Friday, 31 March 2023

ప్రాంజలిప్రభ..




*వ్యక్తిత్వ వికాస సూత్రాలు

===================

🌺నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.

🌺చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. 

🌺మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. 

🌺జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము...

🌺మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మనసులో నిలిచిపోయే మంచితనమే గొప్పది.

🌺 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.......

🌺 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.

🌺 నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న....

🌺 మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.

🌺 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.

🌺 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.

🌺 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.

🌺 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

🌺 మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .

🌺 ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

🌺 ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

🌺 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. 

🌺తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవిత పరమార్ధం


                 *జీవితమొక అందమైన అనుభవం.

*ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?*

గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి??? ...

*ప్రదక్షిణ అని దేనిని అంటారు??*

_అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు._

_ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తితో నడవడం అని చెబుతుంది._

స్కాందపురాణం ప్రదక్షిణంలో ప్రతీ అక్షరం గురించి చెబుతూ ...

*ప్ర - అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని,*

*ద - అంటే కోర్కెలను ఒసగేది అని,* 

*క్షి - అంటే కర్మను క్షయం చేసేది అని,*

*ణ - అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది...*

*శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అర్థం ఏమి???*

_మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని,_

_రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని,_

_మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం._

గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు...

పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు.

అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం.

అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితికి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది. 

ప్రదక్షిణ చేసేటప్పుడు కుడి నుంచి ఎడమవైపుగా నడుస్తాము, దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం. 

ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది.

కుడి వైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది.

అత్యంత మంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేయాలి...

ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం ఉంది, శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి...

*ప్రదక్షిణలు ఎలా ఉండాలి???*

_ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టుగా  నడవాలి అని శాస్త్రం చెబుతోంది_

 ఒక వలయం సెంటర్ నుండి సమాంతర దూరం గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం. 

ఆది శంకరాచార్యులు చెప్పినట్టు 1008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి అని అంటారు..

 21 ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమ శాస్త్రం చెబుతుంది ...

*శివతాండవం చూసేందుకు ఆదిశేషుడు ఎత్తిన అవతారం - పతంజలి*

భారతీయులు ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగశాస్త్రం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శాస్త్రపు విలువ పెరుగుతూనే ఉంది. ఆరోగ్యానికి అంతకు మించిన సాధన లేదని రుజువు చేస్తూనే ఉంది. అంతటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి గురించి మాత్రం పెద్దగా సమాచారం కనిపించదు. కానీ కొన్ని కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఇదిగో... శివుడు ఒకసారి దేవతలు, రుషులందరి సమక్షంలోనూ తాండవం చేశాడట. చూపరులందరినీ కట్టిపడేసిన ఆ తాండవం గురించి లోకమంతా గొప్పగా చెప్పుకోసాగింది. ఆ నృత్యాన్ని స్వయంగా వీక్షించిన విష్ణుమూర్తి సైతం శివతాండవం గురించి పదే పదే తల్చుకోసాగాడు. విష్ణుమూర్తిని మోస్తున్న ఆదిశేషునికి సైతం ఆ పొగడ్తలు చేరాయి. ఇంతమందిని అలరించిన తాండవాన్ని తాను చూడలేకపోయానే అని ఆదిశేషునిలో బాధ మొదలైంది. ఆ బాధ క్రమేపీ పెరిగి ఆయన మనసుని దహించివేసింది. ఎలాగైనా తాను కూడా శివతాండవాన్ని చూడాలని అనుకున్నాడు. కానీ అది మాటలు కాదు కదా! ఎప్పుడో కానీ సంభవించని సందర్భం అది.

ఆదిశేషుని మనసులోని దుగ్ధను గ్రహించిన విష్ణుమూర్తి- భూమిమీద జన్మించి, శివుని ధ్యానించి తన కోరికను తీర్చుకోమని సూచించాడు. అదే సమయంలో గోనిక అనే భక్తురాలు సంతానం కోసం భగవంతుని ప్రార్థిస్తోంది. ఒకరోజు ఆమె సూర్యునికి అర్ఘ్యం అందిస్తుండగా ఆ నీటిలో ఒక పాముపిల్ల రూపంలో అవతరించాడు ఆదిశేషుడు. అంజలి ఘటిస్తుండగా పతం (ఆకాశం) నుంచి వచ్చిపడ్డాడు కాబట్టి అతనికి ‘పతంజలి’ అన్న పేరు స్థిరపడిందంటారు.

పతంజలి పెరిగిపెద్దవాడయి సకలశాస్త్రాలనూ ఔపోసన పట్టేశాడు. చిదంబరంలో శివుని గురించి తపస్సు చేసుకుంటూనే వేదాధ్యయనాన్ని సాగించాడు. అదే సమయంలో చిదంబరంలో వ్యాఘ్రపాదుడు అనే మరో రుషి కూడా ఉండేవాడు. శివుని అర్చించేందుకు ఎంతటి శ్రమకైనా ఓర్చి పూలు సాధించేందుకు తనకు పులి పాదాలు కావాలని ఆ ముని కోరుకున్నాడట. అందుకనే ఆయనకు ఆ పేరు వచ్చింది. చిదంబరంలో ఉన్న ఆ ఇద్దరు రుషుల దీక్షకు మెచ్చి పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమైనాడు. వారి కోసం ఆనందతాండవాన్ని నర్తించాడు. అక్కడే నటరాజ స్వామిగా వెలిశాడు.

చిదంబరంలో వ్యాఘ్రపాదుడు, పతంజలి స్వామివారిని పూజించారనేందుకు నమ్మికగా అక్కడి చిత్రాలలో స్వామివారిని పూజిస్తున్న ఇద్దరు రుషులూ కనిపిస్తారు. అసలు చిదంబరంలోని ఆలయాన్ని పతంజలి స్వయంగా నిర్మించారని కూడా కొందరంటారు. నిజానికి పతంజలి పేరుతో చాలా ప్రముఖ గ్రంథాలే కనిపిస్తాయి. ఇవన్నీ రాసినవారు వేర్వేరు వ్యక్తులనీ.... భారతీయ సాహిత్యంలో కనీసం ఒక ఐదుగురు పతంజలిలు ఉన్నారని కొందరంటారు. కానీ పతజంలి అన్నవాడు ఒక్కడే అని మరికొందరి నమ్మకం! పతంజలి జీవన కాలం గురించి కూడా ఇలాంటి సందిగ్ధతే ఉంది. క్రీ.పూ ఊదో శతాబ్ది వాడని కొందరంటే అంతకు కొన్ని వేల సంవత్సరాల మునుపువాడని మరికొందరి వాదన.

ఏది ఏమైనా అప్పటివరకూ జ్ఞానులకు మాత్రమే తెలిసిన యోగసూత్రాలను క్రోడీకరించి ప్రపంచానికి అందించడంలో పతంజలి అనే వ్యక్తి చేసిన కృషి అసాధారణం అని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇక పతంజలిని సగం పాము రూపంలో కొలవడంలోనూ ఒక ఆంతర్యం కనిపించకపోదు. మనలోని కుండలినిని సర్పంగా భావిస్తుంటారు. నిద్రాణంగా ఉన్న ఆ కుండలినిని జాగృతం చేయగలిగిన రోజున మోక్షం సాధ్యమన్నది యోగుల మాట. ఆ కుండలినీ శక్తిని సూచించేందుకు యోగశాస్త్రకారుడైన పతంజలికి సర్పరూపాన్ని అందించి ఉండవచ్చు.

*🎣సేకరణ:

.......

*శివుడి నివాసం ఎలా ఉంటుంది?*

 *శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే.అయితే ఆ పరమేశ్వరుడు నివశించే ప్రాంతమంతా ఎంత* *శోభాయమానంగా ఉంటుంది?* *పరిసరాలలో ఏవేవి ఉంటాయి? అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు? అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథా సందర్భం. ఇది లింగ పురాణం యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఉంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్త్తెన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది.* *భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. సుగుంధ భరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతోనూ,* *విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి.* 

 *దేవదేవుడైన శంకరుడి మందిరం మణి విభూషితంగానూ, బంగారు మయంగానూ, స్ఫటిక నిర్మితంగానూ ఉన్న గోపురాలతో అలరారుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి.* *భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, రుషులు, గంథర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తుంటారు.* *కుబేర శిఖరం నుంచి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధ* *భరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంథర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నెరులు ఆ నదిలో ఆనందంగా స్నాన పానాలను చేస్తుంటారు. మందాకినీ నదికి ఉత్తర భాగంలోను, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబసదాశివుడు అమ్మ వారితో హాయిగా విహరిస్తుంటాడు అని లింగ పురాణం ఇలా శివ నివాస స్థానాన్ని పేర్కొంటోంది.* 

 *అలాగే ఇంద్రాదుల విషయానికొస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వతం శిఖరం మీద దానవులకు చెందిన ఎనిమిది పురాలు ఉంటాయి. సువర్ణ కోటరాద్రి మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న మహనీలాచలం మీద అశ్వ ముఖులైన కిన్నెరుల పదిహేను పురాలు, వేణు సౌదాద్రి మీద విద్యాధరులు ఉండే మూడు నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్ట వసువుల నివాసాలు, రత్న ధారాద్రి మీద సప్త రుషుల సప్త భవనాలు ఉంటాయి. ఏక శృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది.* 

 *గజ శైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలు ఉంటాయి. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతల ఆవాసాలు ఉంటాయి. ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో ఎనభై నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద, పంచకుటాద్రి పైన రాక్షసులకు చెందిన అయిదు కోట్ల నివాసాలు ఉంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన వంద పురాలు, తామ్రాభం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల ఏడు వేల పురాలు, పుష్ప కేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర, వాయు, నాగధికుల నాలుగు నివాసాలు ఉంటాయి.*

........


పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధమైన కురుక్షేత్ర రణరంగంలో విజయుడి రథం  జెండాపై ”కపి రాజు ”హనుమంతుడు కొలువై ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్య , అర్జునుని కోరికపై రధాన్ని నిలి పాడు పార్ధసారధి అయిన శ్రీ కృష్ణుడు. కిరీటి రధం దిగి, రెండు వైపులా ఉన్న సైన్యసమూహాన్ని చూశాడు అందరు బంధువులే, కావలసిన వారే. వీళ్ళందర్నీ చంపి, తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు. యుద్ధం చేయటం కంటే భిక్షంఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి. మనసంతా వ్యాకులం అయింది. కర్తవ్యమ్ తోచటం లేడు . శ్రీ కృష్ణ పరమాత్మ  నే శరణు కోరి కర్తవ్యం బోధించమని వేడుకొన్నాడు.

ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడైన అర్జునుని మనో భావం గుర్తించిన శ్రీ కృష్ణ భగవాననుడు వెంటనే పద్దెనిమిది అధ్యాయాలభగవద్గీతా సారాన్ని వినిపించి యుద్దోన్ముఖుడిని చేశాడు. భగవానుని గీతను అనుసరించి , విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .

పార్దునికి , పార్ధ సారధి విని పిస్తున్న భగవద్గీత నంతటిని అర్జునుని రథపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించుకొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తితో   నమస్కరించాడు . అప్పుడు గోపాల చక్రవర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హనుమంతా !నేను చెప్పినవిషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న గీతకు ”భాష్యం ”రచించు. దానితో నీ పిశాచ రూపం అంతరిస్తుంది ”అని శాపాన్ని , శాప విమోచనాన్ని తెలియజేశాడు పరమాత్మ .

........

పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఏలాగంటే?

ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది..

'నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను?

ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని?

'మరుసటిరోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు'...

అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది 'అన్నాడు...రాజు వెళ్ళాడు..

అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటుంటాడు.. అది చూసి రాజు ఆశ్చర్యపోయి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు.. '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''

నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.. రాజు ఆయన్ని చూసినపుడు, ఆ సన్యాసి మట్టి తింటూంటాడు..

రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపొమ్మంటాడు...

రాజుకు కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు... తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అంటాడు..

''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి..

'' రాజుకంతా గందరగోళంగా వుంది."అయినా అక్కడికెళతాడు..

చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు...

అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు...

గత జన్మ లో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి వుంటారు.. ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.. తినబోతుంటే

అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే...

ఆ నలుగురిలో మొదటి వాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు...

రెండవ వాడిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు..

మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటే ముసలిదానా ? ''అని నీచంగా మాట్లాడాడు...

కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' ఆవ్వా , నీవు చాలా నీరసంగా వున్నావు.. ఈ రొట్టె తిను, '' అని తాను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేసాడు...

ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు...

రాజు దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు..

రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు... 

........

మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు,     పిల్లలు కావాలను కొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే..!

ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు.

ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి.

కానీ..

డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగు చేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు...

అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు...

అందంగా ఉంటే సంతోషం ఉంటుందా ? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి.

సకల విద్యలనూ ఆపోసన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు.

కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం.

పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం.  కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. దానికి ఒక ఉనికి లేదు...

ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని

పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు..

ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి..

మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు.

నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదన కోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి..._

.......

 అదే చిట్టచివరి సంతోషానికి చిరునామా...ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం.

ఇదే జీవిత పరమార్ధం.

.......


ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకరోజు ఒకె ఒక్క క్షణం మనసు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది ..  అందరులా వచ్చి వెళ్లిపోవడమేనా జీవితం ? తెలిసినది ఎంత ? తెలుసుకోవలసినది ఎంత ? 

ఏది ముక్తి ? ఏది మోక్షం ? 

అది హిమాలయాల్లో దొరుకుతుందా ? 

గుడిలో మసీదులో చర్చులో దొరుకుతుందా ?? ఎక్కడ ? 


ధ్యానులకే దొరుకుతుందా , యోగులకే దొరుకుతుందా , 

సిద్దులకే దొరుకుతుందా ? మరి గృహస్తునికో ?????? 

 ఈ ఆలోచన క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు !!"


ఒక గురువుగారిని వీటికి సమాధానం చెప్పమని అభ్యర్దించాను .. 

"  వారు నువ్వు తెలుసుకోవడానికి ఎంతో సమయం ఉంది  అన్నప్రాశనలో నీకు ఆవకాయ ఎందుకు "

అన్నారు .. ఆ సమాధానంతో  మనసుకు సంతృప్తి కలగ లేదు .. 

ఎందరో ధ్యానులను , యోగులను , భిన్న ఆధ్యాత్మిక సంఘాలలో ఎందరో గురువులు చెప్పినది వింటూనే ఉన్నా .. 


ఇంతలో ఓ మహానుభావులుతో పరిచయం జరిగింది .. వారికి సిద్దులు లేవు మహిమలు లేవు ,, కాషాయము లేదు ,, ఆశ్రమాము లేదు .. వారు గృహస్తులు { కర్మయోగులు , జ్నానయోగులు }

వారి ధ్యారా నేను తెలుసుకున్న సత్యాలు 

మీతో పంచుకుంటూ ..... 


ముక్తి " మోక్షం " అంటే అందరూ భగవంతునిలో ఐక్యం అవ్వడం లేదా మరో జన్మ లేకుండా ఉండటం అంటారు" 

' స్దూల ' సూక్ష్మ ., కారణ , మహాకారణ తో  తయారు కాబడిన ఈ పదార్దములో  "ఆత్మకు మరణం లేదు " మరి ఐక్యత ఎక్కడ .. ??? ఎవరిలో ఐక్యత ?? 

 ఈ అనంతకోటి జీవరాశిలో ,, ఎన్నెన్నో లోకాలలో ఎక్కడో ఒక్క చోట  నీవు ఉండవలసినదే ... 

అది ఎక్కడ అనేది నీవు చేసే కర్మలపై 

ఆధారపడి ఉంటుంది ..  

అంటే ఎక్కడో ఒకచోట ఆత్మ ఉండే తీరుతుంది .. 


ఇక ముక్తి అంటే విడుదల "" 

మోక్షం అంటే  dukkha రహిత స్దితి "" 


విడుదల '' అంటే భార్య బిడ్డలు ఇల్లు సంసారం వదిలేసి స్వేచ్ఛగా ఎగిరి పొమ్మని కాదు .. నీకున్న దేహ ధర్మాలు నిర్వహించకుండా పండుబోతుగా పరుగులు తీయమని కాదు ... 


కార్యా కారణ సంభంధాలతో ఏ పని (కర్మ ) పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చోవో , అది పూరించకుండా పరుగులు తీస్తే 

నువ్వు ఎందుకు వస్తున్నావు .. ఎందుకు వెళుతున్నావు .. ????? 

 ఒకవేళ నువ్వు ఎక్కడికో పరుగులు తీసినా  దుఖము లేని స్దితిలో  ఆశ , మొహం , కోరిక లేని స్దితిలో జీవించగలవా ? లేదు .. 

ఒకవేళ జీవించగలను అనుకుంటే నిన్ను నీవు మభ్యపెట్టుకున్నట్లే .. 


మరి గృహస్తునికి ముక్తి ' మోక్షం ఎలా ? 


"చేసే ప్రతి పని నిష్కామముగా చేయడం " ఫలితం ఆశించకుండా చేయడం " సమర్పణా భావంతో చేయడం " కష్టం అయినా కన్నీళ్లు అయినా వాని ప్రసాదంగా 

భావించడం ... " ఎప్పుడయితే నీవు కర్మయోగిగా కదలిపోతూ ఉంటావో '' మెల మెల్లగా జ్నానమ్ నీకు జత చేరుతుంది 

ఈ  జ్నానాగ్ని లో నీ కర్మలు అన్నీ దగ్దం అయిపోతాయి ... 

 నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు సాక్షిగా మాత్రమే ఉంటావు ".. ఆనందమయునా ఆశ్రువులయినా ... 

దేహం తన ధర్మం తాను చేస్తూ ( ఇంటి వాచ్ మెన్ లా )

 ఇదేది నాది కాదన్న భావనతో మనస్సు , బుద్ది , వాక్కు ఏకమై సమస్దితిలో "" నేను అన్న అహం వదలి "" 

తూహుం తూహుం "" ( నువ్వు నువ్వు అంటూ )దుఖ.. రహితమయున సమస్దితి (సమాధి స్దితి ) అన్నిటికి అతీతమయున స్దితి  అదే నీకు నువ్వు విడుదల " అదే నువ్వు కోరుకున్న ముక్తి "


మరి ఈ స్డితికి నువ్వు చెరాలంటే "  సాధన " సాధన" సాధన " అహం నుండి తుహుం వరకు ...... ( నేను నేను కాదు అంతా నువ్వే నువ్వే)

Monday, 20 March 2023

సమస్యను పరిష్కరించడం..


 

ఒక ఊళ్లో భిక్షకుడు గుడి ముందు అడుక్కుంటూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఆ గుడికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కింద ఉంటుండేవాడు. ఒక భక్తుడు గుడికి వచ్చినప్పుడల్లా ఆ భిక్షకుడి పాత్రలో నాణేలు వేసేవాడు. అతణ్ని ఆప్యాయంగా పలకరించి పండో, ప్రసాదమో చేతిలో పెడుతుండేవాడు. అలా ఆ భక్తుడంటే భిక్షగాడికి ఒక గౌరవ భావం ఏర్పడింది. 

      కొన్నాళ్లకి ఆ భిక్షకుడికి బాగా జబ్బు చేసింది. తనకి చివరి క్షణాలు సమీపించాయని అతనికి అర్థమైంది. ఆ సమయంలో ఆ భక్తుడితో తన మనసులోని కోరిక విన్నవించుకున్నాడు. చనిపోయాక తనని ఆ చెట్టు కిందనే సమాధి చెయ్యాలని కోరాడు. దానికి ఆ భక్తుడు అంగీకరించాడు. 

       భిక్షకుడు కన్నుమూశాడు. భక్తుడు అతను చెప్పిన స్థలంలోనే గొయ్యి తవ్వాడు. ఆశ్చర్యం.. బంగారు నిధి బయటపడింది. అదతని సొంతమైంది. 

      ఏళ్ల తరబడి దైవ సన్నిధిలో భగవన్నామ స్మరణ చేస్తూ గడిపినందుకు ఆ భిక్షకుడు స్వర్గానికి వెళ్లాడు. భక్తుడికి బంగారు నిధి దొరికిన విషయం అక్కడ తెలిసింది. మొదట నిర్ఘాంతపోయాడు. తనని ప్రేమగా పలకరించే వ్యక్తికి అది దొరికినందుకు తర్వాత సంతోషించాడు. అయితే అతడిలో ఓ సందేహం. 

      ‘‘జీవితాంతం నేను ఆ నిధి మీదే కూర్చున్నాను. కానీ, చివరి వరకూ భిక్షగాడిగానే ఉండిపోయాను. నాలుగు డబ్బులు దానం చేసిన ఆ భక్తుడు కోటీశ్వరుడయ్యాడు. ఏంటీ మాయ’’ ఇంద్రుణ్ని అడిగాడు ఆ యాచకుడు. 

      ‘‘నీ జీవితమంతా భగవంతుడి సాన్నిధ్యంలో గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అయితే, నీ సమీపంలోనే ఉన్న నిధి గురించి నువ్వు తెలుసుకోలేకపోయావు. అతను రోజూ భగవత్సేవ చేస్తూ యథాశక్తి నీకు దానం చేశాడు. అందుకే అతణ్ని ఆ నిధి వరించింది. నిజానికీ చాలా మంది తమలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక ఇతరుల మీద ఆధారపడుతుంటారు. దానివల్ల పక్కవారు లాభం పొందుతుంటారు’’ సమాధానమిచ్చాడు ఇంద్రుడు. మౌనంగా తలదించుకున్నాడు ఆ యాచకుడు.


భీష్ముడు చెప్పిన పిల్లి, ఎలుక కథ.


మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తాయి. ఒకవైపు మంచిచెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోని శాంతిపర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకి చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో ఒకటి పిల్లి, ఎలుక కథ. అడవిలోని ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుతండగా, అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది. రోజూ ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి, ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దానిచుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది.


ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ‘ఈ వలని కొరికి నిన్ను నేను రక్షిస్తాను.. దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుంచి కాపాడవా!’ అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొడంత ధైర్యం వచ్చినట్టయి, వెంటనే సరేనంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి.


నీ ప్రాణాలను రక్షించాను కదా.. మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకను పిల్లి అడిగింది. దీనికి ఎలుక ‘నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా! ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను’అని సంజాయిషీ ఇచ్చుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది.

చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు. వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు.. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం’ అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు.. బదులుగా నేను నిన్ను రక్షించావు. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు’ అంటూ కలుగులోకి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మునుండిపోయింది.


ఈ కథలోని పాత్రధారులు సహజశత్రువులైన పిల్లీ ఎలుకలే కానీ, ఇందులోని నీతి మాత్రం నిత్యజీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసీ వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి, జీవితాన్ని ఫణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది.


జీవితం ఒక అంతులేని పయనం. ఈ సుదీర్ఘ వింతపయనంలో నిమిషాలు, గంటలు, దినాలు పరుగులు తీస్తూ ఉంటాయి. మాసాలు గడిచి సంవత్సరాలుగా మారుతుంటాయి. జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతూ ఉన్నంతకాలం మాసాలు నిమిషాలుగా, సంవత్సరాలు గంటల గడియారంలో ముళ్లలా చకచకా నడుస్తూఉంటాయి.


సమస్యలు ఎదురుపడగానే క్రమం అంతా తారుమారవుతుంది. ఇలా జరగడానికి కారణం ఏమైఉంటుంది? కాలమహిమ అని కొందరు, కాదు మనసే ఖలనాయకుడని మరికొందరు వాదిస్తారు. కాలం ఒక మహాప్రవాహం. దానికి ఎదురీది గట్టెక్కాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషికి జీవితం సవాలుగా మారుతుంది. ప్రవాహంతోపాటు సాగిపోదామన్నా, అది సాఫీగా సాగుతుందన్న భరోసా లేదు. తేడా భావనలోనే ఉంది. ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ, సుడిగుండంలో చిక్కుపడిన దుంగలా తలకిందులుగా తలపడటమా? లేక తుంగలా తలవంచి ప్రమాదం నుంచి బయటపడటమా? ఈ ప్రశ్నలకు సమాధానం వ్యక్తి మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది.

గుణాత్మకమైన ప్రకృతి ప్రభావంవల్ల వ్యక్తిత్వపు మానసిక స్థితిగతులు మార్పు చెందుతుంటాయి. వీరులు, ధీరులు, రుషులు, తాపసులు తప్పటడుగులు వేయడానికి ప్రకృతి ప్రలోభాలే కారణమని మన పురాణాలు గళమెత్తి చాటుతున్నాయి. ఆరుగురు అంతశ్శత్రువుల దాడికి ఆగలేక మనసు ఆగమాగమై మూగపోవచ్చు లేదా చతికిలపడవచ్ఛు అర్జునుడి వంటి జగదేక ధనుర్ధరుడు కురుక్షేత్రంలో చతికిలపడ్డాడు. విశ్వామిత్ర మహర్షికి మేనక కనిపించగానే మనసు మూగబోయి మనిషిని దాసుడిగా మార్చేసింది. బంధానికి, మోక్షానికి మనసే కారణమన్న ఉపనిషత్తు వాక్యం అక్షరసత్యం.


