Monday, 20 March 2023

సమస్యను పరిష్కరించడం..


 

ఒక ఊళ్లో భిక్షకుడు గుడి ముందు అడుక్కుంటూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఆ గుడికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కింద ఉంటుండేవాడు. ఒక భక్తుడు గుడికి వచ్చినప్పుడల్లా ఆ భిక్షకుడి పాత్రలో నాణేలు వేసేవాడు. అతణ్ని ఆప్యాయంగా పలకరించి పండో, ప్రసాదమో చేతిలో పెడుతుండేవాడు. అలా ఆ భక్తుడంటే భిక్షగాడికి ఒక గౌరవ భావం ఏర్పడింది. 

      కొన్నాళ్లకి ఆ భిక్షకుడికి బాగా జబ్బు చేసింది. తనకి చివరి క్షణాలు సమీపించాయని అతనికి అర్థమైంది. ఆ సమయంలో ఆ భక్తుడితో తన మనసులోని కోరిక విన్నవించుకున్నాడు. చనిపోయాక తనని ఆ చెట్టు కిందనే సమాధి చెయ్యాలని కోరాడు. దానికి ఆ భక్తుడు అంగీకరించాడు. 

       భిక్షకుడు కన్నుమూశాడు. భక్తుడు అతను చెప్పిన స్థలంలోనే గొయ్యి తవ్వాడు. ఆశ్చర్యం.. బంగారు నిధి బయటపడింది. అదతని సొంతమైంది. 

      ఏళ్ల తరబడి దైవ సన్నిధిలో భగవన్నామ స్మరణ చేస్తూ గడిపినందుకు ఆ భిక్షకుడు స్వర్గానికి వెళ్లాడు. భక్తుడికి బంగారు నిధి దొరికిన విషయం అక్కడ తెలిసింది. మొదట నిర్ఘాంతపోయాడు. తనని ప్రేమగా పలకరించే వ్యక్తికి అది దొరికినందుకు తర్వాత సంతోషించాడు. అయితే అతడిలో ఓ సందేహం. 

      ‘‘జీవితాంతం నేను ఆ నిధి మీదే కూర్చున్నాను. కానీ, చివరి వరకూ భిక్షగాడిగానే ఉండిపోయాను. నాలుగు డబ్బులు దానం చేసిన ఆ భక్తుడు కోటీశ్వరుడయ్యాడు. ఏంటీ మాయ’’ ఇంద్రుణ్ని అడిగాడు ఆ యాచకుడు. 

      ‘‘నీ జీవితమంతా భగవంతుడి సాన్నిధ్యంలో గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అయితే, నీ సమీపంలోనే ఉన్న నిధి గురించి నువ్వు తెలుసుకోలేకపోయావు. అతను రోజూ భగవత్సేవ చేస్తూ యథాశక్తి నీకు దానం చేశాడు. అందుకే అతణ్ని ఆ నిధి వరించింది. నిజానికీ చాలా మంది తమలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక ఇతరుల మీద ఆధారపడుతుంటారు. దానివల్ల పక్కవారు లాభం పొందుతుంటారు’’ సమాధానమిచ్చాడు ఇంద్రుడు. మౌనంగా తలదించుకున్నాడు ఆ యాచకుడు.


భీష్ముడు చెప్పిన పిల్లి, ఎలుక కథ.


మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తాయి. ఒకవైపు మంచిచెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోని శాంతిపర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకి చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో ఒకటి పిల్లి, ఎలుక కథ. అడవిలోని ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుతండగా, అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది. రోజూ ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి, ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దానిచుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది.


ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి ‘ఈ వలని కొరికి నిన్ను నేను రక్షిస్తాను.. దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుంచి కాపాడవా!’ అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొడంత ధైర్యం వచ్చినట్టయి, వెంటనే సరేనంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి.


నీ ప్రాణాలను రక్షించాను కదా.. మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకను పిల్లి అడిగింది. దీనికి ఎలుక ‘నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా! ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను’అని సంజాయిషీ ఇచ్చుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది.

చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు. వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు.. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం’ అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు.. బదులుగా నేను నిన్ను రక్షించావు. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు’ అంటూ కలుగులోకి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మునుండిపోయింది.


ఈ కథలోని పాత్రధారులు సహజశత్రువులైన పిల్లీ ఎలుకలే కానీ, ఇందులోని నీతి మాత్రం నిత్యజీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసీ వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి, జీవితాన్ని ఫణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది.


జీవితం ఒక అంతులేని పయనం. ఈ సుదీర్ఘ వింతపయనంలో నిమిషాలు, గంటలు, దినాలు పరుగులు తీస్తూ ఉంటాయి. మాసాలు గడిచి సంవత్సరాలుగా మారుతుంటాయి. జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతూ ఉన్నంతకాలం మాసాలు నిమిషాలుగా, సంవత్సరాలు గంటల గడియారంలో ముళ్లలా చకచకా నడుస్తూఉంటాయి.


సమస్యలు ఎదురుపడగానే క్రమం అంతా తారుమారవుతుంది. ఇలా జరగడానికి కారణం ఏమైఉంటుంది? కాలమహిమ అని కొందరు, కాదు మనసే ఖలనాయకుడని మరికొందరు వాదిస్తారు. కాలం ఒక మహాప్రవాహం. దానికి ఎదురీది గట్టెక్కాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషికి జీవితం సవాలుగా మారుతుంది. ప్రవాహంతోపాటు సాగిపోదామన్నా, అది సాఫీగా సాగుతుందన్న భరోసా లేదు. తేడా భావనలోనే ఉంది. ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ, సుడిగుండంలో చిక్కుపడిన దుంగలా తలకిందులుగా తలపడటమా? లేక తుంగలా తలవంచి ప్రమాదం నుంచి బయటపడటమా? ఈ ప్రశ్నలకు సమాధానం వ్యక్తి మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది.

గుణాత్మకమైన ప్రకృతి ప్రభావంవల్ల వ్యక్తిత్వపు మానసిక స్థితిగతులు మార్పు చెందుతుంటాయి. వీరులు, ధీరులు, రుషులు, తాపసులు తప్పటడుగులు వేయడానికి ప్రకృతి ప్రలోభాలే కారణమని మన పురాణాలు గళమెత్తి చాటుతున్నాయి. ఆరుగురు అంతశ్శత్రువుల దాడికి ఆగలేక మనసు ఆగమాగమై మూగపోవచ్చు లేదా చతికిలపడవచ్ఛు అర్జునుడి వంటి జగదేక ధనుర్ధరుడు కురుక్షేత్రంలో చతికిలపడ్డాడు. విశ్వామిత్ర మహర్షికి మేనక కనిపించగానే మనసు మూగబోయి మనిషిని దాసుడిగా మార్చేసింది. బంధానికి, మోక్షానికి మనసే కారణమన్న ఉపనిషత్తు వాక్యం అక్షరసత్యం.


ఆత్మజ్ఞానానికి చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి- రెండూ ముఖ్యమైన సూత్రాలు. మనసు అద్దంలా మారినప్పుడే శుద్ధజ్ఞానం మెరుస్తుంది. ప్రపంచాన్ని గెలుచుకున్నా, మనసును జయించకపోతే ఆ వీరుడు ధీరుడు కాలేడు. స్థితప్రజ్ఞుడే ఈ ప్రపంచంలో అసలైన ప్రాజ్ఞుడు. ఆత్మజ్ఞానం అంటే తానేమిటో తెలుసుకోవడం. అంతా తానై ఉన్నానన్న ఎరుక కలగడంతో ఒంటరిపోరాటం మొదలవుతుంది. ఏకాత్మ భావన అంటే మానసికంగా అందరూ ఒకటే. శారీరకంగా ఎవరికి వారే. అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నాడు యోగీశ్వర కృష్ణుడు.


