Monday, 9 August 2021

10::08::2021




మాంగళ్యాన్ని కాపాడే మంగళగౌరీ వ్రతం..

   మంగళగౌరీ వ్రతం అమంగళం దరిచేరకుండా రక్షిస్తుంది. స్త్రీలు తమ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మాంగళ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే శ్రావణమాసపు మంగళవారాల్లో గౌరీదేవిని శక్తిమేర పూజిస్తుంటారు .. భక్తిమేర తరిస్తుంటారు. సహజంగానే స్త్రీలు అమ్మవారిని పూజించడం జరుగుతూ వున్నా, శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని వ్రత విధానం ద్వారా కొలవడం వలన అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది.


ఒకానొక సందర్భంలో .. స్త్రీలు తమ మాంగళ్యం కలకాలం నిలిచి ఉండటానికి ఏంచేస్తే బాగుంటుందని 'ద్రౌపది' అడిగితే, అందుకు మంగళ గౌరీ వ్రతానికి మించిన మార్గం లేదని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో .. వివాహమైన తరువాత వచ్చే శ్రావణమాసం నుంచి మొదలు పెట్టి, అయిదు సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చేయవలసి ఉంటుంది.


అమ్మవారి పూజలో గరిక .. ఉత్తరేణి దళాలు ఉపయోగించడం మరింత శ్రేష్ఠమని చెప్పబడుతోంది. వ్రతం ఆచరించిన తరువాత ముత్తయిదువులకు నానబెట్టిన శెనగలు వాయనంగా ఇవ్వాలి. ఇలా ముత్తయిదువులను ఆహ్వానించి.. 

ఆప్యాయంగా ఆదరించి.. 

వాళ్ల పాదాలకి పసుపురాసి.. 

కుంకుమ బొట్టు పెట్టి.. 

శ్రద్ధగా వాయనాలు సమర్పించడం వలన అమ్మవారు సంతోష పడుతుంది, సంతృప్తి చెందుతుంది. 

తన భక్తుల అయిదవతనాన్ని కాపాడే బాధ్యతను తాను తీసుకుని, వారికి సుఖశాంతులను ప్రసాదిస్తుంది.

[10/08, 5:08 am]


ద! .. ద! .. ద! .. 

- కర్లపాలెం హనుమంతరావు 


దేవుడు, మనిషి, దానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.

దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు. 

'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ 'ద' అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." 'ద' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు

మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!' అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. 'ద' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటాను' అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు. 

ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ 'ద' శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’' అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! 'ద' శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను' అని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు. 

వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. ద' అంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమ, దాన, దయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***

కర్లపాలెం హనుమంతరావు

(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)

[10/08, 4:48 am] On Sriram**: *🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 75 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌴. ద్వితీయ అధ్యాయము -  సాంఖ్య యోగము - 28 🌴*


28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |

అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||


🌷. తాత్పర్యం :

*సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?*


🌷. భాష్యము :

ఆత్మ ఉనికిని అంగీకరించువారు మరియు ఆత్మ ఉనికిని అంగీకరింపనివారు అనుచు తత్వవేత్తలు రెండు రకములుగా నున్నారు. వీరిలో ఎవరిని అనుసరించినప్పటికిని దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. వేదజ్ఞానము ననుసరించువారు ఆత్మ ఉనికిని అంగీకరింపని వారిని నాస్తికులని పిలుతురు. 


మాటవరుసకు ఆ నాస్తికవాదమును గ్రహించినను దుఃఖమునకు ఎత్తి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా భౌతికాంశములన్నియును సృష్టికి పూర్వము అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్తస్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. 


భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక ఎత్తైన భవంతిని ఉదాహరణముగా గైకొననిచో అది భూమ యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని కూలగొట్టి నప్పుడు అది తిరిగి అవ్యక్తమైదాని పదార్థములులన్నియును భూమిలో కలసిపోవును. శక్తి యనునది సృష్టింపబడదు మరియు నశింపబడదనెడి సిద్ధాంతము ప్రకారము శక్తి అక్షయమై యున్నను కాలములో అనేకములు వ్యక్తములై తిరిగి అవ్యక్తములగు చుండును. 


అట్టి యెడ వాటి వ్యక్తస్థితి గూర్చియు లేదా అవ్యక్తస్థితిని గూర్చియు దుఃఖించుటకు కారణమేమి? అవ్యక్తస్థితి యందు వాటికి నాశము లేదు. ఆద్యంతములు రెండింటి యందును అవి అవ్యక్తరూపమున నిలిచి మధ్యలో వ్యక్తములగుచున్నవి. కాని అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు.


దేహము కాలక్రములో నశించు స్వభావము కలది(అన్తవన్త ఇమే దేహా:) అయినను ఆత్మ శాస్వతమైనదని (నిత్యస్యోక్తా: శరీరిణ:) యనెడి భగవద్గీత యందు తెలుపబడిన వేదసారాంశమును మనము అంగీకరింతుమేని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సదా జ్ఞప్తి యందుంచు కొనవలెను. కావున వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖించవలెను? ఆత్మతో పోల్చినచో దేహమునకెట్టి అస్తిత్వము లేదు. 


అది ఒక స్వప్నము వంటిది. స్వప్నములో కొన్నిమార్లు మనము ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథము నందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కాని మేల్కొంచినంతనే మనము ఆకాశమున గాని, రథమునందు గాని లేమని భోధపడగలదు. 


భౌతికదేహపు అస్తిత్వలేమిని ఆధారము చేసికోనియే వేదజ్ఞానము మనుజుని ఆత్మానుభవమునకు ప్రోత్సహించుచున్నది. కావున ఆత్మ యొక్క అస్తిత్వము అంగీకరించినను లేదా అంగీకరింపకున్నను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹

[10/08, 4:48 am] On Sriram**: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 472 / Vishnu  Sahasranama Contemplation - 472🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻 472. వత్సీ, वत्सी, Vatsī 🌻*


*ఓం వత్సినే నమః | ॐ वत्सिने नमः | OM Vatsine namaḥ*


జగత్పితు స్తస్య వత్స భూతాః సర్వాః ప్రజా ఇతి ।

వత్సానాం పాలనాద్వాపి వత్సీతి హరిరుచ్యతే ॥


గోవత్సములు ఈతనిచే పాలించ బడినవగుచు ఈతనికి కలవు. లేదా ఈతడు జగత్పిత కావున ప్రాణులన్నియు ఈతనికి బిడ్డలుగా ఉన్నవి కావున ఆ హరి 'వత్సీ'.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 472🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻 

🌹 🌹 🌹 🌹🌹


[10/08, 4:48 am] On Sriram**: *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 56 🌹*

✍️.  సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


*🍀.   అహమన్నది గొప్ప మోసకారీ. అదెప్పుడూ వెనక దారి నించీ రావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. అది ఎంతో  వినమ్రంగా వుంటుంది. అన్ని ఆటలూ ఆడుతుంది. పరిశీలనాత్మకంగా వుండు.   🍀*


అదృశ్యం కావడాన్ని అభ్యసించు. ఆవిరి కావడాన్ని అభ్యసించు. లేనితనంగా మారడం నేర్చుకో. అది జీవితంలోని అత్యున్నత కళ. ఎందుకంటే అహమన్నది గొప్ప మోసకారీ. అదెప్పుడూ వెనక దారి నించీ రావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. అది ఎంతో వినయంగా, వినమ్రంగా వుంటుంది. భక్తి పూర్వకంగా వుంటుంది. సన్యాసిలా వుంటుంది. పవిత్రంగా వుంటుంది. అన్ని ఆటలూ ఆడుతుంది. పరిశీలనాత్మకంగా వుండు. 


