_*🚩ఈ రోజు చౌడేశ్వరీ దేవి జయంతి🚩*_
*బనగానపల్లె మండలం లోని నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ చరిత్ర*
కర్నూలు జిల్లాలోని నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడనే రాజు ప్రజారంజకంగా పాలించేవాడు. ఆయన దత్తాత్రేయుడికి భక్తుడు. ఈ క్రమంలో ఒకరోజు దత్తత్రేయుడు ప్రత్యక్షమయ్యి కోరిన చోటుకు తీసుకువెళ్లే పావుకోళ్లు (పాదరక్షలు) నంద భూపాలుడికి అందజేస్తాడు. అంతేకాకుండా రోజూ కాశీకి వెళ్లి అక్కడి గంగలో స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడు. దీని వల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పావుకోళ్ల విషయం ఎవరికీ చెప్పకూడదని షరత్తు విధిస్తాడు. ఇందుకు అంగీకరించిన రాజు ఆ పావుకోళ్లను తీసుకొంటాడు. దత్తత్రేయుడు చెప్పినట్లు ప్రతి రోజు బ్రహ్మముహుర్తంలోనే కాశీకి వెళ్లి అక్కడి గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని కాశీ విశాలక్షిని సందర్శించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు. ఇదిలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతి రోజు తన భర్త రోజూ తెల్లవారుజామున ఎక్కడికో వెలుతున్నాడని అనుమానం వస్తుంది. ఒక రోజు ఇదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ పెట్టుకొంటుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతోపాటు కాశీకి తీసుకొని వెలుతాడు. అక్కడ స్నానాలు ముగించుకొన్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది. దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయల్సిందిగా అక్కడే ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరుతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు లోనవుతారని బాధపడుతాడు. అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని వేడుకొంటారు. దీంతో ఆ బ్రహ్మణులు తమ తపఃశక్తిని రాజుకు , ఆయన భార్యకు అందజేస్తారు. ఇందుకు సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి భార్యా సమేతుడై నందవరానికి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది. దీంతో బ్రహ్మణులు తమకు సహాయం చేయాల్సిందిగా నందవరంకు వచ్చి రాజును అర్థిస్తాడు. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలోని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్నదానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నిస్తారు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి చౌడేశ్వరీ దేవి సాక్షమని ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు చెబుతారు. దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీ దేవిని ఇక్కడకు రప్పించి సాక్షం చెప్పల్పిందిగా సవాలు విసురుతాడు. దీంతో బ్రహ్మణులు తిరిగి కాశీకి వెళ్లి అక్కడ చౌడేశ్వరీ అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరుతారు. ఇందుకు చౌడేశ్వరీ దేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరత్తు విధిస్తుంది. మీరు తోవ చూపిస్తూ ఉంటే నేను మీ వెనుక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరు వెను తిరిగి చూసినా తాను వెనక్కు వెళ్లిపోతానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రహ్మణులు చౌడేశ్వరీ అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక సొరంగం గుండా బయలు దేరుతారు. నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రహ్మణుడు వెనక్కు తిరిగి చౌడేశ్వరీ దేవి వస్తోందో ? లేదో ? అని చూస్తాడు. దీంతో చౌడేశ్వరీ దేవి అక్కడే శిలరూపంలో ఉండిపోతుంది. విషయం తెలుసుకొన్న రాజు అక్కడికి వచ్చి బ్రహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యం వారికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతారు. ఇక మీరు కూడా తన రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు. ఇందుకు బ్రహ్మణులు అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రహ్మణులను నందవరీకులని పిలుస్తారు. వీరు ఇప్పటికీ తమ కులదైవతగా చౌడేశ్వరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు వచ్చిన సొరంగం ఇప్పటికీ ఉంది. అయితే అందులోకి ఎవరినీ అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేది. దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు. దీంతో రాజు అమ్మవారు శిలా రూపం దాల్చిన చోటు పై భాగంలో అంటే భూమి పైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించాడు. ఇక అమ్మవారి విగ్రం ఒక చేతిలో ఖడ్గం , మరోచేతిలో కుంకుమ భరిణే ఉంటుంది. అమ్మవారి గర్భగుడికి బయట ఒక చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు. ఇక ఈ చౌడేశ్వరీ అమ్మవారిని సందర్శించుకొంటే సఖల శుభాలు జరుగుతాయని , భయాందోళనలు సమిసిపోతాయని భక్తులు చెబుతుంటారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణానికి చౌడేశ్వరీ దేవాలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బనగానపల్లె నుంచి నిత్యం ప్రభుత్వ బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రైవేటు ఆటోలు , ట్యాక్సీలు కూడా ఇక్కడకు వెలుతుంటాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#సంతృప్తితో_జీవించాలి
అన్నీ ఉన్నా కూడా నాకింకా కావాలనే భావం దురాశవల్ల కలుగుతుంది. అది లేకపోవడమే సంతృప్తి. ఆరోజుకు ఏది దొరికితే దానితో సంతృప్తి చెందాలి. రేపటి సంగతి భగవంతుడు చూచుకొంటాడు అనే సద్భావన అలవరుచుకోవాలి.