తామరాకుపైన నీటిబొట్టులా భౌతికజీవితంలో మెరవాలి. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన విధంగా, జీవన్ముక్తి వివేకంతో మనిషి సంసార సాగరాన్ని ఈదుకు రావాలి. ఐహిక బంధాల్లో చిక్కుపడి ఆముష్మిక పంథాకు దూరం కాకూడదు. భార్య, బిడ్డలు, హితులు, స్నేహితులు, సిరిసంపదలు... ఇవేవీ శాశ్వతం కాదు.


ఇవన్నీ మహాప్రస్థానంలో నాందీప్రస్తావనలు. కాశీయాత్రలో తప్పని మజిలీ స్థావరాలు. మహాప్రస్థానంలో ధర్మరాజును చివరిదాకా అనుసరించింది ధర్మం ఒక్కటే. ఆత్మీయులు అనుకున్నవారు, ఆత్మబంధువులన్నవారు ఊరి పొలిమేర దాకా కలిసి వస్తారేతప్ప, ఊర్ధ్వయాత్రలో మనిషి ఏకాకి మాత్రమే. ఆత్మజ్ఞానం ఒక ఊర్ధ్వగమనం కాబట్టి వ్యక్తి చైతన్యాన్ని చిక్కబట్టాలి. మనోబలంతో ముందుకు సాగాలి. కొంతమంది తమకు తామే గొప్పగా తలబోసుకుంటూ పటాటోపంగా యజ్ఞాలు చేస్తారు. సదా సంసారంలో ఎదురీత సాగిస్తూ ఉంటారు. మనసును వశం చేసుకున్న సాధకులు జీవనయాత్రను జైత్రయాత్రగా మలచుకుని యోగసిద్ధి పొందుతారు.


అంతులేని పయనంలో, ధర్మరాజుకు ధర్మంలా తోడువచ్చేది- ఆధ్యాత్మికసాధనే


ఓటమిని ఆస్వాదించగలిగినవారినే విజయం వరిస్తుంది. జీవితంలో జయాలుంటాయి, అపజయాలూ ఉంటాయి తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికేమో కారణాన్ని విధికి ఆపాదిస్తాం. విధిని నిందిస్తాం. దైవంపై అలుగుతాం. ఇలా ప్రవర్తించడం మానవ తప్పిదమే కాదు, దైవాపరాధం కూడా! జీవితంలో మనకు ఎదురయ్యే జయాపజయాలకు కారణం మనమే! దైవం మనిషికి వివేకం ఇచ్చాడు. వీలైనంతవరకు తప్పులు చేయకుండా కార్యసాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యం! జీవనమార్గంలో తప్పటడుగులు వేయటం ఎవరికైనా సహజం. జీవిత రహదారిలో ముళ్లూ గులకరాళ్లూ ఉంటాయి. వివేకాన్ని ఉపయోగించి ప్రయాణం చేయగలిగితే విజేతలం కావడం ఎప్పుడూ సంభవమే అందలం కోసం ఎగిరే ప్రయత్నంలో కిందపడిపోతుంటాం. పడిలేచి తిరిగి ప్రయత్నించేవాడికి అందలం అందుతుంది. పూలకోసం యత్నిస్తుంటే ముళ్లు గుచ్చుకుంటాయి. జీవితంలో గెలవాలనుకొంటే ఓపిక ఉండాలి. పదిసార్లు ప్రయత్నించిన తరవాత పదకొండోసారి లభించిన విజయంలోని ఆనందమే వేరు! విజయం సాధించేందుకు అడ్డదారులుండవు. అడ్డంకులుంటే తొలగించుకోవాలి. అందుకు సమయస్ఫూర్తి, వివేకం అవసరం శ్రీకృష్ణుడు అపర విష్ణు అవతారం. కౌరవుల బారినుంచి రక్షించడానికి పాండునందనులకు సహకరించాడు కాని విజయప్రయత్నంనుంచి విరమించమనలేదు! లక్కతో నిర్మించిన భవనంలో నివసిస్తున్నవారికి సోమరితనం