ఎంతగా అహం మార్గాల్ని కనిపెడితే అంతగా స్వేచ్ఛగా వుంటావు. నువ్వు తెలుసుకునే కొద్దీ దాని కుట్రలు పని చెయ్యవు. క్రమంగా తలుపులు మూసుకుంటాయి. అప్పుడు నీ నించి స్వేచ్ఛ పొందుతావు. అదే స్వేచ్ఛ. అన్ని మతాలకూ అంతిమ లక్ష్యమదే. ఆ స్వేచ్ఛ పొందిన దశలోనే సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. అవి నిజానికి రెండు స్థాయిలు కావు. ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఒకటి స్వేచ్చ, రెండోది సత్యం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

[10/08, 4:48 am] On Sriram**: *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 299  / Sri Lalitha Chaitanya Vijnanam  - 299 🌹*

*సహస్ర నామముల తత్వ విచారణ*

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*

*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*


*🌻 299. 'నాదరూపా' 🌻* 


నాదరూపము గలది శ్రీదేవి అని అర్థము. సృష్టి సంకల్పింప బడినపుడు ఆ సంకల్పము నాదరూపముగ వ్యక్తమగును. నాదమే తత్త్వమునకు మొదటి శరీరముగ వేదములు కీర్తించుచున్నవి. నాదమున్నంత వరకు సృష్టి యుండును. నాదము నిష్క్రమించిన సృష్టి తిరోధానము చెందును. నాదమే ప్రాణము; నాదమే తెలివి, నాదమే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగ ప్రకటిత మగును. నాద మాధారముగనే సమస్త లోకము లేర్పడి గుత్తిగ కలిసియున్నవి. దైవము నాద స్వరూపము. జీవులును నాద స్వరూపులే. సృష్టికూడ నాద స్వరూపమే. 


నాదము కాని దేమియూ లేదు. తత్త్వము నుండి వెలువడిన నాదము అవరోహణ క్రమమున వాక్కై దిగివచ్చును. సృష్టి కాధారమైన ఈ నాద రూపమే పరదేవతయైన శ్రీమాత ప్రథమ రూపము. పరమ శివుని గూడ నాద తనువు గలిగినవాడని ఋషులు కీర్తించిరి. ఈ నాద మొక ఝంకారమువలెనూ, ఓంకారమువలెనూ మనయందు నిత్యము జరుగుచున్నది. అది ఆధారముగనే మన ప్రాణము, తెలివి, మనస్సు, ఇంద్రియములు, శరీరము పనిచేయు చున్నవి. 


మన ముండుట యనగా నాద ముండుటయే. నాదము ననుసరించి దేహమును స్వచ్ఛందముగా వీడుట, మరల దేహమందు ప్రవేశించుట "అక్షర పరబ్రహ్మ యోగము” నందు శ్రీకృష్ణుడు బోధించి నాడు. నాదమును అనుస్మరణ చేయుట వలన ఇది సిద్ధించునని తెలిపినాడు. 


అవరోహణమునకు, ఆరోహణమునకు నాదమే ఆధారము. సృష్టి మొత్తము నాదమను దారమున కెక్కించిన పూసలగుత్తి వంటిది. దారము ఊడినచో పూసలు రాలినట్లు, నాదమాగినచో సృష్టి నాటక మదృశ్యమగును. శ్రీకృష్ణుని గానము నాదగానమే. అతడు

ఆ గానము ద్వారా జీవులయందలి నాదమును మేల్కొలిపి తనలోనికి ఆకర్షించెడివాడు. అట్టి సమయమున పశుపక్ష్యాదులతో సహా మొత్తము ప్రకృతి తన్మయత్వము చెందెడిది. ఇక మానవుల మాట చెప్పనేల? 


