Friday, 31 March 2023

ప్రాంజలిప్రభ..




*వ్యక్తిత్వ వికాస సూత్రాలు

===================

🌺నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.

🌺చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. 

🌺మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. 

🌺జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము...

🌺మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మనసులో నిలిచిపోయే మంచితనమే గొప్పది.

🌺 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.......

🌺 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.

🌺 నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న....

🌺 మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.

🌺 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.

🌺 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.

🌺 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.

🌺 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

🌺 మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .

🌺 ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

🌺 ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

🌺 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. 

🌺తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవిత పరమార్ధం


                 *జీవితమొక అందమైన అనుభవం.

*ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?*

గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి??? ...

*ప్రదక్షిణ అని దేనిని అంటారు??*

_అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు._

_ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తితో నడవడం అని చెబుతుంది._

స్కాందపురాణం ప్రదక్షిణంలో ప్రతీ అక్షరం గురించి చెబుతూ ...

*ప్ర - అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని,*

*ద - అంటే కోర్కెలను ఒసగేది అని,* 

*క్షి - అంటే కర్మను క్షయం చేసేది అని,*

*ణ - అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది...*

*శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అర్థం ఏమి???*

_మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని,_

_రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని,_

_మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం._

గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు...

పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు.

అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం.

అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితికి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది. 

ప్రదక్షిణ చేసేటప్పుడు కుడి నుంచి ఎడమవైపుగా నడుస్తాము, దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం. 

ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది.

కుడి వైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది.

అత్యంత మంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేయాలి...

ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం ఉంది, శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి...

*ప్రదక్షిణలు ఎలా ఉండాలి???*

_ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టుగా  నడవాలి అని శాస్త్రం చెబుతోంది_

 ఒక వలయం సెంటర్ నుండి సమాంతర దూరం గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం. 

ఆది శంకరాచార్యులు చెప్పినట్టు 1008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి అని అంటారు..

 21 ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమ శాస్త్రం చెబుతుంది ...

*శివతాండవం చూసేందుకు ఆదిశేషుడు ఎత్తిన అవతారం - పతంజలి*

భారతీయులు ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగశాస్త్రం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శాస్త్రపు విలువ పెరుగుతూనే ఉంది. ఆరోగ్యానికి అంతకు మించిన సాధన లేదని రుజువు చేస్తూనే ఉంది. అంతటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి గురించి మాత్రం పెద్దగా సమాచారం కనిపించదు. కానీ కొన్ని కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఇదిగో... శివుడు ఒకసారి దేవతలు, రుషులందరి సమక్షంలోనూ తాండవం చేశాడట. చూపరులందరినీ కట్టిపడేసిన ఆ తాండవం గురించి లోకమంతా గొప్పగా చెప్పుకోసాగింది. ఆ నృత్యాన్ని స్వయంగా వీక్షించిన విష్ణుమూర్తి సైతం శివతాండవం గురించి పదే పదే తల్చుకోసాగాడు. విష్ణుమూర్తిని మోస్తున్న ఆదిశేషునికి సైతం ఆ పొగడ్తలు చేరాయి. ఇంతమందిని అలరించిన తాండవాన్ని తాను చూడలేకపోయానే అని ఆదిశేషునిలో బాధ మొదలైంది. ఆ బాధ క్రమేపీ పెరిగి ఆయన మనసుని దహించివేసింది. ఎలాగైనా తాను కూడా శివతాండవాన్ని చూడాలని అనుకున్నాడు. కానీ అది మాటలు కాదు కదా! ఎప్పుడో కానీ సంభవించని సందర్భం అది.

ఆదిశేషుని మనసులోని దుగ్ధను గ్రహించిన విష్ణుమూర్తి- భూమిమీద జన్మించి, శివుని ధ్యానించి తన కోరికను తీర్చుకోమని సూచించాడు. అదే సమయంలో గోనిక అనే భక్తురాలు సంతానం కోసం భగవంతుని ప్రార్థిస్తోంది. ఒకరోజు ఆమె సూర్యునికి అర్ఘ్యం అందిస్తుండగా ఆ నీటిలో ఒక పాముపిల్ల రూపంలో అవతరించాడు ఆదిశేషుడు. అంజలి ఘటిస్తుండగా పతం (ఆకాశం) నుంచి వచ్చిపడ్డాడు కాబట్టి అతనికి ‘పతంజలి’ అన్న పేరు స్థిరపడిందంటారు.