వదలి అప్రమత్తంగా ఉండాలని బోధించాడు. తానుదైవస్వరూపుడే అయినా జరాసంధుని వధ తనవల్లకా దని(కూడదని తెలిసి... సంధ్యాసమయంలో, పశ్చిమ ద్వారం నుంచి ప్రవేశించి భీముడితో యుద్ధానికి పురిగొలిపాడు. శ్రీకృష్ణుడు జరాసంధుడితో ఓటమికి కుంగక సమయస్ఫూర్తితో పగవాడిని హతమార్చాడు. మహాభారత యుద్ధ సమయంలో కౌరవ వీరుల సమరసన్నాహాలు చూసి పార్థుడు పరాజయం తప్పదని భావించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులవంటి సమరయోధులను గెలవటం అసంభవమని యుద్ధానికివెనకాడుతున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు పోరుచేయడంలో భీరత్వం ప్రదర్శించక ప్రయత్నించమన్నాడు. నిజానికి భీష్ముడు, ద్రోణుడు కృపాచార్యుని వంటివారిని గెలవటం సులభమేమీ కాదు. పద్దెనిమిది రోజుల యుద్ధంలో పాండవులు ఓటమి అంచుల వరకు వెళ్లినా శ్రీకృష్ణుడు వారిని


ఉత్సాహపరుస్తూ సామ దాన భేద దండోపాయాలను వినియోగించి విజయం సాధించిపెట్టాడు. అంతేతప్ప పాండవుల విజయానికి అడ్డదారి చూపలేదు


ప్రతి మనిషికీ జీవితంలో గెలుపు అవసరం. గెలవలేని జీవనలక్ష్యం అంటూ లేనేలేదు. ఎదురవుతున్న ఓటములకు భయపడి లక్ష్యాన్ని విడచి బతికే మనిషి పథవిహీనుడే! మరణం తప్పదని తెలిసినా బతకడానికి చేసే ప్రయత్నాలు విడవలేం కదా! మనం గెలుపుకోసం చేసే ప్రయత్నాలే తరవాతి తరం వారికి స్ఫూర్తిదాయకాలవుతాయి


యుద్ధంలో రాముడి సోదరుడు సౌమిత్రి మూర్భపోతాడు. వానరసేనలో ఓటమి భయం ప్రారంభమవుతుంది అప్పుడు విభీషణుడు అంటాడు- 'రామా! నీ కుడిభుజాన్ని కోల్పోయావు. నా కూతురు త్రిజట సహాయంతో సీతను వెంటనే నీవద్దకు రప్పించగలను. ఓటమి భయం నాకూ పట్టుకుంది. లంకారాజ్యం నాకు అవసరం లేదు. నీ శరణార్థిగా అయోధ్యలో జీవిస్తాను, వెళ్లిపోదామా

శ్రీరాముడు పలికిన వాక్యాలు మానవులందరూ తెలుసుకోదగినవి. 'విభీషణా! నేను సీత కోసం మాత్రమే రావణుడిపై గెలుపును కోరటంలేదు. మానవ సమాజంలో రావణుడిలాంటి రాక్షసులకు స్థానం లేదు. అతడి సంహారమే నా లక్ష్యం. ఆ లక్ష్యంలో విజయం సాధించడం కోసం నా సోదరుడి ప్రాణాన్నైనా పణంగా పెట్టగలను. ఓటములెన్ని ఎదురైనా ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే చెడుపై మంచికి తప్పక విజయం లభిస్తుంది


విజయం కోసం ఓటమిని ఎదుర్కొనక తప్పదు. ఓటమి గెలుపునకు స్ఫూర్తికావాలి కాని, భీరత్వానికి నాంది కాకూడదు. అప్పుడే జయం మనది!

ఎవరు రాసారో తెలియదు కానీ  అత్యద్భుతంగా ఉంది


ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన  - ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన -  అద్దం - రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు

ఆదర్శాలు రూపుకడితే రాముడు .

అందం పోగుపోస్తే రాముడు 

ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు

మంత్రమూర్తి రాముడు .

పరబ్రహ్మం రాముడు .

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?

అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన

పాట -

రామాలాలీ - మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం -

రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం 

సకల సుఖశాంతులకు - రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు - రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;

Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు - రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం

కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే -

శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే -

శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు

అది ఒక జీవన విధానం

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్.....

