సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ
🌻 *అహం అనర్థ హేతువు* 🌻
🥀ఒకప్పుడు పాశుపతాస్త్రం పొందగోరి అర్జునుడు, పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందునిమిత్తం ఒంటరిగా రథంలో బయలుదేరిన అతడు అరణ్య మార్గంలో అనేక మృగాలను వేటాడుతూ ఒక పగటి వేళ రామేశ్వరం చేరుకున్నాడు.
🥀అక్కడ అతడు సముద్రస్నానం చేసి మాధ్యాహ్నికం నిర్వర్తించాడు. ఆ తరువాత గర్వంతో రథాన్ని సముద్ర తీరంలో అటూ ఇటూ సమధికోత్సాహంతో వేగంగా నడిపించాడు.
🥀అప్పుడు అక్కడ అరణ్యంలోని కొండ మీద శ్రీరామభక్త హనుమాన్ తపస్సు చేసుకొంటున్నాడు. 'రామ రామ' అంటూ జపంలో లయించిపోయి ఉన్న ఆంజనేయుని యాదృచ్ఛికంగా అర్జునుడు అక్కడ చూశాడు.
🥀ఆయనను చూసి గర్వంతో అర్జునుడు, "ఏయ్ ముసలి కోతీ! నువ్వు ఎవరు? నీ పేరేమిటి?” అని గద్దిస్తూ అడిగాడు.
🥀అందుకు ఆంజనేయుడు నవ్వుతూ ప్రశాంతంగా, “శ్రీరాముడు బండరాళ్ళతో సేతువు నిర్మించి, లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించాడు. అంతటి కీర్తిమంతుడైన శ్రీరామునికి దాసుణ్ణి నేను. నన్ను హనుమంతుడనీ, వాయుపుత్రుడనీ పేర్కొంటారు" అని చెప్పాడు.
🥀ఆంజనేయుడు, శ్రీరాముని ఆ విధంగా ప్రశంసిస్తూ చెప్పడం విన్న అర్జునునికి నవ్వాగలేదు. అతడు పరిహాసంగా, “ఓ వానరమా! నీ రాముడు పరాక్రమవంతుడై ఉండి ఉంటే సముద్రం మీద సేతువు నిర్మించే కార్యానికి అనవసరంగా ఎందుకు ఉపక్రమించాడు? ఆయన నిజంగానే మేటి విలుకాడై ఉండే పక్షంలో, తన బాణాలతోనే వంతెన నిర్మించి ఆ కార్యాన్ని స్వయంగా తానే పూర్తి చేసి ఉండకూడదా?" అంటూ, అహంకారంగా ప్రశ్నించాడు.
🥀అంతదాకా ప్రశాంతంగా ఉన్న హనుమంతునికి, అర్జునుడు రాముని గూర్చి అమర్యాదగా మాట్లాడటంతో ఆగ్రహం ముంచుకొచ్చింది. తన గురించి అమర్యాదగా మాట్లాడినా కూడా ఆయన సహించి ఉండేవాడు. శ్రీరాముని ఒకడు పరిహసిస్తూ మాట్లాడితే ఆయన ఎలా సహనంతో ఉండగలడు? అందుకే ఆయన కోపోద్రేకంతో, "అర్జునా! బాణాలచే వారధి నిర్మిస్తే నా వంటి వానర సైన్యంలోని బలిష్టమైన వారి భారం కారణంగా వారధి సముద్రంలో మునిగిపోతుందని రాముడు. బాణాలచే వారధి నిర్మించలేదు. నువ్వు నా రాముని కన్నా గొప్ప విలుకాడవా?" అని అడిగాడు.
🥀'విల్లుకు విజయుడు' అనే ఖ్యాతి అర్జునునికి ఉంది కదా! దాంతో అతడు అహంకారంతో, "ఆంజనేయా! బాణాలచే నిర్మితమైన వారధి కోతుల భారంతో సముద్రంలో మునిగిపోతే, ఇక విలుకాని విలువిద్యకు ఏం మహత్వం ఉంటుంది? నేను ఇప్పుడే నువ్వు చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే బాణాలచే అద్భుతమైన వారధిని నిర్మిస్తాను. నువ్వు దానిపైకెక్కి నిలబడి నీ ఇష్టం వచ్చినట్లు ఎంతసేపైనా గంతులు వెయ్యి. తరువాత నేను నీ రామునికన్నా గొప్ప విలువిద్యాపారంగతుణ్ణా, కానా అని నువ్వే తెలుసుకో" అని పలికాడు.
🥀అందుకు ఆంజనేయుడు మందహాసం చేస్తూ, "బాణాలచే నువ్వు కొత్తగా నిర్మించే వారధి మీద నేను ఎక్కి గంతులేస్తాను. అప్పుడు అది కుప్పకూలితే నువ్వేం చేస్తావు? నా కాలి బొటనవేలు పడగానే నువ్వు నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే అర్జునా! నువ్వు ఏం చేస్తావో చెప్పు?" అన్నాడు ధీమాగా.
🥀ఆ మాటలకు ప్రతిస్పందిస్తూ అర్జునుడు, “ఆంజనేయా! నీ భారం కారణంగా నేను నిర్మించే వారధి కూలి సముద్రంలో మునిగిపోతే, ఇక్కడే అగ్ని రాజేసి అగ్నిప్రవేశం చేసి ప్రాణాలు విడుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ! వారధి సముద్రంలో మునిగిపోకపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పు?" అని ప్రశ్నించాడు.
🥀అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ విని ఆంజనేయుడు, "అర్జునా! నువ్వు నిర్మించే ఆ బాణాల వంతెనను నేను నా కాలి బొటనవేలితో సముద్రంలో ముంచివేస్తాను. ఆ విధంగా జరుగకపోతే నీ రథ పతాకంలో కొలువుదీరి నీకు అవసరమైన అన్ని తోడ్పాట్లు అందిస్తాను” అని జవాబిచ్చాడు.
🥀"ఆహా! అట్లే కానివ్వు!” అంటూ అర్జునుడు, హనుమంతునితో పందానికి ఒప్పుకున్నాడు.
🥀'హనుమంతుడు ఎదురు చూడని విధంగా అనేకరెట్లు పటిష్టతతో కూడుకున్న వారధిని నిర్మిస్తాను' అని మనసులో అనుకొని అర్జునుడు తన గాండీవాన్ని చేతుల్లోకి తీసుకుని బాణాలను ప్రయోగించ నారంభించాడు. కాసేపటికల్లా అర్జునుడు కురిపించిన బాణవర్షంతో చక్కని వారధి నిర్మాణం జరిగింది. తరువాత అతడు సగర్వంగా, “హుం, వారధిని ఆసాంతం పరిశీలించి చూసుకో!" అని హనుమంతుడితో చెప్పాడు.
🥀అప్పుడు హనుమంతుడు 'రామా! నేను నీ దాసుణ్ణి. నన్ను నువ్వు ఎలాగైనా చేసుకో' అని మనస్సులో ప్రార్థించాడు. తరువాత, “రామ్ ! రామ్!" అంటూ అర్జునుడు సముద్రం మీద నూరు యోజనాల దూరానికి నిర్మించిన బాణ వారధిపైకి ఎక్కకుండానే తన కాలి బొటన వేలితో ఒక మూల అదిమి నొక్కాడు. అంతే! మరుక్షణమే ఆయన ఆ విధంగా చెయ్యాలి అని కాచుకున్నట్లుగా ఆ వారధి కుప్పకూలి, వారధి ఉండేదనే ఆనవాలుకూడా లేకుండా సముద్రంలో మునిగిపోయింది. పిల్లలు అట్టలతో కట్టిన ఇల్లు గట్టిగా గాలి వీచినప్పుడు కూలిపోయే రీతిలో వారధి కూలి, సముద్రంలో జాడకూడా తెలియనంతగా మునిగిపోయింది.
🥀ఈ ఘటనతో వీరాధివీరుడైన అర్జునునికి అవమానంతో ముఖం చిన్నబోయింది. అతడు నిశ్చేష్టితుడయ్యాడు. అగ్నిప్రవేశం చేసి మరణించడానికి అతడు ఏమాత్రం సంకోచించలేదు, విచార పడలేదు. 'పాశుపతాస్త్ర సముపార్జనకై వచ్చిన నేను, వచ్చిన మహత్కార్యాన్ని నెరవేర్చలేకపోయానే! నాకు పట్టిన గతి తెలియక, నా సోదరులైన పాండవులు తల్లడిల్లిపోతూ నన్ను వెతుకుతుంటారే!' అని అనుకుంటూ అతడు బాధపడ్డాడు.