పతంజలి పెరిగిపెద్దవాడయి సకలశాస్త్రాలనూ ఔపోసన పట్టేశాడు. చిదంబరంలో శివుని గురించి తపస్సు చేసుకుంటూనే వేదాధ్యయనాన్ని సాగించాడు. అదే సమయంలో చిదంబరంలో వ్యాఘ్రపాదుడు అనే మరో రుషి కూడా ఉండేవాడు. శివుని అర్చించేందుకు ఎంతటి శ్రమకైనా ఓర్చి పూలు సాధించేందుకు తనకు పులి పాదాలు కావాలని ఆ ముని కోరుకున్నాడట. అందుకనే ఆయనకు ఆ పేరు వచ్చింది. చిదంబరంలో ఉన్న ఆ ఇద్దరు రుషుల దీక్షకు మెచ్చి పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమైనాడు. వారి కోసం ఆనందతాండవాన్ని నర్తించాడు. అక్కడే నటరాజ స్వామిగా వెలిశాడు.

చిదంబరంలో వ్యాఘ్రపాదుడు, పతంజలి స్వామివారిని పూజించారనేందుకు నమ్మికగా అక్కడి చిత్రాలలో స్వామివారిని పూజిస్తున్న ఇద్దరు రుషులూ కనిపిస్తారు. అసలు చిదంబరంలోని ఆలయాన్ని పతంజలి స్వయంగా నిర్మించారని కూడా కొందరంటారు. నిజానికి పతంజలి పేరుతో చాలా ప్రముఖ గ్రంథాలే కనిపిస్తాయి. ఇవన్నీ రాసినవారు వేర్వేరు వ్యక్తులనీ.... భారతీయ సాహిత్యంలో కనీసం ఒక ఐదుగురు పతంజలిలు ఉన్నారని కొందరంటారు. కానీ పతజంలి అన్నవాడు ఒక్కడే అని మరికొందరి నమ్మకం! పతంజలి జీవన కాలం గురించి కూడా ఇలాంటి సందిగ్ధతే ఉంది. క్రీ.పూ ఊదో శతాబ్ది వాడని కొందరంటే అంతకు కొన్ని వేల సంవత్సరాల మునుపువాడని మరికొందరి వాదన.

ఏది ఏమైనా అప్పటివరకూ జ్ఞానులకు మాత్రమే తెలిసిన యోగసూత్రాలను క్రోడీకరించి ప్రపంచానికి అందించడంలో పతంజలి అనే వ్యక్తి చేసిన కృషి అసాధారణం అని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇక పతంజలిని సగం పాము రూపంలో కొలవడంలోనూ ఒక ఆంతర్యం కనిపించకపోదు. మనలోని కుండలినిని సర్పంగా భావిస్తుంటారు. నిద్రాణంగా ఉన్న ఆ కుండలినిని జాగృతం చేయగలిగిన రోజున మోక్షం సాధ్యమన్నది యోగుల మాట. ఆ కుండలినీ శక్తిని సూచించేందుకు యోగశాస్త్రకారుడైన పతంజలికి సర్పరూపాన్ని అందించి ఉండవచ్చు.

*🎣సేకరణ:

.......

*శివుడి నివాసం ఎలా ఉంటుంది?*

 *శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే.అయితే ఆ పరమేశ్వరుడు నివశించే ప్రాంతమంతా ఎంత* *శోభాయమానంగా ఉంటుంది?* *పరిసరాలలో ఏవేవి ఉంటాయి? అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు? అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథా సందర్భం. ఇది లింగ పురాణం యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఉంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్త్తెన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది.* *భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. సుగుంధ భరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతోనూ,* *విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి.* 

 *దేవదేవుడైన శంకరుడి మందిరం మణి విభూషితంగానూ, బంగారు మయంగానూ, స్ఫటిక నిర్మితంగానూ ఉన్న గోపురాలతో అలరారుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి.* *భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, రుషులు, గంథర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తుంటారు.* *కుబేర శిఖరం నుంచి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధ* *భరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంథర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నెరులు ఆ నదిలో ఆనందంగా స్నాన పానాలను చేస్తుంటారు. మందాకినీ నదికి ఉత్తర భాగంలోను, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబసదాశివుడు అమ్మ వారితో హాయిగా విహరిస్తుంటాడు అని లింగ పురాణం ఇలా శివ నివాస స్థానాన్ని పేర్కొంటోంది.* 

 *అలాగే ఇంద్రాదుల విషయానికొస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వతం శిఖరం మీద దానవులకు చెందిన ఎనిమిది పురాలు ఉంటాయి. సువర్ణ కోటరాద్రి మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న మహనీలాచలం మీద అశ్వ ముఖులైన కిన్నెరుల పదిహేను పురాలు, వేణు సౌదాద్రి మీద విద్యాధరులు ఉండే మూడు నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్ట వసువుల నివాసాలు, రత్న ధారాద్రి మీద సప్త రుషుల సప్త భవనాలు ఉంటాయి. ఏక శృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది.* 

 *గజ శైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలు ఉంటాయి. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతల ఆవాసాలు ఉంటాయి. ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో ఎనభై నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద, పంచకుటాద్రి పైన రాక్షసులకు చెందిన అయిదు కోట్ల నివాసాలు ఉంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన వంద పురాలు, తామ్రాభం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల ఏడు వేల పురాలు, పుష్ప కేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర, వాయు, నాగధికుల నాలుగు నివాసాలు ఉంటాయి.*

........


పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధమైన కురుక్షేత్ర రణరంగంలో విజయుడి రథం  జెండాపై ”కపి రాజు ”హనుమంతుడు కొలువై ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్య , అర్జునుని కోరికపై రధాన్ని నిలి పాడు పార్ధసారధి అయిన శ్రీ కృష్ణుడు. కిరీటి రధం దిగి, రెండు వైపులా ఉన్న సైన్యసమూహాన్ని చూశాడు అందరు బంధువులే, కావలసిన వారే. వీళ్ళందర్నీ చంపి, తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు. యుద్ధం చేయటం కంటే భిక్షంఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి. మనసంతా వ్యాకులం అయింది. కర్తవ్యమ్ తోచటం లేడు . శ్రీ కృష్ణ పరమాత్మ  నే శరణు కోరి కర్తవ్యం బోధించమని వేడుకొన్నాడు.

ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడైన అర్జునుని మనో భావం గుర్తించిన శ్రీ కృష్ణ భగవాననుడు వెంటనే పద్దెనిమిది అధ్యాయాలభగవద్గీతా సారాన్ని వినిపించి యుద్దోన్ముఖుడిని చేశాడు. భగవానుని గీతను అనుసరించి , విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .

పార్దునికి , పార్ధ సారధి విని పిస్తున్న భగవద్గీత నంతటిని అర్జునుని రథపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించుకొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తితో   నమస్కరించాడు . అప్పుడు గోపాల చక్రవర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హనుమంతా !నేను చెప్పినవిషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న గీతకు ”భాష్యం ”రచించు. దానితో నీ పిశాచ రూపం అంతరిస్తుంది ”అని శాపాన్ని , శాప విమోచనాన్ని తెలియజేశాడు పరమాత్మ .

........

పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఏలాగంటే?

ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది..

'నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను?

ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని?

'మరుసటిరోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు'...

అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది 'అన్నాడు...రాజు వెళ్ళాడు..

అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటుంటాడు.. అది చూసి రాజు ఆశ్చర్యపోయి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు.. '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''

నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.. రాజు ఆయన్ని చూసినపుడు, ఆ సన్యాసి మట్టి తింటూంటాడు..

రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపొమ్మంటాడు...

రాజుకు కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు... తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అంటాడు..

''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి..

'' రాజుకంతా గందరగోళంగా వుంది."అయినా అక్కడికెళతాడు..

చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు...

అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు...

గత జన్మ లో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి వుంటారు.. ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.. తినబోతుంటే

అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే...

ఆ నలుగురిలో మొదటి వాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు...

రెండవ వాడిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు..

మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటే ముసలిదానా ? ''అని నీచంగా మాట్లాడాడు...

కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' ఆవ్వా , నీవు చాలా నీరసంగా వున్నావు.. ఈ రొట్టె తిను, '' అని తాను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేసాడు...

ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు...

రాజు దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు..

రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు... 

........

మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు,     పిల్లలు కావాలను కొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే..!

ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు.

ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి.

కానీ..

డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగు చేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు...

అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు...

అందంగా ఉంటే సంతోషం ఉంటుందా ? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి.

సకల విద్యలనూ ఆపోసన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు.

కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం.

పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం.  కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. దానికి ఒక ఉనికి లేదు...

ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని

పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు..

ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి..

మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు.

నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదన కోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి..._

.......

 అదే చిట్టచివరి సంతోషానికి చిరునామా...ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం.

ఇదే జీవిత పరమార్ధం.

.......


ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకరోజు ఒకె ఒక్క క్షణం మనసు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది ..  అందరులా వచ్చి వెళ్లిపోవడమేనా జీవితం ? తెలిసినది ఎంత ? తెలుసుకోవలసినది ఎంత ? 

ఏది ముక్తి ? ఏది మోక్షం ? 

అది హిమాలయాల్లో దొరుకుతుందా ? 

గుడిలో మసీదులో చర్చులో దొరుకుతుందా ?? ఎక్కడ ? 


ధ్యానులకే దొరుకుతుందా , యోగులకే దొరుకుతుందా , 

సిద్దులకే దొరుకుతుందా ? మరి గృహస్తునికో ?????? 

 ఈ ఆలోచన క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు !!"


