Tuesday, 17 August 2021

 

  

 


🌻. శ్లోకం 171.

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా
కౌలినీకేవలా నర్ఘ్య కైవల్యపదదాయినీ

920. దక్షిణా : దాక్షిణ్యము కలిగినది
921. దక్షిణారాధ్యా :దక్షిణాచారముచే పొజింపబదుచున్నది
922. దరస్మేరముఖాంబుజా :చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది
923. కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబదుచున్నది
924. కేవలా :సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
925. అనర్ఘ్య కైవల్యపదదాయినీ :  అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును

తేట గీతి
మోక్షమును ఇచ్చు దాక్షిణ్యము కలిగినది
దక్షిణాచార్యు నిచె పూజ చేయు చున్న
హాస్య ముఖపద్మ కలిగిన కౌళినీ యె
తాను ఒక్కటి మూలమైన మోక్ష మిచ్చు......1.7.1.  

--(())--

🌻. శ్లోకం 172.
స్తోత్రప్రియా స్తుతిమతే శ్రుతిసంస్తుతవైభవా
మనస్వినీ మానవతీ మహేశే మంగాళాకృతి:

926. స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది
927. స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
928. శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
929. మనస్వినీ : మనస్సు కలిగినది
930. మానవతీ : అభిమానము కలిగినది
931. మహేశే : మహేశ్వర శక్తి

తేట గీతి
వేదములచేత వైభవము కలిగినది  
అభి మహేశ్వర శక్తిని కలిగి యుండె   
స్తోత్రములు అని నను  ఇస్ట ము కలిగినది
ఇష్ట ముకలిగి అభిమాన మ0త చూపు

--(())--

🌻. శ్లోకం 173.
విశ్వమాతా జద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా మరామోదా మనోమయీ

933. విశ్వమాతా : విశ్వమునకు తల్లి
934. జద్ధాత్రీ : జగత్తును రక్షించునది
935. విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
936. విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
937. ప్రగల్భా : సర్వసమర్ధురాలు
938. పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
939. మరామోదా : పరమానందము కలిగినది
940. మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది

తేటగీత
విశ్వమునకు తల్లి జగతి రక్ష చేయు
కన్నులు విశాల ముగనుండి లోక దృష్టి
చేయుచూ దేని తోను భంధములు లేని
సర్వ మానందము సమర్ధతను తెలుపు..173

🌻. శ్లోకం 174.
 వ్యోమకెశే విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ
పంచయఙ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ

941. వ్యోమకెశే : అంతరిక్షమే కేశముగా కలది
942. విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
943. వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
944. వామకేశ్వరీ  : వామకేశ్వరుని శక్తి
945. పంచయఙ్ఞప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
946. పంచప్రేతమంచాధిశాయినీ :  పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది.

తేటగీత
అంత రిక్షమే కేశముగా గలిగి మనసు
రూపముగలిగి వజ్రము ఆయుధము గ
వామ కేశ్వరుని శక్తిగ అంత రిక్ష
వాహనమనందు సంచారి ప్రీతి గొలుపు .....174

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 


🌻. శ్లోకం 175.

పంచమే పంచభూతేశే పంచసంఖ్యోపచారిణి
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ

947. పంచమే : పంచకృత్యపరాయణి
948. పంచభూతేశే : పంచభూతములను ఆఙ్ఞాపించునది
949. పంచసంఖ్యోపచారిణి :  శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
950. శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది
951. శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది
952. శర్మదా : ఓర్పు ను ఇచ్చునది
953. శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది

శాశ్వితమ్ము గాను ఐశ్వర్యము కలదు
ఓర్పు ఇచ్చు నదియు పంచభూత
ములను ఆజ్ఞ చేయు పంచకృత్యపరాయ
ణిగను ఈశ్వర శక్తి నీ వె నమ్మ  
   --(())--

🌻. శ్లోకం 176.
 
ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా

954. ధరా : ధరించునది
955. ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
956. ధన్యా : పవిత్రమైనది
957. ధర్మిణీ : ధర్మస్వరూపిణి
958. ధర్మవర్ధినీ : ధమమును వర్ధిల్ల చేయునది
959. లోకాతీతా : లోకమునకు అతీతమైనది
960. గుణాతీతా : గుణములకు అతీతమైనది
961. సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు
962. శమాత్మికా : క్షమాగుణము కలిగినది

తేటగీత
ధర్మ వర్ధినీ ధర్మిణీ కలిగి ఉన్న
గుణముల అతీత మైనట్టి మహిమ ఉన్న
అన్నికళల అతీతు రాలు గున్న
లోక జీవులు సంతాన ముగను కలిగె

--(())--
     

శ్రీ లలితా సహస్ర నామములు - 92 / Sri Lalita Sahasranamavali - Meaning - 92 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻.. తేటగీత/ఆటవెలది పద్యాలు  
🌹

🌻. శ్లోకం 177.
బంధూకకుసుమప్రఖ్యా బాలాలీలావినోదినీ
సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ

964. బంధూకకుసుమప్రఖ్యా :  మంకెనపూలవంటి కాంతి కలిగినది
965. బాలా : 12 సంవత్సరముల లోపు బాలిక,,,,బాల
966. లీలావినోదినీ : బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది
967. సుమంగళి :  మంగళకరమైన రూపము కలిగినది
968. సుఖకరీ : సుఖమును కలిగించునది
969. సువేషాఢ్యా : మంచి వేషము కలిగినది
970. సువాసినీ : సుమంగళి

ఆటవెలది :
మంచి వేషము కలిగించు రూపధారి
సుఖము ఇచ్చు మనసు నీది నమ్మ
లోక సృష్టి గాన  హాస్యపు చూపున్న
బాలి కగను కాంతి నిచ్చు తల్లి           

🌻. శ్లోకం 178.

సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా

971. సువాసిన్యర్చనప్రీతా : సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది
972. శోభనా  : శోభ కలిగినది
973. శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
974. బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది
975. పూర్వజా : అనాదిగా ఉన్నది
976. త్రిపురాంబికా :  త్రిపురములందు ఉండు అమ్మ

ఆటవెలది
అమృత బిందు తర్పణముచేను స0తృప్తి
తృప్తి పొంది త్రిపుర ము0దు ఉండు అమ్మ    
శోభ కలిగి మంచి మనసు  సుమంగళి
అర్చ నందు ప్రీతి కలిగు తల్లి
 
సశేషం...
 

*

 నమస్కారం.

ఒకసారి ఓ వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పండితునకు తెలుసు.., తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని.. శివకేశవ అభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని..

ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు.. ఆ వ్యక్తి చదివి నివ్వెర పోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది..

గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజిత పాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

చదవగానే ఆశ్చర్యపోయాడు... ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి..

గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం.. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పర్వత పుత్రిక.., అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడూ..
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆది మధ్యాన్త రహితుడు అయినవాడూ, అటువంటి పరమేశ్వరః నః పాయాత్ ....
వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింపబడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం..

మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే..!" అని చెప్పి అతనికి ఆ శ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు.

 " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోనలేదు.

 న+ఆది.., అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నాను అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."

గవీశపాత్రః ... లో గ తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,

గరుడుని చేత గౌరవింప బడువాడు, ... అంటే గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము చేసినవాడు విష్ణువు..

కుమార తాతః .... 'కు' తీసివేస్తే మార తాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)

శశిఖండ మౌళి: ... 'శ' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలి పింఛము ధరించినవాడు.. కృష్ణుడు., అనగా విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: .. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .

క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు.. విష్ణువు.

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. .

ఇక 'ప' తీసివేస్తే రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా..! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

అడిగినతడు సిగ్గుతో తలవంచుకొన్నాడు..

గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రసాయనాది ఏ శాస్త్రమున కైనా మహనీయులు వ్రాసిన రామాయణ, భారత, భాగవత, రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము.

 ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆ భాషకు అనుంగు బిడ్డ అయిన తెలుగు నేర్పించండి....

ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది... 


 అత్యంత విలువైన సమాచారం ..

కస్తూరీ మృగం అంటే ఒక రకమైన జింక, సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది, అది మంచి మదపువాసనగా ఉంటుంది, అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా ..? అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది, ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నది అని అది గ్రహించలేదు, ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది, ప్రాణాలు కోల్పోతుంది ...

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలనీ, తీర్ధయాత్రలనీ, అనవసరంగా తిరిగి కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు ..

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ శ్రీకృష్ణుణ్ణి కూడా తమతో తోడుగా రమ్మని పిలుస్తారు ..

ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెబుతాడు, వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు, అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి, వారికి వడ్డింపచేస్తాడు శ్రీకృష్ణుడు, ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది ..