🥀[ఎంతో గొప్ప లక్ష్యం కోసం మనం ఏతెంచాం; మహత్కార్యాలు సాధించే స్థితిలో ఉన్నాం. దాన్ని వదలిపెట్టి, అహంకారంతో మనలను మనమే నాశనం చేసుకొంటున్నాం. మన అహంకారమే ఎన్నెన్నో మంచి పనులు జరగడానికి ఆటంకంగా ఉంటున్నది. ఇది గ్రహించి కూడా మన అహంకారాన్ని తొలగించుకోవడానికి మనం సిద్ధంగా లేము. అంతేకాక ఇతరుల దుఃఖానికి కారణమౌతున్నాం. మహత్కార్యాలు సాధింప వచ్చిన మనం, సిగ్గులేకుండా అల్పవిషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకు మనం సిగ్గుపడాలి - ఈ గుణపాఠానికి అర్జునుడి స్థితి అద్దం పడుతున్నది కదా!]
🥀పాపం! అర్జునుడు ఏం చేస్తాడు? అతడి ప్రగల్భాలు తేలిపోయాయి. తన ప్రతిజ్ఞ మేరకు అగ్నిప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేయనారంభించాడు.
🥀అర్జునుణ్ణి అగ్నిప్రవేశం చెయ్యవద్దని ఆంజనేయుడు పరిపరి విధాల బతిమాలుతూ చెప్పాడు. అయినప్పటికీ అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్ప కట్టెలు పేర్చి అగ్ని రాజేశాడు.
🥀చివరగా అర్జునుడు తన ఆప్తమిత్రుడు, గురువు అయిన కృష్ణుణ్ణి తలచుకొని, "కృష్ణా! నన్ను ఇలా వదలిపెట్టావే? చివరికి ఈ దుస్థితికి దిగజారిపోయేలా చేశావే!" అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థించాడు. ఇక అతడు అగ్నిప్రవేశం చెయ్యడానికి ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి.
🥀అర్జునుని ప్రార్థనలకు దిగివచ్చిన కృష్ణుడు ఒక బ్రహ్మచారి రూపంలో అక్కడకు వచ్చాడు. అప్పుడు అతడు, "అరే! నీవు ఖ్యాతి గాంచిన అర్జునుడివి కదా! నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అర్జునుని అడిగాడు.
🥀ఏడుపు ఒక్కటి రావడమే తక్కువ, అర్జునుడు ఆ బ్రహ్మచారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.
🥀అంతా సావధానంగా విన్న బ్రహ్మచారి రూపంలోని కృష్ణుడు, "ఆహా! అర్జునా, మహావీరుడవైన నీ కథ చివరికి ఇలాగా అయిపోయింది!" అన్నాడు తెచ్చిపెట్టుకున్న విస్మయంతో...
🥀తరువాత కాసేపు ఏదో ఆలోచించి ఆంజనేయునితోనూ అర్జునునితోనూ ఇలా చెప్పాడు: "మీరిద్దరూ పాల్గొన్న పోటీలో న్యాయం. లేదు. ఎప్పుడైనా సరే పోటీ అంటూ వచ్చినప్పుడు అందుకు సాక్షిగా మధ్యస్థుడు లేక నిర్ణేత అనే ఒక వ్యక్తి ఉండాలి. అదే న్యాయమైన పద్ధతి. మధ్యస్థుడు ఉండి పోటీ ఫలితం ఇది అని తీర్పు ఇవ్వడం సముచితం. మధ్యస్థుడు లేకుండా మీరుగానే పోటీ ఫలితాన్ని తీర్మానించడం సబబు కాదు; దాన్ని పోటీ అని పరిగణించడం కూడా సరికాదు. మీరిద్దరూ మునుపటి మాదిరే మళ్ళీ ఇప్పుడు పోటీ చేయండి. నేను మధ్యస్థుడిగా ఉండి పోటీని పర్యవేక్షించి ఫలితం ప్రకటిస్తాను.”
🥀బ్రహ్మచారి యోచనకు ఇద్దరూ సమ్మతించారు.
🥀అర్జునుడు మొదటి పనిగా, కృష్ణుని సహాయం అర్థిస్తూ చిత్తశుద్ధితో ప్రార్థించాడు. ఆ తరువాత మునుపటిలాగానే బాణప్రయోగంతో వారధిని నిర్మించాడు. సాక్షాత్తూ బ్రహ్మచారి రూపంలోని శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని వారధి మధ్యలో నిలిపి ఉంచాడు.
🥀ఆంజనేయుడు అప్పటికే ఒకసారి వారధిని సముద్రంలో ముంచివేశాననే గర్వంతో మునుపటి మాదిరే కాలి బొటనవేలితో వారధిని అదిమి నొక్కాడు. కాని వారధి చెక్కుచెదరలేదు! దాంతో విస్తుబోయిన ఆంజనేయుడు వారధినెక్కి తన బలాన్నంతా ప్రదర్శిస్తూ అటూ ఇటూ గెంతసాగాడు. కాని ప్రయోజనం శూన్యం. చివరికి విశ్వరూపం దాల్చి పదేపదే వారధి పైకి దూకాడు. కాని వారధి కించిత్తుకూడా చలించక సుదృఢంగా నిలబడింది.
🥀ఆంజనేయుడు ఇక ఓటమిని ఒప్పుకొనే ఉద్దేశంతో తీరం మీదికి దూకాడు. అదే సమయంలో కృష్ణుడు బ్రహ్మచారి రూపం విడిచి. రాముడుగా కృష్ణుడు దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో ఒకసారి రాముడు, "ద్వాపరయుగంలో కృష్ణుడిగా నీకు దర్శనమిస్తాను" అని మాట ఇవ్వడం ఆంజనేయుడికి చటుక్కున గుర్తుకొచ్చింది. ఆయన అలా అనుకున్న అదే సమయంలో, రాముడు కృష్ణుడిగా మారి ఆంజనేయునికి దర్శనం ఇచ్చాడు.
🥀తనకు వంగి నమస్కరిస్తున్న ఆంజనేయుని కృష్ణుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. తరువాత ఇలా చెప్పాడు: “ఆంజనేయా! నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి. రాముడిగా, కృష్ణుడిగా విభిన్న నామాలతో నన్ను అర్చించే మీ ఇద్దరినీ ఒకే త్రాటి మీదకు చేర్చడానికే ఈ లీల జరిపాను.
🥀అర్జునా! రాముని తక్కువ చేసి మాట్లాడీ, నన్ను మరచిపోయి మొదటిసారి వారధి నిర్మించావు. ఆంజనేయుడు నన్ను మనసారా ప్రార్థిస్తూ పనికి ఉపక్రమించడంతో సాఫల్యం పొందాడు, వారధి కుప్పకూలింది. రెండవసారి నన్ను మనస్సులో తలచుకుని వారధి నిర్మించావు. కాబట్టే ఇప్పుడు విజయం నిన్ను వరించింది.
🥀“ఆంజనేయా! మొదటిసారి నన్ను తలచుకోవడం వలన పోటీలో విజయం పొందిన నువ్వు రెండవసారి నన్ను మరచిపోయావు; అంతేకాక మొదటిసారి గెలుపును తలచుకుని గర్వించి వారధిని కూల్చ ప్రయత్నించావు. నీ ఆ మనోస్థితే నీ ఓటమికి కారణం అయింది."
🥀ఇలా చెప్పి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. వారధి మధ్యలో ఉన్న సుదర్శనచక్రం మళ్ళీ తన ఆవాసానికి తిరిగి వెళ్ళిపోయింది.
🥀ఈ సంఘటన ద్వాపరయుగాంత సమయంలో జరిగినట్లు ఆనందరామాయణంలో చోటుచేసుకొంది.
🥀మహాభారత యుద్ధంలో అర్జునుని రథ పతాకంలో హనుమంతుడు ఆసీనుడై భాసించాడు. ఆ కారణంగా కపిధ్వజుడు అనే పేరు అర్జునునికి కలిగింది.
🥀గర్వం పనికిరాదు, భగవంతునికి పూర్తిగా శరణాగతులం కావాలి. విభిన్న నామాలతో ఒకే భగవంతుడే విరాజిల్లుతున్నాడు. నిజమైన భక్తులకు ఎప్పుడో ఎంతో అరుదుగా గర్వం తలెత్తినా, ఆ గర్వాన్ని తొలగించి. భగవంతుడు అనుగ్రహిస్తాడని మనం పైన చూసిన ఈ కథ చెప్పక చెబుతోంది.
