Friday, 17 March 2023

ప్రాంజలి ప్రభ 22/03 ఉగాది స్పెషల్



: ఉగాది ప్రార్ధన స్తోత్రాలు:

1. బ్రహ్మ దేవుని స్తోత్రం:

ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహత్మనే 

నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహత్మనే నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనేll 

2. శ్రీ శోభకృత్ సంవత్సర ప్రార్ధన:

సహోజసం శోభకృతం నృణామిష్టదమాశ్రయే శిబికావాహనారూడం చామర ద్వయ పాణికంll 

3. సంవత్సర రాజు స్తోత్రం.

ప్రియంగు గుళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।

సౌమ్యం సౌమ్య  గుణోపేతం తం బుధం ప్రణమామ్యహంll 

4. ఉగాది పచ్చడి స్తోత్రం

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ

సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్‌॥

****

: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది రోజున ఆచరణ విధి

1. సూర్యోదయం కన్నాముందే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి.

2. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.

3. ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగురవేయాలి.

4. నిత్య నైమిత్తిక కర్మలన్నీ ముగించుకోవాలి.

5. ఇష్ట దేవత కుల దేవతలను పూజించుకోవాలి.


6. పంచాంగంను పూజించి ఉగాది పచ్చడి నివేదన చేయాలి.

ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ

సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్‌॥

వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై , సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.

ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-

అబ్దాదౌ నింబకుసుమం

శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌

భక్షితం పూర్వయామేస్యా

తద్వర్షం సౌఖ్యదాయకమ్‌॥

ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.

****

 Malapragadasridevi: నిర్ణయ సింధువు

తిథి నిర్ణయము (పండుగులు)

చైత్ర శుక్ల పాడ్యమి (సంవత్సరాది) :

చైత్రమాసమున ప్రథమ దివసమున సూర్యోదయవేళ బ్రహ్మ జగత్తులను సృజించెను. కావున అది సంవత్సరారంభము. సూర్యోదయవేళకు పాడ్యమితిథి యున్న రోజే సంవత్సరాది పండుగు. సంకల్పాదులకు ఎప్పుడును సూర్యోదయ కాలమందున్న తిథినే గ్రహించవలెను. (హేమాద్రిలో బ్రాహ్మ)

రెండురోజులు సూర్యోదయవేళకు పాడ్యమితిథి యున్నచో మొదటి రోజే యుగాది. ఇదే మన్వాది కూడా. (వృద్ధవసిష్ఠుడు, జ్యోతిర్నిబంధము) 

యుగాదినాడు ఉపవసించి సంవత్సర పురుషుని పూజించ వలెను. (హేమాద్రి, విష్ణు ధర్మము)

చైత్రము మల (అధిక) మాసమైనచో నిజమాసమునందే యుగాది యగునని కొందరందురు కాని అదిసరికాదు. మలమాసము పూర్వ సంవత్సరమునకు చెందినది కాదు. అందుచే అధిక చైత్రశుద్ధ పాడ్యమియే యుగాది. (అపరార్కము, భవిష్యపురాణము)

ఈ యుగాదినాడు తైలాభ్యంగనము తప్పక చేయవలెను. (వసిష్ఠుడు) 

ఈనాటినుండి నాలుగు మాసములపాటు ధర్మాత్ములు చలి వేంద్రములు స్థాపింతురు. అంతకు శక్తి లేనివారు ఒక్క కుండతోనైన మంచినీళ్ళు ఇంటిముందు ఉంచవలెను.

ఈరోజున చూత (నింబకుసుమ (వేపపూవు) భక్షణము ఆచారము) కుసుమ భక్షణము చందనముతో గలిపి చేసినచో ఆ సంవత్సరమంతయును సుఖపడుదురు.

***

"ఉగాది" ఆచరణ విధానం: 

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది. 

ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

ప్రాంజలి ప్రభ ఉగాది సందర్భముగా ఇచ్చిన  అంశం తీపిపదార్ధాలు " తేటగీతి లో భాగంగా," ) (మల్లాప్రగడ రామకృష్ణ)  వ్రాసిన పద్యాలు  (బందరు లడ్డు"తో మొదలై,కాకినాడ కాజాలు,పూతరేకులు, ఒంగోల్ మైసూర్ పాక్,పంచదార చిలకలు,మోతీచూర్ లడ్డు,అరిసెలు,సున్నుండ,పకోడి,సారె,అత్తారిల్లు,బొమ్మల కొలువు,షడ్రుచులు,స(చ)క్కినాలు,సమోసాలతో ముగించడం మనోహరం.


ఉగాది పండుగను ముందుగానే చేశారు.వాటిని ఒక్కచోటే అందిస్తున్నాను.


*గురువు గారు ఇచ్చిన అంశం: బందరు లడ్డు


తే:: నెయ్యి వేసి సెనగపిండి వేపుచూపి 

బూ౦ది తీసి మెత్తగచేసి  బుద్ధితోను 

గుండ్రముగను చేసియు ఆర యుంచ వలెను 

బందరను లడ్డు తినగాను బంధ మొవ్వు 

 ....      

*మీరిచ్చిన అంశం : కాకినాడ కాజాలు


తే:: పిండి మడతలతోచేయు తీపి కాజ

కాకి నాడకే పేరున్న కళల కాజ 

విరివిగా తయారుయగుట విజయ కాజ 

నిత్యమూ శుభ కార్యాల తీపి వంట 

.....  

*మీరిచ్చిన అంశం : పూతరేకులు

 

తే:: ఆంధ్ర పూతరేకులు తిను అలక మరు

పొరల చుట్టమిఠాయిలు పిలుపు యదియు

ఆత్రెయ నగరము నందుతయారు చేయు 

నిత్య నోరూరు తీపి మిఠాయి ఇదియు    

 ****

ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు.

ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు.

“భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..”

భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి” అన్నాడు. భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు తన నగరంలో దండోరా వేయించాడు.

"రేపు అందరు కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికి కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇది రాజుగారి ఆజ్ఞ!”  రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. 

అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి, "అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే.. మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు. కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు 'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!

రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక అందరికి ఒకచోట వెండి నాణేల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు.

వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు కదా!’ అనిపించింది.

ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది.  ప్రజలలో ఇక మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంక కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు. “చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగవంతుడి నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!” నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు.


కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించి, "మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగుచేసి ఉంచుతాను" అంది.

అదిచూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు.

"ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో.. ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.” 

రాజుగారు చాలా సిగ్గుతో, భగవంతుని ముందు తలదించుకున్నాడు.

ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు.

“ఓ రాజా, ఎవరైన సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికి నేను లభించను, కనిపించను! వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”

ఎవరైన సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతున్ని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, ఇష్టంతో భక్తితో భగవంతున్ని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

*****

*పంచాంగం కేవలం బ్రాహ్మణులకేనా?

ఈ రోజు చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చాక, చాలామంది క్యాలెండర్ చూసుకునేది కేవలం సెలవులు ఎప్పుడొస్తాయాని తెలుసుకోవటానికే. ఎందుకంటే వారికి ఉండే పని ఒత్తిడి అలాంటిది. కానీ నిజానికి మనం పాటించేది క్యాలెండర్ కాదు, పంచాంగం.

పంచాంగం కేవలం బ్రాహ్మణులకు సంబంధించినది కాదు. అది ముహూర్తాల వరకే ఆగిపోదు. వండ్రంగివారు, మేస్త్రీలు, ముఖ్యంగా రైతులు ఈనాటికి పంచాంగం చూస్తారు. ఎప్పుడు నిర్మాణం మొదలుపెట్టాలి, కర్తరి ఎప్పుడు ఉంది అనేవి వడ్రంగి వారు చూస్తే, ఏ కార్తె ఎప్పుడు వస్తుంది, పంట ఎప్పుడు వేయాలి? ఏ నక్ష్త్రంలో పంట వేయాలి? అది ఊర్ధ్వముఖ నక్షత్రమా? అధోముఖమా? ఇలా ఎన్నో విషయాలను చూసి రైతు పంట వేస్తాడు. విత్తనం వేయడం దగ్గరే పంచాంగంతో పని మొదలవ్వదు. విత్తనాలు ఏ ఋతువులో సేకరించాలి, మేఘాలను, గాలిని, ప్రకృతిని పరిశీలించి రాబోయే కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి మొదలైన ఎన్నో విషయాలు జ్యోతిష్యం చెప్పింది. కృషి పరాశరా మొదలైన గ్రంథాలు వీటి గురించి విపులంగా వివరిస్తాయి. అంతెందుకు ఈనాటికి చాలా ఊళ్ళకు వెళితే, ఏ చదువు రాని వారు కూడా పంచాంగం చూసి, ఏ కార్తెలో ఎంత ఎండ కాస్తుంది, వర్షం ఎప్పుడు పడుతుంది అనేవి చెప్పేస్తారు. వారేమీ బ్రాహ్మణులు కారు. అందులో మాలమాదిగలు కూడా ఉన్నారు. పంచాంగం అందరిది. ముఖ్యంగా కాయకష్టం చేసుకుని, ప్రకృతి పై నేరుగా ఆధారపడి జీవించే శ్రమజీవులది, కృషీవలులది, కర్షకులది.  

ప్రకృతి పులకించి, వసంతంలో చెట్లు చిగురించే సమయానికి ఉగాది వస్తుంది. అది ప్రకృతిలో నూతన ఆరంభానికి గుర్తు. అదే మన నూతన సంవత్సరం కూడా. అందుకే ఆ రోజు సాయంత్రం ఊళ్ళో అందరూ గుడి దగ్గరకు చేరుకున్నప్పుడు, ఆ ఊరి పురోహితుడు, అక్కడి రైతులను, శ్రమజీవులను ఉద్దేశించి పంచాంగ పఠనం చేస్తారు. అక్కడ కూర్చున్నవారు పంచాంగ పఠనం చేస్తారు. ఆ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా కాస్తాయి, ఏ పంట బాగుంటుంది, ఆ సంవత్సరానికి నవనాయకులు ఎవరు? మొదలైనవి ఆసక్తిగా వింటారు ప్రజలు. అయితే అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ప్రజలు నిత్యం పంచాంగం చూస్తూనే ఉంటారు.  

కానీ గత 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది రైతుల్లో ఈ జ్ఞానం కొరవడుతూ వస్తోంది. అందుకే రైతన్న ఢీలా పడుతున్నాడు. 

కాకపోతే ఇదే కాక మరో బాధాకరమైన అంశం ఏమిటంటే రాజకీయనాయకుల ఒత్తిడల వల్ల చాలామంది పంచాంగ కర్తలు అసలు విషయం చెప్పకుండా, ఉన్నవీ లేనివి కలిపి వారి మెప్పు కోసం పంచాంగం చెబుతున్నారు. పంచాంగం పరువు తీస్తున్నారు.

పాతతరం నుంచి కొత్త తరం పంచాంగం చూడటం నేర్చుకోవాలి. తద్వారా ప్రకృతిని ముందే గమనించి, అంచనా వేసి, ఇబ్బందులకు గురికాకుండా దేశానికి మంచి దిగుబడిని అందివ్వవచ్చు.


🌿🌼🙏#ఉగాది_పండగ విశిష్టత 🙏🌼🌿"#ఉగాది_ఆచరణ_విధానం🙏🌼🌿 #ఉగాది_పచ్చడి #చేసేవిధానం 🙏🌼🌿🌿


🌿🌼🙏ఉగాది పండగ విశిష్టత 🙏🌼🌿


🌿🌼🙏తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ  పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.🙏🌼🌿


🌿🌼🙏కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఈ రోజు నుండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది. ఈ సమయంలో వృక్షాలు కొత్త ఆకులు, పూలతో చూపరులను ఆహ్లాదపరుస్తాయి.🙏🌼🌿


🌿🌼🙏ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. "యుగ" అనగా కాలమని "ఆది" అంటే ఆరంభం అని అర్ధం. తెలుగువారు "ఉగాది" అని కన్నడిగులు "యుగాది" అని మరాఠీలు "గుడి పాడ్వా" గా ఈ పండగని జరుపుకుంటారు. ప్రవాసులు తమ తమ దేశాల్లో "ఉగాది"ని ఆచారాలకనుగుణంగా నిబద్ధతతో జరుపుకొని విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తుంటారు.🙏🌼🌿


🌿🌼🙏ఉగాది రోజున కొత్త పనులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్ముతారు.  అంతే కాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం ఆనవాయితీ.🙏🌼🌿


🌿🌼🙏ఉగాది చరిత్ర కోణం 🙏🌼🌿


🌿🌼🙏బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాది పండగ అని పురాణాల ప్రవచనం. ఈ ఉగాది పండగ చారిత్రిక వివరాలను కూడా కలిగి ఉంది. ఉగాది పండగ శాలివాహనుల కాలం నుండి ఆచరణలో ఉన్నాదని చరిత్రకారుల మాట. అప్పటి శాలివాహనుల రాజు "గౌతమీపుత్ర శాతకర్ణి"గా పేర్గాంచిన రాజా శాలివాహన ఉగాది పండగకు శ్రీకారం చుట్టారు.🙏🌼🌿


🌿🌼🙏చాంద్రమాన కాలం ప్రకారం ఒక యుగానికి 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొనే ఉగాదికి ఒక పేరు చొప్పున 60 పేర్లు పెట్టినట్లు చరిత్ర చెపుతోంది. ఈ 60 ఉగాది నామ సంవత్సరాల తరువాత వచ్చే ఉగాదికి తొలి సంవత్సరపు ఉగాది పేరుతొ తిరిగి ప్రారంభం అవుతుంది.🙏🌼🌿


🌿🌼🙏"ఉగాది" ఆచరణ విధానం🙏🌼🌿


🌿🌼🙏ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.🙏🌼🌿


🌿🌼🙏(1) తైలాభ్యంగనం🙏🌼🌿


🌿🌼🙏తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.🙏🌼🌿


🌿🌼🙏(2) నూతన సంవత్సర స్తోత్రం🙏🌼🌿


🌿🌼🙏అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.🙏🌼🌿


🌿🌼🙏(3) ఉగాడి పచ్చడి సేవనం🙏🌼🌿


🌿🌼🙏ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!🙏🌼🌿


🌿🌼🙏అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.🙏🌼🌿


🌿🌼🙏(4) పూర్ణ కుంభదానం🙏🌼🌿


🌿🌼🙏ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.🙏🌼🌿


(5) పంచాంగ శ్రవణం🙏🌼🌿


🌿🌼🙏తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది. 🙏🌼🌿


🌿🌼🙏ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు.🙏🌼🌿


🌿🌼🙏 ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి🙏🌼🌿


🌿🌼🙏ఉగాది సంవత్సరాల నామాలు - వివరణ 🙏🌼🌿


🌿🌼🙏ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2021 ఉగాది ప్లవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది.🙏🌼🌿


1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోద్యూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భావ, 9.యువ, 10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాధి, 14.విక్రమ, 15.వృష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ , 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, 30.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత, 37.శోభకృత, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత, 46.పరిధావి, 47.ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నల, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్థ, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58.రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.


🌿🌼🙏ఉగాది ప్రత్యేక వంటకాలు 🙏🌼🌿


🌿🌼🙏రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో "బొబ్బట్లు", "పూర్ణం బూరెలు" విధిగా చేస్తారు.ఈ రెండు వంటకాలు తెలుగు ప్రజల పూజల్లో "పవిత్ర వంటకాలు"గా నిలుస్తాయి. తెలుగు ప్రజలు ఈ రెండు వంటకాలను తాజా ఆవు నెయ్యిని జోడించి ఆరగిస్తారు.🙏🌼🌿


🌿🌼🙏ఉగాది పచ్చడి విశిష్టత🙏🌼🌿


🌿🌼🙏"ఉగాది"నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి.🙏🌼🌿


🌿🌼🙏ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.🙏🌼🌿


కొత్త #బెల్లం ఆకలిని కలిగిస్తుంది.


 #చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.


#పచ్చిమిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.🙏🌼🌿


#మామిడి_ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.


#వేప_పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.


🌿🌼🙏ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం 🙏🌼🌿


ఒకటిన్నర కప్పు నీరు.

రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు.

కొద్దిపాటి వేప పువ్వులు.

మూడు టేబుల్ స్పూన్ల బెల్లం.

తగినంత ఉప్పు.

రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు

ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.


🌿🌼🙏ఉగాది పంచాంగ శ్రవణం 🙏🌼🌿


🌿🌼🙏ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు.🙏🌼🌿


🌿🌼🙏ఉగాది శుభాకాంక్షలు 🙏🌼🌿


🌿🌼🙏ఈ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఒకరినొకరు "నూతన ఉగాది శుభాకాంక్షలు" తెలియపరచుకోవటం పరిపాటి. పిల్లలు పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు తీసుకొంటారు.🙏🌼🌿

No comments:

Post a Comment