ఇది చేదు దోసకాయ ..  కటికవిషంలాగా ఉంది ..
ఇలాంటి వంటకం చేయించావేమిటి ..? అని/పాండవులు అడుగుతారు, శ్రీకృష్ణుడు నవ్వి, ఎన్ని గంగలలో మునిగినా, ఈ దోసకాయ చేదు పోలేదు,  ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని శ్రీకృష్ణుడు, ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం ..

మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలకు జరగాలి, యాత్ర అనేది బయట కాదు, అంతరికంగా యాత్రను మనిషి చెయ్యాలి, ఈ ప్రపంచమంతా మనిషి తిరిగినా, తనలో మార్పు రాని పక్షంలో, ఏమీ సాధించలేడు, అదే తనలోనికి, తాను ప్రయాణం చేస్తే, ఉన్న గదిలో నుంచి కదలకుండా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు, మహర్షులు, మునులు ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందారు, కేవలం గ్రంథాలను,  ఇంట్లో పెట్టుకోవడం వలన లాభం శూన్యం, చదవి తర్వాత, ఆచరణలో తీసుకుని వస్తే శుభం కలుగుతుంది ..


 అహం - భావం

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.... ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు.
ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.
ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి.
ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి... ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను.
కాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను, మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంచుతాను...
అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది.
నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు ... ' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది..., శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.
దేవత వెతుకుతూ వస్తోంది, ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి...
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు , శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది,  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేక పోయింది.
ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వేల్లిపోవలనుకొని  వెనుతిరిగింది.
శిల్పి ఆనందనాకి అవధులు లేవు, తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు...
 ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! అంది.

'' అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది, తన కెరీర్ లో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు, అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు.
వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' ఏది ? ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది, ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , " నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని, కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే, నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు !  ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది, అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది."

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.
అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది.
నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము.
స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.
'' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు...

          🔥శుభమస్తు🔥
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
[08:40, 17/08/2021] Mallapragada Sridevi: 🌹🌺🌿🌿💐🌴🪴🍀✍️

భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అంటారు. ఈ గ్రంథం శ్రీరాముని చరిత్రను చెబుతున్నది కనుక రామాయణం అనీ, సీత చరిత్రను వర్ణిస్తుంది కనుక సీతాయాశ్చరితమని, రావణుని వధ గురించి చెబుతున్నది కనుక పౌలస్త్యవధ అనీ పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ, మానవ, వానర, రాక్షస పాత్రలు ఉన్నాయి. వాటిలోని స్త్రీ పాత్రలకు సంబంధించిన వివరాలు:

అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.

అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.

అరుంధతి- వశిష్ట మహర్షి భార్య.

అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.

ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె తపస్సాధనలో ఉన్నది.

కైకసి- రావణుడు, కుంభకర్ణు, విభీషణుల తల్లి.

కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.

కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.

ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

జంఝాట

*తాటకి *- మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.

తార - వాలి భార్య. అంగదుని తల్లి.

*త్రిజట *- రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.

ధాన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.

అనల- విభీషణుని కుమార్తె.

మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, తల్లి.

మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.

మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.

రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.

లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .

వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.

*శబరి *- రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.

శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.

శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.

*శ్రుతకీర్తి *- కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.

సరమ- విభీషణుని భార్య.

సింహిక- హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

సునయన - జనక మహారాజు భార్య.

*సుమిత్ర *- దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.

సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.

సులోచన - ఇంద్రజిత్తు భార్య

*సీత *- జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.
🌹🌺🏵️🌿💐🌴🪴🍀✍️
[08:43, 17/08/2021] Mallapragada Sridevi: అగరుబత్తి (పరిమళం)

     కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు..
 
  అది చూసిన తల్లి ముఖం చీదరించుకుని.., మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మహా పిసినారి.. అంటూ లోపలికి వెళ్లి మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది.. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది.

     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది..
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది..
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది.. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.. ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది..

    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది..

      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను..

     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు..
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావ్ కదా..
కాదు.. కాదు..

     మీ అమ్మ, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో.. నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..

    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక..

     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం.. నిజంగా మేము ధన్యులం... 🙏

                  _శ్రీనివాసరావు ఊట్కూరు
   
         🙏సర్వేజనాః సుఖినోభవంతుః🙏
[08:52, 17/08/2021] Mallapragada Sridevi: క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మనదేశంలో ఇన్నివిధాలుగా దేవుని తార్కాణాలు లభించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది

సేకరణ:-

No comments:

Post a Comment