మన పూర్వీకులు ఎలా ఉండేవారు? దానికి సమాధానం ఒక శ్లోకంలో ఉంది.
यो मे गर्भगतस्यापि वृत्तिं कल्पितवान् प्रभुः |
शेष वृत्ति विधाने तु सुप्तः किन्नु मृतोथवा ||
ఇప్పుడు నా బుద్ధి, నా శరీరమూ బాగా పనిచేస్తున్నాయి. కాని మాతృగర్భంలో ఉన్నప్పుడు నేను నిస్సహాయుడనుగా ఉండేవాణ్ణి. సరియైన బుద్ధిబలం లేదు. ఆ సమయంలో ఆహారం సంపాదించుకొనే సామర్థ్యం నాకు ఉండేదా? లేదు. అప్పుడు నన్ను రక్షించినవాడు భగవంతుడేకదా. ఇప్పుడు మాత్రం నేనెందుకు బాధపడాలి? ఆ భగవంతుడు ఇప్పుడు నిద్ర పోతున్నాడా? అలాంటిదేమీ లేదు. అందుచేత నేను నా కర్తవ్యాన్ని చేస్తాను. నాయోగక్షేమం భగవంతుడు చూస్తాడు.
ఈభావంతో ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఫలితాన్ని భగవంతుని మీద వదిలే దృక్పథం అలవరచుకోవాలి. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని తప్పక నిర్వహించాలి. సోమరితనం ఉన్నవానికి పరమేశ్వరుడు ఏమీ ఇవ్వడు. తన కర్తవ్యాన్ని తాను ప్రతినిత్యం చేస్తేనే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అందువల్ల ఏ ఆశలేకుండా కర్తవ్యపరాయణుడైన వాడే సంతృప్తితో ఉండగలుగుతాడు. తృప్తిగా ఉంటేనే జీవితంలో సుఖం అనుభవించగలుగుతాడు.
|| हर नमः पार्वती पतये हरहर महादेव ||
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
-----------------------------------
*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*
15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల గోష్టి నుంచి ఒక పండితుడు షేర్ చేసి వారు చేసిన కృషియే ఈ అక్షర రూపం
1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని
ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా
ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!
2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..! (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)
3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!
4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!
5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం..ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!
6. బఫే భోజనాలు.ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!
7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.
వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.
అందరూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం
నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
మిత్రులు అందరికి హెచ్చరిక* :-
రేపటి నుండి, నెట్వర్క్ చిత్రాలను పంపవద్దు, అర్థం చేసుకోవడానికి క్రింది కథనాన్ని చూడండి.
దయచేసి గుడ్ మార్నింగ్, గుడ్ఈవినింగ్, గుడ్ నైట్ మరియు ఇతర శుభాకాంక్షల యొక్క అన్ని ఫోటోలు మరియు వీడియోలను వీలైనంత త్వరగా తొలగించండి. తరువాతి కథనాన్ని జాగ్రత్తగా చదవండి మీకు ఎందుకో అర్థం అవుతుంది.
అన్నీ చదవండి! చట్టవిరుద్ధమైన చొరబాట్లను నివారించడానికి వీలైనంత ఎక్కువ మంది స్నేహితులకు ఈ సందేశాన్ని అత్యవసరంగా పంపండి.
*ఓల్గా నికోలెవ్నాస్ న్యాయవాది నుండి హెచ్చరిక:*
గుడ్ మార్నింగ్, అందమైన రోజు, శుభ సాయంత్రం, శుభరాత్రి
దయచేసి ఈ మంచి సందేశాలను పంపవద్దు.