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
🙏 *శ్రీ ఆంజనేయ మహాత్మ్యం —1* 🙏
🌻 *శ్రీ ఆంజ నేయ మంత్రోప దేశ లక్షణం* 🌻
ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు ”కలి కాలం లో దుఖాలను దూరం చేసేది ,దారిద్రాన్ని పోగొట్టేది ,వ్యాదులనుండి రక్షించేది ,సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియ జేయండి.
దానికి ఆ మహర్షి సంతోషించి ”మైత్రేయా !మంచి ప్రశ్న వేశావు. నీ ద్వారా లోకానికి ఉపయోగ కరమైన మంత్రాన్ని చెప్తాను విను .అది సకల వేద శాస్త్ర ,పురాణాదుల సారమే .వెంటనే ఫలితాన్ని ఇచ్చేదీ నేను ఒక సారి సరయు నది దగ్గర వుండగా ,నా తండ్రి వసిష్టుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు .
శివ ,వైష్ణవ ,శాక్తేయ ,గాణా పత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు .వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీ నారాయణ విద్య ,భవానీ శంకర విద్యా ,సీతా రామ మహా విద్యా హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి.
వీటి తరువాత నృసింహ విద్య ,బ్రహ్మాస్త్ర విద్య అస్తార్ణ మారుతీ విద్య. ఎనిమిదవది సామ్రాజ్య లక్ష్మీ విద్య ,తొమ్మిది మహా గణపతి విద్య ,పది సౌర విద్య , పదకొండ వది దక్షిణ కాళీ విద్య .పన్నెండవ విద్య చింతామణి విద్య . వీటినే ద్వాదశ విద్యలు అంటారు.
వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారమూ పాటించక పోయినా ఫలితాన్ని ఇస్తుంది .అస్తార్ణ మారుతీ విద్య ఇంకా తక్కువ సమయం లో ఫలితం చేకూరుస్తుంది .ఇందులో అనులోమ ,ప్రతిలోమంగా యాభై వర్ణాలు వుంటాయి. బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్యా మంచి ఫలితాన్నే ఇస్తుంది. నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలం లో ఫలిస్తుంది .వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన ”పంచ వక్త్ర హనుమాన్ మంత్రం ”శీఘ్రం గా శిద్ధి నిస్తుంది.
ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలి లో పట్టి తాగ గలిగాడు. అర్జునికి,భీమునికి శత్రువులను జయించే శక్తి ,దీని వల్లే కలిగింది .విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహం తో పొందాడు .
హనుమాన్మంత్రం చేత జయం, గౌరవం, రాజ్యం ,జన వశ్యం అచంచల భాగ్యం కలుగుతాయి .ధర్మార్ధ కామ మోక్షాలు ఆపదలను పోగొట్టు కోవటం శత్రు జయం ,నిగ్రహానుగ్రహ శక్తి దీని వల్ల సాధ్యమవుతుంది .వాక్సిద్ది ,పుత్ర సంతానం ,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి .
అయితే గురు ముఖతా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ,గురువును సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం వుంటుంది .పరి శుద్ధ మైన మనసు తో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి .అన్ని విద్యలకు ఇది ఆధార మైన మంత్రం .పంచ వక్త్ర మహా విద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది.
శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని,వెయ్యి శిరస్సులున్న ఆది శేషుడు కూడా వందల సంవత్స రాలు చెప్పినా తరగదు .”అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ మంత్ర మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు .
::(())::
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం —2* 🙏
🌻 *విజయుని చరిత్ర* 🌻
🍃🥀శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి ,మైత్రేయునికి తెలిపాడు .అందులో విజయుని చరిత్ర ను ముందుగా తెలియ జేస్తున్నాను. త్రేతాయుగం లో” చంద్ర కోణం” అనే ప్రసిద్ధి చెందిన నగరం వుంది .దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు .అతడు బలశాలి ,శత్రు సంహారకుడు ,సమర్ధుడు .యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు .
🍃🥀నాలుగు దిక్కుల లో వున్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసు కోవాలనే బల మైన కోర్కె అతనికి కలిగింది .రాజ్యాన్ని కుమారులకు అప్పగించి,పెద్ద సైన్యం తో ,జైత్ర యాత్రకు బయల్దేరాడు .కొంత ప్రయాణం చేసిన తరు వాత ”గర్గ మహర్షి ”ఆశ్రమం చేరాడు .సైన్యాన్ని దూరం గా వుంచి ,తానొక్కడే మహర్షిని సందర్శించాడు .భక్తీ తో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు .ఆతని శ్రద్ధ కు భక్తికి సంతోషించిన గార్గుడు కుశల ప్రశ్న లతో స్వ్వాగతం పలికి ,ఆతిధ్యం ఇచ్చాడు .
🍃🥀గర్గముని- రాజైన విజయుడి తో ”రాజా !స్వాగతం .ఎక్కడి నుంచి బయల్దేరావు ?ఎక్కడి దాకా ప్రయాణం ”?అని అడిగాడు .దానికి రాజు విజయుడు వినయం తో ”మహర్షీ !మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే వుంది .ఇంటి నుంచే బయల్దేరాను .సర్వ దిక్కుల లో వుండే రాజ్యాలన్నీ జయిన్చాలనే కాంక్ష తో దిగ్విజయ యాత్రకు బయల్దేరాను .నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి ,నాకు పని సానుకూలం ఆవటానికి ఇంకా ఏదైనా ఉపాయం వుంటే సెలవివ్వండి ”అని విన్నవించాడు
🍃🥀గర్గమహర్షి సంతోషించి ”నీ కోరిక మంచిదే .అయితే ఏ పని కైనా దైవ అనుగ్రహం కావాలి .అప్పుడే ఆ కోరిక నెర వేరుతుంది .సఫల మనో రాదుడవై ”విజయుడు ‘అనే పేరు సార్ధకం చేసుకో .ఎన్నో మంత్రాలున్నాయి .కాని శీఘ్రం గా ఫలసిద్ధి నిచ్చేది మాత్రం ”హనుమన్మంత్రం ”ఒక్కటే .అది భక్తులకు అందుబాటు లో వుంటుంది .
🍃🥀యుద్ధం లో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని త్రికరణ శుద్ధి గా ,భక్తీ ,శ్రద్ధలతో జపించు .నువ్వు అనుకొన్నది సాధించ గలుగుతావు ”అని చెప్పి ,బీజ సహితం గా ,మంత్ర ,ఉద్ధార ,,న్యాస పూర్వకం గా అష్టాక్షరీ హనుమంమంత్రాన్ని గర్గుడు ,విజయునికి ఉపదేశించాడు .
🍃🥀గర్గాశ్రమం లోనే విజయ మహారాజు వుండి ,ఆయన సన్నిధి లోనే మంత్రం మీద ,మంత్ర దైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావం తో విశ్వాసము ,గౌరవము చూపించి ,108 సార్లు జపించాడు .శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది ,సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షం అయాడు .ఆనంద బాష్పాలు కారుతుండగా ,విజయుడు ,వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు .
🍃🥀నాలుగు ముఖాలు కల బ్రహ్మ ,ఆరు ముఖాల కుమార స్వామి ,వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్య పడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాల కేర్తించాడు .అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు .
హనుమ భగవానుడు సంతృప్తి చెంది ,విజయుని తో ”నీ యడల ప్రసన్నుడిని అయాను నీకు శుభం కలుగు తుంది .ఏదైనా వరం ఇస్తాను కోరుకో” అన్నాడు
🍃🥀మనసులో సంతోషించి ,దోసిలి ఒగ్గి వాయుసుతునుకి మళ్ళీ నమస్కరించి ”అతి తక్కువ కాలమ్ లోనే నాకు దర్శనం ఇచ్చి ,నన్ను క్రుతార్దుడిని చేశావు మహా బలవంతా ,ఆంజనేయా !నీ దర్శనమే కోరిక లన్నిటినీ తీరుస్తుంది .అయినా నా మీద ప్రేమతో వరం కోరుకో మన్నావు ,తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు .నీ కృప అపారం .నా మనసులో నాలుగు దిశలు జయిన్చాలనే కోరిక వుంది .నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి ,నాకు మేలు చేయి ”అని ప్రార్ధించాడు .