ఆత్మజ్ఞానానికి చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి- రెండూ ముఖ్యమైన సూత్రాలు. మనసు అద్దంలా మారినప్పుడే శుద్ధజ్ఞానం మెరుస్తుంది. ప్రపంచాన్ని గెలుచుకున్నా, మనసును జయించకపోతే ఆ వీరుడు ధీరుడు కాలేడు. స్థితప్రజ్ఞుడే ఈ ప్రపంచంలో అసలైన ప్రాజ్ఞుడు. ఆత్మజ్ఞానం అంటే తానేమిటో తెలుసుకోవడం. అంతా తానై ఉన్నానన్న ఎరుక కలగడంతో ఒంటరిపోరాటం మొదలవుతుంది. ఏకాత్మ భావన అంటే మానసికంగా అందరూ ఒకటే. శారీరకంగా ఎవరికి వారే. అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నాడు యోగీశ్వర కృష్ణుడు.


తామరాకుపైన నీటిబొట్టులా భౌతికజీవితంలో మెరవాలి. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన విధంగా, జీవన్ముక్తి వివేకంతో మనిషి సంసార సాగరాన్ని ఈదుకు రావాలి. ఐహిక బంధాల్లో చిక్కుపడి ఆముష్మిక పంథాకు దూరం కాకూడదు. భార్య, బిడ్డలు, హితులు, స్నేహితులు, సిరిసంపదలు... ఇవేవీ శాశ్వతం కాదు.


ఇవన్నీ మహాప్రస్థానంలో నాందీప్రస్తావనలు. కాశీయాత్రలో తప్పని మజిలీ స్థావరాలు. మహాప్రస్థానంలో ధర్మరాజును చివరిదాకా అనుసరించింది ధర్మం ఒక్కటే. ఆత్మీయులు అనుకున్నవారు, ఆత్మబంధువులన్నవారు ఊరి పొలిమేర దాకా కలిసి వస్తారేతప్ప, ఊర్ధ్వయాత్రలో మనిషి ఏకాకి మాత్రమే. ఆత్మజ్ఞానం ఒక ఊర్ధ్వగమనం కాబట్టి వ్యక్తి చైతన్యాన్ని చిక్కబట్టాలి. మనోబలంతో ముందుకు సాగాలి. కొంతమంది తమకు తామే గొప్పగా తలబోసుకుంటూ పటాటోపంగా యజ్ఞాలు చేస్తారు. సదా సంసారంలో ఎదురీత సాగిస్తూ ఉంటారు. మనసును వశం చేసుకున్న సాధకులు జీవనయాత్రను జైత్రయాత్రగా మలచుకుని యోగసిద్ధి పొందుతారు.


అంతులేని పయనంలో, ధర్మరాజుకు ధర్మంలా తోడువచ్చేది- ఆధ్యాత్మికసాధనే


ఓటమిని ఆస్వాదించగలిగినవారినే విజయం వరిస్తుంది. జీవితంలో జయాలుంటాయి, అపజయాలూ ఉంటాయి తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికేమో కారణాన్ని విధికి ఆపాదిస్తాం. విధిని నిందిస్తాం. దైవంపై అలుగుతాం. ఇలా ప్రవర్తించడం మానవ తప్పిదమే కాదు, దైవాపరాధం కూడా! జీవితంలో మనకు ఎదురయ్యే జయాపజయాలకు కారణం మనమే! దైవం మనిషికి వివేకం ఇచ్చాడు. వీలైనంతవరకు తప్పులు చేయకుండా కార్యసాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యం! జీవనమార్గంలో తప్పటడుగులు వేయటం ఎవరికైనా సహజం. జీవిత రహదారిలో ముళ్లూ గులకరాళ్లూ ఉంటాయి. వివేకాన్ని ఉపయోగించి ప్రయాణం చేయగలిగితే విజేతలం కావడం ఎప్పుడూ సంభవమే అందలం కోసం ఎగిరే ప్రయత్నంలో కిందపడిపోతుంటాం. పడిలేచి తిరిగి ప్రయత్నించేవాడికి అందలం అందుతుంది. పూలకోసం యత్నిస్తుంటే ముళ్లు గుచ్చుకుంటాయి. జీవితంలో గెలవాలనుకొంటే ఓపిక ఉండాలి. పదిసార్లు ప్రయత్నించిన తరవాత పదకొండోసారి లభించిన విజయంలోని ఆనందమే వేరు! విజయం సాధించేందుకు అడ్డదారులుండవు. అడ్డంకులుంటే తొలగించుకోవాలి. అందుకు సమయస్ఫూర్తి, వివేకం అవసరం శ్రీకృష్ణుడు అపర విష్ణు అవతారం. కౌరవుల బారినుంచి రక్షించడానికి పాండునందనులకు సహకరించాడు కాని విజయప్రయత్నంనుంచి విరమించమనలేదు! లక్కతో నిర్మించిన భవనంలో నివసిస్తున్నవారికి సోమరితనం

వదలి అప్రమత్తంగా ఉండాలని బోధించాడు. తానుదైవస్వరూపుడే అయినా జరాసంధుని వధ తనవల్లకా దని(కూడదని తెలిసి... సంధ్యాసమయంలో, పశ్చిమ ద్వారం నుంచి ప్రవేశించి భీముడితో యుద్ధానికి పురిగొలిపాడు. శ్రీకృష్ణుడు జరాసంధుడితో ఓటమికి కుంగక సమయస్ఫూర్తితో పగవాడిని హతమార్చాడు. మహాభారత యుద్ధ సమయంలో కౌరవ వీరుల సమరసన్నాహాలు చూసి పార్థుడు పరాజయం తప్పదని భావించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులవంటి సమరయోధులను గెలవటం అసంభవమని యుద్ధానికివెనకాడుతున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు పోరుచేయడంలో భీరత్వం ప్రదర్శించక ప్రయత్నించమన్నాడు. నిజానికి భీష్ముడు, ద్రోణుడు కృపాచార్యుని వంటివారిని గెలవటం సులభమేమీ కాదు. పద్దెనిమిది రోజుల యుద్ధంలో పాండవులు ఓటమి అంచుల వరకు వెళ్లినా శ్రీకృష్ణుడు వారిని


ఉత్సాహపరుస్తూ సామ దాన భేద దండోపాయాలను వినియోగించి విజయం సాధించిపెట్టాడు. అంతేతప్ప పాండవుల విజయానికి అడ్డదారి చూపలేదు


ప్రతి మనిషికీ జీవితంలో గెలుపు అవసరం. గెలవలేని జీవనలక్ష్యం అంటూ లేనేలేదు. ఎదురవుతున్న ఓటములకు భయపడి లక్ష్యాన్ని విడచి బతికే మనిషి పథవిహీనుడే! మరణం తప్పదని తెలిసినా బతకడానికి చేసే ప్రయత్నాలు విడవలేం కదా! మనం గెలుపుకోసం చేసే ప్రయత్నాలే తరవాతి తరం వారికి స్ఫూర్తిదాయకాలవుతాయి


యుద్ధంలో రాముడి సోదరుడు సౌమిత్రి మూర్భపోతాడు. వానరసేనలో ఓటమి భయం ప్రారంభమవుతుంది అప్పుడు విభీషణుడు అంటాడు- 'రామా! నీ కుడిభుజాన్ని కోల్పోయావు. నా కూతురు త్రిజట సహాయంతో సీతను వెంటనే నీవద్దకు రప్పించగలను. ఓటమి భయం నాకూ పట్టుకుంది. లంకారాజ్యం నాకు అవసరం లేదు. నీ శరణార్థిగా అయోధ్యలో జీవిస్తాను, వెళ్లిపోదామా

శ్రీరాముడు పలికిన వాక్యాలు మానవులందరూ తెలుసుకోదగినవి. 'విభీషణా! నేను సీత కోసం మాత్రమే రావణుడిపై గెలుపును కోరటంలేదు. మానవ సమాజంలో రావణుడిలాంటి రాక్షసులకు స్థానం లేదు. అతడి సంహారమే నా లక్ష్యం. ఆ లక్ష్యంలో విజయం సాధించడం కోసం నా సోదరుడి ప్రాణాన్నైనా పణంగా పెట్టగలను. ఓటములెన్ని ఎదురైనా ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే చెడుపై మంచికి తప్పక విజయం లభిస్తుంది


విజయం కోసం ఓటమిని ఎదుర్కొనక తప్పదు. ఓటమి గెలుపునకు స్ఫూర్తికావాలి కాని, భీరత్వానికి నాంది కాకూడదు. అప్పుడే జయం మనది!

ఎవరు రాసారో తెలియదు కానీ  అత్యద్భుతంగా ఉంది


ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన  - ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన -  అద్దం - రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు

ఆదర్శాలు రూపుకడితే రాముడు .

అందం పోగుపోస్తే రాముడు 

ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు

మంత్రమూర్తి రాముడు .

పరబ్రహ్మం రాముడు .

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?

అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన

పాట -

రామాలాలీ - మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం -

రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం 

సకల సుఖశాంతులకు - రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు - రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;

Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు - రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం

కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే -

శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే -

శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు

అది ఒక జీవన విధానం

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్.....

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది

జై శ్రీరామ్ 

శ్రీరామనవమి సందర్భంగా... 

    మీకు నా శుభాకాంక్షలు 🙏🏻

22/04, 8:46 pm] Sriram: నేను చెప్పే విషయం ఆధ్యాత్మికులు అర్థం చేసుకో గలుగుతారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను.

ఈ పూర్తి విశ్వం నాద మయం. సృష్టిలోని ప్రతీ వస్తువూ, జీవి ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే vibrating frequency కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz vibrating frequency దగ్గర మానలేదు. 

ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో covid పెద్ద ప్రమాదకారి కాదు. కేవలం కాస్త ఆనారోగ్యం కలిగించ గలదు అంతే. చాలా త్వరగా కోలుకుంటారు. 

అంటే ఇప్పుడు పెంచుకోవాల్సింది vibrating frequency. 

ముందు మనుషుల్లో vibrating frequency ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. 

భయం

ఫోబియా

అనుమానం

ఆందోళన

ఒత్తిడి

కోపం

ద్వేషం 

దురాశ

మోసం

బాధ

విపరీతమైన మోహం వంటివి మనలోని ప్రకంపనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

ప్రస్తుతం భూమండల సగటు vibrating frequency 27.4Hz. Hospitals, cellarls, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది.  లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది. 

భావోద్వేగాల frequency

మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీ తో vibrate అవుతాయో ఒక సారి చూద్దాం

బాధ - 0.01 Hz

భయం - 0.2 - 2.2

చికాకు -  0.9 - 6.8

చప్పుళ్ళు - 0.6 - 2.2 

గర్వం - 0.8 

దర్పం - 1.9

ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. వీటి వల్ల మనుషుల vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం. 

ఏదీ మంచిది?

ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం.

దయ - 95 Hz

కృతజ్ఞత -250

సహనుభుతి - 150

బేషరతు ప్రేమ - 250hz

So..... Comon let's vibrate higher. ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్య రష్మీలో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం high frequency లో vibrate కావచ్చు. 

సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, అంతెందు స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన vibrating frequency ని పెంచుకోవచ్చు. కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యం లో గడపడం ప్రార్థన చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీ ని పెంచుకోవచ్చు. 

ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుడాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టి తో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. మన vibrating frequency ని పెంచుకుందాం. 

(ఈ సమాచారం మొత్తం power vs force అనే పుస్తకం నుంచి సేకరించింది. ఇది డేవిడ్ హాకిన్స్ రాసిన doctoral thesis లోనిది. )

సైకాలజిస్ట్

[23/04, 7:25 am] +91 94404 88271: *⚛️నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ⚛️*

*పెళ్లి వయస్సు దాటిపోతున్నా పెళ్లి కావట్లేదా… అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి.*

అన్ని అనుకూలంగా ఉన్నా, 

మంచి ఉద్యోగం చేస్తున్నా, 

మంచి కుటుంబం ఉన్నప్పటికి, 

మంచి ఆస్తిపరుడైనప్పటికి..

కొందరు అబ్బాయిలకు.. అమ్మాయిలకు  పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం ఇవ్వవు. 

పెళ్లి ఏర్పాట్లలో ఏదో ఒక లోపం తలెత్తి పెళ్లి క్యాన్సల్‌ అవ్వడం జరుగుతుంది.

పెళ్లి జరుగుతుందని భావిస్తున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల ఆ పెళ్లి చెడిపోవడం లేదా మరేదైనా కారణం వల్ల పెళ్లి పీటల వద్దకు రాకుండానే ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి వారికి కొన్ని దోషాలు ఉంటాయి.

ఆ దోషాల కారణంగానే పెళ్లి జరగకుండా ఏదో శక్తి అడ్డు పడుతూ ఉంటుంది. అలాంటి దుష్ట శక్తిని తొలగించుకుని పెళ్లి చేసుకోవాలి 

అంటే తమిళనాడులోని తిరుమణ తిరుతల సుట్రుల్లా దేవాలయాన్ని సందర్శించాలి. 

అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఆ గుడిని సందర్శించి అక్కడ దైవారాధన చేయడం వల్ల వెంటనే పెళ్లి అవుతుందని నమ్మకం.

తమిళనాడులో ఎక్కువ శాతం ప్రజలు దీన్ని నమ్ముతున్నారు. 