ఈ రోజు, షాంఘై చైనా ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని చందాదారులకు SOS పంపింది . మరియు నిపుణులు సలహా ఇస్తున్నారు: గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలైన చిత్రాలు మరియు వీడియోలను పంపవద్దు.
చైనాపై దాడి చేసిన హ్యాకర్లు ఈ చిత్రాలను రూపొందించారని, ఈ చిత్రాలు మరియు వీడియోలు అందంగా ఉన్నాయని నివేదిక చూపిస్తుంది, కానీ ఒక దాచిన ఫిషింగ్ కోడ్ ఉంది మరియు ప్రతి ఒక్కరూ ఈ సందేశాలను పంపినప్పుడు, హ్యాకర్లు మీ పరికరాన్ని బ్యాంక్ కార్డ్ సమాచారం మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగిస్తారు. డేటా మరియు మీ ఫోన్లోకి ప్రవేశించండి.
500,000 మందికి పైగా బాధితులు మోసపోయినట్లు సమాచారం.
మీరు ఇతరులకు హలో చెప్పాలనుకుంటే, దయచేసి మీ స్వంత శుభాకాంక్షలు రాయండి మరియు మీ స్వంత చిత్రాలు మరియు వీడియోలను పంపండి, తద్వారా మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను మీరు రక్షించుకోవచ్చు.
ముఖ్యమైనది safe సురక్షితంగా ఉండటానికి, దయచేసి మీ ఫోన్లోని అన్ని విదేశీ శుభాకాంక్షలు మరియు చిత్రాలను తొలగించాలని నిర్ధారించుకోండి. ఎవరైనా మీకు అలాంటి చిత్రాలను పంపినట్లయితే, వాటిని వెంటనే మీ పరికరం నుండి తొలగించండి. హానికరమైన కోడ్ అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకుంటే, ఎటువంటి హాని జరగదు.
హ్యాక్ చేయకుండా ఉండటానికి మీ స్నేహితులందరికీ చెప్పండి.
మీ స్వంత మాటలలో హలో చెప్పండి మరియు మిమ్మల్ని పలకరించడానికి మీ స్వంతంగా సృష్టించిన చిత్రాలు మరియు వీడియోలను మాత్రమే పంపండి, ఇది మీ కోసం, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు పూర్తిగా సురక్షితం. దయచేసి నా ఉద్దేశ్యం అర్థం చేసుకోండి! ప్రతిఒక్కరికీ వారి మొబైల్ ఫోన్కు బ్యాంక్ కార్డ్ జతచేయబడి ఉంటుంది మరియు ప్రతిఒక్కరి మొబైల్ ఫోన్కు చాలా పరిచయాలు ఉన్నాయి. ఈ హాక్ మీకే కాదు, మీ ఫోన్, స్నేహితులు మరియు పరిచయస్తులకు కూడా ముప్పును సృష్టిస్తుంది! ఇది క్రూరమైనది
మీ మొబైల్ ఫోన్ సిమ్ కార్డును సందర్శించడానికి ఉగ్రవాదులు ఉపయోగించే కొత్త టెక్నిక్ ఇది, తద్వారా మీరు వారి సహచరుడు అవుతారు !!!
* * * అనధికార చొరబాట్లను ఆపడానికి వీలైనంత ఎక్కువ మంది మీ బంధువులు మరియు స్నేహితులకు ఈ సందేశాన్ని పంపండి !!!
రేపటి నుంచి శుభోదయం wishes పంప వద్దు అని నిర్ణయం తీసుకున్నాను.
*అమ్మ....."
రెండు కిలోల రాయిని నడుముకు కట్టుకుని ఓ వారం ఉండగలరా?
రెండు నుంచి మూడు కిలోల పసికందును కడుపులో పెట్టుకుని తొమ్మిది నెలలు మోస్తుంది అమ్మ.
*ఆమెను మించిన శ్రామికులెవరు?*
శరీరం 45 డెల్ (నొప్పికి కొలత) యూనిట్ల నొప్పినే భరించగలదు. మరి 57 డెల్ యూనిట్ల నొప్పిని భరించగలరా ఎవరైనా?
20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని పురిట్లో భరిస్తుంది అమ్మ.
*ఆమెను మించిన కార్మికులెవరు?*
ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమంటేనే వేలకు వేలు డబ్బులడుగుతారు.