ఒక గురువుగారిని వీటికి సమాధానం చెప్పమని అభ్యర్దించాను .. 

"  వారు నువ్వు తెలుసుకోవడానికి ఎంతో సమయం ఉంది  అన్నప్రాశనలో నీకు ఆవకాయ ఎందుకు "

అన్నారు .. ఆ సమాధానంతో  మనసుకు సంతృప్తి కలగ లేదు .. 

ఎందరో ధ్యానులను , యోగులను , భిన్న ఆధ్యాత్మిక సంఘాలలో ఎందరో గురువులు చెప్పినది వింటూనే ఉన్నా .. 


ఇంతలో ఓ మహానుభావులుతో పరిచయం జరిగింది .. వారికి సిద్దులు లేవు మహిమలు లేవు ,, కాషాయము లేదు ,, ఆశ్రమాము లేదు .. వారు గృహస్తులు { కర్మయోగులు , జ్నానయోగులు }

వారి ధ్యారా నేను తెలుసుకున్న సత్యాలు 

మీతో పంచుకుంటూ ..... 


ముక్తి " మోక్షం " అంటే అందరూ భగవంతునిలో ఐక్యం అవ్వడం లేదా మరో జన్మ లేకుండా ఉండటం అంటారు" 

' స్దూల ' సూక్ష్మ ., కారణ , మహాకారణ తో  తయారు కాబడిన ఈ పదార్దములో  "ఆత్మకు మరణం లేదు " మరి ఐక్యత ఎక్కడ .. ??? ఎవరిలో ఐక్యత ?? 

 ఈ అనంతకోటి జీవరాశిలో ,, ఎన్నెన్నో లోకాలలో ఎక్కడో ఒక్క చోట  నీవు ఉండవలసినదే ... 

అది ఎక్కడ అనేది నీవు చేసే కర్మలపై 

ఆధారపడి ఉంటుంది ..  

అంటే ఎక్కడో ఒకచోట ఆత్మ ఉండే తీరుతుంది .. 


ఇక ముక్తి అంటే విడుదల "" 

మోక్షం అంటే  dukkha రహిత స్దితి "" 


విడుదల '' అంటే భార్య బిడ్డలు ఇల్లు సంసారం వదిలేసి స్వేచ్ఛగా ఎగిరి పొమ్మని కాదు .. నీకున్న దేహ ధర్మాలు నిర్వహించకుండా పండుబోతుగా పరుగులు తీయమని కాదు ... 


కార్యా కారణ సంభంధాలతో ఏ పని (కర్మ ) పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చోవో , అది పూరించకుండా పరుగులు తీస్తే 

నువ్వు ఎందుకు వస్తున్నావు .. ఎందుకు వెళుతున్నావు .. ????? 

 ఒకవేళ నువ్వు ఎక్కడికో పరుగులు తీసినా  దుఖము లేని స్దితిలో  ఆశ , మొహం , కోరిక లేని స్దితిలో జీవించగలవా ? లేదు .. 

ఒకవేళ జీవించగలను అనుకుంటే నిన్ను నీవు మభ్యపెట్టుకున్నట్లే .. 


మరి గృహస్తునికి ముక్తి ' మోక్షం ఎలా ? 


"చేసే ప్రతి పని నిష్కామముగా చేయడం " ఫలితం ఆశించకుండా చేయడం " సమర్పణా భావంతో చేయడం " కష్టం అయినా కన్నీళ్లు అయినా వాని ప్రసాదంగా 

భావించడం ... " ఎప్పుడయితే నీవు కర్మయోగిగా కదలిపోతూ ఉంటావో '' మెల మెల్లగా జ్నానమ్ నీకు జత చేరుతుంది 

ఈ  జ్నానాగ్ని లో నీ కర్మలు అన్నీ దగ్దం అయిపోతాయి ... 

 నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు సాక్షిగా మాత్రమే ఉంటావు ".. ఆనందమయునా ఆశ్రువులయినా ... 

దేహం తన ధర్మం తాను చేస్తూ ( ఇంటి వాచ్ మెన్ లా )

 ఇదేది నాది కాదన్న భావనతో మనస్సు , బుద్ది , వాక్కు ఏకమై సమస్దితిలో "" నేను అన్న అహం వదలి "" 

తూహుం తూహుం "" ( నువ్వు నువ్వు అంటూ )దుఖ.. రహితమయున సమస్దితి (సమాధి స్దితి ) అన్నిటికి అతీతమయున స్దితి  అదే నీకు నువ్వు విడుదల " అదే నువ్వు కోరుకున్న ముక్తి "


మరి ఈ స్డితికి నువ్వు చెరాలంటే "  సాధన " సాధన" సాధన " అహం నుండి తుహుం వరకు ...... ( నేను నేను కాదు అంతా నువ్వే నువ్వే)

No comments:

Post a Comment