తమిళనాడు నుండే కాకుండా కర్ణాటక మరియు కేరళ నుండి కూడా ఆ గుడికి వెళ్తారు. 

ఏపీలో కూడా కొందరు ఆ గుడికి వెళ్లడం వల్ల తమ పెళ్లి అయ్యిందని చెబుతున్నారు. 

ఆ గుడి మహత్తు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహాబలిపురం దగ్గర లో తిరువిడనత్తై వద్ద ఉన్న శ్రీ లక్ష్మి వరాహస్వామి ఆలయము ఉంది . ఈ ఆలయము లో లక్ష్మి దేవిని కోమలవల్లీ తాయారు గా మరియు విష్ణువును వరాహ అవతారం లో పూజిస్తారు. విష్ణువు సన్యాసికి పుట్టిన 360 మంది సంతానాన్ని పెళ్లి చేసుకున్నాడు కనుక, ఈ స్వామీని భక్తులు ‘నిత్య కళ్యాణ పెరుమాళ్’ గా వ్యవహరిస్తారు. తిరుమనం అంటే వివాహం, చేరి అంటే గ్రామం అని అర్ధం. 

పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. 

తిరుమనంచేరిని సందర్శించటం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయని చెప్తారు.

కుంభకోణం నుండి 7 కి.మీ ల దూరంలో ఉప్పిలి అప్పన్ ఆలయం కలదు. 

ఉప్పిలి అప్పన్ అంటే ఉపమానాలకు అందనివాడు అనుపమానుడు అని అర్ధం . 

ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలిక గా లభించింది. 

ఆమె ” కోకిలాంబాళ్ ” పేరుతో పెంచి పెద్దచేసి,

శ్రీ మహావిష్ణువు కిచ్చి వివాహము జరిపించాడని ప్రతితీ. ఆలయంలో ఉప్పులేకుండా నైవేద్యం పెడతారు.

తిరుకరుకావూర్ ఆలయము తంజావూర్ కు మరియు కుంభకోణం పట్టణాలకు 20 km ల దూరంలో కలదు. 

ఇది ఒక ప్రసిద్ద శివాలయ క్షేత్రము . ఇక్కడ అమ్మవారు గర్భరక్షాంబిగై . ఈ అమ్మవారి ని పెళ్లికాని వారు, సంతానము లేని దంపతులు .. భక్తీ శ్రద్దలతో పూజించి దర్శనము చేసుకుంటారు.

శ్రీ దేవి భూదేవి సమేత శ్రీమహా విష్ణువు ” సారనాథుడుగా ” కొలువై ఉన్నాడు. 

ఇక్కడి అమ్మవారికి ‘సారనాయకి’ అనే పేరు ఉంది. కావేరినది దేవి శ్రీహరిని ఇక్కడ వివాహము ఆడింది ఇక్కడేనని స్థలపురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలయము దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గొప్ప పుణ్య క్షేత్రము . 

పాండ్యరాజు తన కుమార్తె అయిన మీనాక్షి దేవిని చొక్కనాథుడు అయిన పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసిన స్థలము గా ప్రసిద్ది చెందినది . పెళ్ళికాని వారు మధుర మీనాక్షిదేవిని దర్శించుకోవడము అనాదిగా వస్తున్న ఆచారము.

పెళ్లి కానీ వారు ఈ దేవాలయంలో పూజలు చేయడం అనేది ఇప్పటి ఆచారం కాదు.. కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. పెద్దలు నమ్మిన ఈ ఆలయాన్ని ఇప్పటికీ అక్కడి వారు నమ్ముతున్నారు. 

ఎన్నో పెళ్లిళ్లు ఈ దేవాలయం లో దర్శనం తర్వాత అయ్యాయి అని అక్కడ వారు అంటుంటారు.

*⚛️నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ:*

వివాహం ఆలస్యమవుతున్న వారు, వివాహ విషయాల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ క్షేత్ర దర్శనం తో వివాహం జరుగుతుంది 

*⚛️ఈ క్షేత్రాన్ని దర్శించి క్రింది విధంగా చేయాలి.*

కోమలవల్లి సమేత వరాహ స్వామీ వారు కొలువైన క్షేత్రం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్. 

1. వివాహం కోసం ఇక్కడకు వచ్చే భక్తులు రెండు పూల మాలలు ఆలయం లో దేవుడికి సమర్పించాలి. (పూల మాలలు గుడి ఎదురుగా ఉన్న దుకాణాల్లో లభిస్తాయి)

2. గోత్ర నామాలతో అర్చన చేసిన పిదప  అందులో ఒక మాల ను పూజారి గారు తిరిగి భక్తుడి మెడలో వేస్తారు. 

3. ఆ మాల ధరించిన భక్తుడు గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి కోమలవల్లి అమ్మవారిని దర్శించి కుంకుమను తీసుకోవాలి. 

అలా చేసిన 3 నుంచి 6 నెలల్లో వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం అయిన తదుపరి దంపతులిద్దరూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

*⚛️దర్శన వేళలు*

ఉదయం6.00 నుంచి మధ్యాహ్నాం 12.00 వరకు 

సాయంత్రం 3.00 నుండి రాత్రి 8.00 వరకు.

*⚛️ఎలా చేరుకోవాలి*

చెన్నై నుంచి 45 kms 

మహాబలిపురం వెళ్లే బస్సులన్ని ఈ క్షేత్రం మీదుగానే వెళ్తాయి 


*⚛️చిరునామా*

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్, 

తిరువిడెంతై ( THIRUVIDANTHAI)

కాంచీపురం dist తమిళనాడు.

[23/04, 10:25 am] +91 99850 01339: *కామదా ఏకాదశి*

*చైత్ర మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి* అంటారు . 

ఇది సమస్త పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి. మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు.

స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా, దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు, వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా *'కామదా ఏకాదశి వ్రతం'* కనిపిస్తుంది.

చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే 'కామదా ఏకాదశి'అని, *'దమన ఏకాదశి'* అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.  

వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం, విశిష్టతను వివరించాడు .

వశిష్ట మహాముని దిలీప్ రాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు.

పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పున్దరికుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వాలు, కిన్నెరలు, అప్సరసలు రాజ్య సభలో పాటలు,నాట్యాలు చేసిన రాజునూ సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గందర్వులు ఆయిన లలిత అనే గంధర్వుడు, తన బార్య లలిత తో చాల అనోన్యంగా ,ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమం లో ఉన్నప్పుడు గంధర్వుడి సతిమని సభలో లేకపోయేసరికి తన అలోచోనలోపడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్హిచిపోయి  తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు వారు గంధర్వుడిని ఆగ్రహించిని అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తేనే బయపడే ఆకారం లో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి బార్య లలిత ఎంతో బాదపడి, దుఖంతో భర్తను తీసుకోని అడవులోకి ప్రయాణమైంది . 

అలా వింధ్యచల అడువుల్లో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది . 

అక్కడికి వెళ్ళిన లలిత, శ్రింగి మహర్షి తో తన కథ అంత చెప్పి, తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమనగా అప్పుడు శ్రింగి మహర్షి *కామాద ఏకాదశి* మహత్యాన్ని వివరించాడు అంతట గంధర్వుడి బార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో అచరించి, ఉపవాసం ఉండి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ స్వామి నేను బక్తి శ్రద్దలతో వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విదంగా ఆయన కాపాడాలి అని మనసులో తలచుకోని, అక్కడే ఉన్న బర్త వైపు చూడగా, వింత ఆకారంలో చూస్తే బయపడే ఆకారం లో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు.

మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుందని పురాణాలూ చెబుతున్నాయి .

******

యుద్ధము ప్రొద్దుటూరులో

Sunday, 19 March 2023

*


*

 నమస్కారం.




ఒకసారి ఓ వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పండితునకు తెలుసు.., తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని.. శివకేశవ అభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని..

ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు.. ఆ వ్యక్తి చదివి నివ్వెర పోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది..

గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజిత పాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

చదవగానే ఆశ్చర్యపోయాడు... ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి..

గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం.. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పర్వత పుత్రిక.., అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడూ..
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆది మధ్యాన్త రహితుడు అయినవాడూ, అటువంటి పరమేశ్వరః నః పాయాత్ ....
వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింపబడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం..

మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే..!" అని చెప్పి అతనికి ఆ శ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు.

 " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోనలేదు.

 న+ఆది.., అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నాను అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."

గవీశపాత్రః ... లో గ తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,

గరుడుని చేత గౌరవింప బడువాడు, ... అంటే గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము చేసినవాడు విష్ణువు..

కుమార తాతః .... 'కు' తీసివేస్తే మార తాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)

శశిఖండ మౌళి: ... 'శ' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలి పింఛము ధరించినవాడు.. కృష్ణుడు., అనగా విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: .. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .

క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు.. విష్ణువు.

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. .

ఇక 'ప' తీసివేస్తే రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా..! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

అడిగినతడు సిగ్గుతో తలవంచుకొన్నాడు..

గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రసాయనాది ఏ శాస్త్రమున కైనా మహనీయులు వ్రాసిన రామాయణ, భారత, భాగవత, రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము.

 ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆ భాషకు అనుంగు బిడ్డ అయిన తెలుగు నేర్పించండి....

ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది... 


 అత్యంత విలువైన సమాచారం ..

కస్తూరీ మృగం అంటే ఒక రకమైన జింక, సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది, అది మంచి మదపువాసనగా ఉంటుంది, అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా ..? అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది, ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నది అని అది గ్రహించలేదు, ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది, ప్రాణాలు కోల్పోతుంది ...

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలనీ, తీర్ధయాత్రలనీ, అనవసరంగా తిరిగి కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు ..

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ శ్రీకృష్ణుణ్ణి కూడా తమతో తోడుగా రమ్మని పిలుస్తారు ..

ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెబుతాడు, వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు, అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి, వారికి వడ్డింపచేస్తాడు శ్రీకృష్ణుడు, ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది ..

ఇది చేదు దోసకాయ ..  కటికవిషంలాగా ఉంది ..
ఇలాంటి వంటకం చేయించావేమిటి ..? అని/పాండవులు అడుగుతారు, శ్రీకృష్ణుడు నవ్వి, ఎన్ని గంగలలో మునిగినా, ఈ దోసకాయ చేదు పోలేదు,  ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని శ్రీకృష్ణుడు, ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం ..

మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలకు జరగాలి, యాత్ర అనేది బయట కాదు, అంతరికంగా యాత్రను మనిషి చెయ్యాలి, ఈ ప్రపంచమంతా మనిషి తిరిగినా, తనలో మార్పు రాని పక్షంలో, ఏమీ సాధించలేడు, అదే తనలోనికి, తాను ప్రయాణం చేస్తే, ఉన్న గదిలో నుంచి కదలకుండా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు, మహర్షులు, మునులు ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందారు, కేవలం గ్రంథాలను,  ఇంట్లో పెట్టుకోవడం వలన లాభం శూన్యం, చదవి తర్వాత, ఆచరణలో తీసుకుని వస్తే శుభం కలుగుతుంది ..

............
 అహం - భావం

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.... ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు.
ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.
ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి.
ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి... ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను.
కాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను, మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంచుతాను...
అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది.
నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు ... ' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది..., శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.
దేవత వెతుకుతూ వస్తోంది, ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి...
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు , శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది,  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేక పోయింది.
ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వేల్లిపోవలనుకొని  వెనుతిరిగింది.
శిల్పి ఆనందనాకి అవధులు లేవు, తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు...
 ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! అంది.

'' అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది, తన కెరీర్ లో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు, అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు.
వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' ఏది ? ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది, ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , " నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని, కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే, నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు !  ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది, అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది."

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.
అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది.
నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము.
స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.
'' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు...

          🔥శుభమస్తు🔥
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
[08:40, 17/08/2021] Mallapragada Sridevi: 🌹🌺🌿🌿💐🌴🪴🍀✍️

భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అంటారు. ఈ గ్రంథం శ్రీరాముని చరిత్రను చెబుతున్నది కనుక రామాయణం అనీ, సీత చరిత్రను వర్ణిస్తుంది కనుక సీతాయాశ్చరితమని, రావణుని వధ గురించి చెబుతున్నది కనుక పౌలస్త్యవధ అనీ పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ, మానవ, వానర, రాక్షస పాత్రలు ఉన్నాయి. వాటిలోని స్త్రీ పాత్రలకు సంబంధించిన వివరాలు:

అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.

అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.

అరుంధతి- వశిష్ట మహర్షి భార్య.

అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.

ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె తపస్సాధనలో ఉన్నది.

కైకసి- రావణుడు, కుంభకర్ణు, విభీషణుల తల్లి.

కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.

కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.

ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

జంఝాట

*తాటకి *- మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.

తార - వాలి భార్య. అంగదుని తల్లి.

*త్రిజట *- రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.

ధాన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.

