ప్రాంజలి ప్రభ కథలు చదవండి (ఆరోగ్యం. ఆనందం.. ఆధ్యాత్మికం )
****
9985.
ముని, ఋషి, యోగి అనే పదాలు ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనవి, కానీ ఈ మూడు పదాలకు విభిన్న అర్థాలు మరియు లక్షణాలు ఉన్నాయి. వాటి ప్రధాన తేడాలను వివరిస్తాను:
ముని
అర్థం: "ముని" అనే పదం సంస్కృతంలో "మౌనం పాటించేవాడు" లేదా "తపస్వి" అనే అర్థాన్ని కలిగి ఉంది.
లక్షణాలు: మునులు ఎక్కువగా ఆత్మశోధనలో మరియు తపస్సులో లీనమై, తమ మనసులోని ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తారు. వారు మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మౌనంగా ఉండి జ్ఞానం సంపాదించడమే లక్ష్యం. మౌనం ద్వారా సాధన చేయడం వీరి ప్రధాన లక్ష్యం.
ఆధ్యాత్మిక దృష్టి: వీరు తమ మనస్సులోనే ప్రశాంతత మరియు ఆత్మజ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తారు. వారు ఎక్కువగా దైవిక లేదా తాత్విక అంశాలను పరిశీలించి అవగాహన చేసుకుంటారు.
ఋషి
అర్థం: "ఋషి" అనే పదం "దృశ్" అనే ధాతువ నుండి ఉద్భవించింది, దీని అర్థం "చూడడం" లేదా "తత్త్వాన్ని గ్రహించడం." ఋషులు అనుభవజ్ఞానం కలిగి ఉన్న సప్తరుషుల వంటి మహా జ్ఞానులు.
లక్షణాలు: ఋషులు గొప్ప ఋగ్వేదాలు మరియు ఇతర వేదాలను గ్రహించి, వాటిని ప్రజల బోధకు అందించినవారు. వీరు వేదమంత్రాలను "దర్శించిన" పూర్వగాములు. ఋషులు తమ తపస్సు ద్వారా కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా, వేదాలను శ్రవణం చేయగలిగిన గొప్ప శక్తిని కలిగి ఉంటారు.
ఆధ్యాత్మిక దృష్టి: ఋషులు ఆధ్యాత్మికతతో పాటు, వేద శాస్త్రాల గురించి జ్ఞానం సంపాదించి, తమ సాధనను ప్రపంచానికి అందజేయడం చేస్తారు. వీరు వేదాలను, మంత్రాలను క్రమబద్ధంగా సేకరించి, ప్రజలకు ఉపదేశం చేయగలరు.
యోగి
అర్థం: "యోగి" అనే పదం "యోగ" అనే పదం నుండి వచ్చింది. "యోగ" అనగా "ఒకత్వం" లేదా "యూనియన్," అంటే ఆత్మను పరమాత్మతో కలపడం.
లక్షణాలు: యోగులు తమ శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక స్థాయిలను సమన్వయం చేసి, దైవాన్ని పొందేందుకు యోగసాధన చేస్తారు. యోగులు శారీరక క్షమత (ఆసనాలు), శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), మరియు మానసిక నియంత్రణ (ధ్యానం) వంటి యోగ పద్ధతులు పాటిస్తూ పరమాత్మతో మానసిక స్థాయి చేరే లక్ష్యంతో ప్రయత్నిస్తారు.
ఆధ్యాత్మిక దృష్టి: యోగులు ఆత్మను పరమాత్మతో కలపడం ద్వారా మోక్షాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. వీరు యోగ ప్రాక్టీసులు చేస్తూ శరీర, మనస్సు, ఆత్మలను శుద్ధి చేసుకుంటారు.
తేడాలు
ముని: మౌనంగా ఉంటూ ఆత్మ జ్ఞానాన్ని సాధించేవారు.
ఋషి: వేదాలను గ్రహించి, అనుభవజ్ఞానం కలిగి ఉన్నవారు; వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే పూర్వగాములు.
యోగి: యోగ సాధన ద్వారా శరీరం, మనస్సు, ఆత్మను పరమాత్మతో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా పెట్టుకునే సాధకులు.
మొత్తం గా, వీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు అయినప్పటికీ, వారి సాధనా పద్ధతులు మరియు లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి.
****
ప్రాంజలి ప్రభ కథలు చదవండి
(ఆరోగ్యం. ఆనందం.. ఆధ్యాత్మికం )..9986..
*స్పర్శ కు ఇంత బలం ఉందా?*
మరణశయ్య పై ఉన్న ఒక తండ్రి అస్పష్టంగా కొడుకు కోసం తల్లడిల్లి పోతున్నాడు. తన రక్త సంబంధపు ‘స్పర్శ’ కోసం ఆయన తపిస్తున్నాడని అర్థం అయిన డాక్టర్లు మాటలు రాక మూగ బోయిన ఆయన గొంతు ఏమంటుందో అని... ఒక కాగితం, పెన్ను ఇచ్చారు... బలవంతంగా ఎక్కడ లేని శక్తి కూడ గట్టుకొని డాక్టరు పట్టుకున్న ప్యాడ్ లోని తెల్ల కాగితం పై... ‘ప్ర...సా...ద్’ అని రాసిన మరుక్షణం ఆయన చెయ్యి జారిపోయింది! డాక్టరు వెంటనే ఆయన కొడుకు ప్రసాద్ కు ఫోన్ చేసి పిలిచారు.
కొడుకు వచ్చి తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకొని మెల్లిగా ఇలా పట్టుకోగానే మూసుకు పోయిన కళ్ళు తెరుచుకొని తృప్తిగా అతని చేతిని గట్టిగా పట్టుకొని తన ‘స్పర్శ’ ద్వారా తన శక్తిని కూడగట్టి కొడుకును తనివి తీరా చూసుకొని కళ్ళు మూతలు పడేశాడు!
విచిత్రం ఏమిటంటే గుండె ఆగిపోయినా కూడా ఆతండ్రి చేయి ఇంకా కొడుకును గట్టిగా పట్టుకునే ఉంది!
అదే రక్త సంబంధం మహిమ!! ‘స్పర్శ‘ శాస్త్రంపై డాక్టర్లు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.
ఇద్దరు స్నేహితుల మధ్య ‘కరచాలనం’ ఎంత ఆత్మీయత వ్యక్తం చేస్తోందో, ఇద్దరు రక్త సంబంధీకులు మధ్య ఒక ‘హగ్’ కొత్త అనుభూతిని అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది. అదే ‘స్పర్శ’ కున్న గొప్ప తనం!
స్పర్శ యొక్క రోజువారీ రూపాలు, విభిన్నంగా ఉంటాయి. మనకు భావోద్వేగ సమతుల్యతను మరియు మెరుగైన ఆరోగ్యాన్ని తీసుకురాగల మార్గాలపై అత్యాధునిక పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
’నేను ఉన్నాను!’ అనే భరోసా ‘స్పర్శ’ ద్వారా మాకు ఇవ్వొచ్చు అనే ప్రక్రియ ‘భుజం’ తట్టడం అంటారు.
కూతురు, కొడుకు చేయి పట్టుకొని తండ్రి వారి కష్టాల్లో ‘మై హునా బేటా!’ అంటే చాలు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
వీపు మీద తట్టడం, చేయిపై చేయి వేసి తడుముకోడం-ఇవి మనం సాధారణంగా తీసుకునే రోజువారీ, యాదృచ్ఛిక హావభావాలు!
మన అద్భుతమైన చేతులు నైపుణ్యం తో బంధాలను దగ్గరిగా చేసే ఆ ‘స్పర్శ’ మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.
స్పర్శ శాస్త్రం కరుణ రసం, విషాద రసం, ప్రేమ రసం, రక్త సంబంధ రసం మన ప్రాథమిక భాష గా సైకాలజిస్టులు గుర్తించారు.
ఇటీవలి సంవత్సరాలలో, ‘స్పర్శ’ ద్వారా వచ్చే కొన్ని అద్భుతమైన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అధ్యయనాల తరంగం నమోదు చేసింది. మానవ కమ్యూనికేషన్, బంధం మరియు ఆరోగ్యానికి స్పర్శ నిజంగా ప్రాథమికమైనదని ఈ పరిశోధన సూచిస్తుంది.