శ్రీదేవిని నాదరూపగ ఉపాసించుట మహత్తరమగు యోగము. నాదోపాసనమున సర్వసిద్ధి కలుగును. అది శ్రీమాత అనుగ్రహముగ సాగవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri 

ఇదెప్పుడైనా ఆలోచించారా 


రాజు ఉదయాన్నే లేచి వాకింగ్ కు వెళ్ళాడు 

తెలియకుండా ఎదురుగా వస్తున్న వ్యక్తి చెయ్యి తగిలింది 

అతను సారీ అని చెప్పాడు 

రాజు పర్లేదండి అని చెప్పి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుండి ఇంటికి వచ్చాడు 

ఇంట్లో స్నానం అన్ని ముగించుకుని అల్పాహారం తీసుకుని చెయ్యి కడుక్కుని వెనక్కు తిరగ్గానే తన ఆరేళ్ళ కొడుకు వెనుక నిల్చుకున్నాడు 


అతని చెయ్యి తగలడంతో రాజుకు కోపం వచ్చేసింది 

అడ్డంగా ఎందుకు ఇలా నిలబడ్డావు పక్కకు తప్పుకో అని అరిచాడు అంతే బాబు బయపడిపోయాడు 

దూరంగా వెళ్ళిపోయాడు 


రాజు అతడి పని ముగించుకుని కాసేపు అలా కూర్చుని ఆలోచిస్తుండగా పొద్దున జరిగిన విషయం గుర్తుకువచ్చింది 


మనకు అసలు తెలియని వ్యక్తిని క్షమించాను కానీ నా బాబుపై కోపాన్ని ప్రదర్శించాను 

ఒక్క నిమిషం అరవకుండా ఉండాల్సింది 

వెంటనే వెళ్ళి బాబును పలకరించాడు 

బాబు కళ్ళలో కన్నీళ్లు

 

సారీ చిన్నా అన్నాడు 

బాబు అన్నాడు నాన్న మనం పెంచిన చెట్లలో రంగురంగు పూలు పూశాయి 

అన్ని రంగులు కలిపి పూలగుచ్చాన్ని నీకు అందివ్వాలని నిన్ను ఆశ్చర్య పరచాలని నీ వెనుక నిలుచుకున్నాను నాన్న అన్నాడు 


ఇప్పుడు రాజు కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు సారీ బాబు ఇంకెప్పుడూ కోపగించుకొను అన్నాడు 


ఇది రాజు మాత్రమే చేసిన చేస్తున్న తప్పు కాదండి 

అందరం చేస్తున్నది 

ముక్కుమొహం తెలియని వ్యక్తులతో సర్దుకు పోయే మనం మన కుటుంబంతో అసలు సర్ధుకోము 


సారీ థాంక్స్ అనే పదాలు వాడనే వాడము 

ఆ పదాలు ఐనవారితో చెప్పాల్సిన అవసరం లేదు అంటారు కానీ నిజానికి ఆ పదాలు ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది


పరాయివాళ్ళ గురించి అలోచించి నడుచుకునే మనం ఒక్క క్షణం అయినవారి గురించి ఆలోచించొచ్చుగా 


పరాయివాళ్ళకు నువ్వొక వ్యక్తివి 

కనిపిస్తే పలకరిస్తారు 

కనిపించకపోతే ఒక్కసారి లేదంటే రెండూ సార్లు తలచుకుంటారు 

కానీ నీ కుటుంభానికి నువ్వే ముఖ్యం 

నీ ఎడబాటు వారికి మాత్రమే బాధ 

ప్రతి క్షణం వారి ఊపిరి ఆగేవరకు నువ్వు పక్కన ఉన్నా లేకున్నా నీ గురించి ఆలోచన ఉండే ఉంటుంది 

అందుకే 

ఎక్కడో సర్దుకుపోయే నువ్వు నీ తోడు నీ పిల్లలతో కొంచం సర్దుకోవచ్చుగా 


ఆలోచించండి ఒక్కసారి .

1 comment: