.


సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ

.......


*కురుక్షేత్ర యుద్ధం రహస్యం*


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు దుర్సోధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రథాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి, "బావా చూసావా కౌరవులు ఎలా నశించారో?" అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.

అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ,కర్ణాది మహావీరులూ, శత్రువులంతా ఎలా తన అస్త్రశస్త్రాలకి బలైంది తనకళ్ళకు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన మేటి విలుకాడే ఈ భూమి మీదే లేకుండాపోయాడు.

అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క ఉదుటన రథం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు. భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.


"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు. అవును పితామహా... సుయోధనుడి ఊరువులను ఇప్పుడే భంగపరిచాను. గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."


"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"


"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." అని నకులుడన్నాడు. నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా అని సహదేవుడాన్నాడు.భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు.


"అర్జునా. పిలిచాడాయన నెమ్మదిగా."చెప్పండి పితామహా.."


"నీవేమి చెప్పవేం..??"


"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను,కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను. ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము."


"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి గంగాతనయునికి నమస్కరించాడు.


"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు. ధర్మపక్షపాతివై ధర్మం పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదేకదా ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."


ఆ మాటలువింటూనే అర్జునిడికి ఎక్కడలేనికోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు. యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అని మనసులో అనుకున్నాడు.


అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రథాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూసాడు. ఝండా పై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథంముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు.


"శ్రీరామచంద్రా... వాసుదేవా.. పరంథామా నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్ధుడి రథంపై ధ్వజమై నిలిపి నీవు లోకానికి ప్రసాదించిన భగవద్గీతాసారం విని నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రథంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.


అంతే... ఫెళ ఫెళ మంటూ శబ్దం చేస్తూ రధం కుప్పకూలిపోయింది. రథచక్రాలు తునాతునకలయ్యాయి. రథాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపితులై చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చాడు.


అర్జునుడు కూడా భయపడుతూ "బావా వాసుదేవా" అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా. ఆ మాటలు వింటునే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.


"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు -"పార్థా నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరమార్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."


"బావ నన్ను కాపాడాడా.?"


"అవును అర్జునా... ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు... భీష్ముని బాణ ధాటికి నీ రథ చక్రాలు ఏనాడో కూలాయి. కర్ణుని అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రథం అప్పుడే తునాతునకలయ్యింది. బ్రహ్మాస్త్రం ధాటికి నీ రథం యావత్తూ బూడిదయ్యింది."|


"మరి..?"


"నీ రథం పైన సాక్షాత్తు ఆది విష్ణువే ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవుడు రథంనుండి కిందికి దిగడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రథం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా! అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంథాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."


హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం ఏమిటో బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.


"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.


సేకరణ. మానస సరోవరం 👏

[07/08, 10:14 am] +91 94901 15412: _*రేపు చుక్కల అమావాస్య రేపటి రోజు ఏం చేయాలి*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


 

ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...

 

హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. 


ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !

 

ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.

 

ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా *‘చుక్కల అమావాస్య’* పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !

 

ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. 🪔🙏

 *కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️


🏵️1. _*అజీర్ణే భోజనమ్ విషమ్.*_

➖➖➖➖➖➖➖➖➖➖➖

మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజ నం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.


🏵️2. *అర్ధరోగహరి నిద్రా*

➖➖➖➖➖➖➖➖➖

సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.


🏵️3. _*ముద్గధాలి గధవ్యాలి*_

➖➖➖➖➖➖➖➖➖➖

అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,

 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.


🏵️4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.


🏵️5. *అతి సర్వత్రా వర్జయేత్*

➖➖➖➖➖➖➖➖➖➖➖

అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.


🏵️6. *నాస్తిమూలం అనౌషాధం*

➖➖➖➖➖➖➖➖➖➖➖

శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.


🏵️7. *నా వైద్యా ప్రభుయుయుషా*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


🏵️8. *చింతా వ్యాధి ప్రకాషయ*

➖➖➖➖➖➖➖➖➖➖➖

చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.


🏵️9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.


🏵️10. *అజవత్ చార్వనం కుర్యాత్*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.


🏵️11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.


🏵️12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా.*

➖➖➖➖➖➖➖➖➖

ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.


🏵️13. *నాస్తి మేఘసమం తోయం.*

➖➖➖➖➖➖➖➖➖

స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.


🏵️14. *అజీర్నే భేజాజం వారీ*

➖➖➖➖➖➖➖➖➖➖

మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.


🏵️15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*

➖➖➖➖➖➖➖➖➖➖

తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)


🏵️16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.*

➖➖➖➖➖➖➖➖➖➖

ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.


🏵️17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి*

➖➖➖➖➖➖➖➖➖➖

మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.


🏵️18. *భుక్త్వోపా విసస్థాంద్ర*

➖➖➖➖➖➖➖➖➖

ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.


🏵️19. *క్షుత్ సాధూతం జనయతి*

➖➖➖➖➖➖➖➖➖➖

ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)


🏵️20. *చింతా జరానామ్ మనుష్యానమ్*

➖➖➖➖➖➖➖➖➖➖

చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.


🏵️21. *సతం విహయ భోక్తవ్యం*

➖➖➖➖➖➖➖➖➖➖

ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.


🏵️22. *సర్వ ధర్మేశు మధ్యమామ్.*

➖➖➖➖➖➖➖➖➖➖ 

ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం  తప్పక లభిస్తాయి.


స్వస్తి.....


        👉👉సర్వేజనా సుఖినోభవంతూ👈👈

🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️

No comments:

Post a Comment