ఒక స్త్రీ పురుషునికి కోపాన్ని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినపుడు చెయ్యి విదిల్చే స్పర్శ లో ఎంతో ఆగాధం ఇమిడి ఉంటుంది. ఒక స్త్రీకి కరుణను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు! కేవలం స్పర్శ మరియు ముఖ కవళికలు లో ఆమె మార్పును డీప్ గా పరిశీలిస్తే తప్ప స్పర్శ విలువ అర్థం కాదు!
నిజానికి, ఈ స్పర్శ అంతు చూసే డాక్టర్లు పరిశోధనలకు వెళుతున్నప్పుడు.. ఇంట్లో భార్య ‘గుడ్ డే’ అని భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపితే పరిశోధన చేసే సమయంలో మరో లేడీ డాక్టర్ అభినందిస్తూ ఇచ్చే షేక్ హ్యాండ్ లో ఏదో పవర్ ఉందని కూడా విశ్లేషకులు వివరిస్తున్నారు.
వ్యక్తులు స్పర్శల నుండి ప్రేమ, కృతజ్ఞత, కరుణను గుర్తించడమే కాకుండా ఆ రకమైన స్పర్శల మధ్య తేడాను గుర్తించగలరని మానవ శాస్త్రం అవపోసన పట్టిన డాక్టర్లు చెబుతున్నారు.
టచ్ భద్రత మరియు నమ్మకాన్ని సూచిస్తుందని చూపించే అధ్యయనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. వెచ్చని స్పర్శ హృదయనాళ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శరీరం యొక్క వాగస్ నాడిని సక్రియం చేస్తుంది, ఇది మన దయగల ప్రతిస్పందనతో సన్నిహితంగా పాల్గొంటుంది మరియు ఒక సాధారణ స్పర్శ ‘ప్రేమ హార్మోన్’ అని పిలువబడే ‘ఆక్సిటోసిన్’ విడుదలను ప్రేరేపిస్తుందని కూడా రెండు రోజులు గా అధ్యయనం చేస్తున్న డాక్టర్లు చెప్పారు! ఒక నర్సింగ్ హోమ్ లో నేను ఈ అధ్యయన రచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక గుండె కు సంబంధిన డాక్టరు...నాతో ‘నీ గుండె చేజారి పోకుండా చూసుకో బ్రదర్!’ అంటే, నేను ఆయనతో అన్న మాటలు ‘నిప్పు కు చెదలు పట్టవు సర్!’ అన్నప్పుడు.... ఆయన ఆలోచనలో పడ్డారు!
9987
ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకుండే నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న. రాజ్యంలో ఓ గుడి కట్టారు. అది రాముల వారి ఆలయం. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు వెళ్లి ఆనందించాలని సుబ్బన్న అనుకున్నాడు. తన ఊరు దూరం అయినా కాలిబాటన, బండిలో ఇలా ఉత్సవ స్థలానికి చేరుకున్నాడు. మొదటి రోజు రాజుగారు వచ్చారు. అందరూ ఆసీనులై ఉండగా.. ఇద్దరు కళాకారులు వచ్చి పాటలు పాడారు. ఆ పాటలు విని తన్మయత్వం చెందాడు. తాను కూడా అలా పాడితే బావుండునని అనుకున్నాడు. ఎంతో బాధపడ్డాడు. తానూ అలా గాయకుడిని అయితే బావుండును అనుకున్నాడు.
రెండో రోజు రాజుగారి ముందు కవులు వచ్చి పద్యాలు పాడారు. పండితులు మాట్లాడారు. వారిలా పద్యాలు రాయలేకపోతినే అనుకున్నాడు. కొన్ని పద్యాలు అర్థమై ఎంతో సంతోషపడ్డాడు. నేను కూడా పండితుడిని అయితే వీరి భాష వచ్చి ఉండేది కదా అని వగచాడు. రానే చివరి రోజు వచ్చింది. మూడో రోజు రామాలయం దగ్గర రామాయణం బొమ్మలు, ఎన్నో విశేషాలను కళాకారులు చిత్రించారు. కాన్వాసుల మీద రాళ్లమీద రామాయణగాథ వివరించబడింది. ఆ బొమ్మలు చూసి నేను కూడా ఇలా గీసి ఉంటే అందరి మెప్పు పొందేవాడిని కదా.. అనుకున్నాడు సుబ్బన్న. బాధతో కోపంతో ఇంటికి పయనమయ్యాడు. మూడోరోజు రాత్రి ఓ ఆశ్రమంలో బస చేశాడు. అక్కడ ముగ్గురు కనపడ్డారు. ఒకడు గుడ్డివాడు, రెండోవాడు చెవిటి, మూడో వాడికి కళ్లు లేవు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ‘వీళ్లు ఈ రాముడి గుడి ఉండే ఊరిలోనే ఉన్నారు. అయితే ఏ కళలనూ ఆస్వాదించలేకపోతున్నారే. వారి కంటే నేనే నయం కదా’ అనుకున్నాడు. వెంటనే అతనికి ఆత్మసంతృప్తి కలిగింది. ఎంతో ఆనందపడ్డాడు.
నిరంతర ఆనందం బాహ్యపరమైన కోరికలలో లేదు. ఉన్నా అది తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందం మన హృదయంలోనే ఉంది. మన ధ్యాస ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటోంది. అందువల్లే అంతరంగంలో నెలకొని ఉండే నిరంతర ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మనిషి మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తాడు. కొంతమంది వ్యసనాల వెనక, మరి కొంతమంది ఆధ్యాత్మికత వైపు పరుగులు పెడుతున్నారు. అవసరార్థం తెచ్చి పెట్టుకున్న ఏ కొత్త అలవాటైనా ఎక్కువ కాలం కొనసాగదు.
ఈ లోకంలో సదా దాతవై వర్ధిల్లు అన్నారు వివేకానంద. తన వద్ద ఏమీ లేకపోయినా ఇవ్వాలనే భావన కలిగి ఉంటే లేమి అనేది ఉండదు. లేమి లేకపోవడం సంతృప్తికి చిహ్నం. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ మనకు కొత్త పాఠాలు బోధించే అధ్యాపకులే. ఉదాహరణకు- ఒంటరిగా ఉండాలంటే భయం అనుకోండి... ఒంటరిగా ఉండే పరిస్థితి ఎదురైనప్పుడు ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని ఇతరులతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఒంటరితనం వల్ల కలిగే భయాన్ని తాత్కాలికంగా పోగొట్టుకుంటాం. కానీ, సంతోషాన్ని సమస్థితిని కోల్పోతాం. ధైర్యంగా ఎదుర్కోగలిగే మనో పరిపక్వత అలవరచుకుంటే, ఏకాంతంలో ఉండే ఆనందం అనుభవంలోకి వచ్చి మనోబలం దృఢపడుతుంది. నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం, మాటల పొదుపు వల్ల సంతృప్తి లభిస్తుంది. మాటలో కాఠిన్యం ఆవేశ కావేషాలు వ్యక్తి కర్కశ స్వభావాన్ని తెలియజేస్తాయి. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా క్లుప్తమైన సరళమైన మృదు సంభాషణతో భావాలను వ్యక్తీకరిస్తే వాచక సంతృప్తి కలుగుతుంది.
ఒక మంచి పని చేస్తే దాని ద్వారా ఎనలేని మానసిక సంతృప్తి కలుగుతుంది. అది ఉన్నవారి మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. అలాంటివారు క్షమాగుణం కలిగి ఉంటారు. మాటల్లో, చేతల్లో సంతోషం సంతృప్తి కలిగి ఉండటం ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టుగా భావిస్తారు. చీకటి లేని వెలుగుకు విలువ లేదు. అలాగే కష్ట నష్టాలు లేకుండా వచ్చే సంతోషానికి సంతృప్తి ఉండదు. అది ఎక్కువసేపు నిలవదు. ఓర్పు సహనాలతో పరిస్థితులను ఎదుర్కొంటూ తద్వారా వచ్చే విజయంలోనే అసలైన సంతోషం సంతృప్తి లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇతరులకు సహాయపడటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, మనసును నియంత్రించుకోవడం వల్లనే జ్ఞానమార్గంలో పయనించగలం. అది అలౌకిక సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుందన్నది బుద్ధుడి మాట.