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది

జై శ్రీరామ్ 

శ్రీరామనవమి సందర్భంగా... 

    మీకు నా శుభాకాంక్షలు 🙏🏻

22/04, 8:46 pm] Sriram: నేను చెప్పే విషయం ఆధ్యాత్మికులు అర్థం చేసుకో గలుగుతారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను.

ఈ పూర్తి విశ్వం నాద మయం. సృష్టిలోని ప్రతీ వస్తువూ, జీవి ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే vibrating frequency కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz vibrating frequency దగ్గర మానలేదు. 

ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో covid పెద్ద ప్రమాదకారి కాదు. కేవలం కాస్త ఆనారోగ్యం కలిగించ గలదు అంతే. చాలా త్వరగా కోలుకుంటారు. 

అంటే ఇప్పుడు పెంచుకోవాల్సింది vibrating frequency. 

ముందు మనుషుల్లో vibrating frequency ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. 

భయం

ఫోబియా

అనుమానం

ఆందోళన

ఒత్తిడి

కోపం

ద్వేషం 

దురాశ

మోసం

బాధ

విపరీతమైన మోహం వంటివి మనలోని ప్రకంపనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

ప్రస్తుతం భూమండల సగటు vibrating frequency 27.4Hz. Hospitals, cellarls, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది.  లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది. 

భావోద్వేగాల frequency

మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీ తో vibrate అవుతాయో ఒక సారి చూద్దాం

బాధ - 0.01 Hz

భయం - 0.2 - 2.2

చికాకు -  0.9 - 6.8

చప్పుళ్ళు - 0.6 - 2.2 

గర్వం - 0.8 

దర్పం - 1.9

ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. వీటి వల్ల మనుషుల vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం. 

ఏదీ మంచిది?

ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం.

దయ - 95 Hz

కృతజ్ఞత -250

సహనుభుతి - 150

బేషరతు ప్రేమ - 250hz

So..... Comon let's vibrate higher. ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్య రష్మీలో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం high frequency లో vibrate కావచ్చు. 

సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, అంతెందు స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన vibrating frequency ని పెంచుకోవచ్చు. కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యం లో గడపడం ప్రార్థన చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీ ని పెంచుకోవచ్చు. 

ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుడాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టి తో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. మన vibrating frequency ని పెంచుకుందాం. 

(ఈ సమాచారం మొత్తం power vs force అనే పుస్తకం నుంచి సేకరించింది. ఇది డేవిడ్ హాకిన్స్ రాసిన doctoral thesis లోనిది. )

సైకాలజిస్ట్

[23/04, 7:25 am] +91 94404 88271: *⚛️నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ⚛️*

*పెళ్లి వయస్సు దాటిపోతున్నా పెళ్లి కావట్లేదా… అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి.*

అన్ని అనుకూలంగా ఉన్నా, 

మంచి ఉద్యోగం చేస్తున్నా, 

మంచి కుటుంబం ఉన్నప్పటికి, 

మంచి ఆస్తిపరుడైనప్పటికి..

కొందరు అబ్బాయిలకు.. అమ్మాయిలకు  పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం ఇవ్వవు. 

పెళ్లి ఏర్పాట్లలో ఏదో ఒక లోపం తలెత్తి పెళ్లి క్యాన్సల్‌ అవ్వడం జరుగుతుంది.

పెళ్లి జరుగుతుందని భావిస్తున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల ఆ పెళ్లి చెడిపోవడం లేదా మరేదైనా కారణం వల్ల పెళ్లి పీటల వద్దకు రాకుండానే ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి వారికి కొన్ని దోషాలు ఉంటాయి.

ఆ దోషాల కారణంగానే పెళ్లి జరగకుండా ఏదో శక్తి అడ్డు పడుతూ ఉంటుంది. అలాంటి దుష్ట శక్తిని తొలగించుకుని పెళ్లి చేసుకోవాలి 

అంటే తమిళనాడులోని తిరుమణ తిరుతల సుట్రుల్లా దేవాలయాన్ని సందర్శించాలి. 

అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఆ గుడిని సందర్శించి అక్కడ దైవారాధన చేయడం వల్ల వెంటనే పెళ్లి అవుతుందని నమ్మకం.

తమిళనాడులో ఎక్కువ శాతం ప్రజలు దీన్ని నమ్ముతున్నారు. 

తమిళనాడు నుండే కాకుండా కర్ణాటక మరియు కేరళ నుండి కూడా ఆ గుడికి వెళ్తారు. 

ఏపీలో కూడా కొందరు ఆ గుడికి వెళ్లడం వల్ల తమ పెళ్లి అయ్యిందని చెబుతున్నారు. 

ఆ గుడి మహత్తు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహాబలిపురం దగ్గర లో తిరువిడనత్తై వద్ద ఉన్న శ్రీ లక్ష్మి వరాహస్వామి ఆలయము ఉంది . ఈ ఆలయము లో లక్ష్మి దేవిని కోమలవల్లీ తాయారు గా మరియు విష్ణువును వరాహ అవతారం లో పూజిస్తారు. విష్ణువు సన్యాసికి పుట్టిన 360 మంది సంతానాన్ని పెళ్లి చేసుకున్నాడు కనుక, ఈ స్వామీని భక్తులు ‘నిత్య కళ్యాణ పెరుమాళ్’ గా వ్యవహరిస్తారు. తిరుమనం అంటే వివాహం, చేరి అంటే గ్రామం అని అర్ధం. 

పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. 

తిరుమనంచేరిని సందర్శించటం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయని చెప్తారు.

కుంభకోణం నుండి 7 కి.మీ ల దూరంలో ఉప్పిలి అప్పన్ ఆలయం కలదు. 

ఉప్పిలి అప్పన్ అంటే ఉపమానాలకు అందనివాడు అనుపమానుడు అని అర్ధం . 

ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలిక గా లభించింది. 

ఆమె ” కోకిలాంబాళ్ ” పేరుతో పెంచి పెద్దచేసి,

శ్రీ మహావిష్ణువు కిచ్చి వివాహము జరిపించాడని ప్రతితీ. ఆలయంలో ఉప్పులేకుండా నైవేద్యం పెడతారు.

తిరుకరుకావూర్ ఆలయము తంజావూర్ కు మరియు కుంభకోణం పట్టణాలకు 20 km ల దూరంలో కలదు. 

ఇది ఒక ప్రసిద్ద శివాలయ క్షేత్రము . ఇక్కడ అమ్మవారు గర్భరక్షాంబిగై . ఈ అమ్మవారి ని పెళ్లికాని వారు, సంతానము లేని దంపతులు .. భక్తీ శ్రద్దలతో పూజించి దర్శనము చేసుకుంటారు.

శ్రీ దేవి భూదేవి సమేత శ్రీమహా విష్ణువు ” సారనాథుడుగా ” కొలువై ఉన్నాడు. 

ఇక్కడి అమ్మవారికి ‘సారనాయకి’ అనే పేరు ఉంది. కావేరినది దేవి శ్రీహరిని ఇక్కడ వివాహము ఆడింది ఇక్కడేనని స్థలపురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలయము దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గొప్ప పుణ్య క్షేత్రము . 

పాండ్యరాజు తన కుమార్తె అయిన మీనాక్షి దేవిని చొక్కనాథుడు అయిన పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసిన స్థలము గా ప్రసిద్ది చెందినది . పెళ్ళికాని వారు మధుర మీనాక్షిదేవిని దర్శించుకోవడము అనాదిగా వస్తున్న ఆచారము.

పెళ్లి కానీ వారు ఈ దేవాలయంలో పూజలు చేయడం అనేది ఇప్పటి ఆచారం కాదు.. కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. పెద్దలు నమ్మిన ఈ ఆలయాన్ని ఇప్పటికీ అక్కడి వారు నమ్ముతున్నారు. 

ఎన్నో పెళ్లిళ్లు ఈ దేవాలయం లో దర్శనం తర్వాత అయ్యాయి అని అక్కడ వారు అంటుంటారు.