లాలపోసి... సాంబ్రాణి వేసి.. బట్టలు తొడిగి... ఊయల ఊపి.. జోల పాటతో నిద్రపుచ్చేది అమ్మ.
*ఆమెను మించిన శ్రమ జీవులెవరు?*
రైల్వేస్టేషన్లో లగేజీని కొద్దిదూరం మోయమంటేనే రూ.వందలు అడుగుతారు కూలీలు.
270 రోజులు కడుపులో... 1095 రోజులు భుజాల మీద... బతికినన్ని రోజులు మనల్ని గుండెల్లో మోసేది అమ్మ.
*ఆమెను మించిన కూలీలెవరు?*
కార్మికుడు... రక్తాన్ని స్వేదంగా మలిచి సమాజాభివృద్ధికి కృషి చేస్తే...
అమ్మ... రక్తాన్ని పాలగా మలిచి ఆ సమాజాన్నే తయారు చేస్తుంది.
ఏమిచ్చినా సరితూగని ప్రేమ
సాయం చేయమంటే! ఎవరో ఒకరు చేయొచ్చు. ఏదో ఒకటి ఆశించవచ్చు. మన కోసం బాధను భరించమంటే మాత్రం ఎవరూ ముందుకు రారు. అమ్మ అలా కాదు. మనల్ని ఈ లోకంలోకి తేవడానికి ఎంత బాధ]పడుతుందో తెలుసా? కడుపులో నలుసు పడ్డప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఏమి తిన్నా వాంతులు... నీరసం అయినా ఆనందంగానే సహిస్తుంది. కడుపులో బిడ్డ కాస్త కుదుట పడ్డాక... దాదాపు ఆరు నెలల పాటు కంటి మీద కునుకు లేక, కంటి నిండా నిద్రపోక ఎంతగానో ఇబ్బంది పడుతుంది. బిడ్డ కలలతోనే సంతోషం పొందుతుంది. ఆపైన పురిటి నొప్పులు, బాలింత కష్టాలు... అన్నీ మన కోసమే. మనం పుట్టడం కోసమే.
మరి వీటన్నింటినీ ఎంత జీతమిస్తే చేయించుకోగలం?
ఆమె అడిగే జీతం ప్రేమ.
*వెలకట్టలేని శ్రమ*
సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయడానికి వేలకు వేలు డబ్బులడుతారు. మరి మన మలమూత్రాలను ఎత్తేయమంటే ఎవరైనా చేస్తారా? ఎంత కూలీ ఇచ్చినా ఈ పనికి ఎవరైనా అంగీకరిస్తారా? అమ్మ ఇవన్నీ చేస్తుంది. మనం పాడుచేసే దుస్తులన్నింటినీ ఉతుకుతుంది. మనకు ఆరోగ్యం బాగోలేకపోతే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. మనకు గాయమైతే తను ఏడుస్తుంది. నిద్ర రాకపోతే జోలపాటవుతుంది. మనం ఆడుకోవడానికి మోకాళ్ల మీద గుర్రం అవుతుంది. మనతో చిన్నపిల్లలా తోడు పరుగెడుతుంది. ఏడిస్తే ఓదారుస్తుంది. నవ్వితే సంతోషిస్తుంది.
ఇన్ని పనులకు ఎంత కూలీ ఇస్తే చేస్తారు?
ఆమె అడిగే కూలీ "ఆప్యాయత".
*స్వేదామృతం*
మనకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు ఎత్తుకొని నిలబడుతుందో అమ్మ. నడిపించడానికి ఎన్నిసార్లు పడిపోతోందో.. పరిగెడుతుందో? వచ్చీరాని మన మాటలకు దుబాసీలా మారి ప్రపంచానికి చెబుతుంది. ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. బడిలో విడిచి వెళ్లడానికి ఆమెగుండె ఎన్ని సార్లు పగిలిపోతుందో? ఎక్కడికైనా వెళ్లి ఆలస్యంగా వస్తే... ఎన్నిసార్లు ఆ కళ్లు గడియారాన్ని చూస్తాయో? ఆ మనసు ఎంతగా నిరీక్షిస్తుందో? పరీక్ష పాసైతే పండగ చేసేది, ఉద్యోగం తెచ్చుకుంటే విజయ పతాకం ఎగరవేసేది అమ్మ. కన్నీళ్లు వస్తే కొంగుతో తుడుస్తుంది. తప్పు చేస్తే కొంగుచాటున దాస్తుంది. తన ఆయుష్షూ మనమే పోసుకోవాలని జీవితాంతం దీవిస్తుంది.