సత్యశీలుడు, సుగుణావతి దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు బుద్ధిమంతులు. వాళ్ళు ఆస్తిపరులు, డబ్బుకు ఏ లోటూ ఉండేది కాదు. ఆరోగ్యం మహత్తరంగా ఉండేది; అన్నీ బాగానే ఉండేవి కానీ ఏదో తెలీని అసంతృప్తి వాళ్లని పీడించేది. 'భగవంతుడిని సేవిస్తే సంతోషం వస్తుంది' అని భార్యభర్తలిద్దరూ పూజలు చేసేవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పుణ్యక్షేత్రాలు దర్శించేవాళ్ళు, ఉత్సవాల్లో పాల్గొంటుండేవాళ్ళు. అయితే కేవలం ఆయా సందర్భల్లో మాత్రమే వాళ్ళ మనసుకు ఉల్లాసంగా, తన్మయంగా అనిపించేది. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు యధా ప్రకారం అసంతృప్తికి గురయ్యేవాళ్ళు. అట్లానే 'గ్రంథ పఠనం' వల్ల సంతృప్తి వస్తుంది అని ఎవరో చెబితే కొన్నాళ్లపాటు వరస పెట్టి ధార్మిక గ్రంధాలు చదివించుకున్నారు; పురాణ కాలక్షేపాలు అవీ చేయించారు కానీ మళ్ళీ యథాప్రకారం అసంతృప్తే.
ఆ సమయంలో వాళ్ళకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుగారు వాళ్ల ఊరికి వచ్చారు. సత్యశీలుడు,సుగుణవతి ఆయన్ని దర్శించుకొని తమ సమస్య చెప్పుకున్నారు. ఆయన "చూడు నాయనా! మనిషి సంఘజీవి. 'తనతోబాటు, తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి' అని కోరుకుంటాడు ఎప్పుడూ. అందువల్లనే, తను ఒక్కడూ సుఖంగా ఉన్నంతమాత్రాన మనిషికి సంతృప్తి రాదు. ఈ సమాజంలో ఎంతోమంది రకరకాల కష్టాలకు లోనవుతున్నారు; వైద్యం చేయించుకునే శక్తి లేక ప్రాణాలు కోల్పోతున్నారు; జ్ఞానపిపాస ఉన్నా యువకులు చాలామంది చదువులు కొనసాగించలేకపోతున్నారు. పలువురు బ్రతుకు తెరువు లేక కష్టపడుతున్నారు. వాళ్లకు మీ చేతనైనంత సాయం, మీ చేతనైన రీతుల్లో చేయండి. అప్పుడు చూడండి ఎంత తృప్తి కలుగుతుందో" అని అన్నారు.
గురువుగారి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న సత్యశీలుడు-సుగుణవతి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ గ్రామంలో రోగుల కోసం ఒక వైద్యశాల, యువతరం విద్యను కొనసాగించేందుకు గాను పాఠశాల, కళాశాల నిర్మించారు. ఊళ్ళో అందరికీ బ్రతుకు తెరువులు చూపే వ్యవస్థలు ఏర్పరచారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు సాయం చేసి, నిలద్రొక్కుకునేట్లు చూసారు. వృద్ధులకు గౌరవాన్నీ, ప్రేమను పంచే కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇక అటుపైన వాళ్ళకు అసంతృప్తి అన్నమాటే గుర్తు రాలేదు!
****
ప్రాంజలి ప్రభ కథలు చదవండి.9988
(ఆరోగ్యం. ఆనందం.. ఆధ్యాత్మికం )
*ఓ పిట్ట కథ*🦜🦜
----------
అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు.
ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షాకాలం వస్తోంది, నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా?" అంది.
"వద్దు ", అనేసింది మొదటి చెట్టు.
ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది.
"సరే ", అంది రెండో చెట్టు.
మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది.
పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.
అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ,
"భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా", అంది నవ్వుతూ.
"నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నేను. నన్ను క్షమించు. నువ్వు పది కాలాలు సుఖంగా ఉండు", అంది ఆనందంగా.
అయ్యో, అపార్థం చేసుకొని తొందరపాటుగా మాట్లాడాను కదా అని సముద్రమంత ఆవేదనతో ఆ చిన్నారి పిట్ట చిన్ని గుండె కలుక్కుమంది.
మీరు ఎవరినైనా ఏదైనా అవసరం లేదా పని కోసం కోరినప్పుడు అవతలివారు స్పందించకపోతే, నిరాకరిస్తే అపార్థం చేసుకోవద్దు. మీరు కోరిన పని చేయగల శక్తి, పరిస్థితి వారికుందా, లేదా అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. కొందరు మొహం మీద చెబుతారు, మరికొందరు మాట దాటేస్తారు. ఒక్కక్కరిది ఒక్కోతరహా.
ఎవరినీ హేళన చేయవద్దు. ఏమో, మీకు కూడా ఒకరోజు అలాంటి పరిస్థితి ఎదురుకావచ్చేమో.
*నీతి: -ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది.
మీ మల్లాప్రగడ
ప్రాంజలి ప్రభ.. 9989
మనం తీసుకునే ఆహారంలో ఐదు* *విధాలైన దోషాలు యిమిడివున్నాయి*
*1. *అర్ధ దోషం*
2. *నిమిత్త దోషం*
3. *స్ధాన దోషం*
4. *గుణ దోషం*
5. *సంస్కార దోషం*.
*ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు*
🔸 *అర్ధ దోషం*
*ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు*
*భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది*.
*హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు*.
*తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు*
*తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు*
*వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు*.
*శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు*.
*ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం*
🔸 *నిమిత్త దోషం*
*మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి*
*వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు*.
*అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి*
*భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు*
*అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది*
*ఆమె ఆలోచనలు *గ్రహించిన భీష్ముడు*
*'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను*.
*నా స్వీయ బుధ్ధిని ఆ *ఆహారం తుడిచి పెట్టింది. *శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను*
*ఇప్పుడు* *పవిత్రుడినైనాను*
*నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు*
*చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి* *'నిమిత్త దోషం '* *ఏర్పడుతోంది*
🔸 *స్ధాన దోషం*
*ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది*
*యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు*.
*దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు*
*మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి*
🔸 *గుణ దోషం*
*మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది*
*సంస్కారదోషం*
*ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది*
🍃🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏🍃
****
ప్రాంజలి ప్రభ..9990
పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శ్రుతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.
నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.
మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.
మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా 'శుద్ధోదకం' అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని 'గీత'లో పరమాత్మ చెప్పాడు.
జలతరంగాల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారమని 'రుద్రనమకమ్' చెబుతోంది. మత్స్యకూర్మావతారాల ఆవిర్భావం నీటినుంచే జరిగింది. అందుకే సలిలం దైవసమానం. జలచరాలన్నింటికీ భగవంతుడే ఆశ్రయమిచ్చి ప్రత్యక్ష సంరక్షకుడయ్యాడు. విషాన్ని హరించి జలాన్ని శుద్ధిచేసే జలచరాలెన్నో ఉన్నాయి. వాటికి ఆ వరం దైవమే ప్రసాదించాడు.
పరమాత్మ 'పత్రం, పుష్పం, ఫలం, తోయం'లలో తనకు నాలుగోదైన నీటిని సమర్పించినా సంతుష్టి పొందుతాననే చెప్పాడు. కలియుగంలో వ్యామోహ, ప్రలోభాలకు దాసులైన మానవాళికి ఇంతటి సేవాసౌలభ్యం అనుగ్రహించాడంటే భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.
చెంబుడు నీళ్లుపోస్తే శంభుడు సంబరపడతాడు కదా! అందుకే ఆ అగ్నినేత్రుణ్ని అభిషేక ప్రియుడంటున్నాం. సృష్టిలో మూడువంతులు నీరు, ఒకవంతు నేల ఉంది. వృక్ష సంతతితో సహా సకలజీవకోటిని ఈ నీరే పోషిస్తోంది. పవిత్రమైన నదీ సాగర తీరాల్లో ఎన్నో దేవాలయాలు, పుణ్యతీర్థాలు వెలిసి భక్తకోటిని తరింపచేస్తున్నాయి. సముద్రస్నానం, నదీస్నానం మానవజన్మ సార్ధక్యానికి అత్యంత ఆవశ్యకాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో అరవై ఎనిమిది శాతం నీరు ఉంది.
భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం.
