*శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం–9,10,11*
*కపిలుని కధ*
*పరాశర మహర్షి మైత్రేయునికి ,హనుమ ఏడవ అవతారానికి చెందిన ”నీలుని కధ ”ను తెలియ జేస్తున్నాడు. పూర్వ కాలంలో గంగానది ఒడ్డున బార్హస్పత్యపురం అనే గ్రామం వుండేది.
*అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు వుండే వాడు. వేద వేదంగా విదుడు దైవాన్ని నమ్మి ,నిష్కామంగా సంసారాన్ని పోషిస్తున్నాడు. రోజూ గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడశాక్షరి మంత్రమైన ”ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చలా వల్లభ హనుమతే స్వాహా ‘అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానం చేసేవాడు. అవసరమైన శాకాలను సంపాదించి ,ఇంటికి చేరే వాడు.
*అనుకూలవతి అయిన భార్య లేమికి చింతించ కుండా గుట్టు గా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆకుటుంబం జీవనం సాగిస్తోంది. గంగా స్నానం ,హనుమ జపంతో జీవితానికి సార్ధకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒక రోజూ సువర్చలా మనోహరుడు, భక్త వత్సలుడు, రామ బంటు ,భక్త శిఖామణి ప్రత్యక్ష మైనాడు. హనుమ నాలుగు భుజాలతో చంద్ర కాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో వున్న కుండలాలతో దుకూలంతో ముత్యాల హారాలతో ముంజ మేఖలం తో జాంబవత వినత నీల పావన గంధ మాదన సుశేణ మైండ ద్వివిదులతో ప్రత్యక్షమైనాడు.
*ఆంజనేయ స్వామి స్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు ఆనందంతో మాటలు నోటి నుండి రాలేదు. కొంచెం సేపటికి తేరుకొని ,”స్వామీ హనుమా !నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు.
”జయచాపి సువర్చలా రవిసుతా దివ్యం చ హేమామ్బరం
మాణిక్యా మ్చిత కుండలే ,శ్రవణ యొహ్ కంతేచ ముక్తావళి హ్
సుగ్రీవ అంగద గంధ మాదన ముఖః సత్పార్శాదాస్సంతితే
కిం దాశ్యామి మనః ప్రియం హి హనుమాన్ సంపూర్ణ కామో భవాన్ ”
*సూర్య దేవుని పుత్రిక సువర్చల నీ భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి. మెడలో తెల్లని ముత్యాల హారం సుగ్రీవుడు అంగదుడు గంధ మాదనుడు మొదలైన హేమా హేమీలు నిన్ను ఎప్పుడు కొలుస్తూ వుంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్ర భావం.
*ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. కపిలుడు హనుమతో అతని వెంట వున్న పరివారం వివరాలు తెలియజేయ వలసినదిగా ప్రార్ధించాడు. అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం వున్న వాడు గంధ మాదనుడు అని గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని మిగిలిన వారందరూ మహా మహులే నని వారంతా తనకు ఇరువైపులా వుండే పార్శదులేనని వారేజాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు అని వివరించాడు.
*వీరంతా మహా బలాధ్యులు కార్య దక్షులు అని చెప్పాడు. కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ ”కపిలా !రోజూ నువ్వు నాకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా అయినది. దానికి ”వాల సాగరం ”అని పేరు ఏర్పడుతుంది.
*ఇందులో ఎవరు స్నానం చేసినా ,పవిత్రులు అవుతారు. వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైన వీరిని పూజించి ,తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు ఆవ మానం జరిగి నట్లే నా అవతారాలు రూపాలు వేల కొద్దీ వున్నాయి .ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను .”అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్య మైనాడు .
*కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ,నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందం తో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకొని వెళ్ళ కుండా చేరాడు. జరిగిన విషయం అంతా భార్యకు పూస గుచ్చినట్లు తెలియజేశాడు. ఆమె చాలా సంతోషించి ,ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇంక ఏ లోటు ఉండదని ,ఏమీ తీసుకురాలేక పోయినందుకు బాధ పడవద్దని ఊ డించింది .
*అయినా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేక పోవటం చూసి మనసులోని బాధను బయటికి చెప్పింది ”స్వామీ ! మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు వేద శాస్త్రాలన్నీ చదివారు. అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా...మా తండ్రికి మీ అసమర్ధత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లకు కాని నాకు కాని సరైన బట్టలే లేవు చిరిగినా వాటితో కాలక్షేపం చేస్తున్నాం.
*అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంత వరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో అంతా గడిపేశారు. ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచి పెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు పాకులాడుతున్నారు. వదిలి వేరే ఎవరి నైనా ఆశ్రయించండి ”అని అతి నిష్టూరంగా అన్నది. ఈ మాటలు భరించ లేక భగవంతుని దూషించటం పాపం అని హితవు చెప్పి ఆతడు లోపలి వెళ్లి పోయాడు .
*ఇంతలో హనుమ ప్రత్యక్ష మైనాడు.జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు. విచారించ వద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెప్పాడు. వాళ్ల ఇంటి వెనుక వున్న రేగు చెట్టు మొదట్లో ధన రాసివుందని దానిని తెచ్చుకొని అనుభవింపమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్య మైనాడు మారుతి
*ఈ విషయం భార్యకు చెప్పాడు ఆమె నమ్మ లేదు మోసం అంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం వుంటే ,ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిస్టురాలాడింది .అతని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి బార్య నిద్రించిన సమయంలో హనుమ రేగుచెట్టు కింద వున్న ధన రాసులతో వున్న పెట్టెను బయటికి తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు.
*కపిలుడు భయ కంపితుడై ,అంత బరువు గల పెట్టెను తాను హనుమ శిరసు మీద పెట్టలేనని ఏడ్చాడు. కాపాడమని ప్రార్ధించాడు. కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ,ఆ పెట్టెను తానె నెట్టి పైకి ఎత్తుకొని ,నిద్ర పోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను .ఇదే నీకు చివరి జననం ”అని చెప్పి అదృశ్యమైనాడు.
*మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్ర లేచి ,తన ముందున్న అనన్త ద్రవ్య రాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్య పోయింది .తన్ను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది .దైవాపచారానికి మన్నించమని హనుమను ప్రార్ధించింది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు.
*అందరి కోర్కెలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా ,మనసంతా నువ్వే అని అతను హనుమ చరనాలనే ఆశ్రయించి చివరికి సాయుజ్యం పొందాడు కపిలుడు. నమ్మిన వారికి నమ్మినంతా సాయం ఇచ్చే వాడు ఆంజనేయుడు అని ఈ కధ మనకు తెలియ జేస్తోంది.
దీని తరువాతి కధ సోమ దత్తుని కధ .
***
*ఆంజనేయ మహాత్మ్యం —12*
*సోమ దత్తుని కధ*
*హనుమ ఎనిమిదవ అవతారంలోని సోమ దత్తుని కధను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నారు. పూర్వం సోమదత్తుడు అనే చంద్ర వంశరాజు వున్నాడు. సత్య వాది అహంకారం లేనివాడు, మౌని ఆతి దేయుడు, పరాక్రమ వంతుడు, శత్రువులను జయించిన వాడు, భూమి నంతటినీ ఏక చత్రాది పత్యంగా పాలించాడు, అతని చేత జయింపబడిన రాజులు అందరు ఏకమై, ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు.
*భీకర యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతముగా నష్ట పోయాడు. పరాజయాన్ని తట్టు కో లేక ,భార్యా పిల్లలతో రహశ్యంగా అడవులకు పారి పోయాడు .
కొంత కాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి నివశిస్తున్నాడు.
*అతనికి గుడ్డి తనం,మూగతనం,చెవుడు,కుంటితనం ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దుర్దశకు విపరీతంగా చింతి స్తున్నాడు. భార్య మాత్రం అతనికి ధైర్యం నూరి పోసింది. అంతా కర్మ ఫలం కాలమే ఈ బాధల్ని మాన్పుతుంది అని ఊరడించింది.
*ఆపదలలో ధైర్యం,సంపదలలో క్షమా,సభల్లో చక్కని ప్రసంగం,యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడ వడి సంపదలో ఓర్పు ,బ్రాహ్మణుల యెడ భక్తీ మనం కలిగి వుండాలని బోధించింది .కొబ్బరి కాయలోని నీళ్ళు లాగా జరగాల్సింది జరిగిపోతూ వుంటుంది. అని ధైర్యం చెప్పింది.
*దగ్గరలో గర్గ మహర్షి ఆశ్రమం వుందని ,ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెప్పింది. ఇద్దరు ముని ఆశ్రమానికి వెళ్లి గర్గుని పాదాల పై పడి శరణు కోరారు .
వారు వచ్చిన సందర్భాన్ని గర్గ ముని గ్రహించారు.
*”రాజా !నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరచి నందున నీకు ఈ ఆపద కల్గింది. భగవంమంత్రాన్ని జపిస్తూ,మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది .”అని తెలిపాడు
సోమ దత్త మహా రాజు గర్గుని పాదాలను స్పృశించి ”మహాను భావా !మీరు చెప్పింది అక్షర సత్యం.
*ఇప్పుడు నా దుస్తితి తొలగి పోవటానికి ఉపాయం అనుగ్రహించండి. సద్యో ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి. నిష్ఠగా జపించి మనో భీష్టసిద్ధిని పొందుతాను అని వేడుకొన్నాడు.
గర్గ మునికి అనుగ్రహం కలిగి ”రాజా !జరిగి పోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫలసిద్ధి నిచ్చే ”హనుమంమంత్రాన్ని ”ఉపదేశిస్తాను.
*దాన్ని జపిస్తూ,హనుమద్ వ్రతం చేయి. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. శత్రు జయం కలుగుతుంది హనుమద్ వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడుకాని,మాఘ, ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో శుక్ల పక్షంలో మొదటి శనివారం కాని, ఈ నెలల్లోనే వచ్చే మృగశిరా నక్షత్రంలో కాని శ్రావణ పూర్ణిమ నాడు కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని ,మార్గ శిర శద్ధ త్రయోదశి రోజున కాని చేయాలి .
*పగలైనా సాయంత్రమైనా వ్రతం చేయవచ్చు .బంగారం వెండి ,రాగి రేకు పై చెక్కించిన యంత్రం ,లేక భూర్జర పత్రం మీద రాసిన యంత్రాన్ని ,బియ్యం పిండి తో వేసిన యంత్రం మీద కాని ,విగ్రహంలో కాని ,నీరున్న కలశంలో కాని ,పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కాని ఆవాహనం చేయాలి శ్రద్ధగా పూజించాలి పద మూడు ముళ్ళు గల తోరాన్ని పూజించి, ధరించాలి.
*పద మూడు నేతి అప్పాలను దానం చేయాలి .పూర్వం శ్రీ రాముడు ,విబీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు .నువ్వు చేసి రాజ్యాన్ని సుఖాలను పొందు ”అని చెప్పాడు .
*సోమ దాత్తుడికి ”పంచ ముఖాన్జనేయ మహా విద్యను ,ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమద్ వ్రతం దగ్గరుండి జరిపించాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బల పరాక్రమాలు సిద్ధించాయి. వ్యాదులన్నీ మాయ మైనాయి. మంచి రూపం వచ్చింది. ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందర్నీ జయించి రాజ్యాన్ని దక్కించుకొన్నాడు.
*ధర్మ మార్గంలో నడుస్తూ...ప్రజల్ని బిడ్డల లాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితుని గా చేసుకొని సత్ర యాగం చేశాడు. దీనితో సప్త ద్వీపాలను జయించాడు. ఎనిమిది మంది కుమారులు కలిగారు ఆనందంగా జీవితాన్ని గడిపి ,పెద్ద కుమారుడికి రాజ్యం అప్ప గించి ,దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకొంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు .
*అందుకే హనుమంతుని మించిన దైవం లేదు. హనుమద్ వ్రతాన్ని మించిన వ్రతమూ లేదు .
హను మంతుని పూజిస్తే ,త్రిమూర్తులు సంతోషిస్తారు. సర్వ దేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి ,ధనంలేని రాజు ,హనుమన్నామం లేని ప్రబంధం వ్యర్ధం .
*”మైత్రేయ ,నీల ,విజయ ,ధ్వజ దత్త ,గాల -మైన్గాంగా దశ్చ ,భారతం ,సుషేషణం
హరీత ,కశ్యప ,సుపుష్కర ,సోమ దత్తాన్ పుణ్యం స్మరామి హనుమత్పద పద్మ భక్తాన్ ”
***
*ఆంజనేయ మహాత్మ్యం —13*
🌻 *గాలవుని కధ* 🌻
*పూర్వం గాలవుడు అనే కిరాతకుడు వుండే వాడు. ఆహారం కోసం జంతువులను వేటాడేవాడు. ఇంటిని లక్ష్మీ కళతో నిర్వహించే వాడు. సాదు జీవనం గడిపేవాడు.
* అతనికి నలభై సంవత్సరాలు వచ్చాయి. ఏదో తీరని బాధతో దిగులుగా వుండేవాడు.
ఒక రోజు గాలవుడు వేటకై అడవిలోకి వెళ్లి ఒక జింక కనపడగానే దాన్ని వెంబడించాడు. అది మధ్యలో మాయమై కనిపించలేదు. మృగం కనిపించనందుకు బాధపడ్డాడు.
*తాను చేరిన ప్రదేశం ,నైమిశారణ్యం అని గ్రహించాడు. ఇక్కడ వున్న ,మహర్షులను సేవించి ,మనో వ్యాధిని మాన్చుకోవాలని భావించాడు .దగ్గరలో వున్న ”పుష్కరముని ”ఆశ్రమం చేరాడు. ఆయన పాదాల పైబడి మనసులోని బాధ నివేదించాడు.
*తనకు దేనిపైనా ఆసక్తి లేదని ఏదీ రుచిగా అనిపించదు అని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్ధం అయిందని తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరాడు. కొంత కాలం ఇక్కడే వేచి వుండాలని ముని సెలవిచ్చాడు .
*రోజూ పుష్కర మునిని సేవిస్తూ ఫలాలు కాయలు ,పూలు కోసి తెస్తూ ,దర్భలు కోసి అందిస్తూ అక్కడే వున్నాడు గాలవుడు. అతని శ్రద్ధా శక్తులకు మహర్షి సంతోషించి ,అతన్ని కరుణించాలని భావించి అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించావచ్చా? ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా , ప్రసన్నుడై అతని కోర్కె తీరుస్తాడా? అనే సందిగ్ధంలో కొంత కాలం వున్నాడు ముని.
*ఒక రోజూ నిండు మనసుతో హనుమను స్మరించాడు ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షం అయాడు. ఆయన ఆకారం ఎలావుందో చూడండి.
*బంగారు యజ్ఞోపవీతం ,స్వర్ణ వస్త్రాలు ,రత్నాలు పొదిగిన చేతి కంకణాలు ,పాదాలకు బంగారు కడియాలు ,శిరసుపై రత్న ఖచిత కిరీటము ,శంఖం లాంటి కంఠం ,బంగారు చిరు జజ్జేలున్న వడ్డాణం ,స్వర్ణ తాటంకాలు ,శ్రీ కారం లాంటి కర్ణాలు ,చంపకం వంటి నాసిక ,విశాలనేత్రాలు నేత్రాలు ,నెమలి పించం వంటి కురులతో వున్న కొప్పు ,మన్మధుని విల్లులాంటి కను బొమలు ,హంస నడక వంటి నడక ,దొండ పండు వంటి పెదవులు ,ముక్తా తిలకంతో నుదురు, ,సన్నని నడుము ,మృదుల బాహుద్వయం ,అందాల రాసి వంటి భార్య అయిన సువర్చలా దేవితో కన్నుల పండువుగా కన్పించాడు.
*మహర్షి మనసులోని సందేహం గమనించాడు హనుమ .గాలవునికి మంత్రం ఉపదేశించటంలో సందేహం అక్కర్లేదని ఎవరికైనా ఉపదేశించా వచ్చునని వివరించాడు. అందరు కుల లింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ,ఫలితం పొంద వచ్చు అన్నాడు.
*వంచకునికి ,క్రుతఘ్నుడికి ,గర్విస్టికి ,లోభికి ,గురువు మీద విశ్వాసం లేని వాడికి మాత్రం తన మంత్రం ఉప దేశించరాదు అని హితవు చెప్పాడు ..
పుష్కరమునికి మనసు లో వున్న సందేహాలన్నీ పటా పంచలు అయాయి.
*గాలుని దగ్గరకు పిలిచి ,దగ్గర లో వున్న పుణ్య జలాశయం లో స్నానం చేసి శుచి గా రమ్మని చెప్పాడు. దానికి గాలవుడు అతి భక్తిగా ”మహర్షీ !మీ పాద జలమే నాకు పవిత్రోదకం. అది గంగాది సకల తీర్దాల కంటే పవిత్ర మైనది. గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా....కనుక నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయాల్సిన పని లేదు.
*మీ పాదజలమే నా సకల పాప విముక్తి కల్గిస్తుంది అనుగ్రహించండి ”అని వేడుకొన్నాడు
కిరాతుడైన గాలవుని భక్తికి చలించి పోయాడు ముని. యోగ విడుదైన పుష్కరుడు హనుమను ధ్యానించి ,తన పాదజలాన్ని ,గాలవుని శిరస్సుపై చల్లాడు. గాలుని ,విశ్వాసం అంత గొప్పది. వెంటనే అతని పాపాలన్నీ తొలగి పోయాయి.
*లోపల వున్న వ్యాధి కూడా నివారణ అయింది. ఎంతో ఆరోగ్య వంతుడయ్యాడు. పరిశుద్ధ దేహ ,అంతరంగుడు అయాడు. వెంటనే మహర్షి అతనికి ”హనుమ ద్వాదశాక్షరి మంత్రాన్ని ”ఉపదేశించాడు .
*మహర్షి సన్నిధిలోనే 108 సార్లు ద్వాదశాక్షరి మహా మంత్రాన్ని జపించాడు .వెంటనే ఫలితం దక్కింది. అతనికి అతీంద్రియ శక్తులు లభించాయి.జ్ఞాని అయ్యాడు. భూత భవిష్యత్ వర్త మానాలన్ని తెలుసుకోగలిగే సామర్ధ్యం లభించింది .ఆకాశగమనం వచ్చింది. అన్ని లోకాలు తిరుగగలిగే శక్తి వంతుడయ్యాడు. సిద్ధ, చార, గంధర్వ గణాలు గాలవుని అపూర్వ శక్తి సామార్ధ్యాలు చూసి ఆశ్చర్య పోయాయి.
*సర్వ శక్తిమానుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి ”మహాను భావా !నిరంతరం మీ పాద పద్మాల మీద భక్తీ కలిగి వుండే వరం ఇవ్వండి .”అని కోరాడు. గురువు ఆశీర్వదించి ,మంత్రాన్ని కడు శ్రద్ధా సక్తులతో జపించమని ,దానిని విసర్జిస్తే చాలా కష్టాలు మీద పడుతాయని హెచ్చరించాడు. గురువును విడువలేక విడువ లేక అక్కడి నుండి బయల్దేరాడు.
*గురువు ఆశీస్సులు పొంది నెమ్మదిగా ఇంటికి చేరాడు. ఇది ఆంజనేయ స్వామి వారి తొమ్మిదవ అవతారంలోని కధ . ఈ సారి కశ్యపుని కధ ను తెలుసుకొందాం
***
*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్యం –14*
🌻 *ధ్వజ దత్తుని కధ -1* 🌻
*కృతయుగంలో పుష్కరుడు అనే మహా మహర్షి వుండే వాడు. అన్ని వేదాలను శాస్త్రాలను చదివి సర్వ విద్యా పరిపూర్ణుడు అయాడు. సూక్ష్మార్ధాన్ని వివరింపగల నేర్పున్నవాడు. స్వధర్మాచరణంలో గొప్పవాడు. అన్ని మంత్రాల సారాన్ని తెలుసుకొన్నవాడు. ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకొన్న పుణ్యాత్ముడు.
*ఆయన శ్రీ ఆంజనేయ మహా మంత్రంలో ఒక దాన్ని జపించాలను కొని నైమిశారణ్యం చేరాడు. సిద్దాశ్రమానికి దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకొని హనుమంతుని మంత్రంతో తపస్సు చేశాడు.
పవనసుతుడు ప్రత్యక్షమై దివ్యానుగ్రహాన్ని ఇచ్చాడు. మానసిక ఆనందాన్ని పొంది ఏ కోరికా లేకుండా అక్కడే జప తపాలతో జీవిస్తున్నాడు.
*ఆ కాలంలోనే ధ్వజదత్తుడు అనే వేద వేదంగాఅధ్యనుడు సర్వ శాస్త్ర పారంగతుడు నిష్టా గరిస్తుడు వుండేవాడు. గర్వంలేనివాడు నిష్కామి అయితే కటిక దరిద్రుడు. గృహస్తుల ఇళ్ళలో భిక్షాటనం చేస్తూ ఆ ద్రవ్యంతో పెళ్ళామ్ పిల్లల్ని పోషించుకొనేవాడు ఇలా ఉపాదానంతో జీవిస్తూ కూడా విద్యార్ధులకు ఉచితంగా వేద శాస్త్రాలను బోధిస్తుండేవాడు. మధ్యాహ్న భోజనం తరువాత శిష్యుల చదువును పరీక్షించేవాడు .
*ఒక రోజూ మధ్యాహ్నం శిష్యులతో పాటు తన కుమారుడిని కూడా పరీక్షించటానికి పిలిచాడు. అతడు రాలేదు. పుత్రుడిని ఎన్ని సార్లు పిలిచినా రాక పోవటంతో ఇల్లంతా గాలించాడు చివరికి వంటగదిలో కూరలనుమాత్రమే తింటున్న భార్యను ,పిల్లాడిని చూశాడు. అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారని అడిగాడు.
*వారిద్దరూ వంట పాత్రను చూపించారు. అందులో ఒక్క మెతుకైనా అన్నం లేదు. గుండె చెరువైంది ధ్వజ దాత్తుడికి దీనికి కారణం ఏమిటి అని భార్యను అడిగాడు. రోజూ వారిద్దరూ అన్నం లేకుండానే గడుపుతున్నారని తెలుసుకొన్నాడు. ఈ దరిద్రానికి తానె కారణం అని తెలుసుకొన్నాడు .
ఇంతటి దారిద్ర్యంలో కూడా భార్య నవ్వు మొఖంతో బయటి నుంచి వచ్చే తన్ను ఆప్యాయంగా ఆదరిస్తూ పిలుస్తున్నందుకు ఆశ్చర్యపోయాడు.
*తన మీద ఆమెకున్న ప్రేమను ,అనురాగాన్ని అర్ధం చేసుకొన్నాడు. తాను వారికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో వున్నందుకు విచారపడి కన్నీరు కార్చాడు. భార్య సౌశీల్యాన్నీ అభినందించాడు. తనలాంటి ధన్యుడు వేరెవరు ఉండరని ఇప్పటి దాకా గర్విన్చానని ,ఇప్పుడు తన అసమర్ధత తెలుసు కొన్నానని అన్నాడు.
*భార్యా ,పిల్లలను పోషించలేని వాడు పరమ పాతకుడని ఆమెతో అన్నాడు. అతని భార్య, భర్త దుఃఖాన్ని చూడలేక ”నాధా !ఈ దరిద్రం ఇవాల్టిది కాదు. ఎన్నో జన్మల నుంచి వచ్చిందే పూర్వ జన్మ లో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి వుండి ఉండం అందుకే ఇప్పుడు ఆ బాధ మనం అనుభవిస్తున్నాం సకల విద్యలు నేర్చి ఉచితంగా విద్యాదానం చేస్తూ ఉపాదానంతో జీవించే మీరు ధన్యులు దుఃఖపడే పురుషుడిని ”కాపురుషుడు ”అంటారు.
*మీ పాద సేవా భాగ్యమే మాకు భాగ్యం అని భర్తకు ధైర్యం చెప్పింది. భార్య మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయిన భిక్షా పాత్రాదేవిని తీసుకొని సంసారం గడపటానికి మార్గం కోసం ఉత్తర దిశవైపు వెళ్ళాడు. ఆ రాత్రి ఒక చోట విశ్రమించాడు. మర్నాటి ఉదయం స్నాన సంధ్యాదికాలు పూర్తి చేసుకొని ,నడిచి, నైమిశారన్యానికి వెళ్ళాడు. అక్కడ కశ్యపుడు మొదలైన నిష్టా గరిష్టులైన మునులను దర్శించాడు.
*ఆ తర్వాత పుష్కర మహర్షి వున్న సిద్ధాశ్రమం చేరాడు. పుష్కర మహర్షి శాంత గంభీర వదనంతో నిశ్చల ధ్యానంలో వున్నాడు. నమస్కరించి దగ్గర నిల బడ్డాడు. ముని కళ్ళు తెరిచి వాశ్చల్య ద్రుష్టితో చూశాడు. ఆయనకు తాను తెచ్చిన సమిధలను ఫలా పుష్పాలను సమర్పించాడు .
*”బ్రాహ్మణోత్తమా! ఎందుకు ఇక్కడికి వచ్చారు ?మీ కుటుంబ విషయాలేమిటో నాకు తెలియజెప్పండి .”అని ప్రేమ పూర్వకంగా అడిగాడు పుష్కరమౌని దానికి అంజలి ఘటించిన ధ్వజదత్తుడు ”మునీంద్రా!నేను గార్గేయస గోత్రికుడను, కుండి ననగరం నా నివాసం బ్రాహ్మణ శ్రేష్టుడైన ధజశర్మ నాతండ్రి. నాకు భద్రకుడు ,భద్ర బాహుడు అనే సోదరులు మేమందరం పండితులమే అయినా ఉపాదానంతోనే జీవిక గడుపుతున్నాం.
*అది చాలటం లేదు .భార్యా బిడ్డలను పోషించలేక పోతున్నాను. నా దీనత్వం పోయే మార్గం సెలవియ్యండి. నన్ను కాపాడండి అని మొర పెట్టాడు .
ఇదంతా విన్న పుష్కర ముని దయా సముద్రుడై అభయం ఇచ్చాడు. హనుమంతుని భక్తిగా ప్రార్ధించాడు. ధ్వజదత్తుడిని తనతో ఒక నదీ తీరాన్ని చేరి అతనితో కలిసి స్నానం చేశాడు. ఆ నది ఒడ్డున కోర్చోబెట్టి ”హనుమంమంత్రమైన ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని ”ఉపదేశించి దాన్ని శ్రద్ధాసక్తులతో నియమంగా జపించమని దానివల్ల అతని కోరిక సఫలం అవుతుందని ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్లి పోయాడు.
*ధ్వజ దత్తుడు చాలా నియమ నిష్టలతో హనుమంమంత్రాన్ని జపించాడు. ఎన్ని సార్లు జపించినా మారుతి దర్శనం కావటం లేదు విసుగు పుట్టింది హనుమను తిట్టుకొన్నాడు. గురువు తనను మోసం చేశాడని మరీ గురువునూ తిట్టటం ప్రారంభించాడు. మంత్రం కంటే గురునింద ఎక్కువై పోయింది. మనస్సు అశాంతితో నిండి పోయింది .జపం ఫలించనందుకు ఆవేశమూ కల్గింది.
*అప్పుడు ఒక రోజూ ”కాలుడు ”అనే కిరాతుడు అక్కడికి వచ్చాడు వాడికి తన గోడు వెళ్ళ బోసుకొన్నాడు .తన దుస్తితికి కారణం ఏమిటో తెలియ జేయమని కోరాడు అప్పుడు ఆ కాలుడు గురు దూష చేస్తున్నావు .నీకు ఉపదేహించిన మంత్రం పని చేయదు గురువును కాదని అంటే ,దేవుడు కూడా కాపాడ లేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. గురువును చేరి నిండు మనసుతో మళ్ళీ ప్రార్ధించి ,ఆయన అనుగ్రహం పొంది ,మళ్ళీ సాధన చెయ్యి.
*అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది ”అని చెప్పి తన దారిన తాను పోయాడు. ధ్వజ దత్తుడు గురువు అనుగ్రహం ఎలా సంపాదించాడో ,హనుమ అతడిని ఎలా అనుగ్రహించాడో వచ్చే కధలో తెలుసుకొందాం...
*
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్యం –16* 🙏
🌻 *త్రిశూల రోముని కధ -1* 🌻
💫🌹మైత్రేయుడు పరాశర మహర్షిని పంపా సరోవర తీరంలో హనుమ నిత్యకృత్యం గురించి తెలియజేయమని కోరాడు. మహర్షి చెప్పటం ప్రారంభించాడు. కిష్కింద (ఈ నాటి ఆనె గొంది ) కు దగ్గరలో పంపా సరోవరం వుంది. దానిలో స్వర్ణ కమలాలుంటాయి. మునులకు ఆవాస భూమి. అనేక రకాల పక్షులకు నిలయం. మలయ మారుతం చల్లగా వీచి మానసికానందాన్ని కల్గిస్తుంది.
💫🌹దేవతలు ,కిన్నెరలు అక్కడికి వచ్చి ఆడుతూ ,పాడుతూ వుంటారు. అద్వైతులు ప్రణవో పాసనతో వుంటారు. పంపా తీరంలో విహరించాలని ఒక రోజూ హనుమ ఒంటె వాహనం ఎక్కి ,పరి వార సమేతంగా అక్కడికి చేరాడు .
💫🌹అప్పుడు సుషేణుడు హనుమకు ఛత్రం పట్టాడు. నీలుడు ,మైందుడు ,చామరాలతో విసరు తున్నారు. మాగధుడు స్తోత్రం చేశాడు. గంధ మాదనుడు ముందు నడిచాడు. ద్వివిదుడు సంభాషించి వినోదం కల్గించాడు. పవనుడు పాదుకలను పట్టాడు. జాంబ వంతుడు నీతిని బోధించాడు. గంధ మాదనుడు వంశ కీర్తిని పాడుతున్నాడు.
💫🌹అందరు అభివాదం చేస్తుండగా ఒంటె దిగి ఉచితాసనం మీద కూర్చున్నాడు హనుమ. అందరిని వారి వారి స్థానాలకు వెళ్ళ మని హనుమ అనుమతి నిచ్చాడు.గవాక్షుడు ,శరభుడు ,నీలుడు ,గవయుడు ,గంధ మాదనుడు ,నలుడు ,గజుడు ,ప్రహస్తుడు ,దర్దరుడు ,వేగ వంతుడు అనే పది మంది మహా వీరులు కోటి మంది సైన్యంతో సరస్సు తూర్పు భాగాన విడిది చేశారు .ఋషభుడు ,సుముఖుడు ,ప్రుదువు ,దధి ముఖుడు ,జ్యోతిర్ముఖుడు ,సంపాతి ,రుంధ్ర గ్రీవుడు ,కేసరి అనే ఎనిమిది మంది యోదులుయిడు లక్షల సైన్యం తో దక్షిణ భాగంలో వున్నారు.
💫🌹మరీచి కేసరి ,రంభుడు ,తరునుడు ,గోముఖుడు ,అనే అయిదుగురు వానర శ్రేష్ఠులు పద్నాలుగు వేల మంది సైన్యం తో పశ్చిమ దిశకు చేరారు .సువేషుడు ,హరి లోముడు ,విద్యుద్దంష్ట్రుడు ,జాత శ్రముడు ,శత వాలి అనే నలుగురు తొమ్మిది వేల వానర సైన్యంతో ఉత్తర దిక్కు చేరారు .వీరదరికి భక్తులు సకల ఫలాలు జలాలు సమర్పించారు.
💫🌹హనుమ పంపా సరోవారంలో దిగి హాయిగా స్నానం చేశాడు. ఇంతలో ఆకాశం నుండి అతి ప్రకాశ మాన మైన వెలుగుతో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయాడు. అందరు లేచి నిలబడి నమస్కరించి భక్తీ చూపించారు. హనుమ నారదునికి నమస్కరించి యోగా క్షేమాలు విచారించాడు. దేవేంద్రాదుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకొన్నాడు.
💫🌹ఏమి పని మీద ఇక్కడికి వచ్చాడో చెప్పమన్నాడు. నారదుడు హనుమకు భక్తీ ప్రపత్తులతో ప్రదక్షిణం చేసి ప్రార్ధన చేశాడు.
”ఆంజనేయ నమస్తుభ్యం సంసారార్నవ తారకః -ప్రసీద జగతాం నాద దేవ దేవ నమోస్తుతే
నమస్తే విశ్వ రూపాయ జ్యోతిషాం పతయే నమః -అబాదిత స్వరూపాయ పూర్ణయ పర మాత్మనే
సూత్రాత్మనే నమస్తుభ్యం సూక్ష్మ రూపాయ విష్ణవే -శంకరాది దేవాయ యోగినాం పత ఏ నమః
సువర్చలా సమేతాయ పార్వతీ నంద నాయచ -నమో వేదాంత వేద్యాయ శరణ్యాయ నమో నమః”
💫🌹అని మనసారా స్తుతించి నారదుడు ఆంజనేయ స్వామితో ”హనుమత్ప్రభో !ఒక దేవ కార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను ”అన్నాడు. ఆ కార్యమేమిటో ఎలా స్వామి దాన్ని పూర్తి చేశాడో తరు వాత తెలుసు కొందాం...
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –17* 🙏
🌻 *త్రిశూల రాముని కధ –2* 🌻
💫🌹నారద మహర్షి హనుమంతునికి తాను వచ్చిన కార్యాన్ని ఇలా చెప్ప సాగాడు ”పూర్వం ”అసి”అనే రాక్షసుడు తపస్సుచే శివున్ని మెప్పించాడు. వాడికి ”త్రిశూల రాముడు ”అనే కొడుకున్నాడు. అనేక ఏనుగుల బలం వున్నవాడు క్రూరుడు.
💫🌹వీడు శివుని కోసం గోదావరి తీరంలో ఘోర తపస్సు ను అనేక సంవత్సరాలు చేశాడు.తన బలాన్ని చూసుకొని ,గర్వంతో ఇతరులను కించ పరచే వాడు. తపస్సు చేసుకొనే మునులను బాధించే వాడు. దేవతలను ఇబ్బంది పెట్టేవాడు. దేవతా స్త్రీలను బలాత్కారం చేసే వాడు. దేవరుషులను కూడా చులకన గా చూసే వాడు. దిక్పాలుర నందర్నీ అధికారాలకు దూరం చేశాడు.
💫🌹పాపం వాళ్లకు భార్యల దగ్గరకు వెళ్ళే సాహసం కూడా లేదు .నన్ను కూడా ఆ దుష్టుడు బాధ పెట్టాడు. భయం అంటే ఏమిటో తెలీని నాకు వాడి వల్ల భయం ఎక్కు వైంది. మనశ్శాంతిగా తపస్సు చేసుకోలేక పోతున్నాను. ఇంక ఉపేక్షించి ఊరుకోవటం తగదని నువ్వు తప్ప వాడిని అదుపులో పెట్టె వారెవ్వరూ లేరని నీ శరణు వేడటానికి వచ్చాను అన్నాడు.
💫🌹హనుమ పరాక్రమాన్ని ఒక సారి గుర్తు చేస్తూ ”హనుమా !పూర్వం బదరికాశ్రమంలో ”నర నారాయణ ఆకృతి ”దాల్చి ,ధ్యానంలో నువ్వు వున్నావు. అప్పుడు రాక్షస బాధ పొందుతున్న బ్రహ్మాది దేవతలు నర నారాయనుడవైన నిన్ను శరణు జొచ్చారు. రాక్షసుల నుండి తమల్ని కాపాడమని మరీ మరీ వేడుకొన్నారు నిన్ను.
💫🌹అప్పుడు నువ్వు గౌరీ శంకరులకు హను మంతుడు అనే పేరుతో జన్మిస్తానని ,బల వీర శ్రీ మంతుదవై సర్వ రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చావు .నీ మాటలు విని సంతోషించి నీకు కృతజ్ఞత తెలియజేసి దేవతలు మళ్ళీ తమ స్థానాలకు వెళ్లి పోయారు. నువ్విప్పుడు మమ్మల్ని అనుగ్రహించాలి. త్రిశూల రాముడిని వధించి లోక కల్యాణం చేయాలి ”అని నారదుడు విన్న విన్చుకొన్నాడు. హనుమ వదిన్క్”లోక కంటకుడైనా వాడిని తప్పక వధిస్తాను
”అని అభయం ఇవ్వగా నారదుడు దేవేంద్ర లోకానికి వెళ్లి పోయాడు .
💫🌹ఇంద్ర లోకంలో సుధర్మ సభలో దేవేంద్రుడు కొలువు తీరి వున్నాడు. త్రిశూలున్ని వాదించే వారెవ్వరూ అనే విషయం మీద అక్కడ చర్చ జరుగుతోంది ఇంతలో దేవర్షి నారదుడు సభలో ప్రవేశించాడు. దేవేంద్రుడు సకలోపచారాలతో స్వాగతం పలికి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. దేవ గురువు బృహస్పతిని చూసి ఇంద్రుడు దైర్యంగా ఉండటానికి కారణమేమిటో నని అడిగాడు.
💫🌹అప్పుడు గీష్పతి ”దేవర్షీ !నీకు తెలియని దేముంది ?త్రిశూల రాముడనే రాక్షసి శివుని వర బల గర్వంతో మమ్మలనందర్నీ పీడిస్తున్నాడు. దిక్పాలకలకే దిక్కు లేకుండా చేశాడు. యజ్న హవిర్భాగాలను ఇంద్రుడికి దక్క నీయటం లేదు. శ్రౌత స్మార్త కర్మ లన్నీ భ్రష్ట మైనాయి. నీ రాక మాకందరికీ ఊరట కల్గించింది. ఇంద్రుని కష్టాలు పోయే ఉపాయం చెప్పాలని మేమందరం నిన్ను ప్రార్దిస్తున్నాం ”అన్నాడు .
💫🌹నారదుడు ఇంద్రుని వైపు చూసి ,మనసులో శ్రీమన్నారాయనుణ్ణి ధ్యానించి”దేవగురు బృహస్పతి వర్యా !పూర్వం మీరు శ్రీమహా విష్ణువును శరణు కోరిన సంగతి మర్చి పోయినట్లుంది. ఆయన భూలోకంలో ఆంజనేయునిగా జన్మించి ,రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చిన సంగతి గుర్తు లేదా ? ఆంజనేయుడు పంపా తీరంలో వున్నాడు.
💫🌹రాక్షస సంహారం చేసి మీ అందరికి మేలు చేస్తాడు హనుమ ను స్మరిస్తూ వుండండి నేను కూడా హనుమ ను దర్శించి త్రిశూల రోముడిని సంహరించమని వేడుకొని వస్తున్నాను. అని అభయమిచ్చి దేవర్షి వైకున్థం చేరాడు .
హనుమ కొంత కాలం పంపా తీరంలోనే వుంది ఆ సరస్సులో నిత్యం జల క్రీడాలాడుతూ పిల్ల వాడిలాగా వినోదిస్తున్నాడు.
💫🌹ఒక రోజూ అకస్మాత్తుగా సామ గానం వినపడింది. తన పరి వారంతో అక్కడికి చేరాడు .వానరులన్దర్నీ మాట్లాడవద్దని హెచ్చరించగా వారంతా చెట్లు ఎక్కి కూర్చున్నారు .హనుమ కూడా ఒక వృక్షమెక్కి కూర్చున్నాడు .దూరంగా పొదల చాటు నుండి త్రిశూల రాముడు రావటం గమనించాడు హనుమ. వాడిని చూసి ఋషులు భయ కంపితులవుతున్నారు.
💫🌹రక్షించే వారి కోసం దిక్కులు చూస్తున్నారు. రాక్షసుడు అక్కడికి చేరి ,కశ్యపాది మహర్షులతో ”కాంది శీకలై పారి పోయిన మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది ?నేనే లోక నాయకుడిని. మీ యజ్న భాగం నాకే చెందాలి .”అని పళ్ళు పట పటా కొరికి హవిస్సును సంగ్రహించటానికి ముందుకు వచ్చాడు .
అన్నీ చూస్తున్న హనుమ ఒక్క సారిగా చెట్టు మీద నుంచి రాక్షసుడి నెత్తి మీదకు దూకాడు. వాడు నేలపై పడి పోయాడు.
💫🌹మారుతిని గమనించి ఆకాశంలోకి ఎగిరాడు . తోకతో వాడి గొంతు బిగించి తిప్పి తిప్పి కొట్టాడు హనుమ. వాడి చూపు మందగించింది. ముక్కు నుండి రక్త ధారలు స్రవించాయి వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. హనుమ సాహసానికి ఆశ్చర్యంతో మునులు చూస్తున్నారు .మారుతిని కింద పడేయ టానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .రాక్షసుడు హనుమ తోక పట్టుకొని గిర గిరా తిప్పాడు మునులు భయ పడ్డారు.
💫🌹హనుమకు ఆశీర్వచనాలు పలికారు. వాడు హనుమ వాలాన్ని పళ్ళతో కొరికాడు .రాక్షసుణ్ణి తన్నుతూ పిడికిలితో గుద్డుతూ వాడి ప్రాణాలకు ఎసరు పెట్టాడు ఆంజనేయుడు .తనని చంపటానికి సాక్షాత్తు నారాయణుడే కపిరూపంలో వచ్చాడని తెలుసు కొన్నాడు. పరిగెత్తి కొండల మధ్య వున్న ”స్పటిక శిల ”చాటున దాక్కున్నాడు.
💫🌹వాడి వెంట బడి అక్కడికి చేరి ”గుండ క్రియా రాగం ”పాడాడు స్వామి హనుమ ఆ రాగంతో స్పటికశిల కరిగి నీరై పోయింది ..అక్కడున్న త్రిశూల రోముడిని వెంటనే చంపి దేవ మునులకు ఆనందం కల్గించాడు .ఈ కధ ఇంతటితో సమాప్తం .
***
*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –18*
🌻 *నాగ కన్య చరిత్ర* 🌻
💫🌹కింపురుష ఖండంలో తార్శ్ని వేనుడు అనే వాడి తమ్ముడు సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు.పావనుడు, జ్ఞాని, సుశీలుడు, సత్యవతి దయా దాక్షిణ్యం వున్నవాడు హనుమ పద సేవకుడు నిత్యమూ హనుమను జలంతోనూ, పంచామృతాలతోను సేవిస్తాడు. త్రికాల పూజా దురంధరుడు దానాలు చేస్తూ హనుమకు ప్రీతిగా హోమాలు చేస్తాడు.
💫🌹షడ్రసోపేత భక్ష్య భోజ్యములను నైవేద్యం పెట్టె వాడు ఆ కాలంలోనే ”నాగ కన్య ”అనే పతివ్రతవుండేది. సుశీల, సుగుణ మని, సత్య వ్రతురాలు సర్వ సద్గుణ సంపన్న ఆమె రక్త రోముడు అనే క్రూర రాక్షసునికి భయపడి గంధర్వ రాజైన సుషేనుడిని శరణు వేడింది .
💫🌹ఆయనతో ”గాంధర్వ రాజా !కామాంధుడు క్రూరుడు అయిన రక్త రాముడు అనే రాక్షసుడు నాగ లోకం వచ్చి నన్ను బలాత్కారింప ప్రయత్నించాడు. నన్ను రక్షించేవారు లేక నీ శరణు వేడుకొంటున్నాను” అని వినయంగా మనవి చేసింది. సుషేణుడు నాగ కన్యతో ”భయం వద్దు అమ్మాయీ !నీ భయం పోగొట్టే నీ మనసుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెబుతాను విను.
💫🌹వజ్ర దేహుడు అరమ పావనుడు పావని నీకు అండగా నిలుస్తాడు. అతడు యజ్న భోక్త ఆపన్న రక్షకుడు ఆర్తిని పోగొట్టే వాడు అలాంటి హనుమ మూల మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆచరించి మనోభీష్టాన్ని పొందు నేను కూడా ఆ జపంవల్లే సౌఖ్యంగా వున్నాను. అని చెప్పి హనుమంమంత్రాన్ని ఉపదేశించాడు.
💫🌹ఆ కన్య హనుమంమంత్రాన్ని ”శ్రీ మన్నిరంతర కరుణామృత సాగర వర్షినీం, పింగాక్షం ,అమోఘ మహేంద్రా యుధ క్షతాన్చిత మహా హనుమ ,అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండలం ,ఆతప్త కార్తస్వర భాస్వర ,కాన్తిచ్చతా కాంతి కలిత ,చూడా విరాజితం ,అప్రతిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం ,అసమాన మాన నీయ ,రామా కాంత ,కర కమల కలిత పంచ జన్య బందుకంబుధారం ,ఇరావత నాసాదండ సుమత్త దీర్ఘ భుజార్గలం ,అనన్య సాధారణ సంకల్ప సంభావాస్తాన పీథ ,పరినాహి బాహ్వంతరం ,అమూల్య పీతాంబరాలంక్రుత కటి ప్రదేశం ,అనవరత వినత జన మనోరధ సాధన పాద యుగళం ,ఉష్ట్ర వాహనం ,అమర గంగా నదీ పరి వేష్టిత ,హాట కాచల ,వద్దీర్ఘ లాంగూల రంగ ఉత్తుంగ ,మంగ లాంగాకం ,అన్జనానంద వర్ధనం ,అమల ఊర్ధ్వ పుండ్రం ,తదు పరి కర్పూర సమ్మిశ్రిత శుభ్ర విభూతి ధారణం ,యజ్ఞోప వీత తులసీ పద్మాక్ష రుద్రాక్ష మాలాభి రామం ,శ్రీ రామ చంద్ర చరణార వింద ,సంధిత హృదయార విందం ,అఖిల కళ్యాణ గుణ వంతం ,హనుమంత ముపాస్మహే ”
*అని తీవ్రంగా తపస్సు చేసింది.
💫🌹ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపంతో ప్రత్యక్ష మయాడు.
💫🌹హనుమ నాగ కన్యను ఉద్దేశించి ”కన్యా మణీ !ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు ?నీ కోరిక తెలియ జేస్తే నేను నీ కార్యాన్ని సాను కూల పరుస్తాను ”అన్నాడు.
💫🌹దానికి ఆమె తన కథ అంతా వివరంగా విన్న వించుకొన్నది. స్వామి దర్శనంతో తాను ధన్యత చెందానని చెప్పింది.
💫🌹హనుమ ప్రీత మానసుడై అభయమిచ్చాడు. తనతో ఆమెను నాగ లోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతి భయంకరుడైన ,అతి బలవంతుడైన రక్త రోమ రాక్షసుని చూశాడు. వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి ”దుష్టుడా !నా ప్రతాపం తెలియక విర్ర వీగుతున్నావు. బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని ”అని తీవ్రంగా హుంకరించి తన తోకతో రక్త రామున్ని బంధించి నేల మీద విసిరికొట్టాడు.
💫🌹ఆ దెబ్బకు వాడు తీవ్రంగా రోదిస్తూ...రక్తం కక్కు కొని చచ్చాడు. దేవ యక్ష గాంధర్వ కింపురుషులు పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు .నాగ కన్యకు దీవెనలిచ్చి అనేక వరాలు అందజేసి ఇక నుంచి భయం లేకుండా నాగలోకంలో హాయిగా స్వేచ్చగా ఉండమని చెప్పారు.
💫🌹అక్కడి నుండి పావని అదృశ్యమై పంపా తీరం చేరి అక్కడ కొత్త కాలం వుండి ,మళ్ళీ గంధ మాదన పర్వతం చేరు కొన్నాడు .
💫🌹నాగ కన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తీ తో ఎవరు పఠిస్తారో వారికి అన్ని కార్యాలను దగ్గర వుండి తీరుస్తాడు హనుమ.
****
* *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –19*
🌻 *సుముఖుని కధ* 🌻
💫🌹శ్రీ భద్రం అనే పట్టణంలో దర్మవేది సుముఖుడనే బ్రాహ్మణుడు వున్నాడు. నిత్య హనుమ జప తపాలతో జీవితాన్ని పండించుకొంటున్నాడు. బ్రాహమనులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపు తున్నాడు. ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం వుంది. అందులో దేను మాలి అనే గోళ్ళ వాడు రోజూ సుముఖునికి నెయ్యి తెచ్చి ఇస్తుంటాడు. దాన్ని అన్నదానానికి ఈయన వినియోగిస్తుంటాడు. ఇది రోజూ జరిగే కార్యక్రమం.
💫🌹ఒక రోజున రోజూ లాగానే నెయ్యి పాత్ర తీసుకొని వస్తుండగా రెండు గ్రామాలకు మధ్యలో వున్న ఏరు పొంగి రాక పోకలకు ఆటంకం కల్గించింది. ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దేను మాలి ఏటి ఒడ్డునే నేటి పాత్రతో కూర్చుని వున్నాడు. ఏరు తగ్గ గానే నెయ్యి సుముఖునికి చేర్చాలని ఆరాట పడుతున్నాడు. అక్కడ సుముఖుడు బ్రాహ్మనులను పిలిచి సమారాధనకు అంతా సిద్ధం చేశాడు.
💫🌹కాని గోళ్ళ వాడు ఇంకా నెయ్యి తీసుకొని రాలేదని ఎదురు చూస్తున్నాడు. కంగారు పడుతున్నాడు. ఆంజనేయుని మనసారా స్మరిస్తున్నాడు అపహాశ్యం పాలు అవుతానేమోనని నిట్టూరుస్తున్నాడు. ఆంజనేయుడు సుముఖుని బాధ గమనిస్తూ గోపాలుని వేశం వేసుకొని నెయ్యి పాత్ర తీసుకొని వచ్చి ఇస్తున్నాడు ఏటి ప్రవాహం తగ్గే దాకా ఇలానే స్వామి చేశాడు. దేనుమాలే తెస్తున్నాడని సుముఖుడు భావిస్తున్నాడు.
💫🌹ఇలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజూ ఏరు తగ్గింది. ఏటి ఒడ్డునే కూర్చుని ఎప్పుడెప్పుడు వెళ్లి బ్రాహ్మణుడికి నెయ్యి ఇద్దామా అని ఎదురు చూస్తున్న దేను మాలి నెమ్మదిగా ఏరు దాటి వచ్చి నేటి పాత్రను అందజేశాడు. గత రెండు రోజులుగా ఏటి ప్రవాహం ఉద్ధృతంగా వుండటం వల్ల రాలేక పోయానని ,క్షమించమని వేడుకొన్నాడు. సుముఖుడు అతని మాటలు విని తనకు ఈ రెండు రోజులు నెయ్యి అందించిన వాడు ఆంజనేయస్వామేనని గ్రహించాడు.
💫🌹తన సమారాధనకు ఎలాంటి ఆటంకం కలుగ కుండా స్వామి కాపాడినందుకు మనసులో మెచ్చి కీర్తించాడు. ఆపన్న శరన్యుడుగా తన్ను ఆదుకొన్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నాడు. హనుమ గుణ గానాన్ని చేశాడు .
💫🌹”నమస్తే దేవ దేవేశ నమస్తే రాక్ష శాంతక –నమస్తే వానరాదీశ –నమస్త్రిమూర్తి వపుషే వేద వేద్యాయ తే నమః -నమస్తే లోక నాదాయ సీతా శోకార్తి హారినే -స్వామింత్వయాక్రుతం హృద్య యదాజ్యవహనం మామ -జాతం మా మప రాధాయ తత్ క్షమస్వ దయానిధే ”
ఈ స్తోత్రానికి మెచ్చి వాయునందనుడు తప్త కాంచన సంకాశం గా ,ముక్తాహార బిన్-భూషనుడిగా ,దివ్య పీతాంబర దారిగా మని కుండల మందితునిగా సుముఖునికి ప్రత్యక్ష మయ్యాడు.
💫🌹సుముఖునితో స్వామి హనుమ ”నిత్యం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక అపర సమారాధన నిత్యం చేస్తూన్నావు .నీ దీక్షకు ఆటంకం కలుగ రాదనీ నేనే నెయ్యి పాత్రను రోజూ గోపాలుడి వేశంలో వచ్చి నీకు ఇచ్చి వెళ్లాను .నీ భక్తీ దాశ్యానికి చాలా సంతోషంగా వుంది. నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పక జరిగి తీరుతుంది .ఏ ఆటంకము వుండదు .నీ భార్యా పుత్రులతో ఈ లోకంలో సుఖాలు అనుభవించి ఆ పిమ్మట వారందరితోనూ గోపాలుడైన దేను మాలితోనూ కలిసి దివ్య దేహం పొంది మోక్షాన్ని పొందగలరు ”ఈ విధంగా వరాలు కురిపించి హనుమ అదృష్యుదయ్యాడు.
💫🌹సుముహుడు ఆరోజు నుంచి ఏకొరతా లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరకు అందరితో కలిసి మోక్షాన్ని పొందాడు. ఈ కధలన్నీ మోక్ష సాధనకు మూల మార్గాలు. హనుమ మంత్ర జపం ,నామ స్మరణ ,హనుమ పాద సేవనం సర్వదా శుభదాయకం.
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –18* 🙏
🌻 *నాగ కన్య చరిత్ర* 🌻
💫🌹కింపురుష ఖండంలో తార్శ్ని వేనుడు అనే వాడి తమ్ముడు సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు.పావనుడు, జ్ఞాని, సుశీలుడు, సత్యవతి దయా దాక్షిణ్యం వున్నవాడు హనుమ పద సేవకుడు నిత్యమూ హనుమను జలంతోనూ, పంచామృతాలతోను సేవిస్తాడు. త్రికాల పూజా దురంధరుడు దానాలు చేస్తూ హనుమకు ప్రీతిగా హోమాలు చేస్తాడు.
💫🌹షడ్రసోపేత భక్ష్య భోజ్యములను నైవేద్యం పెట్టె వాడు ఆ కాలంలోనే ”నాగ కన్య ”అనే పతివ్రతవుండేది. సుశీల, సుగుణ మని, సత్య వ్రతురాలు సర్వ సద్గుణ సంపన్న ఆమె రక్త రోముడు అనే క్రూర రాక్షసునికి భయపడి గంధర్వ రాజైన సుషేనుడిని శరణు వేడింది .
💫🌹ఆయనతో ”గాంధర్వ రాజా !కామాంధుడు క్రూరుడు అయిన రక్త రాముడు అనే రాక్షసుడు నాగ లోకం వచ్చి నన్ను బలాత్కారింప ప్రయత్నించాడు. నన్ను రక్షించేవారు లేక నీ శరణు వేడుకొంటున్నాను” అని వినయంగా మనవి చేసింది. సుషేణుడు నాగ కన్యతో ”భయం వద్దు అమ్మాయీ !నీ భయం పోగొట్టే నీ మనసుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెబుతాను విను.
💫🌹వజ్ర దేహుడు అరమ పావనుడు పావని నీకు అండగా నిలుస్తాడు. అతడు యజ్న భోక్త ఆపన్న రక్షకుడు ఆర్తిని పోగొట్టే వాడు అలాంటి హనుమ మూల మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆచరించి మనోభీష్టాన్ని పొందు నేను కూడా ఆ జపంవల్లే సౌఖ్యంగా వున్నాను. అని చెప్పి హనుమంమంత్రాన్ని ఉపదేశించాడు.
💫🌹ఆ కన్య హనుమంమంత్రాన్ని ”శ్రీ మన్నిరంతర కరుణామృత సాగర వర్షినీం, పింగాక్షం ,అమోఘ మహేంద్రా యుధ క్షతాన్చిత మహా హనుమ ,అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండలం ,ఆతప్త కార్తస్వర భాస్వర ,కాన్తిచ్చతా కాంతి కలిత ,చూడా విరాజితం ,అప్రతిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం ,అసమాన మాన నీయ ,రామా కాంత ,కర కమల కలిత పంచ జన్య బందుకంబుధారం ,ఇరావత నాసాదండ సుమత్త దీర్ఘ భుజార్గలం ,అనన్య సాధారణ సంకల్ప సంభావాస్తాన పీథ ,పరినాహి బాహ్వంతరం ,అమూల్య పీతాంబరాలంక్రుత కటి ప్రదేశం ,అనవరత వినత జన మనోరధ సాధన పాద యుగళం ,ఉష్ట్ర వాహనం ,అమర గంగా నదీ పరి వేష్టిత ,హాట కాచల ,వద్దీర్ఘ లాంగూల రంగ ఉత్తుంగ ,మంగ లాంగాకం ,అన్జనానంద వర్ధనం ,అమల ఊర్ధ్వ పుండ్రం ,తదు పరి కర్పూర సమ్మిశ్రిత శుభ్ర విభూతి ధారణం ,యజ్ఞోప వీత తులసీ పద్మాక్ష రుద్రాక్ష మాలాభి రామం ,శ్రీ రామ చంద్ర చరణార వింద ,సంధిత హృదయార విందం ,అఖిల కళ్యాణ గుణ వంతం ,హనుమంత ముపాస్మహే ”
💫🌹అని తీవ్రంగా తపస్సు చేసింది.
💫🌹ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపంతో ప్రత్యక్ష మయాడు.
💫🌹హనుమ నాగ కన్యను ఉద్దేశించి ”కన్యా మణీ !ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు ?నీ కోరిక తెలియ జేస్తే నేను నీ కార్యాన్ని సాను కూల పరుస్తాను ”అన్నాడు.
💫🌹దానికి ఆమె తన కథ అంతా వివరంగా విన్న వించుకొన్నది. స్వామి దర్శనంతో తాను ధన్యత చెందానని చెప్పింది.
💫🌹హనుమ ప్రీత మానసుడై అభయమిచ్చాడు. తనతో ఆమెను నాగ లోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతి భయంకరుడైన ,అతి బలవంతుడైన రక్త రోమ రాక్షసుని చూశాడు. వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి ”దుష్టుడా !నా ప్రతాపం తెలియక విర్ర వీగుతున్నావు. బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని ”అని తీవ్రంగా హుంకరించి తన తోకతో రక్త రామున్ని బంధించి నేల మీద విసిరికొట్టాడు.
💫🌹ఆ దెబ్బకు వాడు తీవ్రంగా రోదిస్తూ...రక్తం కక్కు కొని చచ్చాడు. దేవ యక్ష గాంధర్వ కింపురుషులు పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు .నాగ కన్యకు దీవెనలిచ్చి అనేక వరాలు అందజేసి ఇక నుంచి భయం లేకుండా నాగలోకంలో హాయిగా స్వేచ్చగా ఉండమని చెప్పారు.
💫🌹అక్కడి నుండి పావని అదృశ్యమై పంపా తీరం చేరి అక్కడ కొత్త కాలం వుండి ,మళ్ళీ గంధ మాదన పర్వతం చేరు కొన్నాడు .
💫🌹నాగ కన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తీ తో ఎవరు పఠిస్తారో వారికి అన్ని కార్యాలను దగ్గర వుండి తీరుస్తాడు హనుమ.
***
*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –19* 🙏
🌻 *సుముఖుని కధ* 🌻
💫🌹శ్రీ భద్రం అనే పట్టణంలో దర్మవేది సుముఖుడనే బ్రాహ్మణుడు వున్నాడు. నిత్య హనుమ జప తపాలతో జీవితాన్ని పండించుకొంటున్నాడు. బ్రాహమనులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపు తున్నాడు. ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం వుంది. అందులో దేను మాలి అనే గోళ్ళ వాడు రోజూ సుముఖునికి నెయ్యి తెచ్చి ఇస్తుంటాడు. దాన్ని అన్నదానానికి ఈయన వినియోగిస్తుంటాడు. ఇది రోజూ జరిగే కార్యక్రమం.
💫🌹ఒక రోజున రోజూ లాగానే నెయ్యి పాత్ర తీసుకొని వస్తుండగా రెండు గ్రామాలకు మధ్యలో వున్న ఏరు పొంగి రాక పోకలకు ఆటంకం కల్గించింది. ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దేను మాలి ఏటి ఒడ్డునే నేటి పాత్రతో కూర్చుని వున్నాడు. ఏరు తగ్గ గానే నెయ్యి సుముఖునికి చేర్చాలని ఆరాట పడుతున్నాడు. అక్కడ సుముఖుడు బ్రాహ్మనులను పిలిచి సమారాధనకు అంతా సిద్ధం చేశాడు.
💫🌹కాని గోళ్ళ వాడు ఇంకా నెయ్యి తీసుకొని రాలేదని ఎదురు చూస్తున్నాడు. కంగారు పడుతున్నాడు. ఆంజనేయుని మనసారా స్మరిస్తున్నాడు అపహాశ్యం పాలు అవుతానేమోనని నిట్టూరుస్తున్నాడు. ఆంజనేయుడు సుముఖుని బాధ గమనిస్తూ గోపాలుని వేశం వేసుకొని నెయ్యి పాత్ర తీసుకొని వచ్చి ఇస్తున్నాడు ఏటి ప్రవాహం తగ్గే దాకా ఇలానే స్వామి చేశాడు. దేనుమాలే తెస్తున్నాడని సుముఖుడు భావిస్తున్నాడు.
💫🌹ఇలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజూ ఏరు తగ్గింది. ఏటి ఒడ్డునే కూర్చుని ఎప్పుడెప్పుడు వెళ్లి బ్రాహ్మణుడికి నెయ్యి ఇద్దామా అని ఎదురు చూస్తున్న దేను మాలి నెమ్మదిగా ఏరు దాటి వచ్చి నేటి పాత్రను అందజేశాడు. గత రెండు రోజులుగా ఏటి ప్రవాహం ఉద్ధృతంగా వుండటం వల్ల రాలేక పోయానని ,క్షమించమని వేడుకొన్నాడు. సుముఖుడు అతని మాటలు విని తనకు ఈ రెండు రోజులు నెయ్యి అందించిన వాడు ఆంజనేయస్వామేనని గ్రహించాడు.
💫🌹తన సమారాధనకు ఎలాంటి ఆటంకం కలుగ కుండా స్వామి కాపాడినందుకు మనసులో మెచ్చి కీర్తించాడు. ఆపన్న శరన్యుడుగా తన్ను ఆదుకొన్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నాడు. హనుమ గుణ గానాన్ని చేశాడు .
💫🌹”నమస్తే దేవ దేవేశ నమస్తే రాక్ష శాంతక –నమస్తే వానరాదీశ –నమస్త్రిమూర్తి వపుషే వేద వేద్యాయ తే నమః -నమస్తే లోక నాదాయ సీతా శోకార్తి హారినే -స్వామింత్వయాక్రుతం హృద్య యదాజ్యవహనం మామ -జాతం మా మప రాధాయ తత్ క్షమస్వ దయానిధే ”
ఈ స్తోత్రానికి మెచ్చి వాయునందనుడు తప్త కాంచన సంకాశం గా ,ముక్తాహార బిన్-భూషనుడిగా ,దివ్య పీతాంబర దారిగా మని కుండల మందితునిగా సుముఖునికి ప్రత్యక్ష మయ్యాడు.
💫🌹సుముఖునితో స్వామి హనుమ ”నిత్యం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక అపర సమారాధన నిత్యం చేస్తూన్నావు .నీ దీక్షకు ఆటంకం కలుగ రాదనీ నేనే నెయ్యి పాత్రను రోజూ గోపాలుడి వేశంలో వచ్చి నీకు ఇచ్చి వెళ్లాను .నీ భక్తీ దాశ్యానికి చాలా సంతోషంగా వుంది. నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పక జరిగి తీరుతుంది .ఏ ఆటంకము వుండదు .నీ భార్యా పుత్రులతో ఈ లోకంలో సుఖాలు అనుభవించి ఆ పిమ్మట వారందరితోనూ గోపాలుడైన దేను మాలితోనూ కలిసి దివ్య దేహం పొంది మోక్షాన్ని పొందగలరు ”ఈ విధంగా వరాలు కురిపించి హనుమ అదృష్యుదయ్యాడు.
💫🌹సుముహుడు ఆరోజు నుంచి ఏకొరతా లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరకు అందరితో కలిసి మోక్షాన్ని పొందాడు. ఈ కధలన్నీ మోక్ష సాధనకు మూల మార్గాలు. హనుమ మంత్ర జపం ,నామ స్మరణ ,హనుమ పాద సేవనం సర్వదా శుభదాయకం.
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్యం - 20* 🙏
🌻 *యవనాశ్వుని కధ* 🌻
💫🌹పూర్వం కాంభోజ నగరంలో యవనాశ్వుడు అనే బ్రాహ్మణుడు వుండే వాడు జటా జుత దారి శివ పూజా దురంధరుడు. ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్లి చాలా కాలం అక్కడ వున్నాడు.
💫🌹అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచ గావ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో వున్ననీరు లేని బావిలో పడ వేసే వాడు. తేనే ,పళ్ళు ,పాలు ,పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు. దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి. వాటిని తాను తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే మూర్చ రోగం వస్తుంది. అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధ పడుతున్నాడు.
💫🌹కొన్ని రోజులకు విశ్వా మిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళ బోసుకొన్నాడు. ఆయన దయ తలచి ”సువర్చలా దేవి దివ్య మంత్రాన్ని ”ఉపదేశించి ,ఆంజనేయుని సప్త వింశతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు.
💫🌹”ఆంజనేయ మతి పాతలానం -కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తారు మూల వాసినం -భావయామి పవ మాన నందనం
హనుమానాన్జనా ఓఓణూః వాయు పుత్రో మహా బలహ -కపీన్ద్రః పింగాలాక్ష సచ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతో వీరః -సీతా శోక వినాశకః -ఆకాశ హన్తా రామ సఖః -రామ కార్య దురంధరః
మహౌశాదిగిరేర్హారీ -వానర ప్రాణ దాయకః -వారీ శాతార కస్చైవ -మైనాక గిరి భంజనః
నిరంజనో జిత క్రోధః కదళీ వన సంవృతః -ఊర్ధ్వ రేతా మహా సత్వః -సర్వ మంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్టాతా -భాష్య క్రుజ్జగాతాం వరః -శివ ధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయనః ”
అనే ౨౭ నామాలే సప్త వింశతి నామాలు .అవి హనుమంతుడు ,అంజనా సూనుడు ,వాయుపుత్రుడు ,మహా బలుడు ,కపీన్ద్రుడు ,పింగా లాక్షుడు ,లంకా ద్వీప భయంకరుడు ప్రభంజన సుతుడు ,వీరుడు ,సీతా శోక వినాశ కుడు ,అక్ష హంత ,రామ సఖుడు ,రామ కార్య దురంధరుడు ,మహౌషధి గిరి హారి ,వానర ప్రాణ దాయకుడు ,వారీశాతారకుడు ,మైనాక గిరి భంజనుడు ,నిరంజనుడు ,జిత క్రోధుడు ,కదళీ వన సంవ్రుతుడు ,ఊర్ధ్వ రేతస్కుడు ,మహా సత్వుడు ,సర్వ మంత్ర ప్రవర్తకుడు ,మహా లింగ ప్రతిష్టాత ,భాష్య కారుడు ,జగద్వారుడు...
💫🌹నిత్య శివ ధ్యాన పరుడు శివ పూజా పరాయణుడు విశ్వా మిత్రుడు ఉపదేశించిన సువర్చలా మంత్రాన్ని ,జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ కొంత కాలం గడిపాడు. వాటి మహాత్మ్యంతో అతని మూర్చ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్య వంతుడయాడు యవనాశ్వుడు.
💫🌹చాలా కాలం ఆరోగ్యంగా జీవించి ,హనుమంతుని నిత్యం పూజిస్తూ ,భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందాడు. కనుక హనుమ నామానికి అంతటి శక్తి మహాత్మ్యం వున్నాయి .అందరు కలిసి హనుమ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది .అయితే చిత్త శుద్ధితో చేయాలి. హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు. సాయుజ్యాన్ని కల్గిస్తాడు అని ఈ కథా సారాంశం .
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్యం–21* 🙏
🌻 *హనుమత్పుర భక్తుల కధ* 🌻
💫🌹అయోధ్యకు రావణ సంహారం తర్వాత చేరి పట్టాభిషిక్తుడైన శ్రీ రాముడు అందరిని ఉచిత రీతిన సత్కరించాడు .ఒక సారి హనుమను పిలిచి ”హనుమా !నీకు నేను సీతాదేవి మాత్రమే కాదు మావంశం అంతా రుణ పడి వుంది. నీకు కావలసిన వరం ఇస్తానున్కోరుకో ”అన్నాడు.
💫🌹దానికి హనుమ రాముడికి నమస్కరించి ”ప్రభు !నీ కృప నా మీద వుంటే చాలు అదే నాకు వరం”అన్నాడు. సీతాపతి ఈ మాటలు విని సంతృప్తి చెంది ,”నా ప్రార్ధన మన్నించి నేనిచ్చే వరాన్ని నువ్వు స్వీకరింపక తప్పదు.వనిన్ను ఆచంద్రార్కంగా పూజించాటానికి భక్తుల కోసం ”హనుమత్పురం ”అనే గ్రామాన్ని నీకిస్తున్నాను.
💫🌹అందులో యజ్ఞం చేసిన సోమయాజులు శాస్త్ర పండితులు నిత్య కరములు వంశాచార ధర్మ పరాయణులు అందరూ తమ విధులను నిర్వర్తిస్తూ నీ మంత్రాన్ని జపిస్తూ నిన్నే శరణు కోరుతూ ,నీ మీదే లక్ష్యం వుంచి సేవించే వారందరూ అక్కడ వుంటారు అన్నాడు దానికి హనుమ ”నీ సేవలో నీ సమీపంలో వున్న ఆనందం నాకు ఎక్కడా లభించదు. నీ శిలా విగ్రహం వద్దే నేను వుంటాను అనుమతి నివ్వు ”అన్నాడు.
💫🌹హనుమత్పురం బంగారు ప్రాకారాలతో స్వర్ణ గృహాలతో ప్రకాశిస్తుంది. గోపురాలు మణి మానిక్యాలతో నిర్మించబడి వుంది. లెక్కకు మించిన వీధులు వేద శాస్త్ర పరాయనులతో నిండి వుంది. అన్ని రకాల ఫల వృక్షాలు వున్నాయి. వివిధ పుష్పాల తోటలనేకం వున్నాయి. ఈ పురం మీరు పర్వతానికి దక్షిణ భాగంలో పడి యోజనాల దూరంలో వుంది.
💫🌹బ్రాహ్మణ దేవులు అనుభవించటానికి హనుమ అన్ని సమ కూర్చి బ్రాహ్మణులు అనుభవించటానికి ఇచ్చేశాడు. 14000 హనుమద్ ఆలయాలను కట్టించారు భక్తుల కోసం నాలుగు చేతులు పడి చేతులు వున్న వాడిగా వీర రూపుడిగా, భయంకరావతారంగా పంచ ముఖాలున్న వాడిగా సువర్చలా సాహితునిగా శాంత మూర్తిగా ఇలా అనేక రూపాలతో దర్శన మిచ్చాడు.
💫🌹కాలం సుఖంగా జరిగి పోతోంది. కాల యవనుడు అనే వాడి కొడుకు దుర్ముఖుడు మదంతో విజృంభించి హనుమత్పురాన్ని దోచుకోవటానికి సైన్యంతో వచ్చాడు. బ్రహ్మనులను బెదిరించి ఆ గ్రామాన్ని తనకు అప్పగించమని బెదిరించాడు. వారు ఆ పురాన్ని తమకు హనుమంతుడు ఇచ్చాడని అతను అనుజ్న ఇస్తేనే అక్కడి నుంచి కదులు తామని అంత దాకా హనుమత్పురాన్ని వదలమని గట్టిగా చెప్పారు.
💫🌹దీనికి కోపం పొందిన దుర్ముఖుడు ”హనుమంతు డెవ్వడు ?నేనే లోక ప్రభువును .అందరూ నన్నే పూజించాలి మిమ్మల్ని చంపను గ్రామం వదిలి వెళ్లి పొండి ”అన్నాడు.
💫🌹ఆ మాటలు విన్న విప్రులు ”సరే రేపు తప్పక ఖాళీ చేసి వెళ్తాం ”అన్నారు. చేసేది లేక భక్తి శ్రద్ధలతో హనుమను కొందరు ప్రార్ధించారు. కొందరు మాలా జపం చేశారు. నిరాహారంగా హనుమంతుని ధ్యానించారు.
💫🌹ఆ రాత్రి అందులో ఒక బ్రాహ్మనోత్తముడికి హనుమ కలలో కనిపించి రెండు శ్లోకాలు విని పించాడు.
”మాన్ధాతా చ మహీ పథిహ్ కృత యుగాలన్కార భూతో గతః –సేతురఎన మహౌదదౌ విరచితః క్వాసా దశాశ్యాన్తకః
అన్యే చాపి యుధిష్టిర ప్రభ్రుతయః తే కీర్తి శేషం గతాః –నికే నాపి సమం గతా వసుమతి నూనం త్వయాయాస్యతి
ఆత్మ దత్తాప హార యః శ్మశ్రో ర్నీచ తరో హిసః -అన్యిస్తూ చర్దితం భుంక్తే న స్వాత్మ చర్దితం క్వచిత్ ”
💫🌹ఈ రెండు శ్లోకాలు వాడికి చెబితే వాడు మీ జోలికి రాడు అని అభయం చెప్పాడు కలలో...
💫🌹దీని భావం ఏమిటంటే క్రుతయుగానికే అలంకారుడైన మాంధాత గతించాడు. మహాసేతువు నిర్మించి పది తలల రావణున్ని చంపినా రాముడు ఇప్పుడున్నాడా /యుధిష్ఠిరుడు మొదలైన వారు కూడా కీర్తి శేషులైనారు వారితో ఎవ్వరితోనూ ఈ భూమి వెళ్ళ లేదని తెలుసుకో....
💫🌹ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు. తాను ఇచ్చిన దానిని అపహరించేవాడు నీచుడు. ఇతరులు కక్కిన దాన్ని ఎవరైనా అనుభవిస్తారు .కాని తానె కక్కిన దాన్ని ఎవడు అనుభవిస్తాడు ?
💫🌹ఆ ప్రకారమే వీరంతా కలిసి దుర్ముఖుడికి చెప్పారు. వాడికి కోపం రెచ్చి తక్షణం ఖాళీ చేయమని మల్లీ బెదిరించాడు .వాళ్ళు మర్నాడు చేస్తాం అన్నారు. ధుఃఖంతో కూర్చున్నారు .అప్పుడు హనుమ అదృశ్యంగా వుంది ”నేను భక్తులను రక్షించే వాడినని మీకు తెలుసు. నాకు మీరే ఆత్మీయులు ”అని వినిపించాడు. మళ్ళీ హనుమ ధ్యానం చేశారు. హనుమ దయాలుడై దుర్ముఖుడు వున్న వైపుకు కదిలాడు.
💫🌹ఆ మహా వానరున్ని చూసిన అతని సైన్యం దుర్ముఖుడికి నీతి బోధించారు .బ్రాహ్మణులు హనుమద్ భక్తులని వాళ్ల జోలికి వెళ్తే మాడిపోక తప్పదని హితవు చెప్పారు .హనుమ మా పరాక్రమాన్ని వివరంగా వర్ణించి చెప్పారు. వాళ్ల మాట విన్నవాడు సైన్యాన్ని దూరంగా పొమ్మన్నాడు. ఆ రాత్రి హనుమంతుడు ఒక పర్వతాన్ని పెకలించి తెచ్చి ఇదివరకు సైనికులున్న చోట ఉంచాడు.
💫🌹సైన్యం అక్కడి నుంచి వెళ్లినట్లు హనుమకు తెలియదు. దుర్ముఖుని సైన్యం దాన్ని చూసి అక్కడ వుంది వుంటే దాని కింద పడి పచ్చడి పచ్చడి అయ్యే వాళ్ళం అనుకొన్నారు .దుర్ముఖుడు కూడా హనుమ పరాక్రమం తెలిసి బ్రాహ్మనులందర్నీ రప్పించి వారికేమీ భయం వద్దని హనుమంతుడు వారిని చల్లగా కాపాడుటాడని తనకు హనుమత్పురం మీద ఆశ లేదని యదా ప్రకారం ఆ పురంలో యధేచ్చగా ఉండమని కోరాడు.
💫🌹తన దుష్ట వర్తనానికి క్షమాపణ చెప్పుకొన్నాడు. అంతేకాదు అనేక ధన కనక వస్తు వాహనాలను వారికి దానంగా అంద జేశాడు.న్వారందరూ అతన్ని క్షమించారు. ఆనందంగా జీవించటం మొదలు పెట్టారు. దుర్ముఖుడు తన ప్రదేశానికి బ్రాహ్మణుల అనుజ్న తీసుకొని బయలు దేరి వెళ్ళాడు .హనుమత్పురంలో విప్రులందరూ స్వర్గంలో వున్న సుఖాలన్నీ అనుభవిస్తూ అనుక్షణం హనుమ ధ్యానంతో జీవితం గడుపుతున్నారు .
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 22* 🙏
🌻 *దార్మికుని కధ* 🌻
💫🌹కాశీ పట్టణంలో కేదారేశ్వర ఘాట్ లో దక్షిణాన రామ వాటిక వుంది. దాని ముందు గంగా తీరంలో జానకీ నాధుడు వున్నాడు. అయోధ్య లో శ్రీ రాముని విగ్రహం ఉన్నట్లుగా ఇక్కడ శ్రీ రాముని మూర్తి అద్భుతంగా వుంటుంది.
💫🌹ఆయన పాద పద్మాల చెంత హనుమ కూర్చుండి భక్తుల మనో భీష్టాలను నెర వేరుస్తుంటాడు. రామ వాటికలో ధార్మికుడు అనే వేదాధ్యయనుడైన బ్రాహ్మనుడున్నాడు. అతని కుమారుడు ధర్మ కీర్తి సదాచారి, వినయ సంపన్నుడు. పితృ సేవా పరాయణుడు. పదహారేళ్ళ ప్రాయంవాడు. మహా ప్రాజ్ఞుడు. అయినా ఇంట్లో దారిద్ర్యం తాండ విస్తూనే వుంది.
💫🌹ధన సంపాదన కోసం చాలా దూరం ప్రయాణం చేసి గోకర్ణ క్షేత్రం చేరాడు గోకర్నేశ్వరున్ని అర్చించి ,పూర్వ జన్మ వాసన వల్ల ఇంటిని మరిచి పోయి అక్కడే చాలా కాలం స్వామి సేవలో ఉండి పోయాడు.
💫🌹అక్కడ కాశిలో భార్యా పిల్లలు ధర్మ కీర్తి జాడ తెలియక బాధ పడుతున్నారు. కనపడిన ప్రతి యాత్రికుడిని తన కుమారుడు ధర్మకీర్తి ఎక్కడైనా కన్పించాడా అని అడిగేవాడు ధార్మికుడు. కొడుకు ఎడ బాటును సహించ లేక నిత్యం ధుఃఖిస్తూనే ఉండేవాడు. ఒక రోజు సుతప్తుడు అనే బ్రాహ్మణుడు ధార్మికుని వేదన చూసి ”ధార్మికా !దుఃఖించ వద్దు .దైవ సహాయం ఇప్పుడు నీకు కావాలి. భూత ,భవిషత్ ,వర్త మానాలను తెలియజేసే ”స్వప్నాన్జనేయ మంత్రం ”వుంది. నీకు దాన్ని ఉప దేశిస్తాను.
💫🌹నిరంతరం జపించి నీ పుత్రుని ఆయన అనుగ్రహంతో తిరిగి పొందు ”అని చెప్పి మంత్రోపదేశం చేశాడు. కలలో ఆంజనేయ స్వామి కనిపించి ధర్మ కీర్తి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో కూడా తెలియజేస్తాడని కూడా చెప్పాడు.
💫🌹ధార్మికుడు ఏకాగ్ర చిత్తంతో రామ వాటికలోని శ్రీరామ సన్నిధిలో కూర్చుని ,మంత్రాన్ని జపిస్తున్నాడు. ఒక రోజు కలలో హనుమ కన్పించి ”ధార్మికా !నీ కుమారుడు క్షేమంగా గోకర్ణంలో ఆరోగ్యంగా స్వామి సేవలో గడుపు తున్నాడు. తనంతట తానె తిరిగి మీ వద్దకు తిరిగివస్తాడు.
💫🌹నన్ను స్వప్న హను మంతునిగా భావించు. స్వస్తి అని చెప్పి మారుతి అదృశ్యమైనాడు. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటన అతనికి ఆశ్చర్యం కలిగింది .ఉదయం నిద్ర లేచి తన కలను అందరికి తెలియబరచాడు. అందరు ఆంజనేయ వైభవాన్ని దార్మికుని అదృష్టాన్ని పొగిడారు. పుత్రుని రాక కోసం ఎదురు చూస్తూ ఆంజనేయ జపాన్ని చేస్తూనే వున్నాడు ధార్మికుడు.
💫🌹అక్కడ గోకర్ణ క్షేత్రంలో తనను అత్యంత భక్తీ విశ్వాసాలతో కొలుస్తున్న ధర్మ కీర్తి సేవలను ప్రస్తుతించి ,కాశీ క్షేత్రంకు వెళ్లి తలిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చమని హితవు చెప్పి ,గోకర్నేశ్వర స్వామి వెళ్ళటానికి అనుమతి నిచ్చాడు. అతడు శివుని ఆజ్ఞను శిరసావహించి కాశీకి ప్రయాణమైనాడు.
💫🌹కొన్ని రోజులకు కాశీ చేరి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రుల ఆనందం వర్ణించ లేకుండా వుంది. అందరికి నమస్కారాలు చేసి ,బంధువులను పలకరించాడు. కాశీ విశ్వనాధుని నిత్యం సేవిస్తూ ఆంజనేయ ఉపాసన పొంది రోగాలు లేకుండా ,ఆరోగ్యంగా జీవిస్తూ ,చివరకు మోక్షాన్ని పొందాడు .”స్వప్న హనుమంతుని ”దివ్య ప్రభావం అంత గొప్పది అని ధార్మిక ,ధర్మ కీర్తిల కధ మనకు తెలియ జేస్తోంది.
****
శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం – 23.* 🙏
🌻 *హుంకార మంత్ర మహిమ* 🌻
💫🌹పూర్వం దేవ,దానవులకు భీకర యుద్ధం జరిగింది. ఇరు పక్షాలలో చాలా మంది మరణించారు. ఇంద్రాది దేవతలంతా భయపడి దాక్కొని అనేక చోట్ల తిరుగుతూ బ్రహ్మను వెంటపెట్టుకొని మహా విష్ణువు దగ్గరకు చేరి తమ బాధ వెళ్ళ బోసుకొన్నారు.
💫🌹అందర్నీ తీసుకొని హరి కైలాసం వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు.
”నమస్తే రుద్ర మన్యవుతోతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః -యాత్ర్హ ఇషు శ్శివ తమా శివం బభువతే -శివా శరణ్యయా తవ తయానో రుద్ర మ్రుడయా -యాతే రుద్ర శివా తనూ రాఘోరా పాప కాశినీ –నమస్తే అస్తు భగవాన్ ,విశ్వేశ్వ రాయ ,మహాదేవాయ త్ర్యంబకాయ ,త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ ,కాలాగ్ని రుద్రాయ ,నీల కంతాయ, మ్రుత్యుంజయాయ ,సర్వేష్వ రాయ ,సదా శివాయ శ్రీ మన్మక్హా దేవాయ నమః -తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ -తన్నో రుద్ర హ ప్రచోదయాత్”
💫🌹శంకరుడు పరమానందం పొంది వచ్చిన కారణం అడిగాడు. శ్రీ పతి నారాయణుడు ”శుభంకరా !శంకరా !లోకంలో దరిద్రం తాండవిస్తోంది. కరువు కాటకాలతో జనం అల్లాడి పోతున్నారు. నువ్వు ఇచ్చిన వారాల వల్ల రాక్షసులు విజృంబించి అందరినీ బాధిస్తున్నారు. యజ్న యాగాదులు సాగనివ్వటం లేదు. స్త్రీలకు రక్షణ లేదు. మానవ భక్షణ ,దేవాలయ ధ్వంసంతో వారి ఆగడాలు శృతి మించుతున్నాయి.
💫🌹దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రునితో సహా అందర్నీ తరిమేస్తే వారంతా కంది శీకుల్లా బతుకు తున్నారు. ఆ రాక్షస మూక నుండి మమ్మల్ని అందర్నీ నువ్వే రక్షించాలి. ఆలశ్యం చేయవద్దు అని ప్రార్ధించాడు.
💫🌹”నా వరాల వల్ల నిమి మొదలైన రాక్షసులు ఇంతకూ తెగిన్చారా ?నేను వాళ్ళను చంప లేను. నేనే హనుమంతుని గా జన్మించి దానవుల పాలిటి యమునిగా మారుతా... సంహరించుట మీకు తెలుసు మీ శత్రువులు హనుమను దూషిస్తారు. ఆ దూషణం చేత దివాన్ధులు అనబడే శిబితాశానులు తేజో విహీనం అవుతారు.
💫🌹ఆ సమయంలో వానరాకారుడనైన నేను ”హుంకారం ”చేస్తాను. అదే సమయంగా భావించి ,మీరందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి. రాక్షసులంతా నశిస్తారు. మీ ఆధిపత్యాలు మీకు మళ్ళీ లభిస్తాయి. అని చెప్పి ఊరట కల్గించి వారిని పంపించే శాడు. దేవ గణం అంతా గంధ మాదన పర్వతం చేరి ,అక్కడ కొలువై ఉన్న మారుతిని సంస్తుతించారు.
”శ్రీ మన్మహోదార చరిత్రా !సౌవర్ణ దేదీప్య మాన ప్రభా పూర్ణ గాత్రా !కృపా పూర్ణ నేత్రా !జగద్వంద్య కౌండిన్య గోత్రా !జగత్ప్రాణ పుత్రా !పవిత్రాన్జనా నిత్య సంతోష పాత్రా !భక్త రక్షైక దక్షా !సురాధ్యక్షా !దుర్భావ మత్తేభ హర్యక్షా !శ్రీ మత్క్రుపా పూరా పింగాక్షా !శ్రీ దాన సౌసర్వ వ్రుక్షా !సదా సాదు పక్షా !సదా దుష్ట శిక్షా !కరాగ్రాప్త మోక్షా !ముఖ స్థాన రుక్షా !నివ్రుత్తారి రక్షా !శ్రితా భీష్ట దానైక రక్షా !కపీన్ద్రా !హరీ !రామ దూతా !సదా సాదు గేయా !అమేయ ప్రభావా !ఆంజనేయా !నమస్తే నమస్తే నమః ”అని భక్తీ ఆర్తి కలిపి స్తుతించారు.
💫🌹హనుమ ప్రీత మానసుడై విషయం తెలుసుకొని రాక్షస సంహారానికి అందరితో బయల్దేరాడు.
దానవులు ,దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ శస్త్రాస్త్రాలతో హింసిస్తున్నారు. మారుతికి కోపం విజృంభించింది. భూమి ,ఆకాశం దద్దరిల్లెటట్లు ”హుంకారం చేశాడు. దానితో రాక్ష గణం బలం తగ్గి నిర్వీర్యులవుతున్నారు.
💫🌹అప్పుడు హనుమ ”మూడు శిరస్సులు ,ఆరు నేత్రాలు ,వజ్రాల వంటి కోరలు ,ద్వాత్రిమ్శాద్భుజాలు ,భయంకరమైన కత్తులవంటి రోమాలు వున్న అతి భయంకార ఆకారంతో కనిపించాడు. రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు ,నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతై మరికొందరు చని పోయారు. కొందరు నేల మీద పడి తన్నుకొని చచ్చారు .కొంతమంది దేవతల శాస్త్రాస్త్రాలకు బలి అయారు.
💫🌹ఈ విధంగా సర్వ రాక్షస సంహారం జరిగింది. లోక కంటకులు నశించటంతో అందరు హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు. హనుమను ప్రస్తుతించారు. అందరికి ఆనందం కల్గింది.
💫🌹అప్పుడు ఆంజనేయుడు ”దేవతలారా !మీరు అన్ని కాలాల్లోనా ”హుమ్కారమన్త్రాన్ని ”న్యాస పూర్వకంగా జపిస్తూ సర్వ శుభాలను బలాన్ని శక్తిని పొందండి ”అని చెప్పి అంతర్ధానమయాడు. ఇదీ హుంకార మంత్ర మహిమ .
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం–24* 🙏
🌻 *రత్నాకరుని కధ* 🌻
💫🌹అయోధ్యలో రత్నాకరుడు అనే వైశ్య వ్యాపారి ఉన్నాడు. ధనంతో పాటు విద్య ఉన్నవాడు కర్మిష్టి అనేక యాగాలను శ్రద్ధగా చేశాడు గొప్ప దాత జన హృదయంలో నిలిచిన వాడైనా గర్వం లేనివాడు కీర్తి కాంక్ష లేని వాడు నిత్యం భగవంతుని చింతనతో అన్న దానంతో గడుపుతాడు. అనుకూలవతి అయిన బార్య తండ్రిని గౌరవించే పుత్రులు జీవితం హాయిగా గడిచిపోతోంది.
💫🌹రత్నాకరుని కుటుంబం వారంతా రామ భక్తులే అయినా ,హనుమను ఆరాధిస్తారు. ఏపని చేసినా దాశ్య భావంతో ఆంజనేయునిలాగా చేస్తారు. ఆదర్శ కుటుంబం అని అందరూ పిలుచుకొంటారు. ఒక రోజూ రత్నాకరుడు యాగం చేస్తున్నాడు. యజ్ఞాన్ని కొందరు దానవులు భగ్నం చేయటానికి ప్రయత్నించారు. ఆపేసి మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ విధ్వంసం మళ్ళీ ప్రారంభంగా కొనసాగింది.
💫🌹చేసేది లేక ఇంద్రుడిని శ్రద్ధగా ప్రార్ధించాడు ఆయన ప్రత్యక్షమవ్వగా తన బాధ చెప్పుకొన్నాడు శచీపతి ”నువ్వు అధైర్య పడవద్దు. గౌతమ ఆశ్రమానికి వెళ్ళు అక్కడ శతా నందుని పూజించి ,”హుమ్కార ఆంజనేయ మంత్రాన్ని ”ఉపదేశంగా పొందు. పవన తనయుడు నిన్ను అనుగ్రహించి నీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్లు చేస్తాడు ”అని చెప్పాడు.
💫🌹అలాగే గౌతమాశ్రమానికి చేరి ,శాతానందాను గ్రహం పొంది గురుత్రయ ఉపదేశాన్ని ,హుమ్కార హనుమంమంత్రాన్ని న్యాస పూర్వకంగా ఉపదేశం పొందాడు. మంత్ర జప నియమాన్ని, కాల నిబంధనలను శతానందుడు రాత్నాకరునికి వివరంగా అనుగ్రహించాడు.
💫🌹గౌతమాశ్రమంలోనే మహర్షి శతానందుని సాన్నిధ్యంలో ”హుమ్కార మంత్రాన్ని ”ఒక జాము సేపు జపించాడు. భక్త సులభుడు ఆంజనేయుడు ఆవిర్భవించాడు. రత్నాకరా !చాలా సంతోషించాను. నీ భక్తీ గొప్పది. అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళు సత్రయాగం మొదలైనవి నిర్విఘ్నంగా చేసుకో సర్వ సుఖాలు అనుభవించి ,ముక్తిని పొందు ‘అని చెప్పి అదృశ్యమైనాడు మారుతి గురువు శతానందుని అనుజ్న పొంది ,రత్నాకరుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు.
💫🌹వేద విదులైన బ్రాహ్మనోత్తముల ఆధ్వర్యంలో సత్రయాగం ప్రారంభించాడు మూడు రోజులు గడిచిన తర్వాత రాక్షసులు యాగ విధ్వంసానికి వచ్చారు. హనుమంతుడు బహు రూపములతో ప్రత్యక్షమై ,రాక్షస సంహారం చేసి ,యాగం నిర్విఘ్నంగా జరిపించాడు .
💫🌹ఆ తర్వాత అనేక సత్రయాగాలు చేసి ,పునర్జన్మ లేని లోకం చేరాడు. రత్నాకరుని వంశం వారంతా అతని మార్గాన్నే అనుసరించి మోక్షం పొందారు .ఈ కధ చెప్పిన పరాశర మహర్షి మైత్రేయునితో కొన్ని ముఖ్య విషయాలు తెలిపాడు. మంత్రాలు అనేకం ఒకే మంత్రాన్ని ,పల్లవాలను కలిపి జపించవచ్చు. నిర్దిష్టకార్యాన్ని అనుసరించి ,బీజాలను ఇరువైపులా చేర్చి జపించాలి.
💫🌹గురువు నుండే మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి ఉపదేశం లేని మంత్రం ఫలం ఇవ్వదు. నిష్కామంగా ,నిగర్వంగా ,సత్కర్మా చరణంతో సాధన చేయాలి. అలాంటి వారినే మంత్రాధిష్టాన దేవత రక్షిస్తాడు. మంత్రాలతో వ్యాపారం చేసే వారు మొదట్లో బానే ఉంటారు. తర్వాత వారికి కష్ట నష్టాలు వస్తాయి. అని చెప్పి ”హుమ్కార మంత్రోద్ధారాన్ని ”వివరించాడు.
💫🌹రామ బీజం సముచ్చార్య వాయు బీజం నమో నమః -వాయుపుత్రేత్యదో చార్య హనుమత్పరమం ధరేత్
సర్వ రాక్షస సంహార కారణాయే త్యదోచ్చరేత్ -సర్వ భయ నివారణం కురు యుగ్మంచ హుం త్రయం .
ఫటు స్వాహేతి మంత్రోయం ద్విచాత్వారిమ్ష దక్షరః -సర్వేషామేవ మంత్రానాం అయం శ్రేష్ఠ తరో మతః
అస్య మంత్రస్య హనుమాన్ స్వయమేవ రుషిస్మ్రుతః -చందస్య దైవ గాయత్రీ హనుమాన్ దేవతా స్మృతః
రామో బీజ మరుక్చక్తిహ్ వాయు పుత్రేతి కీలకం -సర్వ కామ్యార్ధ సిద్ధ్యర్ధం సాధకో విని యోజఎత్
న్యాసం కుర్యాత్ప్రయత్నేన మూల మంత్ర విధానతః –అధవా రామ వాయుభ్యాం షడంగం విన్యసేద్బుదః
ఆయుతం తు పునస్చార్యా దశాంశ విధినా తతః -హోమ తర్పణ విప్రార్చాన్ గురు పూజాం సమాచ రేత్
💫🌹ఇది హుమ్కార మంత్రోద్ధారం .దీనికి ధ్యాన శ్లోకం -కింద చెప్ప బడింది.
”ద్వాత్రిమ్శాద్భుజ భీశానో దయత మహా శాస్త్రం త్రిశీర్షం జ్వాల –ధ్వహ్ని స్పర్దీశాడీ క్షణం ప్రవిలసడ్డంష్ట్రా కరాలాననం
నిస్త్రింశ ప్రతి మాన రోమ నిచయం హుమ్కార ఘోరాక్రుతిం -ధ్యాఎచ్చత్రు వినాశానాయ నుతి మానుగ్రం హను మత్ప్రభుం ”
”అస్య శ్రీ హుమ్కార హనుమన్మహా మంత్రస్య -హనుమాన్ రుషి హ్ గాయత్రీ చందః హుమ్కార హనుమాన్ దేవతా -రాం బీజం -మరుక్చక్తిహ్ -వాయు పుత్రేతి కీలకం -హుమ్కార హను మత్ప్రసాదేన సర్వ కామ్యార్ధ సిద్ధ్యర్ధం హుమ్కార హనుమంమంత్ర జపే విని యోగః -మూల మంత్రేనా షడంగ న్యాసం కుర్యాత్ -భూర్భువాస్వోమితి దిగ్బంధః -ధ్యానం -ల మితి గురు ధ్యానాదికం కృత్వా-
ఓం రాం యం ,నమో వాయు పుత్రాయ హను మతే సర్వ రాక్షస సంహార కారణాయ ,సర్వ భయ నివారణం కూరు హుం హుం హుం ఫట్ స్వాహా
***
🙏 *శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 26* 🙏
🌻 *కేశవుని కధ* 🌻
💫🌹పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద వేదంగా పారంగతుడు ,బుద్ధిమాన్ ,స్వధర్మా చరణ నిష్టుడు. పుత్రులు ,పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతున్నాడు. అతిధి పూజలో జన్మ ధన్యం చేసుకొంటున్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగి పోతున్నాడు కేశవుడు.
💫🌹కొంత కాలానికి అతని జీవితంలో విషాదం అలముకొంది ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఖం పట్ట శక్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీ నగరం చేరాడు
అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ ,విశ్వేశ్వరున్ని దర్శిస్తూ ,అభిషేకం చేస్తూ ,విశాలాక్షీ దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు.
💫🌹కొంత కాలం కాశీలో గడిపి ,తర్వాత ప్రయాగ ,గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృ కార్యాలను నిర్వహిస్తూ ,విధ్యుక్త ధర్మాలన్నీ నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి ,మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒక రోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వట వృక్షం చాలా పురాతనమై ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధ రాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొన ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుని తినాలని ఉబలాట పడింది.
💫🌹మనోహర సుందర యువతీగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చ గొట్టటం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలు పోలేదు. యువతీ !ఎవరు నువ్వు ?అర్ధ రాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయిందా ?నేను భార్య లేని వాడను. నా అండ దండలతో ఉండగలవా ?నువ్వు ఒప్పుకొంటే నాతో నిన్ను మా ఊరు తీసుకొని వెళ్తాను”అని చెప్పాడు.
💫🌹ఆమె అంగీకరించింది. వారిద్దరూ ఆ రాత్రి ఆనందంగా గడిపారు మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు. కొంత కాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒక రోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద ధూళి దూసర దేహంతో ,రుద్రాక్ష మాల ధరించి ,వ్యాఘ్ర చర్మాంబర దారి అయిన ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని కోరాడు.
💫🌹సంతోషంతో ఆ యోగి ,శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలి వెళ్లి భార్యను రమ్మని పిలిచాడు. అ యోగి పిలవవద్దని వారించాడు. కేశవుని తో యోగి ”కేశవా ! ఆమెను తెలుసుకొనే కాపురం చేస్తున్నావా ?పెళ్లి చేసుకోన్నావా ?నిజం చెప్పు ”అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ వివరంగా తెలిపాడు. తనకే మీ తెలీదని తనను ఉద్ధరించ మని వేడుకొన్నాడు.
💫🌹కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్దరించాలని భావించాడు. ”ఈమె విషయం నేను చెప్పను నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపింప చేయించాడు ఒక రుద్రాక్ష మాలను ఇచ్చి దానితో జపం చేయమన్నాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగి పోతున్నాడు.
💫🌹ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరేయమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్ధిస్తూ ఏడుస్తూ దూర దూరంగా జరిగింది. అప్పుడు భక్త శులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచిని చుట్టి విసిరేశాడు. కేశవుడికి జరిగినదంతా తెలిపి స్వామి అదృశ్యమైనాడు. కేశవుడు యోగిని దర్శించి ,జరిగినదంతా తెలియజేసి ,తన్ను ఉద్ధరించమని వేడాడు.
💫🌹యోగి క్రుపాలువై రామ,ఆంజనేయులను నిత్యం జపించు. ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్టించు. జీవితాంతం హనుమ పూజ మానవద్దు ”అని హితవు చెప్పి శిష్యులతో వెళ్లి పోయాడు.
💫🌹యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి ,స్వామిని ప్రతిష్టించి యదా విధిగా పూజలు నిర్వహిస్తూ ,హనుమ మద్భాక్తులను ఆదరిస్తూ, హనుమ కధలను వినిపిస్తూ హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ,చివరకు ముక్తిని పొందాడు.
***
ఓం శ్రీరామ.. శ్రీ మాత్రేనమః
ReplyDelete