*ఇంతటి స్వేదజీవికి
ఎంత వేతనం ఇవ్వాలి?*
ఆమె కోరే వేతనం "మన ఎదుగుదల".
అందుకే *"అమ్మ"* కు పాదాభివందనం.
***ప్రాయశ్చిత్తం (కథ) -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
మహా భారత యితిహాసాన్ని, అష్టాదశ పురాణాలు, భాగవతము వ్రాసి వేదవిభజన చేసిన వ్యాసుడు నాలుగు లక్షలకు పైగా శ్లోకాలు రచించాడు. ఆయన గ్రంథాలలో పాత్రల సంఖ్య వేలల్లో ఉంటుంది. అందువలన ‘చ' అక్షరం అనేక మార్లు వినియోగించారు.
తరతరాల రాజుల పేర్లు, ఋషుల పీర్లు వ్రాసేటప్పుడు 'భవాన్ భీష్మశ్చ,కర్ణశ్చ,కృపశ్చ, సమితింజయ' అని 'చ'కారం వాడేవారు. అది తెలిసిన మహాకవి కాళిదాసు వేదవ్యాసుడిని 'చ'కార కుక్షి అని సంబోధించేవాడు. ఆయన మీద గౌరవం అమితంగా ఉన్నప్పటికీ అలా పిలవడం కాళిదాసు బలహీనత.
ఒకరోజు కాళిదాసు కాశి పర్యటిస్తుండగా ఆ క్షేత్రంలో వ్యాస భగవానుడి విగ్రహం కనబడింది. భక్తితో విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశాడు కాళిదాసు. విగ్రహం చూడగానే అతడికి చకారకుక్షి అనే పేరు గుర్తొచ్చింది. అలా స్ఫురించగానే చిలిపిగా విగ్రహం బొడ్డులో కుడి చూపుడు వేలును వుంచాడు కాళిదాసు. ఎందుకలా చేస్తున్నావని అడిగారు అతనితో వచ్చినవారు.
“తాతగారి పొట్టనిండా 'చ'కారాలే ఉంటాయి కదా. ఎన్ని వున్నాయో చూస్తున్నాను. అవసరమైతే కొన్ని తీసుకుని నా కావ్యాలలో వాడుకుంటాను” అన్నాడు నవ్వుతూ కాళిదాసు.
కాసేపటికి కాళిదాసు వేలుని తియ్యబోతే బయటకు రాలేదు. విగ్రహంలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా ఊడి రాలేదు. కాళిదాసు బాధగా ముఖం పెట్టి “తాతా .. ఇదేమి పరీక్ష” అనుకున్నాడు మనసులో.
మరుక్షణం విగ్రహం నుండి మాటలు వినిపించాయి.
“ 'చ'కార కుక్షి అని ఎగతాళి చేసినందుకు ఇదే శిక్ష” అంది విగ్రహం.
“తప్పయింది. క్షమించి వదిలేయండి. మీరంటే నాకెంతో భక్తి గౌరవాలున్నాయి” అని బ్రతిమాలాడు కాళిదాసు.
“నీకు మహాకవినన్నఅహంకారం. లక్షల శ్లోకాలతో వేల పాత్రలతో వందల కొద్దీ చరిత్రలు సృష్టించిన నన్నే ఎగతాళి చేసేంత గొప్పవాడివా? అనేక పాత్రల గురించి వర్ణించేటప్పుడు 'చ'కారం వాడక తప్పదు. అందుకు నన్ను ఎగతాళి చెయ్యటం భావ్యమేనా” అన్నాడు వ్యాసుడు.
కాళిదాసు నొచ్చుకుంటూ “నాది మన్నించలేని అపరాధమని అంగీకరిస్తున్నాను. మహామహుల చరిత్రలు, మహాకావ్యాలు వ్రాసేటప్పుడు అలా జరుగుతుంది. మహాతేజస్వి అయిన మీ ముందు అల్పుడునైన నేనెంత? క్షమించి వదిలేయండి” అని బ్రతిమలాడాడు.
“శిక్ష తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉంది. వినిపించుకుంటే బయటపడతావు” అన్నాడు వ్యాసుడు.
“చిత్తం. సెలవివ్వండి” అన్నాడు కాళిదాసు.