ప్రాంజలి ప్రభ
*పుటుక్కు జరజర డుబుక్కు మే* 9991
అదోపాఠశాల మైదానం. బాలికలాడి యాడి అలసి పోయారు. గుంపుగా ఓ చోట కూచున్నారు. ఆయాసం కారణంగా వారి ఎదలెగ సెగసి పడుతున్నాయి. ఓ అమ్మాయి నెత్తి నుండి ప్లాస్టిక్ పిన్ను తీయ బోయింది. ఆది పుటుక్కున విరిగిపోయింది. ఆ బాలికకు చిన్న గాయమయింది. అమ్మా అన్నది. ఇది చూసి నవ్వారు. ఆ అమ్మాయి మనస్సులో ఏవో పూర్వ స్మృతులు తైతక్కలాడాయి. అంతే.
*పుటుక్కు..జరజర... డుబుక్కు... మే..."* అన్నది. అమ్మాయి నవ్వుతూనే “పుటుక్కు జరజర డుబుక్కుమే" ఒక్క సారి కాదు; రెండు మూడు పర్యాయాలన్నది; అంటూనే నవ్వుతున్నది; నవ్వుతూనే అంటున్నది.
ఆ కథస్మృతిలో తిరిగిన వారానవ్వుకు నవ్వుకలిపారు. కొందరు ఆశ్చర్యంలో మునిగారు; మరికొందరు ప్రశ్నార్థక ముఖలయ్యారు. ఈ తతంగంలో ఆసహనం రేకెత్తిన కొందరు పిన్ను విరిగించానికన్నా మీ విరుగుబాటే బాధాకరంగా ఉందన్నారు.
'నవ్వుతూన్న ఓ అమ్మాయిని 'చాల్చాల్లేవే' అంటూ మరో అమ్మాయి. మోచేతితో పొడిచింది. 'నన్ను మోచేతితో పొడుస్తావా? అయితే నేనో పొడుపుకథ పొడుస్తాను. విప్పుకో!' అంది అమ్మాయి. 'సరే సరే' అన్నారందరు.
ఆ అమ్మాయి మరోసారి 'పుటుక్కు, జరజర, డుబుక్కు, మే' అంది. ఆ కథ తెలిసిన బాలికలొకరిద్దరు మేము ముడి విప్పుతాం అన్నారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. 'పిన్ను విరిగి ఏడుస్తున్న పిల్లయినా చెప్పాలి, లేదా పొడిచిన మోహినైనా చెప్పాలి, పట్టు పట్టింది.
"మా యిద్దరికీ దాని అర్థమేంటో తెలియదు తల్లీ! నీవే చెప్పు. ఇద్దరూ చేయెత్తి మొక్కారు. ఆ అమ్మాయి పైట నడుంకు చెక్కి, గళం సవరించుకొని పొదుపు కథకు విడుపు ప్రారంభించింది.
"అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఓ పూరిల్లు, ఆయింటి చూట్టూరా చక్కనికూరగాయల మొక్కలు. అమొక్కల మధ్యమధ్య చిక్కుడు, పొట్లతీగలు, బీర తీగలు, ఆ యింటి పై కప్పుపై పచ్చని గుమ్మడి తీగ, కప్పునిండ గుమ్మడి ఆకులు చిలుక పచ్చగా నిగనిగలాడుతోన్న గుడిసె. ఆకుల మధ్య పసుపు పచ్చని గుమ్మడి పూలు.
ఆ గుడిసె పేద రైతుది. అతనికో మేక ఉంది. దాని నెప్పుడూ గుడిసె తలుపుకే కట్టి వేస్తారు. ఆ మేక కడుపునిండా తిన్నది; హాయిగా నెమరు వేస్తూఉన్నది; నిలబడే ఉన్నది, గుడిసె మీద ఆకుల్లో ఎలుకలున్నాయి. అవి అటూ ఇటూ పరుగెత్తుతున్నాయి. ఓ ఎలుక పెద్ద గుమ్మడి పండు కాడ కొరికింది. కొండల్నే పిండిగా చేసే ఎలుకకు గుమ్మడి పండో లెక్కా... పక్కా!
ఇంకేం! కాడ *'పుటుక్కున'* తెగింది. గుడిసె మీన్నుండి గుమ్మడి పండు *'జరజర'* జారింది. నెమరు వేస్తున్న మేకమీద *'డుబుక్కున'* పడింది. హఠాత్ ఘటన! మేక బెదురుకుంది *'మే'* అంది.
ఆ అమ్మాయి విడుపుకథ ఆపింది. అందరిదిక్కు చూసి గలగలా నవ్వింది. అందరూ 'పుటుక్కు, జర జర డుబుక్కు, మే' అంటూ నవ్వారు.
ఆ నవ్వుల తళతళలు ఇంటింటా ప్రసరించాయి. వీధుల్లో కాంతిని నింపాయి.ఈ కథ ఆ నగరం రాజ- చెవిలో దూరింది. రాజు పండితుల్ని అడిగాడు. శబ్దార్థాలు మాత్రమే తెలిసిన పండితులకిది తలకు మించిన కార్యమైంది.
ఇది ఏదో సంఘటనకు ముడి అనుకున్నారు. ఆ చిక్కుముడి విప్పితే గాని దీని అర్థం తేలదనుకున్నారు. అందుకే రాజును వారం రోజుల గడువడిగారు. పండితులు జనపదాలపై పడ్డారు. శబ్దాలు తెలుసు; శబ్దార్థాలు తెలుసు; కాని జరిగిన సంఘటం తెలువదు. మొత్తంమీద జనహృదయ సంశోధనం చేసి సాధించారు. కొండను త్రవ్వి ఎలుక పట్టారన్న సామెత ఎలాంటిదైనా తవ్వితే గాని అంత ఇంత దొరకదు మరి! ఇంత దొరికినప్పుడు అంత అర్థమవుతుంది మరి!
9992
ఆత్మానాత్మ వివేకము- 2
( ఆది శంకరుల విరచితం ) )
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం /
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. //
* * *
ఆత్మన : కిం నిమిత్తం దు:ఖం ? శరీర పరిగ్రహ నిమిత్తం /
" నేహ వై సశరీరస్య సత: ప్రియాప్రియాయో రపహతి రస్తీతి " శ్రుతే : // 3
ప్రశ్న : అయితే, బ్రహ్మ స్వరూపమయిన ఆత్మకు దు:ఖం ఎందుకు కలుగుతుంది ?
స : శరీరాన్ని ధరించడం వలన. ఈ శరీరధారులకు ‘ ప్రియము, అప్రియము ‘ అనేవిషయాలు అశాశ్వతములనీ, పుడుతూ నశిస్తూ వుంటాయనేది, తెలియని విషయమని, శ్రుతులు చెబుతున్నాయి.
' శరీరధారులకు ఇష్టానిష్టాలు, కష్టసుఖాలు తప్పవు. ' అని భావం.
దు:ఖం అనేది శరీరానికే గానీ , ఆత్మకు కలగడం లేదని ముందు తెలుసుకోవాలి. ఆత్మకు, దు:ఖాలున్నాయని అనుకోవడం భ్రమ.
ఇక, ఈ దు:ఖాలు మూడురకాలు.
1. i ) శరీరానికి కలిగే క్లేశాలు, జ్వరాలు, ఇతర రోగాలు
ii ) మనస్సుకు సంబంధించిన క్లేశాలు అనగా కోరికలూ , కోపం , ఆశ , కోరినది లభించలేదనే దు:ఖం, మొదలైనవి
2. ఇతర ప్రాణులవలన కలిగేదు:ఖాలు. క్రూరమృగాల వలన, చోరుల వలన ...
3. అగ్నిబాధలూ, తుఫానులూ, గ్రహబాధలూ మొదలైనవి.
పై మూడు బాధలూ శరీరానికే. మనస్సుని ఆత్మ గా భ్రమింపరాదు . మనం మనిషిని ఆత్మరూపంలో గుర్తిస్తే రాగద్వేషాలు వుండవు. దు:ఖమూ వుండదు.
ఆత్మానాత్మ వివేకము ( ఆది శంకరుల విరచితం -- శ్లోకం 4 .)
శరీర పరిగ్రహ: కేన భవతి ? ..... కర్మణా !
ప్రశ్న : మరి , అటువంటి దు:ఖానికి స్థానమైనట్టి శరీరాన్ని, ఎందుచేత ధరించాల్సి వస్తుంది ?
స : కర్మల వలన ! అంటే, జన్మ జన్మాంతరాలలో మనం చేసుకున్న కర్మల వలన ! ఈ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి జన్మ అనేది కలుగుతోంది. అంటే, శరీరం ధరించాల్సి వస్తోంది .
ఈ శరీరం మనంచేసిన శుభాశుభకర్మల వలన కలిగిన సంస్కారంతో బంధింపబడి వున్నదన్నమాట. అనగా, జీవాత్మ మాటిమాటికీ కోరికలతో అనేకకర్మలు చేస్తూ, ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి అనేక జన్మలు పొందుతూ, చస్తూ, జనన మరణాలనే చక్రంలో తిరుగుతోంది.
అందుకే జన్మ అనేది ఎందుకు కలుగుతుంది అంటే ' కర్మ చేత ' అని సమాధానం ఇచ్చారు.
* * *
పంచేంద్రియాలూ, మనస్సు, నిశ్చయాత్మక బుద్ధి, అహంకారం వీటి అన్నిటి కలయికను, ' అంత:కరణం ' అంటారు.
వీటి ద్వారానే కర్మ ప్రభావితమౌతుంది. కర్మయందు మమకారం, ఆసక్తి, ఫలాపేక్ష లేకుండా, కర్మచేయడం ద్వారా కర్మబంధం నుండి విముక్తి పొందవచ్చన్నారు. అనగా మోక్షమార్గమన్నమాట.
కర్మలే మన లెక్కపద్దులలో లేనప్పుడు, మరుజన్మకు ఆస్కారమే లేదు కదా !
శరీరం లభించడం దోషం కాదు. ఈ శరీరం మీద ఆసక్తి ని పెంచుకోవడమే దోషమని గ్రహించాలి.
* * *
ఆత్మానాత్మ వివేకము ( ఆదిశంకరుల విరచితం -- శ్లోకం 5.)
కర్మ కేన భవతీతి చేత్ ? రాగాదిభ్య: /
ఈ శరీరానికి బంధరూపమైనట్టి కర్మ దేనివలన ప్రేరేపింప బడుతోంది ? అని ప్రశ్న.
సమా : ' రాగం ' వలన. అంటే, ఏదో పొందాలనే తృష్ణ వలననే కర్మ పుడుతోందనీ , ఆ తృష్ణ చేత ప్రేరేపింపబడటం వలననే, కర్మ చేస్తున్నారనీ, సమాధానం.
రాగం అంటే ఏమిటీ ? ఏదైనా సుఖంగానీ దు:ఖంగానీ కలిగించే వస్తువు విషయంలో వుండే మానసిక స్థితిని ' రాగం ' అంటారు . ఈ రాగం అనే దానివలననే ఒక వస్తువు లేకపోవడం అనే భావం వలన, దానిని తానూ పొందాలనీ , దాని సాన్నిధ్యం పొందాలనీ, దానిని రక్షించుకోవాలనీ , ప్రబలమయిన కోరిక పుడుతుంది.
తాను పొందవలసిన సుఖం, లేదా పొందిన సుఖం, లేదా పొందుతున్న సుఖం, పోతుందేమో అని అనుకోవటం వలన, రాగం పుడుతుంది. ఆ రాగం వలన కర్మకు ప్రేరణ కలుగుతుంది.
* * *
ఈ రాగం అనేది ఒక రోగం లాంటిది. ఇది మనస్సులో చేరి కర్మ కోసం ప్రేరణను ఇంకా అధికం చేస్తూ వుంటుంది. అందుకనే " నాస్తి రాగ సమం దు:ఖం " అన్నారు. ఈ రాగాన్నే సాంఖ్యుల పరిభాషలో " మహా మోహం " అని అంటారు.
ఈ రాగానికి అష్టైశ్వర్యాలు విషయాలుగా ఉండటం వలన, దీనికి ఎనిమిది భేదాలు చెబుతారు. ( అష్టైశ్వర్యాలు పొందే మార్గాలు అష్ట సిద్ధులు -- అణిమ , మహిమ , గరిమ , లఘిమ , ప్రాప్తి , ప్రాకామ్యం , ఈశత్వం, వశిత్వం ).
అందువలననే రాగం వలన అని కాకుండా, ' రాగాదిభ్య: ' రాగం మొదలయిన వాటివలన అని సమాధానం చెప్పారు.
* * *
శంకరుల అనుగ్రహంతో, మరికొంత రేపు...
స్వస్తి.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్ పంపినది
.....
ప్రాంజలి ప్రభ కథలు. 9993
*****
పిచ్చోళ్లమ్మా పిచ్చోళ్లు....అంగట్లో పిచ్చోళ్లు...ఊళ్ళల్లో పిచ్చోళ్ళు...
అంతర్వేదిలో మొదలైన పిచ్చోళ్ళు సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి వరకూ వచ్చేసారు...
ఆ మధ్యన ఈ పిచ్చోళ్ళే ఆఫ్ఘనిస్తాన్ లో బనియన్ బుద్ధ విగ్రహాల వరకూ వెళ్లారు...
పిచ్చి ముదిరినప్పుడల్లా గుళ్ళూ గోపురాలు కూలగొట్టారు...
పిచ్చోడు ఒకడైతే ఫరవాలేదు...
బంగ్లాదేశ్ లో వేలాది లక్షలాది మంది పిచ్చోళ్లు తయారయ్యారు....
పాకిస్తాన్ అనే దేశం మొత్తం పిచ్చిదై పోయింది...
గుళ్ళూ గోపురాలూ కనబడితే పిచ్చొచ్చేస్తుంది...
అదేంటో విగ్రహం కనబడితే పిచ్చి లేస్తుంది...
ఏమిటో...పోలీసులు పిచ్చి సర్టిఫికేట్ ఇప్పించి...మరీ ఊళ్ళల్లో వదులుతున్నట్టు ఉన్నారు...
అదే సర్టిఫికెట్ రేపు కోర్టులో కూడా ఉపయోగ పడచ్చు...
పిచ్చోడని కూడా చూడకుండా బడితే పూజ చేస్తే...పాపం పిచ్చోడని బాధ పడే సెక్యులర్ పిచ్చోళ్ళూ ఉన్నారు...
ఆ ఏకైక దేముడు ప్రపంచమంతా ఇంత మంది పిచ్చోళ్లని తయారు చేసి ఎలా వదిలాడురా నాయనా...
రేపు రేపు పాపం పిచ్చోళ్ళకు జీవించే హక్కు నిరాకరిస్తున్నాయని...విగ్రహాలు తీసెయ్యమనే ఎర్ర భక్తులు కూడా వస్తారు...
కోర్టులు కూడా పిచ్చోడిని కొట్టిన గుంపు పైన సుమోటోగా కేసులు పెట్టినా పెడతాయి...
ఏమో బాబూ...ఎందుకైనా మంచిది పిచ్చోడు ఏమైనా చేస్తాడు...
గుళ్ళకు వెళ్ళకండి...విగ్రహాలు పెట్టకండి...భయం లేకుండా నాస్తికులై పొండి...
గుంపుగా ఇంత మందిని పిచ్చోళ్లుగా తయారు చేస్తున్న ఆ పిచ్చి వ్యవస్థను సరి చెయ్యాలని తాపత్రయ పడకండి...
కుదిరితే మీరూ ఆ పిచ్చోళ్ళ సమూహంలో కలిసిపోండి...
పిచ్చోళ్ల ప్రపంచవ్యాప్త పోరాటానికి మద్దతు ఇవ్వండి...
ప్రపంచ పిచ్చోళ్ళారా ఏకంకండి...విగ్రహం లేని ప్రపంచం కోసం...!
జై పిచ్చి ప్రపంచం...!
*****
9994.*ప్రతి జన్మ లోనూ…
ఉపాధ్యాయుడుగానే పుట్టాలని
కోరుకున్నారు!
పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నారు విద్యాసాగర్ గారు.
ఆయన రిటైరయ్యి నాలుగేళ్లు అయ్యింది.
స్వస్థలం కర్నూల్ పట్టణం. అక్కడే ఎక్కువకాలం లెక్చరర్ గా పని చేసారు. ఎన్నో అనుభూతులు...! గతం ప్రసాదించిన వరం..!!
ఆ అనుభూతుల్లోనికి తొంగి చూడటం అలవాటయ్యింది విద్యాసాగర్ గారికి..!
ఆయనో పిజిక్స్ లెక్చరర్ ఆ రోజుల్లో..! అప్పుడు ఆయన వయస్సు పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు. అప్పటికే సీనియర్ కాలేజీ లెక్చరర్! స్టూడెంట్స్ కి ఇష్టమైన లెక్చరర్ కూడా..!
ఆయన పనిచేస్తున్న కాలేజీ ఒక రెసిడెన్షియల్ కాలేజీ. మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారు. దాదాపుగా తొంభై శాతం విద్యార్థులు నిరుపేదలే! కష్టపడి చదివి, ఎంట్రెన్స్ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణులై వచ్చిన వారే అందరూ..!
నెలకు వంద రూపాయలు స్టైఫండు ఇచ్చేవారు ప్రతి విద్యార్థికి. అవి వారి తిండికే సరిపోయేవి.
** ** ** ** **
ఇంకో రెండు రోజుల్లో దసరా పండుగ సెలవులు. ఆ రోజు రాత్రి పది గంటల తరువాత విద్యార్థులు ఉన్న హాస్టల్ నిరీక్షణకు వెళ్ళారు ఆయన.
ఆ కళాశాల లో పని చేస్తున్న ప్రతి లెక్చరర్ కి అదో ప్రత్యేకమైన డ్యూటీ..!
హాస్టల్ లో నలభై గదులున్నాయి. రెండు వందల మంది మాత్రమే హాస్టల్ లో ఉన్నారు. మిగతా రెండు వందల మంది కాలేజీకి దగ్గర్లో ఉన్న కాలనీల లో అద్దెకు ఉండేవారు. హాస్టల్ లో ఖాళీ అయినప్పుడు వచ్చి చేరేవారు.
హాస్టల్ నిరీక్షణకు దాదాపు రెండు గంటల సమయం పట్టేది.. నలభై గదుల్లో ఉన్న విద్యార్థులు ఎలా చదువుతున్నారో చూడాలి ..నిరీక్షణ చేస్తున్న లెక్చరర్.
నిరీక్షణ మొదలయ్యింది ఆ రోజు రాత్రి..
మధ్య మధ్యలో గదుల్లోనికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి ముందుకు కదులుతున్నారు.
8 వ నంబర్ రూము.... తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి.. ఏవో మాటలు వినిపిస్తున్నాయి.. చదువు కోకుండా ఈ మాటలేమీటీ.. అనుకుంటూనే దగ్గరగా వెళ్లి మాటలు విన్నారు... ఆ తరువాత ముందుకు కదిలారు.. ఒక గంట తరువాత స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటికి బయలు దేరారు విద్యాసాగర్ మాష్టారు.
ఆ రోజు రాత్రి చాలా సేపటి వరకూ ఆయనకు నిద్ర పట్టలేదు.
ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పట్టింది ఆయనకు...
టైము కి కాలేజీకి వెళ్ళడం ఆయనకు అలవాటు..
మొదటి పీరియడ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాసుకి వెళ్ళారు...
పాఠం మొదలు పెట్టే ముందు మాములుగా అందరినీ అడిగారు .
“దసరా సెలవులు వస్తున్నాయి కదా .. ఈ పది రోజులు ఇంటికి వెళ్ళే వారు ఎందరు ?”
మొత్తం క్లాసులో ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు తప్పించి అందరూ ఇంటికి వెళ్తున్నామని చేతులు యెత్తారు. చేతులు ఎత్తని ముగ్గురి పేర్లు ఆయనకు తెలుసు.
“హాయిగా సెలవులు గడిపి రండి. కొన్ని రోజులు కాలేజీని మరచి పొండి..." నవ్వుతూ అన్నారు ఆయన.
క్లాసు చెప్పడం మొదలు పెట్టారు. గంటన్నర తరువాత క్లాసు ముగించి స్టాఫ్ రూమ్ కి వెళ్ళారు ఆయన.
ఒక అరగంట తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఉన్నారు ఆయన.
“సర్..! నిన్న రాత్రి హాస్టల్ విజిట్ కి వెళ్ళాను.. ఒక రూం లోనుండి విద్యార్థులు మాట్లాడుకున్న మాటలు విన్నాను.."
"సర్ ! దసరా సెలవులు కొంతమంది పిల్లలకు కష్టం కలిగిస్తున్నాయి.. కొంత మందికి తల్లి దండ్రులు లేరు. ఎవరి పంచనో ఉండి చదువుతున్నారు ఇన్నాళ్లూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలో వాళ్లకు అర్థం కావటం లేదు! హాస్టల్ కూడా మూసేస్తున్నాం. తిండి కూడా ఉండదు పిల్లలకు.. సెలవుల్లో.."
"నాదో రిక్వెస్ట్ సర్ .. హాస్టల్ తెరిచి ఉంచుదాం. రెండువందల మందిలో కనీసం ఒక ఇరవై మంది హాస్టల్ లోనే ఉండే అవకాశం ఉంది. వీలయితే మెస్ కూడా ఏర్పాటు చేయాలి మనం... చెప్పడం ఆగారు.. విద్యాసాగర్ గారు..
ప్రిన్సిపాల్ అంతా విని ఆశ్చర్య పోయారు.. "అయ్యో.. ఇన్నాళ్లూ ఈ విషయం నా దృష్టికి ఎవరూ తీసుకు రాలేదు..." బాధ పడ్డారు ఆయన.
ఆలోచనలో పడ్డారు ప్రిన్సిపాల్. కాసేపటి తరువాత తేరుకుని అన్నారు…
"హాస్టల్ తెరిచి ఉంచడం కష్టం కాదు!మెస్ ఏర్పాటు చేయడం కష్టం.. మెస్ లో పని చేస్తున్న వాళ్లకు సెలవులు ఇచ్చి తీరాలి.. ఏం చేయాలి ?" ఆలోచనలో పడ్డారు ఆయన.
"అది పెద్ద కష్టం కాదు సర్.. దాదాపు పాతిక మంది లెక్చరర్లము ఉన్నాము. పిల్లలు మా ఇళ్ళల్లో భోజనం చేస్తారు. ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు హాస్టల్ తెరిచి ఉంచి పుణ్యం కట్టుకోండి.." బ్రతిమ లాడారు విద్యాసాగర్ గారు.
"అలాగే… తప్పకుండా హాస్టల్ తెరిచే ఉంచుదాం...ఇక్కడే ఉండాలనుకునే విద్యార్థులు నిరభ్యంతరంగా ఉండవచ్చు సెలవు రోజుల్లో..! వాచ్ మన్లు గా ఒకరిద్దర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం. ఇక భోజనాల సంగతి… మా ఇంట్లో కూడా నలుగురికి నేను ఏర్పాటు చేస్తాను.." అన్నారు ప్రిన్సిపాల్.
ఆయనకు నమస్కారం చేసి స్టాఫ్ రూం కి నడిచారు విద్యాసాగర్ గారు.
లంచ్ సమయంలో స్టాఫ్ రూం లో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు ఉదయం ఫస్ట్ పీరియడ్ లో సెలవులకు ఇంటికి వెళ్ళని ముగ్గురు విద్యార్థులు..
"ఏమిటి ? చెప్పండి .." అడిగారు ఆయన.
ఒక నిముషం మాటలు లేవు.. నెమ్మదిగా ఒక విద్యార్థి చెప్పాడు..
"మాకు కూడా ఇంటికి వెళ్ళాలని ఉన్నది.. అమ్మని, నాన్నని చూడాలని ఉంది.. అలాగే తమ్ముళ్ళను చెల్లాయిలను కూడా. కానీ వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకే మేం ఉదయం చేతులు ఎత్తలేదు సర్..." చెప్పాడు ఒక విద్యార్థి.
మిగతా ఇద్దరూ .. “అవును సర్...” అన్నారు.
“ఈ విషయం అందరి ముందు చెప్పలేక పోయాం సర్... క్షమించండి.” అన్నారు ఆ ముగ్గురూ.
"సరే..మీరు క్లాసుకి వెళ్ళండి.... మీతో తరువాత మాట్లాడుతాను.. " అంటూ వాళ్ళను పంపేశారు విద్యాసాగర్ గారు.
పిల్లలు ఇంత కష్టపడుతూ ఉన్నారా? సెలవులకు ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవా ? ఆయన మనసు ఎంతో బాధ పడింది.
ఏం చేయాలి.. ఏం చేయాలి...