🍃🥀ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై ,వాత్చల్యం తో ”రాజా !నాలుగేమిటి ?పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్ధకం చేసుకో .అయితే ,ఈ జన్మలో నీ కోరిక తీరదు .రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెర వేరుతుంది .అప్పుడు నువ్వు స్వర్గాది పతి దేవేంద్రుని కుమారుడి వైజన్మిస్తావు .శ్రీ కృష్ణుని సారధిగా చేసు కోని ,అన్ని దిక్కులను జయిస్తావు .
🍃🥀కురు క్షేత్ర సంగ్రామం లో కౌరవులను జయిస్తావు .అప్పుడు నీ రధానికి నేను జెండా పై అధివసించి ,నీ కు విజయం చేకూరుస్తాను .నేను వుండే ఆ జెండాను ”కపిధ్వజం ”అంటారు .నిన్ను ”కపిధ్వజుడు ”అని పిలుస్తారు”అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానం అయాడు .
🍃🥀హనుమ చెప్పిన మాట విని ,విజయ మహారాజు తన జైత్ర యాత్రను విరమించు కోని ,గర్గ మహాముని ఆశీస్సులను అందుకొని ,ఆయన కు నమస్కరించి ,,మళ్ళీ రాజా దానికి చేరు కొన్నాడు . .
రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ,ప్రజా క్షేమంగా పరిపాలించి ,చివరికి స్వర్గ లోకం చేరాడు .
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –3 🙏
🌻 మైన్దుని కధ 🌻
🍃🥀పూర్వం సుందరి అనే ఒక పట్టణం వుండేది. అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్ధిల్లింది.అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద,శాస్త్రాలన్నీ బాగా చదువు కొన్న వాడు. అతనికి ”హనుమంమంత్రం ”అంటే మహా ప్రీతి.అన్నిటి సారం అందులోనే వుంది అని తెలుసు కొన్నాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించే వాడు.
🍃🥀మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించటం నేర్చుకొన్నాడు.
మైన్డుడికి కాశీ వెళ్లి శ్రీ విశ్వనాదున్ని దర్శించాలనీ ,గంగా స్నాంనంతో పులకించాలని అనిపించింది. చాలా ప్రయాస పడి నడిచి వారణాసి చేరాడు. గంగా నదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నదీమ తల్లికి భక్తీ తో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు.
🍃🥀కొంత సేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడి నట్లు గుర్తించారు. నీరు ,దాని ద్వారా పడవ లోకి చేరుతోంది. పడవ బరువెక్కి ,మునిగి పోవటానికి సిద్ధంగా వుంది. భయం వేసిన మైందుడు ,తల మీద వస్త్రాన్ని కప్పు కోని ,భక్తీ తో హనుమంమంత్రాన్ని” పఠిస్తున్నాడు.
🍃🥀హనుమ దీనిని గమనించి ,తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక ”వానర ”రూపం ధరించి ,ఆ పడవను నెత్తినా పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్లి ,అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్య మైనాడు. దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండి పోయారు. భక్తీతో ,ఆ కోతికి నమస్కరించారు పడవలో నిశ్చల జపంలో వున్న మైన్డుడికి ఇదేమీ తెలీదు. తెల్ల వారి లేచి చూసే సరికి గంగ ఒడ్డున పడవ వుండటం చూసి ఆశ్చర్య పడ్డాడు.
🍃🥀పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలీలేదు. అప్పుడు ఒడ్డున వున్న ఒక మనిషి ఓకే మహా వానరం ఈ పడవను తలమీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్లి పోయిందని చెప్పాడు .
🍃🥀మైన్డుడికి ఆశ్చర్యం వేసి ”మీరు పుణ్యాత్ములు ,వానర రూపంలో హనుమను దర్శించారు. జపం చేస్తూ నేను ఏదీ గమనించ లేక పోయాను. నేను అదృష్ట హీనున్ని హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగ పాలు చేస్తాను ”అని చెప్పి గంగా నదిలోకి దూకటానికి సిద్ధమైనాడు.
🍃🥀అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి ,వాత్సల్యంతో నిజ రూపంతో మైన్డునికి దర్శనం ఇచ్చాడు. హర్ష పులకితుడై మైందుడు హనుమను స్తుతిం
చాడు.
🍃🥀🌼”ఉస్త్రా రూఢ ,సువర్చలా సహచర ,సుగ్రీవ మిత్రాంజనా సూనో ,వాయుకుమార ,కేసరి తనూ ,జా అక్షాది దైత్య కాన్తకా సీతా శోక హరా ,అగ్ని నందనా ,సుమిత్రా సంభావ ,ప్రాణదా –శ్రీ భీమాగ్రాజ ,శంభు పుత్ర ,హనుమాన్ ,పంచాష్య తుభ్యం నమః ”అని చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమ భక్తా !మిందా !నువ్వు ఈ లోకం లో భాగాలన్నీ అనుభవించు. నీ దగ్గరే నేను ఉంటాను. జీవితాంతంలో నన్ను పొందుతావు ”అని వరం ఇచ్చి అదృశ్యం అయాడు .
🍃🥀అలాగే మైందుడు భక్తీ తో జీవించి ,సుఖాలు పొంది ,చివరికి హనుమంమంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు.
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
[7:41 pm, 07/06/2021] +91 94414 08564: శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –4 🙏
🌻 బ్రహ్మ దేవుని చరిత్రం 🌻
🍃🥀శ్రీ హనుమానుడు సువర్చలా దేవితో గంధ మాదన పర్వతం మీద సుఖంగా వున్నాడు. శ్రీ రామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ ,శ్రీ రామ నామ పానాన్ని అనుభవసిస్తున్నాడు. అయినా ఒక రోజూ ఆయనకు శ్రీ రామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది. అంతే వెంటనే బయల్దేరి గంధ మాదనం నుంచి బయల్దేరి అయోధ్యకు చేరాడు. శ్రీ రాముని సందర్శించి భక్తీ ,వినయం తో నమస్కరించి స్తుతి చేసి ,ఆయన మనస్సును గెలిచాడు.
🍃🥀అప్పుడు సీతా రాముడు హనుమను గాడంగా ఆలింగనం చేసుకొన్నాడు. శిరస్సును మూడు సార్లు ముద్దు పెట్టుకొన్నాడు. హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసు కొన్నాడు. ఆంజనేయుడు ”రామా !నువ్వు వుండగా ,కులాసాకు ఏమి కొదవ?నీ పై భక్తీ వున్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకొని నాకు పరమానందాన్ని కలిగించావు నాకు ఉక్కిరి బిక్కిరిగా వుంది మాట రావటం లేదు ”అన్నాడు.
🍃🥀హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి ”హనుమా !సీతాదేవి లంకలో వున్న కాలంలో చాలా కస్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత ,అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు. నా వ్రేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఆయనకు ఎవరికి తెలియ కుండా ఇచ్చాను. ఆ ముద్రికను చూస్తే కాని జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మ లోకానికి వెళ్లి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి ”అన్నాడు.
🍃🥀అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరి ,సనకసనందనాదులు స్వాగతం చెప్పగా ,బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళారు .ఆయన అర్ఘ్య ,పాద్యాదులు ఇచ్చి ,కుశల ప్రశ్నలు వేసి ,ఉచిత ఆసనం పై కూర్చో పెట్టాడు. షోడశోప చారాలు చేసి పూజించాడు. హనుమను వచ్చిన కారణం అడిగాడు బ్రహ్మ. హనుమ శ్రీరాముని ఆజ్ఞను తెలియజేశాడు. దానికి బ్రహ్మదేవుడు ”నా ప్రార్ధన విని శ్రీ రాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు.
🍃🥀రోజూ నేను దాన్ని పూజిస్తూ,శ్రీ రాముడిని ధ్యానం చేస్తున్నాను .దాన్ని యెట్లా ఇవ్వమంటావు ?”అన్నాడు .దానికి హనుమ ”సృష్టి కర్తా !నా మాట విను .ఆ ఉంగరం మీదే సీతా సాధ్వి ద్రుష్టి నిలిపి వుంది .రోజూ రోజుకు కృశించి పోతోంది .ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది .వెంటనే తీసుకొని రమ్మని శ్రీ రామాజ్ఞ ”అని తెలిపాడు. అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు .
🍃🥀ఇప్పటి వరకు ఎంతో శాంతంగా వున్న హనుమ ఒక్క సారిగా తన తనువును విపరీతం గా పెంచాడు. సత్య లోకం దాటి శరీరం పెరిగి పోయింది. దశ దిశలా ఆక్రమించాడు. బ్రహ్మాండాన్ని బద్దలు చేసేట్లు తయారయాడు. ఆ తేజస్సుకు లోకాలు భస్మం అయేట్లున్నాయి. ప్రళయ కాల మేఘం లాగా విజ్రుమ్భించాడు .ఇరవై చేతులతో ,ఇరవై ఖడ్గాలను ధరించి ,భయంకరమైన ముఖంతో ,తీక్షణమైన కోరలతో ,మహా సింహంలాంటి విశ్వ రూపాన్ని ధరించి ,ప్రళయ కాల గర్జన చేశాడు.
🍃🥀బ్రహ్మ ,మిగిలిన దేవతలు ,మహర్షులు,ఆశ్చర్యంతో భయపడి పోయారు. అందరూ భక్తీ తో రామ నామం జపించారు .సనకస నందనులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు .
అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్తుతించాడు. హను మంతుని విశ్వ రూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ ..బ్రహ్మ ప్రార్ధన విని ,హనుమ తన రూపాన్ని ఉప సంహరించాడు .
🍃🥀అప్పుడు బ్రహ్మ ”హనుమా !అదిగో సరస్సు .దానిలో అనేక రామ ముద్రికలున్నాయి .అంతకు పూర్వం వున్న ,అనంత కల్పాలు ,అందులో రామావతారాలు ,కని పిస్తాయి ..ఆయా అవతారాలలో బ్రహ్మకు ఇచ్చిన రామ ముద్రికలన్నీ కనిపిస్తాయి. వాటిలో ఏది శ్రీ రాముని ముద్రికయో పరీక్షించి తీసుకో ”అన్నాడు.
హనుమ సంతోషంలో ఆ సరస్సులో మునిగాడు.
🍃🥀రామ ముద్రికలు అనేకం కనిపించాయి. ఏమీ పాలు పోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు .ఆది భౌతిక ,ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగి పోయేట్లుగా ఆ సరస్సు లో స్నానం చేశాడు ఆనందించాడు బ్రహ్మకు నమస్కరించి ,సీతా రామ సన్నిధికి చేరాడు. ఆనందామృత సరస్సులో మునుక లేసి వచ్చిన ఆన్జనేయుడిని శ్రీ రాముడు సాదరంగా స్వాగతించి ‘హనుమా !నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు దాన్ని సీతకు ఇచ్చి సంతోషం కలిగిస్తాను ”అన్నాడు.
🍃🥀ఆంజనేయుడు జంకుతూ వెనుక అడుగు వేస్తున్నాడు. భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు .”హనుమా !భక్త శేఖరా !ఎందుకు భయం?నీకు నాకు భేదం లేదు కదా...భయం వదిలి పెట్టి బ్రహ్మ లోకంలో నువ్వు చూసిన వింతలు తెలియ జెయ్యి ”అన్నాడు చాలా ప్రేమగా .
🍃🥀రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ ”భగవాన్ ! నీకు నమస్కారం సత్య లోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీ దేవితో ఆనందం గావున్నారు. అక్కడ బ్రహ్మర్షులు ,వేదాంతులు ,జిత క్రోదులు వున్నారు. వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు వుంది .అక్కడ నీ ముద్రికలు అనేకంగా కన్పించాయి. వాటిని చూసి నమస్కరించి వచ్చేశా…
[7:42 pm, 07/06/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 91 (ఆనందనిలయ నిర్మాణం) 🎈
🍃🌹శ్రీనివాసుడు ఈలోగా - ఆకాశరాజు తమ్ముడైన తొండమానుని పిలిచి, ఈ ఆరునెలల వ్యవధిలో వేంకటాచలంపై తాము నివసించడానికి ఓ అద్భుతమైన భవనాన్ని వాస్తు ప్రకారం నిర్మించి ఇమ్మని ఆదేశించాడు. ఆ భవనంలో తాము కలియుగాంతం వరకు నివసిస్తామని, తద్వారా తొండమానుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా శెలవిచ్చాడు.
🍃🌹శ్రీవారి ఆనతిని శిరసావహించిన తొండమానుడు - అత్యంత స్వల్పసమయంలో, తిరుమల క్షేత్రంలో స్వామిపుష్కరిణికి దక్షిణ భాగాన, తూర్పు ముఖంగా, ఆదివరాహుడు శ్రీనివాసునికి ఆవాసనిమిత్తం ఇచ్చిన స్థలంలో, మూడు ప్రాకారాలు - ఏడు ప్రవేశ ద్వారాలు – బంగారు గోపురం - ధ్వజస్తంభ పరివేష్ఠితంగా ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మింపజేశాడు. అదే ఈనాడు తిరుమలలో సర్వాంగ సుందరంగా, నిత్యకళ్యాణం - పచ్చతోరణంగా శోభిల్లే "ఆనందనిలయం" అనబడే ముఖ్యాలయం. అందులోనే శ్రీవారు అర్చామూర్తి రూపంలో, దేవేరులిద్దరితో ఈనాటికీ కొలువై ఉన్నారు.
🍃🌹భవననిర్మాణం పూర్తికాగానే, గృహప్రవేశం చేయవలసిందిగా శ్రీవేంకటేశ్వరునికి వర్తమానం అందింది.
🌻 శ్రీనివాస మంగాపురం- ముక్కోటి 🌻
🍃🌹శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా శ్రీవరాహక్షేత్రానికి బయలుదేరుతూ, అగస్త్యుని ఆతిథ్యానికి సంతుష్టుడై, ఆరునెలల పాటు తాము నివసించిన ఆ ప్రదేశం తమ దంపతు లిరువురి పేరునా, "శ్రీనివాసమంగాపురం" గా ప్రసిద్ధిగాంచు తుందని, అందులో తాను "కళ్యాణ వేంకటేశ్వరుని" గా కొలువై ఉంటానని శెలవిస్తాడు. మనందరికీ సుపరిచితమైన ఈ "శ్రీనివాస మంగాపురం" ఆలయం గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం!
🍃🌹అయితే, స్థానికుల కథనం ప్రకారం - పద్మావతీ శ్రీనివాసులు, ఆ ఆరునెలల్లో పగటిపూట అగస్త్యుని ఆశ్రమంలోను, రాత్రివేళల్లో శ్రీనివాసమంగాపురంలో నున్న మరో ఆశ్రమం లోనూ నివసించేవారట! తిరుపతికి సమీపంలో, సువర్ణముఖి నదీతీరాన, నేటి "తొండవాడ" గ్రామంలో, "ముక్కోటి" గా పిలువబడే దేవాలయమే పద్మావతీ - శ్రీనివాసులు కొలువున్న ఆశ్రమం. ఈ విషయం ఆ ఆలయ కుడ్యాలపై చిత్రించబడి ఉంది. ఈ ఆలయాన్ని నేడు కూడా మనం చూసి తరించవచ్చు.
🌻 శుభమస్తు 🌻
🍃🌹పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టం భక్తిశ్రద్ధలతో ఎవరు విన్నా, చదివినా, పారాయణం చేసినా; వారి వివాహమహోత్సవం ఎవరు జరిపించినా, శ్రీనివాసుని అనుగ్రహంతో వారింట సర్వశుభాలు కలుగుతాయని తరతరాల నమ్మిక.
🍃🌹శుభప్రదము, సర్వమంగళకరము అయిన "పద్మావతి పరిణయం" ఇక్కడితో ముగిసింది. ఆకాశరాజు ఎవరు? తొండమానుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? త్రేతాయుగం నాటి వేదవతికి - కలియుగపు పద్మావతిదేవికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీనివాసమంగాపురం - ముక్కోటి ఆలయాల పూర్తి వివరాలు - వీటన్నింటినీ విపులంగా తెలుసుకుందాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –5 🙏
🌻 నీలుడి కధ 🌻
🍃🥀రావణ వధ తర్వాత ,లంకా రాజ్యానికి విభీషనుడికి పట్టాభిషేకం చేయించాడు. తమ్ముడు లక్ష్మణునితో శ్రీ రాముడు. అతడు ధర్మ బద్ధంగా రాజ్య పాలన చేస్త్రున్నాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు.ఇతడు గుణము,బలము విద్యలలో మేటి. ఒక సారి నీలుడు ,తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి ,నమస్కరించి ఇలా అన్నాడు”తండ్రీ !మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ ,సంతోషాలతో వర్ధిల్లుతున్నారు.
🍃🥀వారికేమీ లోటు లేదు మనకు ధనం సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రాజ్యమైన లంకలో ”చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం ”లేని లోటు బాగా కన్పిస్తోంది నాకు. మీరు, శ్రీ రాముని పద సన్నిధిని చేరి ,లంక సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా ,వీటిపై మీకు ద్రుష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేక పోయారు?నాకు అనుజ్న ఇస్తే వాటిని సాధించి ,తీసుకొని వచ్చి ,మన లంకలో ఉంచు తాను”అన్నాడు వినయంగా....
🍃🥀నీలుని మాటలను విన్న తండ్రి విభీషణుడు ”కుమారా,నీలా !నేను శ్రీ రామచంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను .ఆ రామ ప్రభు దివ్యాను గ్రహం వల్ల అన్ని సుఖాలు ,ఆనందాలు ,భోగ ,భాగ్యాలు అనుభవిస్తున్నాను. బ్రహ్మానంద రసాను భూతిని అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయుస్సు ,సామ్రాజ్యము నాకు శ్రీ రామకృప వల్ల లభించాయి.
🍃🥀శ్రీ రాముడే నా చింతామణి ,కామ ధేనువు ,కల్ప వృక్షం .అంత కంటే వేరే ఏమీ నాకు అక్కర లేదు. రాముని కరుణ వల్ల ,ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,నా వశంలోనే వున్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడిటి అవసరం లేక పోయింది .అవి లంకలో లేవనే చింత వదిలెయ్యి .శ్రీ రామ పద భక్తితో ధన్యుడవు అయే ప్రయత్నం చెయ్యి ”అని అనునయంగా చెప్పాడు.
🍃🥀తండ్రి మాటలు ,నీలుడికి రుచించ లేదు .కీర్తి కాంక్షతో తహ తహ లాడి పోతున్నాడు. మళ్ళీ తండ్రి తో వాటి అవసరాన్ని తెలియ జేశాడు. చివరికి విభీషణుడు మెత్త బడి ”నీ కోరికను కాదన లేక పోతున్నాను. వాటిని సాధించి ఇక్కడికి తీసుకొని రావటానికి గురువు అనుజ్న చాలా ముఖ్యం.ముందుగా మన కుల గురువు శుక్రాచార్యుల వారి శుశ్రూష చేసి ,అనుగ్రహం సంపాదించి ,అప్పుడు ,ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యి ”అని సలహా ఇచ్చి ,ఆశీర్వదించి నీలుడిని పంపాడు.
🍃🥀తండ్రి అనుమతితో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు గురువు శుక్రాచార్యుల వారిని ,చేరి పూజించి ,నమస్కరించి ,చేతులు జోడించి ”గురుదేవా !మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను.నాకు చింతామణి ,కల్ప వృక్షం,కామధేనువులను సాధించి ,లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది.దీనికి మీ అనుగ్రహం కావాలి.ప్రసాదించండి ‘అని వేడు కొన్నాడు.
🍃🥀నీలుని భక్తీ తత్పరత,వినయం ఆచార్యులకునచ్చి ” కుమారా !ఈ రోజూ మృగశిరా నక్షత్రం.ఈ నక్షత్ర కాలంలో కొత్త మంత్రోపదేశానికి మంచిది. దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది.శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను.శ్రద్ధతో జపించి నీ కోర్కెను సాధించుకో ”అని చెప్పి ,వెంటనే ”పంచ ముఖ ఆంజనేయ మంత్రం ”ఉపదేశించాడు. జగన్నాధ క్షేత్రం చేరి ,దీక్షతో ,ఆ మంత్రాన్ని ,త్రికరణ శుద్ధి గా, జపించమని చెప్పాడు శుక్రా చార్య గురు వరేన్యుడు .
🍃🥀పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. ”పంచ వక్త్రం ,మహాభీమం ,కపి యూద సమన్వితం బహుభిర్దశ భిర్యుక్తం ,సర్వ కామార్ధ సిద్ధిదం
పూర్వంతు ,వానర వక్త్రం ,కోటి సూర్య సమ ప్రభం-దంస్త్రా కరాల వదనం భ్రుకుటీ కుటి లేక్షణం . ”
”అస్త్వైవ దక్షిణ వక్త్రం ,నారసింహం ,మహాద్భుతం –అత్యుగ్ర తేజో వపుషం ,భీషణం ,భయ నాశనం ”
”పశ్చిమే ,గారుడ వక్త్రం ,వక్ర తుండం ,మహాబలం –సర్వ నాగ ప్రశమనం ,సర్వ భూతాది కృంతనం”
”ఉత్తరే సూకర వక్త్రం ,కృష్ణ దీప్త నభో మయం -పాతాలే సిద్ధ భేతాళ ,జ్వర రోగాది కృంతనం ”
ఊర్ధ్వం హయాననం ,ఘోరం ,దాన వాన్తకరం ,పరం -యేన వక్త్రేనా విప్రేంద్ర తాట కాయా ,మహా హవె ”
దీని భావం తెలుసుకొందాం .
🍃🥀పంచముఖ ఆంజ నేయుడు సర్వ సిద్ధి ప్రదాత .తూర్పు ముఖం’ వానర ముఖం” .కోటి సూర్యుల కాంతితో ,భీకరమైన కోరలతో ,భ్రుకుటి ముడిచి కని పిస్తుంది .దక్షిణ ముఖం ‘నార సింహ ముఖం ”మహాద్భుతంగా ,మృత్యువును తెచ్చే ఉగ్ర రూపం గా ,తేజో వంతంగావుంటుంది. భయ నాశనం చేస్తుంది. పశ్చిమ ముఖం ”గరుడిని ముఖం ”దీనికి వక్ర తుండం వుంటుంది. సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది. సర్వ భూతాలను అదుపు లో ఉంచుతుంది.
🍃🥀ఉత్తర ముఖం ”సూకర ముఖం ”.ఈ వరాహ ముఖం నల్లని కాంతి తోవుంటుంది. భేతాళ ప్రయోగాల్ని ,జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది. పై ముఖం ”హయ ముఖం. ఇది మోక్షాన్ని ఇస్తుంది .ఇలాంటి మహా మహిమాన్విత మైన అయిదు ముఖాలకు చెందిన ”బీజాక్షరాలు ”తో భక్తీ గా మంత్రాలను జపిస్తే ,కోరిన కోరిక తీరుతుంది .
🍃🥀గురువు అనుమతి తో నీలుడు ,బయల్దేరి ‘నీలా చల క్షేత్రమైన పూరి ,జగన్నాధ క్షేత్రాన్ని” చేరాడు .అక్కడ ఒక మహా పర్వతం ,దానికింద పెద్ద అడవి వున్నాయి .ఆ పర్వతం మీదకు చేరి ,అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలంలో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్య ప్రభలతో ,ముప్పది మూడు కోట్ల అర్బుదగణంతో” సంజీవ రాయుడు” అయిన ఆంజనేయ స్వామి ,నీలుడికి ప్రత్యక్షమైనాడు.
🍃🥀శంఖ ధ్వని వంటి ధ్వనితో నీలున్ని పిలిచాడు ,వెంటనే మేల్కొన్న నీలుడు ,ఆయన పాదాల పై సభక్తికంగా వాలి పోయాడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాఠంగా కారి పోతున్నాయి .నీలున్ని బుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తీ తో స్తోత్రం చేశాడు . దీన్నే ”నీల కృత ఆంజనేయ స్తోత్రం ”అని పేరు .చాలా మహి మాన్విత మైన స్తోత్రం .దానికి విపరీతంగా సంతోషించి హనుమ ”నీలా !నీ తపస్సు ,ధ్యానాలకు మెచ్చాను.
🍃🥀నీ మనోభీష్టం నాకు తెలుసు .త్వర లో ఇంద్రుని జయిస్తావు. చింతామణి వగైరాలను పొందుతావు.దేవతా స్త్రీలలో అందమైనది ”వన సుందరి ”అనే స్త్రీ నీకు భార్య గా లభిస్తుంది .నువ్వు కోరక పోయినా ,బ్రహ్మ దేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు .లోకంలో ఎవరైనా సరే ,నీ లాగానా మంత్రాన్ని జపించి ,నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను .నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు.
🍃🥀ఆయనా ,నేను శ్రీరాముని బంటులం.నా దక్షిణ భాగం లో నీకు సుస్తిరమైన స్తానం కల్పిస్తున్నాను .నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇక నుంచి ”పురుషోత్తమ క్షేత్రం ”అని పిలువ బడుతుంది.నీ కోరికలు న్యాయ బద్ధమైనవే.త్వరలోనే అవి తీర గలవు ”అని వరదానం చేసి ,పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు .
🍃🥀శ్రీ హనుమ దర్శనంతో తృప్తి చెంది ,ఆయన వరాలను అందుకొన్ననీలుడు ,అక్కడి నుంచి బయల్దేరి మళ్ళీ గురువు శుక్రాచార్యుల సన్నిధి కి చేరాడు .భార్గవుడు చాలా సంతోషించి,ఆశీర్వ దించి ,తండ్రి విభీషణునికి వివరాలన్నీ తెలియ జేయ వలసినది గా చెప్పి పంపించే శాడు .లంకలో తండ్రి విభీషనుడిని చేరి ,జరిగిన విధానం అంతా పూస గుచ్చి నట్లు తండ్రికివిన్న వించాడు .కుమారుని అద్భుత తపో వృత్తాంతం ,వర గ్రహణం విన్న విభీషణుడు ,పరమానందం పొందాడు.
🍃🥀నలుణ్ణి ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపాడు .నీలుడు చింతామణి మొదలైన వాటిని ఎలా పొందాడో తరువాతి కధలో తెలుసుకొందాం .
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
🙏 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం – 6 🙏 6* 🙏
🌻 నీలుడి కధ -2 🌻
🍃🥀లంకకు
చేరిన నీలుడు కొంత కాలమ్ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు .తనలో
తాను ఇలా వితర్కించు కొన్నాడు ”రాజు పని వున్నా లేక పోయిన రాజ్యానికి నష్టం
లేకుండా శత్రువులను భయ పెట్టాలి .శత్రు మర్దనుడు అనే బిరుదుపొందాలి. ఇలా
చేయక పొతే ,శత్రువులకు తేలికై పోతాడు.మా జాతికి శత్రువు స్వర్గ లోకాది పతి
ఇంద్రుడే అతని వద్ద నుండి చింతామణి ,కల్ప వృక్షం ,కామ ధేనువు నేను
గ్రహించటం రాజ ధర్మం.
🍃🥀నెమ్మదిగా నయంతో సాధించటానికి
ప్రయత్నిస్తా.ఇవ్వకపొతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించుకుంటాను .ఒక
దూతను రాయ బారి గా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది .అతని వల్ల
సమా చారం తెలుసు కోని ,అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలో చిస్తా”అని
దీర్ఘా లోచన చేశాడు .సమర్ధుడైన దూతను పిల్చాడు .అతనితో తన మనసు లోని మాట
ఇలా తెలియ జేశాడు .”నా రాయ బారిగా ఇంద్ర లోకం వెళ్లి ,నేను చెప్పే మాటలు
ఇంద్రునికి తెలుపు.
🍃🥀ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని ,మనకు
కావాల్సిన చింతామణి వగైరా లను మర్యాద గా అప్ప గించి ,సంతోషం కలుగ జేయ మని
చెప్పు .లేక పొతే యుద్ధానికి సిద్ధం గా ఉండ మని తెలియ జేయి ”అని వివరం గా
చెప్పి పంపాడు దూతను .
🍃🥀దూత ,నీలుడి మాటలను మననం చేసు కొంటు,
స్వర్గ లోకం చేరాడు .అక్కడ దేవ సభ లో మహేన్ద్రుని సభకు చేరాడు ..ఇంద్రుడు,
భార్య అయిన శచీదేవి తో సింహాసనం పై అధివసించి వున్నాడు .దేవగురు బృహస్పతి
,దేవ లోక మహర్షులు అందరు ఉచిత ఆసనాలపై ఉపవిస్టు లైనారు.అప్సరసలు నృత్యాలు
చేస్తుంటే గంధర్వులు కమ్మగా గానం చేస్తున్నారు.
🍃🥀రాక్షస రాజ
కుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి ,మహేన్ద్రునికి నమస్కరించాడు .ఆయనా
మర్యాద పూర్వ కం గా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు .దూత నీలుడు
చెప్పమన్న మాటలను ”సురాదిపా దేవేంద్రా !నేను లంకా రాజ్య పరి పాలకుడు విభీషణ
మహా రాజు గారి సేవకుడిని .ఆయన కుమారుడు ,యువ రాజు నీలుని దూతను .శ్రీ
మంతుడు ,సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడు ,ధర్మాత్ముడు ,భగవద్ భక్తుడు అయిన
నీల మహా రాజు మీకు ఒక సందేశాన్ని ,నా ద్వారా పంపించారు.
🍃🥀సావదానం
గా విని ప్రత్యుత్తరం ఇవ్వ వలసినది గా కోరు తున్నాను ”అని చెప్పి ,నీలుడు
చెప్పి పంపిన విష యాలనన్నిటినీ ఏకరువు పెట్టాడు .
అన్నీ విన్న
సహస్రాక్షుడు కోపోద్రేకం తో ”నీలుడు అంతటి వాడు అయ్యాడా ?మా వజ్రాయుధం
సంగతి మరిచాడా ?మహా బల సంపన్ను లైన పాకాసుర ,జమ్బాసురాది రాక్ష సుల కన్నా
పోటు గాడా ?అతని పరాక్రమం ఏమిటో చూద్దాం .అతను అడిగిన వేవీ ఇవ్వం అని
చెప్పు” ‘అని చెప్పి దూతను చంప రాదు కనుక ,శిఖ ను కత్తిరింప జేసి ,బయటికి
వెడల గొట్టాడు ఇంద్రుడు.
🍃🥀ఇంతలో సభలో అశుభ శకునాలు కని పించాయి
,విని పించాయి .ఏదో ప్రమాదం జరుగ బోతోంది అనే నేసూచన గమనించాడు ఇంద్రుడు
.సభ చాలించి ,అంతః పురం చేరాడు .
🍃🥀ఇంద్ర సభలో జరిగిన పరాభవాన్ని
మూట గట్టు కోని ,దూత నీలుని చేరి విషయం అంతా వివరించి చెప్పాడు .నీలుడు
దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు. తండ్రి విభీషణునితో
మంత్రా లోచన చేశాడు .సైన్యాన్ని సమ కూర్చుకొని స్వర్గాన్ని ముట్ట
డించటానికి సన్నద్ధుడై బయల్దేరాడు .కొద్ది కాలంలోనే స్వర్గం చేరి దేవ
సైన్యం తో యుద్ధం ప్రకటించాడు.
🍃🥀ఇంద్రుడు కూడా సమయా సమయాలు
తెలీకుండా ,అహంకార బల గర్వితుడై ,మద మత్స రాలతో ఊగిపోతూ పోరుకు తలపడ్డాడు
.భయంకర యుద్ధం సాగింది .ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడి పై ప్రయోగించాడు
.నీలుడు దాన్ని చేదించి నిర్వీర్యం చేశాడు .పరాభవంతో రగిలిన దేవేంద్రుడు
నీలుడితో ద్వంద్వ యద్ధానికి దిగాడు .
🍃🥀ఇంద్ర నీలు లిద్దరూ బాహా
బాహి ముస్టా ముష్టి యుద్ధం చేశారు .కుప్పించి తన్ను కొన్నారు ,కాళ్ళ తో
కొట్టు కొంటున్నారు .యెగిరి మాటి మాటికీ బాదు కొన్నారు .క్రమంగా ఇంద్ర బలం
క్షీణించి ,రాక్షసుడు అయిన నీలుని బలంపెరిగింది. ఇంద్రుడు కుస్తీ పోటీలో
పీటీ దెబ్బ తిని నేల మీద కూలి పోయాడు .నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి
ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదు నైనఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చ టానికి
పైకి ఎత్తాడు .
🍃🥀ఈ ఘోరం చూడ లేక అందరు భయ కంపితు లైనారు .అప్పుడు
బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై నీలున్ని ఆపు చేశాడు .ఇద్దరికీ సంధి చేయటానికి
తాను వచ్చానని బ్రహ్మవారిద్దరికీ చెప్పాడు .నీలుడు ఇంద్రుని
గుండెల మీద
నుంచి లేచాడు .ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మ దేవునికి నమస్కరించారు .భక్తీ
తో కీర్తించారు .నీలుడు చేసిన బ్రహ్మ స్తవానికి నాలుగు ముఖాల బ్రహ్మ
సంతోషించాడు .
🍃🥀దేవేంద్రునితో బ్రహ్మ ”పాక శాసనా !నీకు బుద్ధి
ఇంకా రాలేదా ?ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాది పత్యం ,విభీషణుడి
రాజాదికారం అంతా శ్రీ రాముడి దయ చేతనే ననే సంగతి మార్చి పోయావా?నీలుడు
కోరిన కోరికలు అతి సాధారణ మైనవే .వాటిని మన్నించి ,అతనికి వాటిని ఇచ్చి
వేస్తె మంచిది ”అని చెప్పాడు .