“సరే. నేనొక ఘట్టం చెబుతాను. 'చ'కారాలు లేకుండా శ్లోకం చెప్పు. చెప్పగలిగితే బంధవిముక్తుడ వవుతావు” అన్నాడు వ్యాసుడు.
“నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తా” అన్నాడు కాళిదాసు.
వ్యాసుడు “పాండవులు ద్రౌపది భర్తలు. అయిదుగురూ అన్నదమ్ములే. వాళ్ళలో పెద్దవాడైన ధర్మరాజుకి భార్యగా ఉన్నప్పుడు తమ్ముళ్ళు నలుగురూ ఆమెకు మరిది వరుస అవుతారు. వారిలో కనిష్టుడైన సహదేవుడికి భార్యగా ఉన్నప్పుడు అన్నలు నలుగురూ ద్రౌపదికి బావ వరుస అవుతారు. ధర్మరాజు ఆమెకు మరిది కాడు, సహదేవుడు బావ కాడు. వరుసగా పేర్లు, వరుసలో చెప్పుకుంటూ వ్రాయాలంటే 'చ'కారం లేకుండా సాధ్యమవుతుందా? 'చ'కారం లేకుండా శ్లోకం చెబితే విడిచి పెడతాను” అన్నాడు వ్యాసుడు.
వినమ్రంగా శిరస్సు వంచాడు కాళిదాసు.
“నా ప్రయత్నం చేస్తాను. పరీక్ష పెట్టినప్పుడు ప్రయత్నించకపోవడం అవిధేయత అవుతుంది. కనుక నా శ్లోకం చిత్తగించండి.
ద్రౌపద్యా: పాండు తనయాః పతి దేవర భావుకాః
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః”
‘ ద్రౌపదికి పాండుపుత్రులు భర్తలు, మరిదీ, బావ వరుస కూడా. కానీ ధర్మరాజు మరిది వరుస కాడు. సహదేవుడు బావ వరుస కాడు’ అని భావం.
“ఈ శ్లోకంలో మీరు కోరిన భావంతో మిమ్మల్ని మెప్పిస్తే నన్ను బంధవిముక్తుడిని చేయ ప్రార్ధన” అన్నాడు కాళిదాసు.
శ్లోకంలో 'చ'కారం రాలేదు. కనుక వ్యాసుడు “మెచ్చాను నీ ప్రతిభ. చిరకాలం నిలిచిపోయే మహా కావ్యాలు వ్రాయాలని ఆశీర్వదిస్తున్నాను” అని దీవించాడు. మరుక్షణం కాళిదాసు వేలు బయటకు వచ్చింది.
విగ్రహానికి చేతులు జోడించి నమస్కరిస్తూ “నా అపచారం మన్నించండి. మీ వంటి మహానుభావులను ఎవరు కించ పరచినా శిక్ష అనుభవించాలని బోధపడింది” అన్నాడు కాళిదాసు.
కాళిదాసు ప్రతిభను లోకానికి తెలిపేందుకే ఇలాంటి పరీక్షకు వ్యాసుడు గురి చేసాడని అనుకుంటారు. గొప్పవాళ్ళను యెగతాళి చేయరాదని, తెలిసో , తెలియకో చేసినట్లయితే తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుందని గ్రహించి మసలుకోవాలి.
తరువాత కాలంలో ఆ శ్లోకం ఆధారంగా మరో సంఘటన జరిగింది.
సర్వజ్ఞ సింగ భూపాలుని వద్దకు ఒక కవి వచ్చినప్పుడు ఆయన
‘ద్రౌపద్యాః పాండుతనయాః పతి దేవర భావుకః |
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః ||'
అనే శ్లోకాన్నిచ్చి ఆశువుగా కందపద్యంలో చెప్పమన్నారట.
‘పతి మఱఁదియు సహదేవుఁడు,
పతి బావయు ధర్మజుండు, బావలు మఱఁదుల్
పతులు నర నకుల భీములు,
పతు లేవురు సింగభూప! పాంచాలి కిలన్’
అని ఆ కవి ఒక పద్యం చెప్పగానే సింగభూపాలుడు ఆనందించి కవిని సముచితంగా సత్కరించాడట!
----***----
. గీతోపనిషత్తు -237 🌹*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 18 - 2
*🍀 17 - 2. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀*
అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18
తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది.