ఆ పిల్లలు ముగ్గురికి ..సెలవులకు ఇంటికి వెళ్ళడానికి ట్రెయిన్ టిక్కెట్లు కొన్నారు.. మళ్ళీ రావడానికి, ఖర్చులకు ఒక్కొక్కరికి వంద రూపాయలు అదనంగా ఇచ్చారు... విద్యా సాగర్ గారు.
అయినా ఆయన మనసులో ఏదో బాధ..! ఇలా విషయం చెప్పకుండా తమలో తాము బాధ పడుతున్న విద్యార్థులు ఎందరో..?
ఆయన మదిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
దసరా, సంక్రాంతి సెలవులకు వారం రోజుల ముందు విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టు లో పరీక్ష పెట్టేవారు. వంద మార్కులకు..కనీసం ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులకు వంద రూపాయలు నగదు పారితోషికం అందజేసేవారు..! ఇంకేముంది.... ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులకు.. ఇలా ఇవ్వసాగారు.. దసరా , సంక్రాంతి పండుగలకు.. విద్యాసాగర్ గారు ఇరవై వేలు పైనే ఖర్చు పెట్టేవారు.
ఆ రోజుల్లో.. ఆ కాలేజీలో ఆయన ఉన్న ఐదేళ్ల లో ఇలాగే గడిచింది . ఆయనకు తృప్తిగా ఉంది... ప్రిన్సిపాల్ కూడా మెచ్చుకున్నారు..ఆయన కూడా కొంత సాయం చేసే వారు మిగతా గ్రూప్ విద్యార్థులకు..
ఆ రోజులు గుర్తుకు వచ్చి .. నవ్వుకున్నారు ఆయన. ఆ పిల్లలు ఎలా ఉన్నారో... ఎక్కడ ఉన్నారో... వాళ్ళు కనిపించినా గుర్తు పట్టడం కష్టం.!
"కాఫీ తీసుకోండి.. " అంటూ వచ్చింది ఆయన శ్రీమతి..
"దసరా పండుగ వస్తోంది కదా.. మన పని మనిషి పిల్లలకు బట్టలు కొందామా ?" అడిగింది ఆవిడ.
ఆవిడ వంక తదేకంగా చూశారు విద్యాసాగర్ గారు..
"అలాగే..." అంటూ ఆలోచనలో పడ్డారు..
ఒక గంట తరువాత శ్రీమతి కి చెప్పారు... "అలా ..మా కాలేజీ వరకూ వెళ్లి వస్తాను.."
"మీ కాలేజీ ఏమిటి ? మీరేమైనా కట్టించారా ?" నవ్వింది ఆయన శ్రీమతి..
ఆయన కూడా నవ్వారు..
హైదరాబాదు లో డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆయన..విద్యా విభాగంలో..! ప్రస్తుతం కర్నూల్ లో సెటిల్ అయ్యారు.
*** *** ***
కాలేజీ కి చేరుకుని .. తిన్నగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళారు..అక్కడ ఉన్నవారికి ఆయన తెలుసు. నమస్కారం చేసారు అందరూ... కాసేపు వారితో గడిపి...ప్రిన్సిపాల్ రూం లోనికి అడుగు పెట్టారు ఆయన.
“నమస్కారం ప్రిన్సిపాల్ గారూ..!
నా పేరు విద్యా సాగర్.. ఈ కాలేజీలో ముప్పై ఏళ్ల క్రితం లెక్చరర్ గా పనిచేశాను. ఒకసారి చూసి పోదామని వచ్చాను." చెప్పారు ఆయన.
ప్రిన్సిపాల్ .. అక్కడున్న మిగతా వాళ్ళు చూస్తూ ఉండగానే .. విద్యాసాగర్ గారి కాళ్ళకు నమస్కారం పెట్టారు.
"సర్..! మీరు నాకు తెలుసు..! నేను కూడా ఇదే కాలేజీ లో కామర్స్ చదివాను. మీరిచ్చిన వంద రూపాయల్లో సగం నాకిచ్చేవాడు నా రూం మేట్.! మీ పేరు చెప్పుకుని మేము సెలవుల్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం .." వినయంగా చెప్పారు...ప్రిన్సిపాల్.
విద్యాసాగర్ గారికి ఆశ్చర్యం.. ఎన్ని ఏళ్ల క్రితం మాట... కొన్ని వందల రూపాయల సాయం... అదీ పిల్లలకు.... ఇంకా ఇలా కొంతమంది గుర్తు పెట్టుకోవడం ఆనందంగా ఉంది.
జేబులో నుండి చెక్కు తీశారు... ఇరవై వేల రూపాయలు… వ్రాసి సంతకం చేసి..ప్రిన్సిపాల్ చేతికి అంద జేశారు.”
పిల్లల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తాను..."చెప్పారు విద్యా సాగర్ గారు..
"అలాగే సర్...తప్పకుండా.."
"మీరు నేర్పిన బాట లోనే నేను నడుస్తున్నాను. పండుగల ముందు పరీక్షలు పెట్టి.. కొంతమందికి నగదు బహుమతి ఇవ్వడం మొదలు పెట్టాను.
మీరు వెలిగించిన కాగడా ..ఇంకా వెలుగుతూనే ఉంది మాష్టారూ.
నా ముందు వాళ్లు కూడా ఇలాగే చేసారు. అవసరం ఉన్న వాళ్లకు , వాళ్ల ఆత్మాభిమానానికి అడ్డు రాకుండా... మీరు చేసిన పనిని మేం కొనసాగించాం.
మీకు అభ్యంతరం లేక పోతే అప్పుడప్పుడూ వస్తూ ఉండండి" వేడుకున్నాడు ..ప్రిన్సిపాల్.
ప్రిన్సిపాల్ తో బాటుగా టీ త్రాగి తృప్తిగా బయటకు నడిచారు. కాదు..కాదు..కారు వరకూ..దాదాపు అందరు లెక్చరర్లు వచ్చి దిగ బెట్టారు. ప్రిన్సిపాల్ కారు డోర్ తీసి పట్టుకుని.. అన్నాడు.. "మమ్మల్ని ఆశీర్వదించండి మాష్టారూ."
విద్యాసాగర్ గారికి.. కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. ప్రతి జన్మ లో ఉపాధ్యాయుడుగా పుట్టాలని కోరుకు న్నారు .. దేవుణ్ణి..
*** *** *** *** ***
"మీకోసం ఆయన ఎవరో వచ్చారు.... ఇంకో గంట లో వస్తానని వెళ్ళారు. ఏదో పేరు చెప్పారు. ఆc.. సుబ్బారావు గారట. పెద్ద రైల్వే ఆఫీసర్ లా ఉన్నారు ఆయన." చెప్పింది ఆయన శ్రీమతి.
ఎవరా సుబ్బారావు... గుర్తుకు రాలేదు విద్యాసాగర్ గారికి.
ఇంకో అరగంట లో వచ్చారు ఆ సుబ్బారావు గారు.
షరా మామూలే ...! వచ్చిన సుబ్బారావు గారు ఆయన కాళ్ళకు నమస్కరించడం ...
వచ్చిన సుబ్బారావు గారు చెప్పారు ..
"ముప్పై ఏళ్ళ క్రితం.. ఒక మధ్యాహ్నం.. మీ రూం కి వచ్చిన ముగ్గురిలో నేను ఒకడిని మాష్టారూ.. అప్పుడు మీరు ట్రెయిన్ టికెట్ కొనిపెట్టి.. వంద రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇంటికి వెళ్ళడానికి.
ఈ రోజున .. అదే రైల్వేలో .. రైల్వే బోర్డు మెంబరుగా పని చేస్తున్నాను. అంతా మీ చలవే..!” వినయంగా చెప్పాడు సుబ్బారావు.
ఎంతో సంతోష పడ్డారు విద్యాసాగర్ గారు... సుబ్బారావు ని దీవించి పంపారు ..విద్యాసాగర్ గారు.
అతను తెచ్చిన స్వీట్ ని తిన్నారు ఆప్యాయంగా...
ఆ రుచి గొప్పగా ఉంది ఆయనకు.... అలా ఎప్పుడూ అనిపించలేదు ..
ఆయనకు బాగా నిద్ర పట్టింది ఆ రాత్రి.. నిద్రలో వెలుగుతున్న కాగడా ... కనిపిస్తూనే ఉంది.. సంతోషంగా ట్రెయిన్ లో వెళుతున్న విద్యార్థులు కూడా కనిపించారు కలలో!
మాష్టారు గా విద్యను అందరూ బోధిస్తారు... విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆదుకునే .. విద్యాసాగర్ లాంటి మాస్టార్లు అరుదుగా ఉంటారు... చేసిన సాయం బయటకు చెప్పడం వారికి ఇష్టం ఉండదు.... వారే నిజమైన మాష్టార్లు.... విద్యా సాగరులు.🙏🙏
.
*****
ప్రాంజలి ప్రభ కథలు.. 9995
*కర్మ సిద్థాంతం*
*ఇది చాలా కఠినమైనది ఎవ్వరికీ అర్థంకాదు*
*మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది*
"కర్మను" అనుభవించాలి ..... నిందిస్తే ప్రయోజనం లేదు .
రమణ మహాశయలు వారు ప్రతిదినము స్నానం కొరకు నదికి పోతుండేవారు.
ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు.
ఒకనాడు రమణ మహాశయులు
నదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా తో "కృష్ణా ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు.
కృష్ణా కు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు.
ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు మీద పడినది .
కాలి వేలు చితికింది .రక్తం కారుతోంది .
ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు,
కృష్ణా అప్పుడు గ్రహించాడు, వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు.
అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గుర్తించి , రమణ మహాశయులతో "మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ?" అని ప్రశ్నించాడు.
అప్పుడు రమణమహాశయులు కృష్ణా తో … "ఆలా జరగదు కృష్ణా పక్కకితప్పుకొంటే , ఎప్పుడో
ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే!
రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా !" అని అన్నారు.
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించ వలసిందే.
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
*****
*ప్రాంజలిప్రభ కథలు... 9996
శివుడిని కొన్ని సందర్భాలలో ఏనుగు చర్మం ధరించిన వాడిగా, మరికొన్ని సందర్భాలలో పులి చర్మం ధరించిన వాడిగా, మరికొన్ని సందర్భాలలో దిగంబరుడిగా వర్ణిస్తారు. వీటి వెనక పరమార్ధం ఏమిటి? అసలు ఆయన ఎలా ఉంటాడు?
"ఆపాతళనభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్పురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి"
పాతాళము నుండి ఆకాశపు అంచుల వరకు వ్యాపించిన బ్రహ్మాండము నిండుకున్న జ్యోతి స్వరూపుడు శివుడు. ఆది, అంతములు లేని వాడు. అటువంటి పరమేశ్వరుని కప్పే వస్త్రము ఉందా? అందుకే శివుడు దిగంబరుడు - దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు.
అందరినీ శాసించే ఈశ్వరుడు. తనను శాసించే వారెవ్వరూ లేని వాడు కాబట్టి దిగంబరుడు. వస్త్రధారణ లోకములో వ్యావహారిక నియమాలను సూచించే కనీస కర్తవ్యము - కూడు, గుడ్డ, నీరు అంటారు కదా? తనకు ఎటువంటి నియంత్రణ లేదని చెప్పేది దిగంబర తత్వము.ప్రపంచ రాహిత్య స్థితిని సూచిస్తుంది.
తనను పూజించినా, కపటంతో మోసం చేసినా, ధిక్కరించినా కూడా భక్తుని మనసు మార్చి , రాక్షసత్వం పోగొట్టి తన దారిలోకి తెచ్చుకొని ప్రాయశ్చిత్తపడేలా చేసెడి వృత్తాంతం గజాసురుని విషయంలో కనబడుతుంది. ఆత్మనే శివునికి సమర్పించుకుని, శరీరాన్ని ఏ బాధా లేకుండా పరమేశ్వరునికి వలిచి భక్తుడు ఇస్తే, ఆ వలచిన రక్తం కారుతున్న చర్మాన్ని చుట్టుకొని భక్తుని కోరికను తీర్చేది కరిచర్మ ధారణ. కాదు ..తనకు ఎటువంటి ఆశుచి అంటదు, తనకు అన్ని సమానమే అని తెలిపేది కృత్తివాసుని రూపము.తలపైన అన్ని దోషములను పోగొట్టి పవిత్రము చేసే గంగ, అమృత ధారాలను కురిసే చంద్రుడు. వంటిపై రక్తంకారుతున్న గజచర్మము, స్మశాన బూడిద, భయంకరమైన పాములు!! శుభములు, అశుభములు ఒక్క చోటే కొలువైన రూపము అదొక్కటే. కాబట్టి ప్రపంచాన్ని ఒక్క చోట చూపే ప్రతిరూపము ఆ నిరాకార శివుని సాకార స్వరూపము.
రాక్షసుల గర్వము మదించిన ఏనుగులా ఉంటే, అన్నీ తెలిసి మాయ నుండి బయట పడని ఋషుల గర్వము విచక్షణ లేక వేటాడే పులి వంటిది. ఏ బాధలు లేకుండా అన్ని సాగిపోతే ఒక రకమైన మాయ అలుముకొని తమంతటి వారు లేరనే గర్వము, దైవముపై చిన్న చూపు కల్గుతుంది. అదే జరిగింది దారుకా వనంలో ఋషులకు ఒకసారి. యజ్ఞము మొదలైన కర్మలతో, తమకు తెలిసిన జ్ఞానంతో ఏదైనా సాధించవచ్చు అనే గర్వం కలిగింది ఈ ఋషులకు. తమకి ఫలానికి మధ్య పరమేశ్వరుడు ఉంటాడనే విషయం మరిచారు. ఈశ్వర శక్తిని ధిక్కరించే వరకు వచ్చారు.
ఆదిపురుషుడైన శివుడు వారిని పరీక్షించడానికి, వారిని దారిలోకి తేవడానికి ఒక యువ భిక్షువు రూపంలో దిగంబరంగా , తోడుగా మోహిని రూపంలో యజ్ఞ రక్షకుడైన విష్ణువును వెంటబెట్టుకొని వెళతాడు. అంతటి సుందర రూపం చూసి మోహితులయ్యారు. కానీ ఇంతటి దీక్షా పరులైన తమను ఆకట్టుకొనే ఈ యువకుడు ఎవరనే అలోచన లేకుండా, అతని పైకి తమ శక్తులను ప్రయోగింప ప్రయత్నించారు. ఆభిచారిక హోమం చేసి పామును ప్రయోగించారు. ఈ అహంకార రూపమైన పాముని తీసుకొని మెడలో వేసుకున్నాడు ఆ యువకుడు. పులిని సృష్టించి విడిచారు. దాని ఉగ్రంగా రెండు చేతులా పట్టి ఝులిపించి చర్మాన్ని ఒంటికి చుట్టుకుని నవ్వాడు ఆ యువకుడు. తమ మాయలను కూడగట్టి అపస్మారుడనే రాక్షసుణ్ణి సృష్టించి వదిలారు. ఈ అజ్ఞాన రాక్షసుని కాలితో తొక్కాడు. ఇక చేసేది లేక యజ్ఞ అగ్నిని ప్రళయాగ్నిగా ప్రయోగించారు. వారి కోపానికి రూపమైన ఆ అగ్నిని చేతిలో పట్టుకుని, మీరు నన్నేమీ చేయలేరని నవ్వుతూ నాట్యం చేసాడు. అలా తనను ధిక్కరించిన వారికి అపురూపమైన నటరాజ రూపం చూపాడు.
గజ చర్మము రాక్షసుని పై కృప చూపి కట్టుకునే పంచగా మారితే, పులి చర్మము ఋషులపై కృపతో అంగ వస్త్రంగా మారింది.
ఇక మీ ప్రశ్నకు సమాధానం. ఆదిమధ్యాంత రహితుడు, నిరాకారుడు అయిన పరమేశ్వరుడు కావలసిన రూపంలో దర్శనమిస్తాడు. దిగంబరంగా కావాలంటే అలాగే, గజచర్మంతో కావాలంటే, వ్యాఘ్ర చర్మంతో కావాలంటే, లేదా పట్టు వస్త్రాలతో ముత్యాల హారాలతో, లేదా కిరాత రూపంతో మనము భావించినట్లు కనిపిస్తాడు. అనేక మూర్తుల ఆది దేవుడు మనని ఆదుకునే శివుడు.
ఓం నమః శివాయ.
16 వ పదం చెప్పనేలేదు
ReplyDelete