🍃🥀బ్రహ్మ ఇంద్రునికి హితోప దేశం
చేస్తూ ”నీలుడు హనుమ భక్తుడు హనుమద్దాసులకు అప జయం లోకంలోవుండదు .చింతామణి
,కల్ప వృక్షం ,కామ ధేనువు లను ఈనీలునికి సమర్పించించు .అతని క్షమాపణ కోరి
సుఖంగా వుండు .”అని బోధించాడు .బ్రహ్మ వాక్కు లకు సిగ్గు పడి నీలున్న్ని
క్షమాపణ కోరి నీలునికి చింతామణి ,కల్ప వృక్షం ,కామధేనువులను
ఒసగి ,సభక్తికంగా నిల బడ్డాడు.
🍃🥀అప్పుడు
బ్రహ్మ నీలుని చూసి ”శ్రీ మంతా నీలా !నువ్వు మాకు ఇష్టుడ వైన భక్తుడవు .నా
సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వా లను కొంటున్నాను.స్వీకరించు .నువ్వు
తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి ”నీలా చలం ”అని నీ పేర పిలువ బడుతుంది
.దీన్నే ”పురుషోత్తమ క్షేత్రం ”అనీ పిలుస్తారు .నీకు ”వనసుందరి ”అనే దేవతా
స్త్రీ ని ఇస్తున్నాను .ఆమెను వివాహం చేసుకొని ,సర్వ సుఖాలు అనుభవించు.
🍃🥀కాలాంతరంలో
నువ్వే ఇక్కడ ”నీలా చలేశ్వరుడు ”అనే పేరు మీద ఈ నీలా చలంలో వెలసి భక్తుల
కోర్కెలను తీరుస్తావు .”అని చెప్పి వన సుందరిని ఇచ్చి యుద్ధంలో చని పోయిన
వారందరినీ బ్రతికించి బ్రహ్మ లోకం చేరాడు బ్రహ్మ.
🍃🥀ఇంద్ర
,నీలాదులు పరమ సంతోషం పొందారు .ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభం
అయిందో ,అంత త్వరగా సమసి పోవటం ఉభయులకు ఆనంద దాయకం అయింది . .కాలం ఎంతటి
వారినైనా కలుపు తుంది విడదీస్తుంది .కాల మహిమ ఎవరు తెలుసు కో లేరు .ఈ కధలను
పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసు కొన్నాం
కదా.... నీలుడి కధ సమాప్తం
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
🙏 శ్రీ ఆంజనేయ మహాత్మ్యం — 8 🙏
🌻 దూర్వాస మహర్షి కధ –2 🌻
💫🌹శివామ్షతో జన్మించిన దూర్వాసుడు ,అన్ని విద్యలు నేర్చి ,గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు.అప్పుడు దేవదాసీ తిలోత్తమ ,ఆమె ప్రియుడు సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించకుండా రతి క్రీడలో పాల్గొన్నారు. వారి మాటలు ,చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కల్గించాయి.
💫🌹ఆయన కళ్ళు తెరచి వారి కామోద్రేకానికి కినిసి వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని శపించాడు. సాహసి ”గర్దభాసురుడు ”గా జన్మించాడు. ఇతడు మహా విష్ణువు చేతిలో మరణం చెండాడు. ఏమైనా భరద్వాజుని ఏకాగ్రత దెబ్బ తిని కామ వికారం కల్గి ,పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది.
💫🌹అదే సమయంలో చ్యవన మహర్షి కుమారుడు ”ఔర్వుడు ”అనే ఆయన తన కుమార్తె ”కందళి ”తో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని ఆట తెలుసు కోని తన కూతురు కందళి నిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు. కందళి గంప గయ్యాళి ఆమెను భరించటం కష్టంగా వుంది. ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు.
💫🌹ఆమెకు భర్తను వదలటం ఇష్టంలేక ఆతడిని అనుసరించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దివ్య రూపంలో వున్న ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలికను విడిచి పెట్ట వద్దనీ ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్లి పోయాడు. కందలిక తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది. కందళి కడలిగా రంభగా అరటిగా పేరు మారింది.
💫🌹దూర్వాస మహర్షి గురించిన మూడో కధ.
💫🌹పూర్వం ”నాభాగుడు ”అనే రాజు వుండే వాడు. ఆయన కుమారుడే అంబరీషుడు. అంబరీషుడు విష్ణు భక్తుడు. ఏకాదశీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో చేసేవాడు. ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధమైన సమయంలో దూర్వాసుడు ఆయనకు అతిధిగా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు.
💫🌹ద్వాదశి ఘడియలు పూర్తి అయింది. సమయం అయినా మహర్షి రాలేదు. అక్కడున్న మార్షుల అనుమతితో కొద్దిగా జలాన్ని తీర్ధంగా త్రాగాడు. తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోపపడి తన శిరస్సులోని ఒక జడను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు.
💫🌹అది అతి భయంకరంగా మీదకు రావటం గ్రహించి రాజు శ్రీ హరిని మనసులో ధ్యానించాడు వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి పిశాచాన్ని చంపి దుర్వాసుని చంపటానికి మీదకు వెళ్ళింది. భయంతో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు. చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది. మూడు లోకాలూ తిరిగినా ఎవరూ దుర్వాసునికి అభయం ఇవ్వలేదు.
💫🌹చివరికి విష్ణువు ఆజ్ఞతో మళ్ళీ అంబరీశున్నే శరణు వేడాడు. అంబరీషుడు అతన్ని క్షమించాడు. వెంటనే చక్రం అదృశ్యమైంది. భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కలవాడు అని ఈ కధ మనకు తెలియజేస్తుంది.
💫🌹ద్వాపర యుగంలో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు. ఆయన కుమార్తె కుంతీ దేవిని చూసి ,ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు. కుంతీ దేవి బుద్ధి చాపల్యంతో ఆమంత్ర ప్రభావాన్ని పరీక్షించాలను కొంది.
💫🌹సూర్యుని గురించి ప్రార్ధించింది. ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మ దేవత ,వాయుదేవుడు ,ఇంద్రుడు ,అశ్వినీ దేవతలను దుర్వాసుని మంత్రంతో స్మరించి ,క్రమంగా ధర్మరాజు ,భీముడు ,అర్జునుడు ,నకుల సహదేవులను కన్నది. వీరే పంచ పాండవులు. కర్ణుడిని నదిలో వదిలి పెడితే ఆతడు సూతుదికి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో తన సామర్ధ్యం రుజువు చేసుకొని ,దుర్యోధనుని మనసు గెల్చి ,అంగ రాజ్యానికి అభిషిక్తుడై ,కౌరవ పక్షంలో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే.
💫🌹దూర్వాసుడు వైష్ణవ, శాక్తేయాది మహా మంత్రాలన్నీ జపించి నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి ”శ్రీ హనుమత్సంజీవినీ విద్య ”నేర్చి జపించాడు. అప్పుడు హనుమ ఒకే ముఖం తో 18 భుజాలతో దర్శన మిచ్చాడు. దుర్వాసుడు పరవశించి ఆన్జనేయుడిని భక్తితో కీర్తించాడు.చక్కని శ్లోకంతో ఆయన్ను వర్ణించాడు.
”శక్తిం ,పాశం చ కుంతం ,పరశు మపి హలం తోమరం ,ఖేతకం వా
శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముద్గరం చ
గాండీవం బాణ పద్మం ,ద్వినవ వర భుజైహ్,ఖడ్గ మస్యావదానం
వందేహం వాయుసూనుం ,సురరిపు మధనం ,భక్త రక్షా దురీణం .”
💫🌹ఈ శ్లోకం వినగానే ,ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి ,అదృశ్యమైనాడు. అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధ లతో జపిస్తూ మనశ్శాంతి
ని పొందుతూ ,కోపంలేని వాడై ,గంధమాదన పర్వతం వద్ద నివశిస్తూ ,మహాయోగి అయి శివునివలె నిత్య ప్రాతస్మరనుడు అయాడు.
💫🌹కనుక మానషిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అని దుర్వాసుని కధల వల్ల మనకు తెలుస్తోంది. దుర్వాసముని కధ సమాప్తం.
Hare Rama Hare Krishna
ReplyDelete