*⚛️నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ క్షేత్ర మహిమ:*

వివాహం ఆలస్యమవుతున్న వారు, వివాహ విషయాల్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ క్షేత్ర దర్శనం తో వివాహం జరుగుతుంది 

*⚛️ఈ క్షేత్రాన్ని దర్శించి క్రింది విధంగా చేయాలి.*

కోమలవల్లి సమేత వరాహ స్వామీ వారు కొలువైన క్షేత్రం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్. 

1. వివాహం కోసం ఇక్కడకు వచ్చే భక్తులు రెండు పూల మాలలు ఆలయం లో దేవుడికి సమర్పించాలి. (పూల మాలలు గుడి ఎదురుగా ఉన్న దుకాణాల్లో లభిస్తాయి)

2. గోత్ర నామాలతో అర్చన చేసిన పిదప  అందులో ఒక మాల ను పూజారి గారు తిరిగి భక్తుడి మెడలో వేస్తారు. 

3. ఆ మాల ధరించిన భక్తుడు గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి కోమలవల్లి అమ్మవారిని దర్శించి కుంకుమను తీసుకోవాలి. 

అలా చేసిన 3 నుంచి 6 నెలల్లో వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం అయిన తదుపరి దంపతులిద్దరూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి.

*⚛️దర్శన వేళలు*

ఉదయం6.00 నుంచి మధ్యాహ్నాం 12.00 వరకు 

సాయంత్రం 3.00 నుండి రాత్రి 8.00 వరకు.

*⚛️ఎలా చేరుకోవాలి*

చెన్నై నుంచి 45 kms 

మహాబలిపురం వెళ్లే బస్సులన్ని ఈ క్షేత్రం మీదుగానే వెళ్తాయి 


*⚛️చిరునామా*

నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్, 

తిరువిడెంతై ( THIRUVIDANTHAI)

కాంచీపురం dist తమిళనాడు.

[23/04, 10:25 am] +91 99850 01339: *కామదా ఏకాదశి*

*చైత్ర మాసం లో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి* అంటారు . 

ఇది సమస్త పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి. మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు.

స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా, దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు, వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా *'కామదా ఏకాదశి వ్రతం'* కనిపిస్తుంది.

చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే 'కామదా ఏకాదశి'అని, *'దమన ఏకాదశి'* అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.  

వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం, విశిష్టతను వివరించాడు .

వశిష్ట మహాముని దిలీప్ రాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు.

పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పున్దరికుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వాలు, కిన్నెరలు, అప్సరసలు రాజ్య సభలో పాటలు,నాట్యాలు చేసిన రాజునూ సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గందర్వులు ఆయిన లలిత అనే గంధర్వుడు, తన బార్య లలిత తో చాల అనోన్యంగా ,ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమం లో ఉన్నప్పుడు గంధర్వుడి సతిమని సభలో లేకపోయేసరికి తన అలోచోనలోపడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్హిచిపోయి  తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు వారు గంధర్వుడిని ఆగ్రహించిని అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తేనే బయపడే ఆకారం లో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి బార్య లలిత ఎంతో బాదపడి, దుఖంతో భర్తను తీసుకోని అడవులోకి ప్రయాణమైంది . 

అలా వింధ్యచల అడువుల్లో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది . 

అక్కడికి వెళ్ళిన లలిత, శ్రింగి మహర్షి తో తన కథ అంత చెప్పి, తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమనగా అప్పుడు శ్రింగి మహర్షి *కామాద ఏకాదశి* మహత్యాన్ని వివరించాడు అంతట గంధర్వుడి బార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో అచరించి, ఉపవాసం ఉండి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ స్వామి నేను బక్తి శ్రద్దలతో వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విదంగా ఆయన కాపాడాలి అని మనసులో తలచుకోని, అక్కడే ఉన్న బర్త వైపు చూడగా, వింత ఆకారంలో చూస్తే బయపడే ఆకారం లో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు.

మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుందని పురాణాలూ చెబుతున్నాయి .

******

యుద్ధము ప్రొద్దుటూరులో

No comments:

Post a Comment