వివరణము : ఇట్లు వ్యక్తము, అవ్యక్తము జీవులను అనంతముగ నడిపించుచు నుండును. ఎరుక పొందుటవలన వ్యక్తము, ఎరుక పోవుటవలన అవ్యక్తము, ఎరుకలో నున్నపుడు జ్ఞానము, ఎరుక కోల్పోవునపుడు అజ్ఞానము- ఇట్లు బ్రహ్మసృష్టియందు సమస్తము వ్యక్తావ్యక్తముల నడుమ తిరుగాడుచుండును.
ఇట్లనంతముగ సాగును. బ్రహ్మసృష్టి కూడ వ్యక్తములోనికి వచ్చుట, అవ్యక్తములోనికి పోవుట, మరల మరియొక బ్రహ్మ వచ్చుట, అతడి సృష్టికాలము ముగియగనే అతడు, అతడి సృష్టి అవ్యక్తములోనికి చనుట- అనంత కాలమున జరుగుచున్నదని ఋషిదర్శనము. ఇప్పటి కెందరు బ్రహ్మలు వచ్చి వెళ్లిరో ఎవ్వరికిని తెలియదు.
“వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, వారెవ్వరో కూడ ఎవ్వరికిని తెలియదు. ఇంకెంతమంది వత్తురో కూడ ఎవ్వరికిని తెలియదు.” సృష్టితోపాటు సృష్టికర్తకూడ అవ్యక్తమున లీనమై పోవును. నిద్రయందు మన మెట్లుండమో, అట్లే ప్రళయమందు సృష్టికర్త కూడ లీనమైపోవును.
కనుకనే భగవానుడు పూర్వము తెలుపబడిన శ్లోకములలో బ్రహ్మసృష్టి యంతయు చక్రాకృతిన తిరుగుతూ జన్మకర్మలతో నిండియుండునని, పునర్జన్మము కర్మము ఉండితీరునని తెలిపెను. సత్యలోకము నుండి భూలోకము వరకు గల అన్ని లోకముల యందలి జీవులు, ఇట్లు అవశ్యులై తిరుగు చుందురని, ఎవ్వరికిని నివృత్తి లేదని తెలుపుచున్నాడు.
సశేషం...
***
. శ్రీ శివ మహా పురాణము - 436🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 27
*🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 3 🌻*
బ్రాహ్మణుడిట్లు పలికెను-
నీవు సూర్యతేజస్సును విడిచిపెట్టి మిణుగురు పురుగుల కాంతిని గోరుచున్నావు పట్టువస్త్రములను వీడి చర్మవస్త్రములను గోరుచున్నావు(22) నీవు గృహమునందు నివాసమును విడిచిపెట్టి వనమునందు నివసించ గోరుచున్నావు. ఓ దేవదేవీ! నీవు ఉత్తమమగు నిధిని విడిచిపెట్టి ఇనుపముక్కను కోరుచున్నావు '23).
నీవు ఇంద్రుడు మొదలగు లోకపాలురను విడిచిపెట్టి శివుని గురించి వ్రతముననుష్ఠించుచున్నావు. లోకులు ఈ చర్యను మంచిగా చెప్పుకొనరు. నీ చర్య విడ్డూరముగా కన్పట్టుచున్నది(24). పద్మ పత్రముల వంటి కన్నులు గల నీవెక్కడ? ఆ ముక్కంటి యెక్కడ? చంద్రుని వలె ఆహ్లాదకరమగు ముఖముగల నీవెక్కడ ? ఆ అయిదు ముఖముల శివుడెక్కడ? (25)
నీ శిరస్సుపై జడ దివ్య సర్పమువలె భాసించుచున్నది. శివుని జటాజూటము లోకములో చాల ప్రసిద్ధి చెందినట్లున్నది(26). నీ శరీరమునందు చందనము ఉండగా, శివుని శరీరముపై చితాభస్మ ఉండును. నీ పట్టు చీర యెక్కడ? శంకరుని గజచర్మము ఎక్కడ? (27).