అనల- విభీషణుని కుమార్తె.

మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, తల్లి.

మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.

మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.

రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.

లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .

వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.

*శబరి *- రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.

శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.

శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.

*శ్రుతకీర్తి *- కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.

సరమ- విభీషణుని భార్య.

సింహిక- హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

సునయన - జనక మహారాజు భార్య.

*సుమిత్ర *- దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.

సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.

సులోచన - ఇంద్రజిత్తు భార్య

*సీత *- జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.
🌹🌺🏵️🌿💐🌴🪴🍀✍️
[08:43, 17/08/2021] Mallapragada Sridevi: అగరుబత్తి (పరిమళం)

     కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు..
 
  అది చూసిన తల్లి ముఖం చీదరించుకుని.., మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మహా పిసినారి.. అంటూ లోపలికి వెళ్లి మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది.. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది.

     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది..
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది..
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది.. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.. ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది..

    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది..

      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను..

     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు..
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావ్ కదా..
కాదు.. కాదు..

     మీ అమ్మ, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో.. నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..

    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక..

     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం.. నిజంగా మేము ధన్యులం... 🙏

                  _శ్రీనివాసరావు ఊట్కూరు
   
         🙏సర్వేజనాః సుఖినోభవంతుః🙏
[08:52, 17/08/2021] Mallapragada Sridevi: క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మనదేశంలో ఇన్నివిధాలుగా దేవుని తార్కాణాలు లభించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది

సేకరణ:-

శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్‌కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.

శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.

అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్‌సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.

కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.

........


గానం-పానం

‘నేను భాగవతాన్ని వింటున్నాను/చదువుతున్నాను’ అని ఎప్పుడూ అనుకోకూడదంటారు. మరేమనాలని అడిగేవారికి ‘పిబత భాగవతం’ (భాగవతాన్ని తాగండి) అనాలని చెబుతారు భాగవతులు. చెవులతో వినేదాన్ని తాగడం ఎలా కుదురుతుంది?

కుదురుతుంది. అలా అనడంలో లోతైన అంతరార్థం ఉంది.

ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం. ‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి. (భక్తులు, భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి) దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట. భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా(పా)నం చెయ్యవచ్చు.

‘తెలుగు భాషకు ముగ్గురు మకుటంలేని మహారాజులు ఉన్నారు. వారు వరసగా- త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. కానీ వీరు ముగ్గురూ భగవంతుణ్ని సేవించి, ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి (తాగి), ఆ రుచి మరిగి ‘ఈ రాచరికం వల్ల ఏమీ సుఖంలేదు. కాబట్టి మాకు వద్దు’ అని విడిచిపెట్టేశారు.

ఆ పరంపరలో ఒక రాజు దాసుడయ్యాడు. అతడే రామదాసుగా మారిన గోపరాజు. ఆయన తన కీర్తనల్లో ‘రామజోగి మందు కొనరే...’ అనే కీర్తనలో ‘శ్రీరామ దివ్య నామస్మరణ అనే పానం చెయ్యండి’ అన్నాడు. మరోచోట ‘తారక నామమనే రసాన్ని పానం చేసేవారికి అమృతాన్ని తాగే అవసరం లేదు’ అన్నాడు.

మరో రాజు అయ్య (తండ్రి)గా మారి త్యాగయ్య అయ్యారు. ఆయనా తన కీర్తనల్లో చాలాచోట్ల ‘దైవ నామ పానం చెయ్యండి’ అని ప్రయోగించారు.

పోతరాజు ‘పోతన్న’ పేరుతో అందరికీ అన్న అయ్యారు. ఆయన తన భాగవత అనువాదంలో అనేకచోట్ల నామపానం అనే ప్రయోగం చేశారు. ప్రహ్లాదుడి గురించి చెబుతూ, నారాయణుడి పాదపద్మాల గురించి ఆలోచించడమనే అమృత పానం చేసేవాడు- అని ప్రయోగించారు. ‘మందార మకరంద...’ అనే పద్యంలో విష్ణు పాదాల గురించి ఆలోచనలనే అమృతాన్ని గ్రోలేవాడు అని ప్రయోగించారు.

ఇలా ఆ ముగ్గురూ పరమేశ్వరుడి పాదాల దగ్గర దాస్యాన్నే అభిలషించారు. భక్తి అనే రసం పంచారు. భక్తి సామ్రాజ్యాలను ఏలారు.

సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు. ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.వేదాలనే కల్పవృక్షాల శాఖల చిట్టచివర పండిన పళ్లు ఉపనిషత్తులు. అవి జ్ఞాన రసాత్మకమైనవి. దాన్ని చిలక కొరికింది. పండు బాగా పక్వానికొచ్చినప్పుడే చిలక కొరికి రుచి చూస్తుంది. చిలక రుచి చూసిన పండ్లను ఎంగిలిగా భావించరు. ఇక్కడ చిలక ఎవరు? శుకబ్రహ్మ. శుకుడు తన నోటిద్వారా ప్రవచనం చేశారు. అదే భాగవతం. దేనిమీదా ఆపేక్ష లేని మహాపురుషుడు శుకుడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది కాబట్టి భాగవతం ఎంగిలికాని, మధురమైన పానద్రవ్యం అయింది. అందుకని ఆ భాగవతాన్ని రెండో ఆలోచన లేకుండా తాగెయ్యవచ్చు అంటారు.

నాలుక లాగానే చెవి, కన్ను లాంటి ఇంద్రియాలు సైతం రుచిని ఆస్వాదించగలుగుతాయి. భగవన్నామం అన్నా, విన్నా, కన్నా మధురమే కదా! అంత గొప్పదైన రసాన్ని, అమృతసమమైనదాన్ని గానం చేస్తుంటే, ఆ గానం ఏ అడ్డంకీ లేని పానం కావాలి. కాబట్టి భాగవతాన్ని వినడం అనేకన్నా పానం చెయ్యడం అనడమే అన్నిందాలా సబబు.

- అయ్యగారి శ్రీనివాసరావు

.........

శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు. జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

........

సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే..

సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు. అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మాత్రమే! ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత సంస్కార విశేషం. ఆధ్యాత్మికత జీవితంలోని అన్ని పార్శాలను అలుముకొని

ప్రభావితం చేసే సంస్కారం. అందుకు ప్రధాన మార్గం శ్రవణం, మననం, నిధి ధ్యాసనం. శాస్ర్తాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేస్తున్న దానిలోని విషయాన్ని శాస్త్రీయంగా గ్రహించడం, ఆధ్యాత్మిక బోధలు వినడం.. శ్రవణం. ఈ విధంగా గ్రహించిన విషయాన్ని తరచి తరచి చూచి స్పష్టత ఏర్పర్చుకోవడం మననం. ఆ స్పష్టమైన అవగాహనను హృదయంలో స్థిరపరచుకొని, ఆచరణలోకి అనువదించడం నిధి ధ్యాసనం. ఈ ప్రధాన మార్గానికి పైన పేర్కొన్న ఉపకరణాలు ప్రబల సహాయకారులుగా నిలుస్తాయి.

అవగాహనలో, అనుభూతిలో అనన్యత, అన్యోన్యత, ఆత్మీయత అనంతంగా విస్తరించడమే ఆధ్యాత్మికత. అదే సాధకుడి మార్గాన్ని అనుభవింపజేసే విస్తరణం. అంతిమంగా పొందేది అమృతత్వం. ‘మృత్యోర్మా అమృతం గమయ’ అంటే ఇదే ప్రస్థానం. పరిమితిలో కూరుకుపోయిన అహంకారం రకరకాల ఆధిక్యతా ఆకాంక్షలుగా వ్యక్తమవుతుంది. అది ఇతరులను తొక్కివేయాలన్న భావన

కలిగించవచ్చు. మాయమాటలతో ఆధ్యాత్మిక వేదికను ధనార్జనకు భూమికగా మార్చుకునే ప్రయత్నమూ జరగవచ్చు. అయితే, ఆధిక్యత సాధించాలన్న అభిలాష, ఆశయం తప్పు కాదు. అది లోక క్షేమానికి దారితీయాలి. ఆ మార్గంలో ఉన్న వ్యక్తులు వివేకంతో మసలుకోవాలి. తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు ధారపోయాలి. ఇలాంటి భావనను విస్తారంగా వినియోగంలోకి

తేవాలన్న ఆధిక్యతాభిలాష ఎప్పుడూ మంచిదే. అదే సాత్వికాధిక్యత. అయితే, పరుల విశిష్టతను, ఉన్నతిని ఓర్వలేక ప్రదర్శించే ఆధిక్యత సరైనది కాదు. ఇలాంటి తామసాధిక్యత సమాజంలో భేదాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సంస్కృతిని దెబ్బతీస్తుంది.

సారభూతంగా నిస్వార్థత, ప్రేమను పెంచడమే నిజమైన ఆధ్యాత్మికత. అటువంటి విధానం వ్యక్తిలో, సమాజంలో, దేశంలో పరివ్యాప్తమై పరిఢవిల్లాలి. అయితే అనేక వికృతులు విస్తరిస్తున్న ఈ కాలంలో ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ, ఈ మార్గంలో మాత్రమే మానవాళి భవిష్యత్తు క్షేమంగా ఉండగలుగుతుంది. ఇందుకు విరుద్ధమైన విధానం వినాశనాన్ని ఆహ్వానిస్తుందన్నది కూడా

తథ్యం. ప్రస్తుత వినియోగవాద ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచిపోషించేవి వ్యవస్థలు కాదు. నిష్పక్షపాత దార్శనికత, ధైర్యం కలిగిన బుద్ధిజీవులుగా, మేధావులైన శిష్టజనులు మాత్రమే ఈ పనిని సాకారం చేయగలరు. సమాజంలో వీరి సంఖ్య పరిమితమే కావచ్చు. కానీ, వీరంతా ఒక బలమైన వేదికగా ఏర్పడి, సాఫల్య వైఫల్యాలపై దృష్టిపెట్టక ధర్మనిష్ఠతో

ముందుకుసాగాలి. నిరంతరం ప్రజలకు మార్గదర్శనం చేస్తుండాలి

శ్రేష్ఠజనుల ఉద్ఘోష , అచంచల ఆచరణే మానవాళికి ప్రేరణ. ఆర్ష వైదిక దర్శనం, ధర్మం, వాఙ్మయం, సంస్కృతి ఈ దిశలోనే సంప్రదాయాన్ని నిర్మించింది. స్వేచ్ఛ పేరుతో అన్ని రంగాలలో స్వార్థం, సంకుచితత్వం పెరుగుతున్న ఆధునిక సమాజంలో ఆర్షవైదిక స్ఫూర్తిని విస్ఫారింపజేయడం అత్యావశ్యకం. సంస్కారకాంతులను అన్ని దిశల నుంచి గ్రహిస్తూ తాము వికసిస్తూ, సమాజాన్నిమేల్కొలిపే శిష్టజనుల పాత్ర ఆధ్యాత్మిక శ్రేయస్సుకు శ్రీరామ రక్ష.

........

ధర్మరాజు, ఆయన తమ్ముళ్లు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్లను చూడటానికి లోమశ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత లోమశుడు, ‘ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది’ అని సలహా ఇచ్చాడు.

లోమశుడి మాట ప్రకారం కొన్నాళ్లకు పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్లారు. అలా వెళ్లినప్పుడు వాళ్లకు గంగానది ఒడ్డున రైభ్య మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే భరద్వాజుని ఆశ్రమం ఉంది. భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. నదీ తీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పర్చుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు పరావసు, అర్వావసు. వాళ్లిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరు పొందారు. భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. అతనికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు. పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు.

పరావసు, అర్వావసుల కన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుణ్ని గురించి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్లంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూ లోకానికి వచ్చి, ‘ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఎవరూ చదువని వేద విద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ని కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువు గారి దగ్గరికి పోవటం, ఆశ్రమవాసం చేయడం, కొన్నాళ్లు ఆయనకు సేవ చేయటం నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాల మీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి’ అని యవక్రీతుడు వేడుకున్నాడు. అది విని ఇంద్రుడు నవ్వాడు. ‘పిచ్చివాడా! నీ తెలివి అపమార్గం పట్టింది. తక్షణమే వెళ్లి గురువును ఆశ్రయించు. ఆయన దగ్గర శుశ్రూష చేసి వేద విద్యలన్నీ నేర్చుకో. గురువు వద్ద నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు’ అని హితవు పలికాడు.

కానీ, యవక్రీతుడుకి ఇంద్రుడి మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సుకు పూనుకున్నాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి, ‘నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్లి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్లు కాల్చుకోవటం మానుకో’ అని చెప్పాడు. యవక్రీతుడికి కోపం వచ్చి, ‘నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను’ అన్నాడు.

అలా ఉండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. అక్కడ ఓ వృద్ధుడు నది ఒడ్డున కూర్చుని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు ‘ఏం చేస్తున్నావు. తాతా?’ అని అడిగాడు. ‘గంగానది దాటడానికి వంతెన కడుతున్నా’ అన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాటలకు యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. ‘వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్టవేయడం కుదరని పని. వేరే మార్గం చూడు’ అని సలహా ఇచ్చాడు. ‘గురువు లేకుండానే, అసలు చదువకుండానే, కష్ట పడకుండానే విద్య రావాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో! అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా’ అని వృద్ధుడు బదులు చెప్పాడు.

ఆయన ఎవరో యవక్రీతుడికి అప్పుడు అర్థమైంది! వెంటనే కాళ్లమీద పడ్డాడు. ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుడిని దగ్గరకు తీసుకుని, ‘నీ తండ్రి దగ్గర వేద విద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు’ అని ఆశీర్వదించాడు.

......

ఒకనాడు శ్రీకృష్ణుడు... 

పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట!! అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు!!

కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది నాకిస్తావా, అని అడిగాడు. 

వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా..

అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు*

కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు, కుడిచేత్తో యీయరాదా, అన్నాడు. 

అందుకు కర్ణుడు

క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:

అర్థము:—

కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు.

లక్ష్మి చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను.అన్నాడు.

అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు

సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు*

అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా

దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ

అర్థము:- కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు. 

దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.

దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవ దర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.

దానం చేసి నేను చేశాననే అహం కూడదు.

మానవునకు రోగం కలిగించేది- పాపం!

మానవునకు భోగం కలిగించేది- పుణ్యం!

మానవుని భవిష్యత్తు నిర్ణయించేది- కర్మ!

మానవునకు లాభం కలిగించేది- సేవ!

మానవునకు సంపాదన నిలిపేది- పొదుపు!

మానవుని విలువ పెంచేది – దానం!

మానవునకు నష్టం కలిగించేది – హింస!

మానవునకు అశాంతి కలిగించేది- ఆశ!

మానవునకు శాంతి కలిగించేది- తృప్తి!

మానవునకు దుఃఖం కలిగించేది- ‘కామం!

మానవుని పతనం చేసేది – అహంకారం !

మానవునకు అందరిని దగ్గర చేసేది- ప్రేమ !

మానవునకు అందరినీ దూరం చేసేది- అసూయ !

మానవుని స్థితిని సూచించేది-గుణం !

మానవుని దైవంగా మార్చేది- దయ !

మానవుని ఆత్మస్థితి తెలిపేది- వాక్కు !

మానవునకు విజయం చేకూర్చేది- ధర్మం !

మానవుని గొప్పవాడిగా చేసేది- జ్ఞానం !

మానవునకు- ముక్తి’ని ఇచ్చేది- సత్యం !

మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది-

జపం / ధ్యానం !..

. అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి. 

కాబట్టి నిత్యం జప ధ్యానాల్లో సమయాన్ని వెచ్చిస్తూ, దైవ చింతనలో మనస్సును లగ్నం చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి,

అలాగే ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి.

ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం “సత్పాత్ర” దానం చేయడం అలవరుచుకోవాలి


హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే🙏

[10/11, 10:07 am] . Mallapragada: తల్లికి కపిలుడి తత్త్వ బోధ!!


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.

”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో.

కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి ”నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.

”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.

”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి ”అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా.

నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. కపిలుడు మందహాసం చేసి ”అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.

”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉంచి ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.

అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.

”మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.

”ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషిడిగా’ తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.

”ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.

”ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”

కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.

దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. ”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.

కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.

    ( సేకరణ : విష్ణు పురాణము నుండి)

మహాదేవ 🙏

[10/11, 5:49 pm] . Mallapragada: *వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం* 

—————————————-

 *అ* - *అ* రుదైన అమ్మాయి

 *ఆ* - *ఆ* కతాయి అబ్బాయి

 *ఇ* - *ఇ* ద్దరికి

 *ఈ* - *ఈ* డు జోడి కుదిరి

 *ఉ* - *ఉం* గరాలను తొడిగి

 *ఊ* - *ఊ* రంతా ఊరేగించారు

 *ఋ* - *ఋ* ణాల కోసం 

 *ఎ* - *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే

 *ఏ* - *ఏ* నుగు లాంటి కుభేరుడితో అడిగి

 *ఐ* - *ఐ* శ్వర్యం అనే కట్నం ఇచ్చి

 *ఒ* - *ఒ* కరికి ఒకరు వియ్యంకులవారు

 *ఓ* - *ఓ* ర్పుతో ఒప్పందం చేసుకొని

 *ఔ* - *ఔ* దార్యాని ఇరు కుటుంబాలకు

 *అం* - *అం* దించాలని కోరుకుంటూ

 *అ* : - *అ:* అంటూ

 *క* - *క* లపతో తయారయిన పత్రికలపై 

కలంతో రాసిచ్చి

 *ఖ* - *ఖ* డ్గాలతో నరికిన పందిరి ఆకులను

 *గ* - *గ* డప ముందుకు తీసుకొచ్చి

 *ఘ* - *ఘ* నమైన ఏర్పాట్లు చేయించి

 *చ* - *చా* పుల (బట్టలు)నింటిని కొని

 *ఛ* - *ఛ* త్రం (గొడుగు) పట్టి గండదీపాని

 *జ* - *జ* రిపిస్తూ

 *ఝ* - *ఝా* ము రాత్రి దాక

 *ట* - *ట* పాకాయలను కాలుస్తూ

 *ఠ* - *ఠీ* విగా (వైభవంగా)

 *డ* - *డ* ప్పులతో

 *ఢ* - *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది

 *ణ* - కంక *ణా* లు చేతికి కట్టుకొని

 *త* - *త* ట్టలో తమలపాకులు పట్టుకొని

 *థ* - *థ* మన్ (మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో

 *ద* - *ద* గ్గరి బంధువులను పిలిచి

 *ధ* - *ధ* నవంతులను కూడా పిలిచి

 *న* - *న* అనే నలుగురిని పిలిచి

 *ప* - *పది* మందిని పలకరిస్తూ

 *ఫ* - *ఫం* క్షన్ కి రావాలని చెప్తూ

 *బ* - *బ* లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి

 *భ* - *భ* టువులని (ఆభరణాలు) కొని

 *మ* - *మం* గళ స్నానాలు చేయించి, రాజసూయ

 *య* - *యా* గం లాంటి పెళ్లి కి 

 *ర* - *రా* రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి

 *ల* - *ల* క్షణమైన 

 *వ* - *వ* ధూవరులను మీరు

 *శ* - *శ* తమానం భవతి అని

 *ష* - *ష* రతులు లేకుండా ఆశీర్వదించడానికి

 *స* - *స* ప్తపది (పెళ్లి) వేడుకలో

 *హ* - *హం* గు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో

 *ళ* - క *ళ* త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని

 *క్ష* - *క్ష* త్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి

 *ఱ* - *ఱా* రండి.........

🙏🏻🙏🏻🙏🏻

Saturday, 18 March 2023

10 నుంచి 18 స్టోరీస్ 9 కధలు

 


జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి  జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది.

మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే.

ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు.

ఇదే  కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు!

శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు.

శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు.

   కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో  వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం  కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ  మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ  తట్టినా  చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..!

ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి. 

ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు.

    చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి.

    జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు.

జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది.

   జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్‌ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది.

 మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి.

****

*ధర్మసూక్ష్మం*

ధర్మం తల్లిలాంటిదంటారు. అది చక్కగా కర్తవ్యం చెబుతుంది. భగవంతుడు మహర్షుల ద్వారా ధర్మసూత్రాలను మానవాళికి అందించాడు.

యుగధర్మాలను కూడా పరమాత్మే నిర్ణయించాడంటారు. నాలుగు యుగాలకు నాలుగు ధర్మాలున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఈ నాలుగు ధర్మాలకు ప్రతీకలుగా నాలుగు శ్వేతాశ్వాలను పూన్చిన రథానికి సారథిగా సమరాన్ని శాసించాడు. యుద్ధకాండ అంతా శ్రీకృష్ణుడి కనుసన్నల్లో, ఆయన సంకల్పానుసారమే జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

సాక్షాత్ నారాయణుడు నడిపిస్తున్నా, నరుడైన అర్జునుడు వివిధ సందర్భాల్లో వివశుడు, విచలితుడిగా కర్తవ్యనిష్ఠలో తడబడటం మనం గమనించవచ్చు. ఇది మానవ సహజమైన బలహీనత. ఎంతటి భక్తులైనా తీవ్రమైన పరీక్షలను తట్టుకోలేరు. భక్తరామదాసు భక్తి పరీక్షలోని పతాక స్థితిలో శ్రీరాముణ్ని తన బాధలో పలు విధాల నిందిస్తాడు. కానీ, అదే స్థితిలో ప్రహ్లాదుడుప్రాణాపాయంలోనూ నిబ్బరంగా నిలబడ్డాడు. జీవితంలోని అన్ని పరీక్షల కంటే, భక్త పరీక్ష కఠినాతికఠినమైనది. లోకంలో ధర్మాలను మతాలుగా చెప్పుకొంటారు. అది మనుషుల నిర్వచనం. భగవంతుడు ఏ మతానికీ ఏ కులానికి చెందనివాడు. అన్నింటికీ అతీతమైనవాడు.

ధర్మాలు తెలిసినవారు కూడా ధర్మ సూక్ష్మాలను గ్రహించలేరు. పరమాత్మ చెప్పగలడు. ఆయన అనుగ్రహం గలవారు చెప్పగలరు. అలాంటివారు దైవసమానులైన అష్టావక్రుడు, శుకుడు లాంటి మహర్షులు. మహాభారతంలో ధర్మసూక్ష్మానికి సంబంధించి రుక్మిణీ శ్రీకృష్ణుల సంవాదం గురించి తెలుసుకుందాం. యుద్ధం ముగిసింది.

మహాయోధులెందరో మరణించారు. వారి మరణాల గురించి రుక్మిణికి కొన్ని సందేహాలు కలిగాయి. పరమాత్ముణ్ని ఇలా ప్రశ్నించింది. 'దేవా! గురు ద్రోణ, భీష్మపితామహుల వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు. వారి సంహారంలో మీరెందుకు పాలుపంచుకున్నారు... ఇది అధర్మం కదా?'

‘రుక్మిణీ! నీవు చెప్పిన మహనీయులు నిజంగా గొప్పవారే. పూజ్యులు, పుణ్యమూర్తులే. కానీ, నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో తమకు అధికారం, శక్తి ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అది మహాపరాధం. దానివల్ల ఆ క్షణంలోనే వారి పుణ్యం నశించిపోయింది. వారి పూజ్యత శూన్యమైపోయింది. అందుకే వారికి మరణదండన లభించింది' అన్నాడు. శ్రీకృష్ణుడు.

'మరి లోకోత్తరమైన దానగుణం గల కర్ణుడి విషయం ఏమిటి? అర్ధించిన వారికి లేదనకుండా చివరకు తన కవచకుండలాలనే చీల్చి ఇచ్చేశాడే! అతడినెందుకు సంహరించారు? '

'దేవీ! కర్ణుడి గురించి నీవు చెప్పింది అక్షరసత్యం. కానీ, మరణ వేదన పడుతున్న అభిమన్యుడు ఆర్తితో దోసెడు నీరు ఇచ్చి దాహం తీర్చమని కోరితే, పక్కనే నీటిచెలమ ఉన్నా, దుర్యోధనుడు అపార్థం చేసుకుంటాడేమోననే సంశయంతో కర్ణుడు ఇవ్వలేదు. అతడి జీవితకాల దానపుణ్యం ఆ క్షణమే లుప్తమైపోయింది. కడకు అతడిరథచక్రం అదే నీటి చెలమలో కూరుకుపోయి

ప్రాణాంతకమైంది. ధర్మాలు కేవలం పాటిస్తే చాలదు.

వాటిలోని సూక్ష్మాంశాలను కూడా గ్రహించి

అనుసరించాలి!' అని బదులిచ్చాడు శ్రీకృష్ణుడు.

అంతరంగ భక్తి మానసిక పూజల ప్రాధాన్యం ఏమిటో కథ ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్నే ధర్మంలోని ధర్మం అంటారు. అగ్నిలోని వెలుగు, సత్యంలోని శక్తి, ‘అంతర్యామి’లోని దివ్యత్వం... ఇవన్నీ సూక్ష్మ దృష్టికి మాత్రమే అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోవడమే

ఆధ్యాత్మిక కృషి ఫలం.

కె.విజయలక్ష్మి

***

*స్వర్ణ మౌనం*

మౌనం గొప్ప భాష, అద్భుత కావ్యం, గొప్ప అనుభూతి అసంఖ్యాకమైన ఆలోచనలను రేపే ఒక నిశ్శబ్ద శబ్దబ్రహ్మాండం. ఒక మార్గదర్శి, హితైషి, ఉపాధ్యాయుడు మౌనం ఒక సింహావలోకనం. అన్నింటికీ మించి అంతర్ముఖత్వం. మనలోని 'అంతర్యామి' ఘోషను మనం వినగలిగేటట్టు చేసి... ఆ 'అంతర్యామి'ని చేరుకునేందుకు ఉపకరించే గొప్ప సాధనం.

‘భాషణం రజతం... మౌనం స్వర్ణం'. భాష మన భావాలను ఇతరులకు వ్యక్తం చేసి వారివి తెలుసుకునే ఒక మహత్తర వాహిక. కానీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడినప్పుడే ఆ మాటలు విలువను

సంతరించుకొంటాయి. భాషకందని భావాలు, అనుభూతులు మనందరి జీవితాలలో సహజమే. ఆటువంటి వేళ, మౌనం మన మనోభావాన్ని అనాయాసంగా, అద్భుతంగా అభివ్యక్తం చేయగలదు. అక్కడ మౌనం హేమతుల్యమే.

ఎక్కడ భాషించాలో, ఎక్కడ మౌనం పాటించాలో తెలుసుకోవాలి. అది విజ్ఞత, వివేచనల వల్లనే సాధ్యం.

జ్ఞానులు, పండితులు, అనుభవశాలుర సమక్షంలో మిడిమిడి జ్ఞానంతో నోరు మెదపడం దుస్సాహసమే కాదు, దుశ్చర్య కూడా. మన మాట చెల్లని చోట, విలువివ్వనివారి దగ్గర ఒక్క మాటైనా పెదవి దాటకూడదు. మహాత్ముల మాటలు ఆలకిస్తున్న వేళ మౌనముద్రులం కావాలి. కోపం సింహాసనమెక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఆవేశపూరితులమైనప్పుడు విచక్షణను కోల్పోతాం. అప్పుడు మౌనమే ఉత్తమ మార్గం. 'మౌనేన కలహం నాస్తి' అంటారు. వివాదాస్పద వ్యక్తుల దగ్గర ఇది చాలా అవసరం.

విజ్ఞుల సమూహంలో 'వాగ్భూషణం భూషణం'. విషయపరిజ్ఞానం లేని వ్యక్తులకు

‘విభూషణం మౌనమపండితానాం' అంటారు భర్తృహరి. మౌనం దేవుడిముందు భక్తి, గురువుల ముందు శ్రద్ధ, పెద్దల ముందు గౌరవం, ఉపాధ్యాయులముందు వినయాన్ని వ్యక్తం చేస్తుంది.

లంకలో, ఆ ఒంటరి వేళ రాముడి చింతనలో ఉన్న సీతాదేవి మౌనాన్ని ఆశ్రయించింది. అదే ఆ సాధ్వికిగొప్ప ఊరటనిచ్చి రక్షణ కవచమైంది. ధర్మవేత్త, రాజ నీతిజ్ఞుడైన విదురుడికి, సంభాషణా చతురుడైన ఆంజనేయుడికి మాటల గలగలలూ తెలుసు... వాటి గాంభీర్యత, సాంద్రత తెలుసు. మాట, మౌనం అర్థం, విలువ వారికి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదేమో!

స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే, ధ్యానం మనసును శుద్ధిచేస్తుంది. ధ్యానం మౌనాన్ని సూచించే ఒక అద్భుత ప్రక్రియ. ఒక క్రమం, నియంత్రణ లేక ఒకదాని వెంట ఒకటిగా వచ్చే ఆలోచనా తరంగాలను తట్టుకోవాలంటే మానసిక శక్తి కావాలి. అది మౌనం వల్లే ఒనగూడుతుంది. తపస్సు కూడా ఒక మౌనమే. మంత్ర ఉచ్చారణతో ప్రారంభమయ్యే ఈ తపస్సు కొన్ని దశలు దాటిన పిదప వాక్కు ఆగిపోయి కేవలం పెదవుల కదలికలు ఉంటాయి. ఆపై దశలో శుష్కించిన ఊపిరితిత్తుల కదలికలే ధ్యానమవుతాయి. మౌనం అత్యున్నత స్థాయి అది.

మౌనం ఆధ్యాత్మికవేత్తలకు ముఖ్య సాధనమార్గం. 'నడిచే దేవుడు'గా కీర్తిపొందిన శ్రీ చంద్రశేఖర పరమాచార్య, శ్రీ రమణులు మౌనంగానే ఎన్ని గొప్ప భావపరిమళాలను పరివ్యాప్తి చేశారో! మహాత్మా గాంధీ వారంలో ఒక రోజు మౌనవ్రతం పాటించేవారు. మౌనం ఆయన ఆత్మ పరిశీలనకు, సత్యశోధనకు, సాధనకు ఒక ప్రయోగశాల అయింది. మౌనం ఎంతో శక్తిమంతమైనది. మనసు మనసు కలిస్తే మౌనం. ఆత్మ పరమాత్మతో సంలీనమయ్యే ఘడియకూడా మౌనమే. అది జీవిత సార్ధకతను నిర్ణయించే విఘడియ. ఈ శుభలగ్నం కోసమే మునులు, యోగులు, సాధకులు తపించిపోయేది.

కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్

****

*ఎవరికైనా తప్పదు పరీక్ష!*

ఏ మనిషిని అయినా వస్తువునైనా అనేక విధాలుగా పరీక్ష చేసిన తరవాతే దాని విలువను, గుణాన్ని నిర్ధారిస్తారు. ఇది సహజం. ఒక విద్యార్థి ఎంత జ్ఞానం సంపాదించాడో తెలుసుకోవడానికి అధ్యాపకుడు పరీక్షిస్తాడు. అనేక రీతులుగా ప్రశ్నలు వేసి జవాబులు రాబడతాడు. అధ్యాపకుడు సంతృప్తి చెందితే ఆ విద్యార్థి కృతార్థుడవుతాడు. ఏ ఉద్యోగార్థికైనా ఇలాంటి పరీక్ష తప్పదు.


ఉద్యోగం, వృత్తిరీత్యానే గాక, కుటుంబంలోని సభ్యులకూ పరీక్షలుంటాయి. అవి చెప్పిరావు. ఎప్పుడైనా, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా పరీక్షలొస్తాయి. అవి సమస్యలుగా పరిణమించి వాళ్లను వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఇంటి యజమానినీ యజమానురాలినీ మానసిక సంఘర్షణలకు గురిచేస్తాయి. అటువంటప్పుడే ధైర్యంతో, సహనంతో, వివేకంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు.

నిరంతరం భగవంతుణ్ని పూజించి ఆరాధించే భక్తుడికీ పరీక్షలు తప్పవు. సచ్ఛరిత్రులకు, సచ్ఛీలురకూ పరీక్షలుంటాయి. సత్యవ్రతుడైన హరిశ్చంద్రుణ్ని విశ్వామిత్రుడు పరీక్షించాడు. సతీ అనసూయను త్రిమూర్తులు పరీక్షించారు. సతీసావిత్రిని యమధర్మరాజు పరీక్షించాడు. యక్షుడు అనేక ప్రశ్నలు వేసి ధర్మరాజు విజ్ఞతను పరీక్షించాడు. దేవేంద్రుడు, అగ్నిదేవుడు డేగ, పావురాల రూపంలో వచ్చి శిబి చక్రవర్తి దానశీలతను పరీక్షించారు. సతీసక్కుబాయి పరీక్షలకు గురైనదే. పరమశివుణ్ని పతిగా పొందాలని కఠిన తపోదీక్షలో నిమగ్నమై ఉన్న పార్వతిని కపట బ్రహ్మచారి వేషంలో శివుడు వచ్చి అనేక ప్రశ్నలతో పరీక్షిస్తాడు. ఆమె జవాబులు విన్న ముక్కంటి తనపట్ల ఆమెకు గల అచంచలమైన అనురాగాన్ని గ్రహిస్తాడు.

ద్రోణుడు విలువిద్యలో అర్జునుణ్ని పరీక్షించి, అతడి విద్యాకౌశలాన్ని మెచ్చుకున్నాడు. గణాధిపత్యం ఇచ్చే సందర్భంలో పరమేశ్వరుడు కుమారస్వామిని, గణపతి పరీక్షిస్తాడు. త్రిమూర్తుల్లో ఎవరు సహనంగలవారో

తెలుసుకోవాలని ప్రయత్నించి భృగుమహర్షి భంగపాటు చెందుతాడు.

బ్రహ్మ, విష్ణువు నేనంటే నేను అధికుణ్ని అని కలహించుకుని తీర్పుకోసం వచ్చినప్పుడు పరమశివుడు ఇద్దరినీ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో విఫలురైనందుకు శివుడు వారిని శపిస్తాడు. నాస్తికుడైన మంజునాథను పరీక్షించి, చివరికి పరమభక్తుడిగా చేసుకుంటాడు

ఈ గాథల వల్ల మనిషి ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని క్లిష్టమైనవీ కావచ్చు, మరికొన్ని అత్యంత సంక్లిష్టమైనవి కావచ్చు. ఈ సమస్యలే పరీక్షలు. వీటిని ఎదుర్కోవడానికి ఓర్పు కావాలి. వివేకం, వివేచన అవసరం. సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశపడటమో, కుంగిపోవడమో, ఎదుటివారినో పరమాత్మనో దూషించడమో వాంఛనీయం కాదు. కుటుంబసభ్యులతో చర్చించుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సాధారణంగా స్వయంకృతాపరాధం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం ఉంటుంది. పెద్దరాయి అడ్డమైనప్పుడు ప్రవహించే నీరు పక్కదారి చూసుకుని వెళ్ళిపోతుంది కదా! ఇది ప్రారబ్ధం అని కూర్చునేవారు సాఫల్యం పొందలేరు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్ని పరీక్షలనుంచి అయినా, సమస్యలనుంచి అయినా బయటపడవచ్చు. ధ్యానం, ఆధ్యాత్మిక చింతన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సత్సాంగత్యం వల్ల సానుకూల దృక్పథం గోచరిస్తుంది. బోధన కంటే శ్రవణం గొప్పది. శ్రవణం కంటే సాధన గొప్పది. సాఫల్యమనే వృక్షానికి సాధనే బీజం. గ్రీష్మమనే ఏ పరీక్షకైనా నీడనిచ్చేది ఆ వృక్షమే.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

****

*ఇంద్రియ నిగ్రహం - సాధన** 

ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు , కర్మేంద్రియములు అని అర్ధం . వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం . అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం . తనకు ఇష్టమైనదానికోసం పోవటం మనస్సు యొక్క సహజ లక్షణం . అది దానికి ఇష్టంలేని దానిమీదికి పోదు . ఎందుచేతనంటే దానివలన మనస్సుకు ప్రయోజనం లేదుకనుక . అలాంటప్పుడు ఎందుకు శ్రమపడాలి ? కాబట్టి మనస్సుకు ( ఇంద్రియానికి ) ఏది ఆకర్షణగా ఉంటుందో , దేనివలన తాను కోరుకున్న అనందం కలుగుతుందో దానిమీదనే ఆసక్తి ప్రసరిస్తుంది . అది లౌకికమైన తాత్కాలిక ఆనందం , కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాల వైపు మనస్సు పోదు . అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం . ఆ విధంగా మనస్సును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు . 

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని నిత్యమైన పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి . ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి . కార్యసాధనకు ప్రయత్నం అవసరం , ముఖ్యం . లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయటం ఎట్లా సంభవిస్తుంది . కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి , ఆలోచన చేయాలి . ఆలోచన అంతర్ముఖం చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి . 

మనకు ఇష్టంలేని ప్రస్తావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది . క్రోధం అంతః శత్రువు . హద్దు మీరుతుంది . చేయకూడని పని చేయిస్తుంది . మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది . దీనివలన అనర్ధం జరుగుతుంది . అది తనకూ మంచిది కాదు . ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు . అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలి . 

సహనం , వివేకం జీవితంలో అలవరుచుకోవాలి . మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడింది అనుకుందాము . త్రోవను పోయే ఒకనిని హఠాత్తుగా పాము కాటువేసింది అనుకుందాము . అది ఆకస్మికమైన విపత్తు . దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి , ఇతరులను నిందించి , పాముపై క్రోధం పెరిగి , దానిని చంపటానికి ప్రయత్నించి , అది కనపడకుండా పోయి , భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది తప్ప ఉపయోగం ఉండదు . అటువంటి ఆపద సమయములలోనే మనము సహనము , వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి .

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది . ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉంది ఉంటుంది . అదియే దైవ ప్రేరణ . దీనినే మనం లౌకికంగా ఒక సామెత కూడా వాడుతూవుంటాము -  "శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని" . ప్రారబ్ధ కర్మను పాలనంలోనే అట్లా జరిగి ఉంటుంది అని భావించాలి . అట్లా విచారణచేయటమే వివేకం . ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము . ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులను , అవరోధాలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది . నీటిని సహనంతో అధిగమించాలి . దీనినే తితిక్ష అని కూడా అంటారు . తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు అర్హుడు , యోగ్యుడు . అటువంటివానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది . శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం . శాస్త్రం అనేది ఏది నిర్దేశిస్తుందో అది చేయాలి . ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు . శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి , విశ్వాసం ఉంటే చాలదు , శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించి తీరాలి .  

--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .

***

*భక్తిమార్గంలో బాటసారి

భగవంతుడెవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషికి ఉండాలి' వ్యతిరేక భావనలు లేని బుద్ధి. మనసు ఉంటే అతడికి చాలన్న మహావేదాంతి రామకృష్ణ పరమ హంస, భగవంతుడెవరని శ్రద్ధాళువులకు విపులీకరించడానికి భౌతిక జీవనంలో మనుషుల కెదురయ్యే అనుభవాలనే పారమార్థిక సత్యాలకు అనుసంధానిస్తూ, చిర కాలం గుర్తుండే పిట్టకథల వంటి ఉదాహరణలతో, తన ఆధ్యాత్మిక హృదయం చేతనే మాట్లాడించిన ఆయన విలక్షణమైన వేదాంతి. జీవాత్మ పరమాత్మల అభేదం, నిజమైన ఆనందానికి అర్థం తెలిసిన ఆత్మజ్ఞానిగా, మనిషికి ఆ పరమ సత్యాలను, హంస నిర్వాణాలనిపించే స్వచ్ఛమైన వాక్కులతో వినిపించినందుకు పరమహంసగా ఆయన ప్రసిద్ధులయ్యారు.

భగవంతుడెవరో కాదని, ఎక్కడో లేడని, తనలోనే ఉన్న ఆత్మ స్వరూపుడని, తన కన్నా భిన్నమైనవాడేమీ కాదని మనిషికి తెలియాలనేవారు రామకృష్ణులు, దివ్యత్వం. లేని అత్యలని ఉండవని, అతడి పాపపుణ్యాలు ఆత్మకు అంటని గుణాలన్నారు. ఆత్మజ్ఞాన సాధనలకన్నా భగవంతుడిని చూసేందుకు భక్తిమార్గమే సులువైనదం మనసంతా కల్లాకపటం, బుద్ధి నిండా కుటిలత్వం, మడీ మైలా అంటూ మరొక మనిషిని దూరంగా ఉంచే అవలక్షణాలున్న మనిషికి ఆధ్యాత్మికతనిచ్చే జ్ఞాన సాధనలు ఫలితమివ్వవని చెబు తారు. ఆహేతుకమైన అభిప్రా యాలు, ఆడంబరమయమైన ఆరా ధనా పద్ధతులు, ఆచార వ్యవహా రాలు, సభ్రంధ పారాయణలకిచ్చే ప్రాధాన్యం కన్నా ఆచరణ సాధ్య మైన ధ్యానం, జప తపాదులు, దైవ నామ స్మరణలకు వినియోగించే జీవి తకాలు, అతడిని అంతర్ముఖుడిని చేసి భగవద్దర్శనమిప్పించడానికి సరిపోతుందన్నారు. వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో మీరన్న భక్తి సాధనలు సాధ్యమయ్యేవేనా అని ఎవరైనా సందేహిస్తే- దేవుడి పేరు ఒకమారైనా గుర్తుచేసుకునేందుకు తీరిక లేని వారా మీరు, ఆ పేరును ఉచ్చరించడాన్ని అలవాటుగా మార్చుకుంటే ఫలితం మీకే తెలుస్తుందని సున్నితంగా మందలిస్తుండేవారు.

అంతర్యామి

రామకృష్ణులు భగవద్భక్తిని కలియుగ ధర్మమన్నారు. మనిషికి తన తపనంతా భగ వదనుగ్రహ ప్రాప్తికి ఉంటున్నప్పుడు అతడిని భక్తిమార్గం విడిచిపెట్టవద్దన్నారు. అందులో ముందుకు సాగుతున్నప్పుడు ఎప్పటికైనా అతడికి అక్కడ ఎదురుకాబోయేది. ఆ భగవంతుడొక్కడేనంటారు. భక్తిమార్గంలో పయనించిన ఆయనకు, కలియుగం అంటున్న ఆధునిక జగత్తులో, అసాధ్యమనుకునే అరుదైన భగవత్ సాక్షాత్కారం ఆ మార్గంలో లభించింది. నమ్మిన దైవం కాళికామాత ప్రత్యక్షమై కరుణించింది.

వివేకానందుడు తనకు స్ఫూర్తినిచ్చిన రామకృష్ణుల ఆధ్యాత్మికతలోని వాస్తవికత ఆసాధారణమైనది అనేవారు. ఆయన శిష్యుడిగా చేరాకనే, అంతవరకూ అద్వైతం, వేదాంతాలంటే అంతగా ఆసక్తి చూపని, దైవాన్ని విమర్శించే ఆయన వివేచనా దృక్పథం అలవరచుకున్నారు. వేదాంతం చెబుతున్నదంతా వినడం నేర్చుకున్నారు. దేవుడున్నాడని, విశ్వవ్యాపకుడైన సర్వాంతర్యామి అతడని అంగీకరించారు. తత్వ విచారానికి కొత్త దిశానిర్దేశనమిచ్చి మహావేదాంతిగా గణుతికెక్కారు.

భారతీయుల ఆధ్యాత్మిక చింతనలను పాశ్చాత్యుల ఆలోచనా సరళి ప్రభావితం చేస్తూ, సత్యార్థుల ధర్మ మీమాంసను సందిగ్ధపరుస్తున్న సంధికాలంలో జన్మించిన మహాపురుషులు రామకృష్ణులు భావి తరంలో జరగబోయే వేదాంత విచారానికి తనదైన పద్ధతిలో కొత్త ఒరవడులు సృజించి ఇచ్చిన మార్గదర్శకులాయన.

- జొన్నలగడ్డ నారాయణమూర్తి

*సుమతీ శతకంలో మకుటంగా ఉంచిన ‘‘సుమతీ! ’’ అంటే... మంచి మనసున్న వాడా! మంచి మేధ కలిగిన వాడా! మంచి మతి కలిగిన వాడా! అని అర్థం. ఒక వ్యక్తికి ఏదయినా ఒకటి తెలియకపోవడం తప్పుకాదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. అందరం శంకర భగవత్పాదులం కాదు. పుట్టుకతో అందరికీ అన్ని విషయాలూ తెలియవు. కానీ తెలియనిది తెలుసుకోకపోవడం, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మాత్రం తప్పే. నాకు తెలిసినది మాత్రమే నిజం, నాకు తెలుసుకోవలసిన అవసరం లేదనడం ధిక్కారం...అది ముమ్మాటికీ తప్పు. నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను–అని ఎవరు వినయంతో చెవిపెట్టి మంచి మాటలు వింటారో వారందరూ సుమతులే. విద్యార్థుల మనసు తెల్లకాగితంలా ఉంటుంది. దాని మీద ఏది రాస్తే దాని ముద్ర పడుతుంది.

పిల్లలకు అందవలసిన విషయం అందితే వాళ్ళు జీవితంలో వృద్ధి లోకి వస్తారు. ఉత్తమ పౌరులవుతారు. అటువంటి పిల్లలు కుటుంబంలో ఆధారపడతగిన వ్యక్తులవుతారు. ఆ వీథిలో ఉన్నవారు, ఆ ఊరి వారు, ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఉన్న వారు కూడా వారిని చూసి గర్వపడే, సంతోషపడే స్థితిని పొందుతారు. అలా పొందేటట్లు బతకగలిగిన స్థితికి చేరుకోవడానికి సుమతీ శతకం పద్యాలు గొప్ప సోపానాలు. ఇవి పిల్లలను ఉద్దేశించి చెప్పినవే అయినా, వారికే కాక, అందరికీ అన్నికాలాల్లో ఉపయుక్తం అవుతాయి. వాటిలో ఒక పద్యం చూద్దాం...

‘‘ఇమ్ముగ చదువని నోరును/అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్‌/తమ్ముల పిలువని నోరును/కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ!’’ –‘ఇమ్ముగ చదువని నోరును...’ అంటే.. చదివేది ఇష్టంగా చదవాలి.. ఇష్టం అంటే?  నీకు ఆకలేసింది. ఉదయం ఫలహారం తిన్నావు.. మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది.. మరి ఉదయం తిన్నదేమయింది! ఏదీ చూపించమంటే ఇక కనిపించదు. అది రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ వంటి సప్త ధాతువుల్లోకి కలిసిపోయింది. అలా కలిసి అది నువ్వయి పోయింది. అంటే నేను తిన్న ఫలహారం నాలో కలిసిపోయింది, నేనుగా మారిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తింటాం. అదీ అంతే. నీళ్ళు తాగుతాం. అదీ అంతే. అలాగే చదివిన చదువు కూడా మనకన్నా వేరుగా ఉండకూడదు. అది కూడా నీలోకి వెళ్ళిపోయి ‘నువ్వు’గా మారిపోవాలి.

అంటే నీకు దాని అవసరం ఎప్పుడొస్తే అప్పుడు అది నీకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం వస్తూ ఉండాలి అంటే మీరు చదివిని దానిని లోపల మననం చేసుకుంటూ ఉండాలి. ఇదంతా జరగాలి అంటే... చదివే చదువు ఇష్టంగా, ప్రీతిగా చదవాలి. ఇష్టంగా స్వీకరించింది ఏదయినా మన ప్రయత్నం లేకుండానే అది మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అవసరమయినప్పుడు అది వెంటనే మనకు గుర్తొస్తుంటుంది. మీకు నాన్నంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం. మీరు ఎక్కడున్నా వారిని మనసులో అనుకున్న వెంటనే మీకు వారెలా గుర్తుకొస్తుంటారో, ఇష్టంగా చదివినది కూడా అంతే. ఆవుపాలు పితికేటప్పుడు ఆ పాలధార సన్నగా ఉన్నా నేరుగా పాత్రలోకి చేరేటట్లు ఎలా ఏకాగ్రతతో పితుకుతామో, అలా చదివే విషయాలు, గురువుల ద్వారా వినే విషయాలు కూడా నేరుగా మనసులోకి చేరాలి. అలా జరగాలంటే... చదివే వాటిని కష్టంతోనో, చదవాల్సి వచ్చిందన్న బాధతోనో కాకుండా బాగా ఇష్టపడి చదవాలి.

***

అనుమానం పెనుభూతం

శ్రీకృష్ణుడు రాయబారం వహించడానికి హస్తినాపురం వెళ్లాడు. ముందుగా సభలో అందరికీ నమస్కరించి, అశ్వత్థామను సభ బయటకు పిల్చుకుని వెళ్లాడు. క్షేమ సమాచారం ముచ్చటించిన తర్వాత తనచేతి ఉంగరాన్ని కిందికి జారవిడిచాడు. దుర్యోధనుడు ఇదంతా ఒకకంట గమనిస్తూనే ఉన్నాడు. ఉంగరం పడిపోయిందని అశ్వత్థామ కిందికి వంగి తీసివ్వబోగా కృష్ణుడు గమనించనట్టు నటించి ఆకాశం వైపు చూపిస్తూ ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు. కృష్ణుడేం చూపిస్తున్నాడో.. అర్థం కాక అశ్వత్థామ కూడా ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ, వేలికి ఉంగరం తొడిగాడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు, మరోలా అర్ధం చేసుకుని 17 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను ఒక్కరోజూ సర్వ సైన్యాధిపతిగా నియమించ కుండా చేశాడు. యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడ్డాడు. అప్పుడు అశ్వత్థామ సుయోధనా! నేను చిరంజీవిని. పైగా శస్త్రాస్త్రాలలో అర్జునుడితో సమానమైన వాణ్ణి. నన్ను సైన్యాధిపతిని చేసి ఉంటే పాండవులనందరినీ హతమార్చేవాణ్ణి. నీకీ దుస్థితి కలిగేది కాదు' అంటూ విలపించాడు. దుర్యోధనుడు 'కానీ నువ్వు రాయబారం నాడు శ్రీకృష్ణుడికి నింగీ నేలా సాక్షిగా పాండవుల విజయానికే సహాయపడతానని మాట ఇచ్చావు కదా! అందుకే నిన్ను దూరం పెట్టాను' అన్నాడు. అది విన్న అశ్వత్థామ విరక్తిగా నవ్వి 'విధి వైపరీత్యం దుర్యోధనా! ఇది ఆ జగన్నాటక సూత్రధారి పన్నాగం. నీకు నా మీద కలిగిన అనుమానమే నీ ఓటమికి కారణమైంది' అంటూ ఆనాడు జరిగిందేమిటో వివరించాడు. కనుక అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి. అంతేగానీ లోలోపలే రగిలిపోతే నష్టం తప్పదు. అనుమానం పెనుభూతమని రుజువు చేసే ఘటన ఇది.

- డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్య

***

ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది.

ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది. 

అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి.

నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి.వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు….

***