నీ దివ్యములగు అలంకారములెక్కడ? శంకరుని సర్పములెక్కడ? నిన్ను సేవించుటకు ఉత్సాహపడే అందరు దేవతలెక్కడ? భూతములకు ఇచ్చు ఆహారమును ఇష్టపడే శివుడెక్కడ?(28) మృదంగ ధ్వని ఎక్కడ? ఆ శివుని డమరుకము యొక్క శబ్ధము ఎక్కడ? భేరీ ధ్వనులు ఎక్కడ? అశుభమగు కొమ్ము బూరాల ధ్వని యెక్కడ? (29). ఢక్కా శబ్దమెక్కడ? గలమనే వాద్యము యొక్క అమంగళ ధ్వని ఎక్కడ? నీ ఉత్తమమగు సౌందర్యము శివునకు అర్హమైనది కానే కాదు (30)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. వివేక చూడామణి - 113 / Viveka Chudamani - 113🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 25. వైరాగ్య స్థితి - 3 🍀*
378. మనస్సును స్థిరముగా బ్రహ్మముపై ఉంచి, బాహ్య జ్ఞానేంద్రియములను వాటి వాటి కేంద్రములలో ఉంచి, శరీరమును స్థిరపర్చి ఏవిధమైన ఇతర ఆలోచనలు లేకుండా బ్రహ్మముపై మనస్సును నిల్పి దానితో ఏకత్వమును సాధించుము. అపుడే బ్రహ్మజ్ఞానము యొక్క సారము పూర్తిగా నీ ఆత్మలో ఏవిధమైన అడ్డంకులు లేకుండా ఆస్వాదించగలవు. ఇతరమైన వస్తు సముదాయము వలన ఏమి లాభము? అవి పూర్తిగా డొల్ల మాత్రమే.
379. అనాత్మ భావము యొక్క ఆలోచనను పూర్తిగా తొలగించి, (ఎందువలనంటే అవి చెడును గలిగించి దుఃఖానికి కారణమవుతాయి), నీవు ఆత్మను గూర్చి, దాని ఆనంద స్థితిని గూర్చి ఆలోచించి పూర్తి విముక్తిని సాధించుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[09/08, 4:52 am] On Sriram**: *🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 64 🌹*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సుఖజీవనము 🌻*
*మానవుడు సుఖముగా జీవించవలెనన్న ఏది ప్రదానము- ధనమా? ఆరోగ్యమా? సత్ సంతానమా?*
ధనము వలన మానవుడు శారీరకముగా సుఖమును అనుభవించగలడే కానీ, మానసికముగా శాంతిని పొందలేడు. ఇక ఆరోగ్యము మానవునకు ముఖ్యమయినది. ఆరోగ్యవంతుడు కష్టపడి ధనము సంపాదించగలడు. కానీ, ఒక ధనవంతుడు ఆరోగ్యమును పొందలేడు.
అయితే, ఈ ఆరోగ్యము శరీరానికా? మనస్సుకా? ఆరోగ్యవంతమయిన శరీరము కన్నా ఆరోగ్యవంతమయిన మనస్సు ప్రధానము.
శారీరక రుగ్మతలకు కారణము కేవలము భౌతిక పరిస్థితులే కాక, మానసిక పరిస్థితులు కూడా కారణము అని పెద్దలు సూచించి ఉండిరి. ఇదే విధముగా రోగమునకు కాక, రోగికి చికిత్స చేయు విధానము హోమియోలో సూచించబడినది.
కామక్రోధాదులు మానవుని ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే కాక శారీరక ఆరోగ్యమునకు కూడ శత్రువులే. కోపము, అసూయ, ద్వేషము మొదలగునవి శరీరములోని గ్రంథులపై ఎక్కువ ప్రభావమును చూపును.
ఒకరిపై ద్వేషము, పగ, చికాకు కలిగిన వ్యక్తికి అన్నము హితముగా ఉండదు. నిద్రపోలేడు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండును.
ఈ ప్రభావము వలన నరములకు ఒత్తిడి కలిగి రక్తపు పోటు వచ్చును. గుండె, ఊపిరితిత్తులు దీని ప్రభావమునకు లోనయి రోగముల రూపముగా పరిణమించును.
నేటి కాలమున మూడువంతుల రోగులు మానసిక కారణముల వ్యాధులకు లోనగుచున్నవారే.
✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
: *🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 113 / Sri Lalita Sahasranamavali - Meaning - 113 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 113. అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ |*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ‖ 113 ‖ 🍀*
🍀 553. అగ్రగణ్యా -
దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
🍀 554. అచింత్యరూపా -
చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.
🍀 555. కలికల్మషనాశినీ -
కలియుగ మలినములను పోగొట్టునది.
🍀 556. కాత్యాయనీ -
కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
🍀 557. కాలహంత్రీ -
కాలమును హరించునది.
🍀 558. కమలాక్ష నిషేవితా -
విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment