Wednesday, 28 February 2024




పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!

💥ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...


💥ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


💥ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


💥మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


💥ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...


💥మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


💥మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...


💥కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


💥తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


💥ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 


💥పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 


💥అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...


💥ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 


💥ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


💥నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


💥ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


💥ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...


💥కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


💥అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 


💥ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.

035..*దేవుడు మన కళ్ళకు…* *ఎందుకు కనబడడు….?*

            

*ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…,         అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు.* 


*నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.*

ఉదాహరణకు…


*మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.*


*మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.*


*కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.*


*మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.*

*‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.*


మరి *మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా?* అన్నదే ఈనాటి మన ప్రశ్న!


*పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం.* *అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…, వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు.* 

*ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….*


*ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.!*


*వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ!*


*అగ్ని* కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.


*’జలము’ కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.*


*’భూమి’ కి ఉన్న గుణాలు ఐదు శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు. ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.*


*’జలము’…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.*


*’అగ్ని’…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.*


*’వాయువు’…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.*


*’ఆకాశం’…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.*


*కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?             అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే.  ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.*


🙏🌹🌴🪔🌴🌹🙏

                                                                                                                                                                                                                                  *అతిధిదేవో భవ*

           

అతిథిరూపంలో ఆ పరమేశ్వరుడికన్నా గొప్పవాళ్ళు రావచ్చు. అందుకే పూజలో కూర్చున్నప్పుడు... శాస్త్రం మినహాయింపు ఇచ్చింది.


పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం. కానీ పూజచేస్తుండగా గురువుగారొచ్చినా, మహాత్ములు వచ్చినా పూజ విడిచిపెట్టి వెళ్ళి వారిని ఆదరించాలి. ఎందుకొచ్చారో కనుక్కుని పంపించి తరువాత పూజచేసుకోవాలి. అంతేతప్ప ‘నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను’ అని అనకూడదు.


అతిథిరూపంలో వచ్చినవాడు మహాత్ముడయితే వారిని సేవించకుండా తనదగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు.

*గజేంద్రమోక్షం కథామూలం అదే కదా!*


ఒకానొకప్పుడు ద్రవిడదేశంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండమీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు.


ఆ సమయంలో మహాత్ముడయిన అగస్త్యుడొచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాలిచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కానీ ఆయన వస్తే నాకేంటన్నట్లు ఉండిపోయాడు.


‘నీవు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువయి పుడతావు!’ అని శపించాడు అగస్త్యుడు.


’అయితే ఈ జన్మలో జపతపాదులు చేసావు కాబట్టి నీ ప్రాణంమీదికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావ’ని వరమిచ్చాడు.


అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు.


‘అతిథి దేవోభవ!’ అని శాస్త్రం అన్నదంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది.


అమర్యాద అంటే–అతిథి పూజ చేయకుండుట!  అంటే... ఇంటికొచ్చిన వాళ్ళకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా, ఫలహారం పెట్టావా ... అన్న లెక్క ఉండదు. నీ మర్యాద ఎటువంటిదన్నదే ప్రధానమయి ఉంటుంది.


*కుటిల బుద్ధులయిన వారి ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో చెప్పిందదే... ‘వారేం నష్టపోతున్నారో వాళ్ళకు తెలియదు పార్వతీ...! దుర్మార్గులైన వారేం చేస్తారో తెలుసా? పరమ భాగవతోత్తములు,పూజనీయులు ఇంటికొస్తే ఆదరబుద్ధితో తలుపు తీయరు. ‘రండిలోపలికి’ అని పిలవరు. తలుపుకొద్దిగా తీసి కనుబొమలు ముడేస్తారు, ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు, నిన్ను పలకరించరు, నువ్వలా బయటే చాలాసేపు కూర్చుని ఉంటే... వస్తున్నా ఉండండి.. అని ...                            ఆ తరువాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తరువాత వారు నీకు అన్నం పెట్టినా, పరమాన్నం పెట్టినా... నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు పార్వతీ! నా మాట విను. ఆదరబుద్ధి లేనివారి ఇంటికి వెళ్ళవద్దు!’ అని పరమశివుడంతటివాడు చెప్పాడు.*


*నీకు శక్తి ఉంది. అతిథికి మర్యాదలు ఘనంగా చెయ్యవచ్చు. శక్తిలేదు. అసలు చెయ్యలేకపోవచ్చు. చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు. చెయ్యలేక పోతున్నానన్నమాట పరమ మర్యాదతో చెప్పాలి. ‘అయ్యా! నన్ను మన్నించండి. మీవంటి మహాత్ములు వస్తే ఇవ్వాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా. ఫలానా నిస్సహాయ పరిస్థితిలోఉన్నా. క్షమించండి!’ అని ఒక్కమాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తిమంతం.*


🙏🌹🌴🪔🌴🌹🙏


*_ఓంతో కలిపి అష్టాక్షరి అయితే, ఓం లేకుండానే పంచాక్షరి అవుతుంది. అసలు మంత్రాలను అక్షర సంఖ్యతో ఎందుకు వ్యవహరిస్తున్నారు? అలా వ్యవహరించినందువల్ల తేడాలు వస్తున్నాయి కదా. వివరించండి._*

⚡⚡⚡ ⚡⚡⚡ ⚡⚡⚡

*_ముందు ప్రసిద్ధ మంత్రాలను అక్షర సంఖ్యతో ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసుకుందాం. ఏ మంత్రమైనా ఉపదేశం చేసినప్పుడు అది ఆరు చెవులకు వినపడకూడదని శాస్త్రం. అంటే గురుశిష్యులే ఆ మంత్రాన్ని వినాలి. మంత్రం జపించినప్పుడు అది వారిద్దరికే వినపడాలి. మననం చేసేదే మంత్రం. మనన ప్రక్రియలో శబ్దం బయటకు వినపడే ప్రసక్తేలేదు. అందుకే మంత్రాన్ని గుహ్యమని, అన్నారు. అట్టి మంత్రాలను పేరుపెట్టి పిలిస్తే, గుట్టు విప్పినట్లే కదా! అందుకే ప్రసిద్ధ మంత్రాలకు మన పెద్దలు అక్షర సంఖ్యను ఏర్పరిచారు. అష్టాక్షరి అంటే 'ఓం నమో నారాయణ' అని పంచాక్షరి 'సమశ్శివాయ' అని, ద్వాదశాక్షరి అంటే 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని, షడక్షరి అంటే 'ఓం నమో విష్ణవే' అని అర్ధం. అయితే పంచాక్షరికి స్వతస్సిద్ధంగా ఓం లేదు. ఓం కలుపుకుంటే తప్పులేదు. ఏ మంత్రానికైనా ప్రణవం (ఓం) చేర్చినప్పుడే అది వైదికం అవుతుంది. లేకపోతే తాంత్రికం అవుతుంది. ఏది ఏమైనా మంత్రం ఇచ్చే గురువు మీద, మంత్రం మీద, మంత్రాధిదైవతం మీద విశ్వాసం ఉంచి ఏ మంత్రం జపించినా సత్ఫలితం ఉంటుంది._*

🙏🌹🌴🪔🌴🌹🙏

036..దయ్యం వదిలింది -- చందమామ కథలు

వాణీ, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్ళకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్మా, వాణీ భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే, వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. ‘‘పట్నానికని బయలుదేరి, వర్షంలో చిక్కుపడ్డాం.

ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా?'' అని వాళ్లు అడిగారు. ‘‘లోపలికి రండి,'' అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి, భోజనం పెట్టి, పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళుతిన్నాక అన్నం కొద్దిగామిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు. ముద్దగా తడిసి పోయాయి. ‘‘ఇద్దరమూ చెరిసగమూ తిందాం,'' అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని, పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్లు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని, వెక్కివెక్కి ఏడుస్తున్నది. వాణీ వర్మలు నిర్ఘాంతపోయి, ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. ‘‘నా కాపరం గంగపాలయింది! రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది.

రాత్రి నా భర్త మీ ఆలూమగల అన్యోన్యం చూసి, ‘నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా నాలుగు మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి?' అని, ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళి పోయాడు. మొండిమనిషి! మళ్లీ తిరిగి రాడు. ఇక నా బతుకేంగాను? ఏం చేయను? ఎక్కడికని వెళ్ళను?'' అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్తకోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. ‘‘నాకు తెలుసు, ఆయన రాడు. నా కింకెవరూ లేరు. లోతయిన బావి చూసి దూకేస్తాను,'' అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. ‘‘నువ్వు ఏమీ బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు,'' అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్లింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి, నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు రెండు, మూడు నెలల కొకసారి అలా వస్తూంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికి చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలా సేపటిదాకా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపట్టుతూండగా ఏదో అలికిడి అయి, మెలుకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని, చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది! వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తనా, కిటికీ చప్పుడూ అనుమానం కలిగించాయి. ఆమె వంట గదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి, చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నమూ, కూరా, పులుసూ, పెరుగూ అమర్చి, కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ‘‘ఇంకా ఎన్నాళ్లు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చెయ్యి,'' అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణంచేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ‘‘ఇప్పుడిప్పుడే వీళ్ళకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపికపట్టు,'' అన్నది చంద్రమతి. ‘‘అమ్మ దొంగముండా! పైకి అమాయకంగా కనిపిస్తూ, మావాళ్ళ మంచితనాన్ని ఆసరాచేసుకుని, మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను!'' అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకుని, చంద్రమతి గురించి వాణీ, వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, ‘‘బాబోయ్‌, రాత్రి నేను కన్నుమూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జెలచప్పుడు! నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటివైపుకు ఈడ్చుకు పోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయట పడ్డాను. మరొకరైతే, హరీ అనేవాళ్ళు,'' అన్నాడు. వాణీ, వర్మా ఈ మాట విని హడలి పోయి, ‘‘అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం,'' అన్నారు. ‘‘మీరేమీ కంగారుపడకండి, ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను,'' అని మురారి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని, అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తరవాత అతను తలగడను మంచంమీద నిలువుగా అమర్చి, వాటిమీద దుప్పటి కప్పి, పెరటివైపు వెళ్ళి, వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలా సేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని, చంద్రమతి వచ్చి, గిన్నెలో అన్నీ సర్ది, మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి, ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి, మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి, ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి, కిటికీని సమీపించి, బయట తన భర్త జాడ కనబడక, వంటగది తలుపు మూసి, తనగదిలోకి వెళ్ళి, కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మా, వాణీ ఉలిక్కిపడి లేచి, చంద్రమతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు.

 చంద్రమతి భయంతో, ‘‘దయ్యం ఉన్న మాట నిజమే! నాకూ గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదికి వచ్చింది,'' అన్నది. ‘‘భయపడకండి. త్వరలోనే ఈ దయ్యం భరతం పట్టుతాను,'' అన్నాడు మురారి. రెండు రోజులపాటు అతను రాత్రిళ్ళు గజ్జెలచప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే, తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది. మూడోరోజు రాత్రి మురారి బయటనే పొంచి వుండి, చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా, తాను అదే దారిన వెళ్ళబోతున్నవాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, ‘‘నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా? నేను చూస్తాను!'' అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ‘‘ఏం జరిగిందండి?'' అని అనుమానంగా అడిగాడు. ‘‘ఇంకా ఏం జరగాలండీ? ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిణ్ణి చేసుకుంటాడట! ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే వున్నది!'' అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి, వీధితోవన లోపలికివచ్చి, తనమంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పినమాటమీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మూడు రోజులుగా అతనికి కిటికీ తెరవటంలేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, ‘‘నేను బుద్ధి గడ్డితిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను. ఆమెను నాతో పంపెయ్యండి,'' అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణీ, వర్మలు బాధ పడుతూంటే, ‘‘దయ్యం వదిలిందని సంతోషించక బాధ పడుతున్నారా?'' అంటూ మురారి జరిగిన సంగతి వాళ్ళకు చెప్పి, వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.

_037*💫 జీవిత నగ్న సత్యాలు  ⚜️*_

➖➖➖➖➖➖✍️

*_⚡1. నేను నేను నేను అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒక రోజు._*


*_2. నాది నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు._*


*_3. ఒక్క చావుతో బంధాలు అన్ని  తెగిపోతాయి ఏదో ఒక రోజు._*


*_4. ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు, ఏదో ఒక నాడు చుట్టూ అందరు ఉన్నా ఎందరు వున్నా సరే._*


*_5. ఇద్దరు కలిస్తే జనం నలుగురు మోస్తే మరణం._* 


*_6. మాయతో పుట్టావు, మాయలో జీవిస్తావు, మాయ మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు._*


*_7. జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు, పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు._*


*_8. ఎన్నో అనుభవిస్తావు నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్ని మర్చిపోతావు._*


*_9. నీ కష్టాలకు నీ సుఖాలకు కారణం నీవే._*


*_10. నీవు పుట్టడానికి కారణం కూడా నీవే. ఇలా బ్రతకడానికి కారణం నీవే. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే. చేతులారా నీవు చేసుకున్నవే._*


*_11. ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే లేకపోతే మరో జన్మకు సిద్ధం అవుతాడు._*


*_12. బ్రతికి ఉన్నప్పుడే దైవ నామాన్ని పట్టుకో లేదా బతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు._*


*_13. ఒట్టి చేతులతో వచ్చావు. పది మంది సహకారంతో బ్రతుకుతావు. పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావు.._*


*_ఎల్లప్పుడూ లభించే ఆనందం ఎక్కడ ఉంది ? ఈరోజు రమణీయంగా ఉన్న పుష్పమాల రేపటికి వాడిపోతుంది. ఎల్లుండికి కృళ్ళిపోతుంది. నేడు ఎంతగానో ఆకర్షణముగా ఉన్న భోజనము, రేపటికి పాచి పోతుంది. ఈనాడు మహా సుందరముగా ఉన్న స్త్రీ లేక పురుషుడి శరీరము 40 సంవత్సరాల తర్వాత ముడతలు పడి కృశించి వికారముగా అవుతుంది._*


*_ఇలాగే ప్రపంచంలో ప్రతి పదార్థము కొంతకాలమునకు పూర్తిగా మారిపోతుంది. ఇటువంటి చంచల పదార్థములను నమ్మి వాటి నుండి ఆనందమును కోరుకునే వారందరూ ఆశాభంగమే పొందగలరు. ఎందుకంటే నశించే వస్తువుల నుండి కలుగు సుఖము నశ్వరముగానే ఉంటుంది. చపల వస్తువుల నుండి కలుగు ఆనందము చపలముగానే ఉంటుంది. కావున శాశ్వత ఆనందమయుడైన భగవంతుణ్ణి అన్వేషించాలి..!_*


*_జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది._*


*_రేపు ఎప్పుడూ రేపే. ఈ రోజు కాదు. దాన్ని ఒక్కలాగే వుండాలని వూహించ కూడదు. అట్లా వూహించడం ప్రమాదకరం. రేపు ఎప్పుడూ ఈ రోజు కాదు. అందువల్ల నువ్వు చిరాకుపడతావు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఈ రోజులాగే రేపు జరిగితే నీకు విసుగు వస్తుంది. చిరాకు ఆనందం కాదు, విసుగు ఆనందం కాదు. భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోనీ. దానిపైన ఎట్లాంటి ఆశలూ పెట్టుకోకు. దాన్ని అజ్ఞాతమయిందిగానే వదిలిపెట్టు. అనూహ్యమయిందిగానే వదిలిపెట్టు. విషయాల్ని శాశ్వతమయినవిగా వుండేలా ప్రయత్నించకు. జీవనతత్వం మారేది. మనం  ప్రకృతిని బట్టి సాగాలి, తావుని బట్టి సాగాలి._*


*_అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. కొత్త కాంతి, కొత్త జీవితం, కొత్త దైవత్వం ఆవిష్కారమవుతాయి. నిరంతరం ప్రేమ ప్రవహించే వ్యక్తి, దేనితోనూ ఘర్షించని వ్యక్తి విశాలమవుతాడు. ఆకాశమంత అవుతాడు. విశాలత్వంలో అస్తిత్వమంటే ఏమిటో అతనికి తెలిసి వస్తుంది. ఆ విశాలత్వమే అస్తిత్వం._*


*_మనం అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదైనా వినగానే చదవగానే నేను నేర్చుకున్నాను అనిపిస్తుంది. కానీ కృతజ్ఞతను నేర్చుకోము. కృతజ్ఞత లేకుండా ఏ దైవీ గుణం కూడా పని చేయదు. అనేటువంటి ఎరుకలో ఉండాలి..._*


*_తనను తాను లొంగదీసుకుంటే చాలు. శరణాగతి అంటే తన ఉనికికి అసలు కారణం. అటువంటి మూలాన్ని మీకు వెలుపల ఉన్న దేవుడు అని ఊహించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఒకరి మూలం మీలోనే ఉంది. దానికి మిమ్మల్ని మీరు వదులుకోండి. అంటే మూలాన్ని వెతుక్కుని అందులో విలీనమవ్వాలి. మీరు దాని నుండి బయటపడినట్లు మీరు ఊహించుకున్నందున, మీరు "మూలం ఎక్కడ ఉంది ?" అనే ప్రశ్నను లేవనెత్తారు._*


*_చక్కెర దాని స్వంత తీపిని రుచి చూడదని, రుచి చూసేవారు దానిని రుచి చూసి ఆనందించాలని కొందరు వాదించారు. అదేవిధంగా, ఒక వ్యక్తి అత్యున్నతుడు కాలేడు, ఆ స్థితి యొక్క ఆనందాన్ని అనుభవించలేడు ; అందుచేత ఒకవైపు వ్యక్తిత్వాన్ని, మరోవైపు భగవంతుని తలరాతని కొనసాగించాలి, తద్వారా ఆనందం కలుగుతుంది ! భగవంతుని ప్రవృత్తి పంచదార లాంటిదా ? అత్యున్నతమైన ఆనందం కోసం ఒక వ్యక్తి తనను తాను లొంగిపోయి, తన వ్యక్తిత్వాన్ని ఎలా నిలుపుకోవచ్చు ? అంతేకాకుండా, ఆత్మ, దివ్య ప్రాంతాన్ని చేరుకుని, అక్కడే ఉండి, పరమాత్మకు సేవ చేస్తుందని కూడా వారు చెప్పారు._*


*_"సేవ" అనే పదం యొక్క ధ్వని ప్రభువును మోసగించగలదా ? అతనికి తెలియదా ? అతను ఈ ప్రజల సేవ కోసం ఎదురు చూస్తున్నాడా ? అతను-స్వచ్ఛమైన స్పృహ-ప్రతిస్పందంగా అడగలేదా : “నేను కాకుండా నువ్వు ఎవరు "అది నాకు సేవ చేయాలనే ఊహ ?"..._*

*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*

🙏🇮🇳

038*మన శరీరంలో ప్రసరించే పది రకాల వాయువులు, వాటి ఉపయోగాలు*:-


(1) ప్రాణ వాయువు = ఇది మన శరీరంలోని జ్ఞానేద్రియాలు సక్రమంగా పని చెయ్యటానికి ఉపయోగపడుతుంది.


(2) అపాణ వాయువు = ఇది శరీరంలోని వ్యర్థ్యాలను బయటకు పంపించటానికి ఉపయోగపడుతుంది.


(3) సమాన వాయువు = ఇది మనం తిన్న ఆహరం యొక్క శక్తి శరీరం మొత్తానికి సమానంగా తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుంది.


(4)ఉదాన వాయువు = ఇది మన మనస్సులోని ఆలోచన వాక్కు రూపంలో రావటానికి ఉపయోగపడుతుంది.


(5) వ్యాన వాయువు = ఇది శరీరం మొత్తానికి రక్తం సరఫరా అవ్వటానికి ఉపయోగపడుతుంది.


(6) నాగ వాయువు = వాంతి అవ్వటానికి ఉపయోగపడుతుంది.


(7) కూర్మ వాయువు = ఇది కనురెప్పలు వేయటానికి ఉపయోగపడుతుంది.


(8)కృకర వాయువు = తుమ్ము, దగ్గు రావటానికి ఉపయోగపడుతుంది.


(9)దేవాదత్త వాయువు = ఇది ఆవలించటానికి ఉపయోగపడుతుంది.


(10) ధనుంజయ వాయువు = ఇది మనిషి చనిపోయాక శరీరం త్వరగా చెడిపోకుండా ఉండటానికి  ఉపయోగపడుతుంది.


ఈ పది వాయువులు సక్రమంగా పనిచెయ్యటానికి చేసే ప్రయత్నమే ప్రాణాయామం. ప్రతి మనిషి రోజుకు కనీసం ఐదు నిమిషాలు ప్రణాయామం చేయగలిగితే అద్భుతమైన ఉపయోగం ఉంటుంది.

0039..జీవిత సూత్రం*ప్రాంజలి ప్రభ            

*మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు.*

*ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*

*“సర్వే క్షయాంత నిచాయంః పతనంతఃసమ్రుశ్ఛాయః”* 

*“సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్”*

*ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.*

*వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*

*1. సర్వే క్షయాంత నిచాయంః*

*ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు.*

*వారు ఎలాంటి పనిచేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.*

*కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత మేరకు డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది.*

*2. పతనంతః సమ్రుశ్ఛాయః*

*ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి.*

*3. సంయోగ విప్రయోగంత:*

*ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.*

*అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.*

*4. మారాతంత జీవితమ్*

*దీని అర్థం   పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ, చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.*

*ఈ విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవమైనవి.*

*మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే.*

*మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి, పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది*

*మార్పు మన నుండే మొదలవ్వాలి....!*

***

040..ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి ఎలా వచ్చాయో   తెలుసా?  చిన్న కధ...

వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్తుంటాడాయన.

అలా నడుస్తుండగా... ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన "సూర్యుడా...! దూరంగా వెళ్ళు" అంటూ ఆజ్ఞాపించాడు.

అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని.... వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.

అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా ఇంకా పెంచుతున్నాడు.

అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో.... తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు.

ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ.... ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.

"ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని" హెచ్చరించాడు.

అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ... "ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ... మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా...! అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు" అన్నాడు కసిగా...

జమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. "ఓ మహామునీ...! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం" అని చెప్పుకొచ్చాడు.

అంతేగాకుండా... జమదగ్నికి వేడినుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్య భగవానుడు. అవేంటంటే... పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా... అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు.

041..కర్మ   కర్మణా   నశ్యతి"

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది... వెంటనే గంగానదినే అడిగాడట.

"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు.  మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ... అని. 

అందుకా తల్లి  "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"  అని బదులిచ్చిందట. 

వెంటనే, అయ్యో  అన్ని పుణ్యనదులు ఇంతేకదా... పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని... సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని... దానికా సముద్రుడు 

నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట. 

అరే ... ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాప భారాన్ని అని అడగగా... అవి పకపకా నవ్వి  'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...

ఓహో...ఆ పాపాలన్నీ మన  మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట. 

కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః 

ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే.

పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది. 

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. 

ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?...అని ఈ శ్లోకం అర్థం

కర్మ కర్మణా నశ్యతి.... అనగా,  కర్మ కర్మతోనే నశిస్తుంది.

***

042..ఏమి కావాలి నీకు

ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?

సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.

దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.

షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.

ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు. భూతం ప్రత్యక్షం అయ్యింది." ఏమి కావాలి నీకు? అని అడిగింది.

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.

భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.

 నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.

వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.

ఏమి కావాలి నీకు అని అడిగింది.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.

ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?

పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం అలసిపోయి

స్థంభం ప్రక్కన నిద్రపోతోంది.

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.

ఈ కధ మనది.

ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?

మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని.

 ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం  "మంత్రం" (దైవ నామ స్మరణ) 

ఎక్కడం దిగడం మంత్రం జపం. జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన) 

అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.

అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.

మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక 

దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా 

మహోజ్వల జ్యోతి రూపం.

మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.

ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.

ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.

జై శ్రీ కృష్ణా...💐🙏

043..*విముక్తి :*
*₹₹₹₹₹₹₹₹₹₹₹*

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్య వేక్షిస్తున్నాడు.

అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది." అని శ్రీ రాముని అనుమతి అడిగాడు." నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని అన్నాడు శ్రీ రాముడు.

హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండ బోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు."నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు ." సరి , ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు .. అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు
శనీశ్వరుడు .హనుమంతుడు , రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టు కోవాలసిందిగా కోరాడు.అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"
అని అడిగాడు. హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"అన్నాడు." సరి, నీ చేతులు పట్టుకోనా"అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి
తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు హనుమంతుడు."అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు శనీశ్వరుడు.

"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.
" పోనీ, నీ హృదయంలో వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.
"ఈ హృదయంలో, మహాలక్ష్మీ రూపిణి అయిన సీతాదేవి,నా దేవుడైన శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు చోటు లేదు. " అన్నాడు హనుమ.

" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది. అక్కడే వుంశ్వరుడు , హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు.

హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళు తేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు.

" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామ భక్తుడవు. నీముందు నా శక్తి చాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్ట మహానుభావా"
అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!

నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది.

*సేకరణ :*
*_ ప్రాంజలి ప్రభ .*

044..ప్రాంజలి ప్రభ 

ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.

 నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. 

తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.

కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.

 అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.

 అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా,  'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.

అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.

“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది.

****

045.. Pranjali👌prabha👌

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.

తండ్రి శాపం :-
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష :-
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నేయి ,ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు . వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట :-
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన :-
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట :-
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి :-
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను
వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం  :-
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ :-
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత
విషయం బాగుందని పంపిస్తున్నాను.

🙏🙏🙏🙏🙏🙏 *మగవాడు_ఆడదానిలా_ఎలా_మారతాడు?*

*మగాడికి_మగాడికి_పిల్లలు_ఎలా_పుడతారు?*

*మచ్చుకు కొన్ని ఉదాహరణలు*
      🙏🙏🙏
*మహా భారత రచయిత శ్రీ వేద వ్యాస మహర్షి చేసిన కొన్ని అధ్భుత ప్రయోగాలు..*
         🔥🔥🔥
*1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.*
          🐢🐍🦎
*2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*
         🦆🪿🦇
*3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*
*పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..*
          🐗🐴🦄
*4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..*
          ☀️🌤️💥
*5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..*
        🌞🌞🌞
*6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..*
        🌎🌏🌍
*7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..*

*8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.*
         💧💦❄️
*9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..*
          🌟⭐💥
*10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..*
        🙈🙉🙊
*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?*
      🌼🌻🌞
*ఇవేమిటి, నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?*
              🪷🌺🌸
 *ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు..అది వారికున్న పరిమితత్వాన్ని తెలియజేస్తుంది...ఒకవేళ ఊహ అనుకున్నా కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?*
         💐🌷🌹
*ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బయటికి వస్తాయి అని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..*
        🦚🦜🦤
*కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని దైవం ఉనికి ఉండి తీరుతుంది..*
       🎄🌲🌳
*ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ వైదికులుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..*

*సనాతన సంప్రదాయం చాలా గొప్పది*
     👍👍👍
 *భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా?*
      🙏🙏🙏
*👉భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యభట్ట)*

*👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)*

*👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)*

*👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)*

*👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*

*👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే*

*👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన*

*వాల్మీకి మహర్షి మనవాడే*

*👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*

*👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు*

*👉అణువులు గురించి వివరించిన కణాదుడు*

*👉DNA గురించి చెప్పిన బోధిధర్మ*
*👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*

*👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు*

*👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని*
*ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏*

 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.*
*నా దేశం గొప్పది నా "సనాతన ధర్మం" గొప్పది నా హైందవ ధర్మం గొప్పది*
🙏🙏🙏🙏🙏

Tuesday, 27 February 2024

❤️)*(%)*(&)*(₹)*(#)*(@)*(*)*(-)*(=)*(!)*(")*(?)*(😜)

వసంతం.

కరికుంభసన్నిభకమనీయకుచకుంభ

ఫలభారకంపిత వామ మధ్య

పరిరంభసంరంభప్రారంభవిజృంభ

విస్తారకౌశికీ విభ్రమాంగి

ఘనజఘనహసిత కనకపులినతల

ప్రియహస్తమర్దనాపృథులమోద

అవిరామచుంబనాసవిరాజితాధరో

త్ఫుల్లముఖపద్మ తుష్టనేత్ర


యగుచు రతికేళి సలుపుచు యర్థదేహ

మగని భాగ్యమ్ము పండగ మరులు గొనుచు

జంటగూడుచుమధుమాససౌరుబెంచి

సంతసమ్మిడుగాదె వసంతవేళ.

(సీస పద్యం సేకరణ.. రచయిత తెలియదు )

****

భావము..వసంతకాలం ప్రారంభంతో, ప్రపంచం ఒక శక్తివంతమైన వస్త్రంగా రూపాంతరం చెందుతుంది, ప్రకృతి వైభవం యొక్క క్లిష్టమైన నమూనాలతో అల్లినది. పువ్వులు వికసిస్తాయి మరియు చెట్లు వికసించినప్పుడు, గాలి తీపి సువాసనలతో నిండి ఉంటుంది మరియు జీవితం యొక్క సున్నితమైన సంతృప్తి.

. ఈ పునరుద్ధరణ మరియు ఆశల ఋతువులు మన ఆత్మలకు ఓదార్పునిస్తుంది మరియు దాని ప్రకాశవంతమైన అందం మరియు వెచ్చదనంతో మనం మునిగిపోతున్నప్పుడు మన జీవితాలు దాని ఆశీర్వాదాలతో సుసంపన్నం కావాలి.

***-

వేరొక అర్ధం 

ఏనుగు తొండాలులా స్థనాలు కదులుతూ, ప్రకృతి పరవశించి శక్తి వంతమైన ఫలాలు కదలికలు పైయాకు కదలిక ఆరంభం, వైభోగం ఆనందం అల్లికతో మకరందం పొందా హస్తములతొ కౌగిలింత, ముఖపద్మము విస్తరించి చూంబనాలతొ మర్దనకు సహకరించి ఆకలితీర్చి, తీర్చుకొని రతికేళిలో అర్థభాగము అర్పించి పండుగచేసుకొనుచు వసంత కాలంలో అచ్చాధన మెలికలయిక జెంట సంగమం.

****

ఆరని కారుచిచ్చు యది యాసల కూడుకు వంతు చూపగన్ 

దారిన నీరుచేరినను తగ్గని వేడిని నెం చగల్గగన్ 

మారని మాయకర్మయది మానస మంటను తెల్పగల్గగన్ 

తీరని దాహమేననియు తిష్టగ దారిన వేచియుండగన్ 

****

వారని చేరనివ్వ కథ వారధి జూపియు వాలు నెంచియున్ 

తీరని కోర్కెయేనినియు తిక్కగ పక్కకు చేర నించియున్ 

నూరక యేలదిక్కులని నూతన మైకము దాహ మిచ్చియున్ 

మారక దేహమోప్పియు సమాయను చూపెను పాడు బుద్ధియున్ 


****

కారము లేనితిండి పరువమ్ము  నెరుంగని మోహి నింట భూ

భారము చూడ లేని తగు పాపము చేసెది  మంట తెచ్చ వి

ప్పారని మోము కుంట పురుషార్థము లేని మదంబు లoట యోం

కారము లేని పూజ  కొరగావులె యేల చెప్పనే 

*****

దారులు వేరుగా కదల ధాత్రుత భావము చూప గల్గగన్ 

మారక యంతరాత్మను సమానపరమ్మగు ధర్మ బుద్ధిగన్ 

కోరిన విన్నపాన్ని తగు కోమల లక్ష్యము జూప గల్గగన్ 

పారెడి దారి గౌరవము పాపము చేయక జీవ ముండగన్ 

***--

సారము లేని వంట సరసమ్ము నెరుంగని యీవి గొంట భూ

సారము లేని పంట పనిసల్పని బానిస యింట నీరు వి

స్తారము లేని కుంట పురుషార్థము లేని ధనంబు లుంట యోం

కారము లేని గంట కొరగావులె యేల చెప్పనే 


రుచిలేని వంట,సరసత తెలియని వాడిదగ్గర దానము తీసికొనుట,భూమిలో సారము లేని పంట,పనిచేయని సేవకుడు,దండిగా నీళ్ళు లేని చెరువు,దానము చేయని ధనము ఓంకారము లేని గంట పనికి రావు.

*-**

*సమస్య పూరించుట 

కొమ్మా తలయూచి మెచ్చి కొమ్మా నన్నున్


కం.నమ్మా పలికే విధిగా 

 చెమ్మా కారక మదీయ చింతల్ మాయల్ 

 అమ్మా పిలుపే స్మరణా

 కొమ్మా తలయూచి మెచ్చి కొమ్మా నన్నున్


***-

కర్తను నేనుగానునులె గాయ వశమ్మగు సంపదేయగున్ 

భర్తకు దాహతృప్తిగను బంధము దప్పని తీరుయేయగున్ 

వార్తలు మాత్రమెన్నియన వాంఛలు తీర్చుట ధర్మమేయగున్ 

కర్తగ నెవ్వరైననులె వైద్యము కర్మల లక్ష్యమేయగున్

****

ఉ.పువ్వుల నేస్తతుమ్మెదలు పూజ్యత భావము వ్యక్తమేయగన్ 

నవ్వులు పంచులక్ష్యము వినమ్రత కల్గియు దాహతృప్తిగన్

సవ్వడి చేయువాక్కులగు సానుభవమ్మును చూప 

గల్గగన్ 

మువ్వల శబ్దమై కదిలె పువ్వుల నవ్వులు సంతసమ్ముగన్


ఉ.మాటల మూర్ఖుడై కదల మాన సుభాషిత మార్గ మౌనమే 

మాటల ధాత్రుత్వమ్ము పిసినారికి సంపద లక్ష్య దాహమే 

మాటల సంప్రదాయకళ మాయలుయేలను దేశ బంధమే 

మాటల పుణ్యకర్మకళ మర్మ మహత్యము పాపి కాలమే

****

ఉ.మాటల మూర్ఖుడై కదల మాన సుభాషిత మార్గ మౌనమే 

మాటల ధాత్రుత్వమ్ము పిసినారికి సంపద లక్ష్య దాహమే 

మాటల సంప్రదాయకళ మాయలుయేలను దేశ బంధమే 

మాటల పుణ్యకర్మకళ మర్మ మహత్యము పాపి కాలమే

****

చెం.చెలువుగ రామలక్ష్మణులు చేనుకు రక్ష గనే సురక్షితన్ 

తలపుల మాయలేయవియు తాపము సీతకువచ్చె యేలనున్ 

కళల నిశంభచేష్టలగుకాలపు తమ్ములు శంభు డన్నయున్

తలుపులు మాదిరేకదల మా నసమౌనులె దివ్య కాంతిగన్

(క్రమాలాంకారము )

సమస్యను పరిష్కరించడం.....


భల్లూకము కడుపు లోన భానుడు గ్రుంకెన్ 


కం.కల్లోల్లాల కడలి కే 

భల్లూకము కడుపులోన భానుడు గ్రుoకెన్ 

జల్లే కురవంగ పుడమి 

ఒళ్ళే తడవంగ పృథ్వి వోర్పే చూపే

*****

ఉ.కనులచూపుకానకయు కావలి కష్టము వచ్చి నప్పుడే 

కనుల కళ్లజోడు సహకారము తోడుగ దృష్టి పెర్గగన్ 

కనుల దూరదృష్టి గను కాల వయస్సుగ కళ్ల జోడుయే 

కనులు వృద్ధులందున సకావ్యము వ్రాయుట విద్య భోదగన్ 

****

లోకము కొక్కడే విభుడు! లోకులు కాకులు, ఎంత కూసినన్

ఆకలి కేక లన్నిటిని ఆపగ నాతడు ఒక్కడే తగున్!

రూకలు లేని నాడు పెను రోదన చేయుచు, మోకరిల్లుచున్

తూకము వేయుచుండుటది తొత్తుల కబ్బిన ఛాందసంబగున్!


ద్వి..లోకము కొక్కడే విభుడు! లోకులు కాకులు, 

ఆకలి కేక లన్నిటిని ఆపగ నాతడు 

రూకలు లేని నాడు పెను రోదన చేయుచు, 

తూకము వేయుచుండుటది తొత్తుల కబ్బిన 

*****

చం.అవిటితనమ్మనేదియు కణాలుగ జన్మ పరంపరాయగున్ 

అవిటితనమ్ము వోర్వకయు యాస గుణమ్ముయు చేరి సంపదన్ 

అవిటితనమ్ము యుండదు మనస్సున శాంతిగ నిర్ణయమ్ముగన్ 

అవిటి తనమ్ము సేవల గుణమ్ముయు విద్య నునాప లేదుయున్


*అవిటితనమ్మనేదియు కణాలుగ జన్మ 

అవిటితనమ్ము వోర్వకయు యాస గుణమ్ముయు 

అవిటితనమ్ము యుండదు మనస్సున శాంతిగ 

అవిటి తనమ్ము సేవల గుణమ్ముయు విద్యయె 

****

ఉ.ఆకలి జీవసాగరమనస్సగు శక్తికి మూలమేయగున్ 

ఆకలి హృద్యతాపము యనాదిగ తర్చగ నేటి విద్యయున్ 

ఆకలి చంపనీక విధి యాడెడి పాశము బట్టి మార్పుగన్ 

ఆకలి యాయసంమలుపు యాశ్రిత సంగమసేవతీర్పుగన్ 

****

 ****

అచ్యుతానంద బ్రహ్మచారి


              మధ్యమ వ్యాయోగము 


మహాకవి భాసుడు రచించిన13 నాటకాలలో 

మధ్యమ వ్యాయోగము ఒకటి.మధ్యమ వ్యా 

యోగమునకు ముఖ్యపాత్రలు మహాభారతము 

నుండి స్వీకరించబడినవి.ఇందులోని కథ కల్పితము.

ఇది ఏకాంకముతో కూడిన వ్యాయోగము.కేవలము 

ముఖ్యపాత్ర భీమసేనుడు,హిడింబా,ఘటోత్క

చుడు అనుమూడు పాత్రలు మాత్రమే మహాభారత 

మునుండి స్వీకరించబడినవి.ఈపాత్రలతో మరికొన్ని 

పాత్రలను సమకూర్చి కవి కథను కల్పించి దీనిని 

రచించెను.ఘటన లన్నియు ఒకదినములోనే 

పరిసమాప్తమగును.ఈ ఘటనలన్నియు ఒకే 

అంకములో నిబద్ధమై యుండును.దీనియందు 

భీమసేనుడు పాండవ మధ్యమునిగా చిత్రించ 

బడెను.కథ ముఖ్యపాత్రయైన భీమసేనునిపై 

ఆధార పడియుండును.అందుచేత'మధ్యమ 

వ్యాయోగము,గాచెప్పబడుచున్నది.


   మధ్యమ వ్యాయోగములోని పాత్రలు 

             పురుషులు 

1.భీమసేనుడు- పాండవ మధ్యముడు, నాయకుడు 

2.ఘటోత్కచుడు -హిడింబా భీమసేనుల పుత్రుడు

3.వృద్ధుడు- కేశవదాసు అను ఒక బ్రాహ్మణవృద్ధుడు 

4.ప్రథముడు-కేశవదాసుయొక్క ప్రథమ పుత్రుడు 

5.ద్వితీయుడు-కేశవదాసుయొక్కద్వితీయ పుత్రుడు 

6తృతీయుడు-కేశవదాసుయొక్కతృతీయపుత్రుడు 

                       స్త్రీపాత్రలు 

1.హిడింబా-భీమసేనునియొక్కభార్య 

2.బ్రాహ్మణి-కేశవదాసుయొక్కభార్య 

****

        అచ్యుతానంద బ్రహ్మచారి

తెలుగు అనువాదము అచ్యుతానంద బ్రహ్మచారి

సంస్కృతములో రచన మహాకవి భాసుడు 

             మధ్యమ వ్యాయోగః

               (మధ్యమ వ్యాయోగము)

(నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః) తె౹(నాందీచివర,తరువాతసూత్రధారుడుప్రవేశించును

సూత్రధారః౹   శ్లో॥

పాయాత్స వో ౽సుర వధూ హృదయావసాదః

పాదో హరేః కువలయామల ఖడ్గనీలః ౹

యః ప్రోద్ధత స్త్రిభువన క్రమణే రరాజ 

వైఢూర్య సంక్రమణ ఇవాంబర సాగరస్య ॥

తె౹   సీ॥

పైకెత్తబడియు నే పాదము త్రిభువన 

        గణనకై వినువీధిఁ గ్రాలుచున్న,

బయలను కడలికి వైఢూర్య వారధి 

      నిర్మితమై యది నెగడుచున్న, 

దనుజాబలల హృదయ తాపమున్ గలిగించు

     ప్రఖ్యాత మైయది వరలుచున్న, 

నీలోత్పలామల నీలఖడ్గమువలె 

     రాజిల్లి గగనానఁ బ్రబలుచున్న, 

తే గీ౹

బ్రహ్మదేవుఁడు కడిగిన బలిమిగలుగు, 

దనుజ నాథుని బలిరాజు నణచినట్టి, 

వామనవతార విష్ణుని పదకమలము 

చేరి యిటనున్న మిమ్ము రక్షించుఁగాక!


ఏవమార్యమిశ్రాన్ విజ్ఞాపయామి౹అయే!కిన్ను 

ఖలు మయి విజ్జాపనవ్యగ్రే శబ్ద ఇవశ్రూయతే ౹

అంగ!పశ్యామి౹

తె౹ఇట్లు పూజనీయులకు విన్నవించెదను.అరే!

నేను విన్నవించుటకు సంసిద్ధుడనై యుండగా 

ఏదో శబ్దమువలె వినబడుచున్నది .ఓయీ!

చూచెదను.

   (నేపథ్యే) (తెరలోపల)

భోస్తాత!కోను ఖల్వేషః!

తె౹ఓతండ్రీ!ఇతడెవడో కదా!

సూత్రధారః ౹భవతు విజ్ఞాతమ్ ౹

తె౹ఆ తెలిసినది.

శ్లో॥

భోః శబ్దోచ్ఛారణాదస్య బ్రాహ్మణో౽యం నసంశయః ౹

త్రాస్యతే నిర్విశంకేన కేనచిత్ పాపచేతసా ॥

తె౹  తే గీ 

పరఁగ' భోః' యను శబ్దము పలుకువలన 

సందియములే దితండుబల్ సద్విజుండె, 

భీకరుఁడు,దుష్టుఁడును,పాపభీతిలేని 

వాఁడు భయపెట్టుచున్నాడు పాఱునిపుడు.


(నేపథ్యే =తెరలోపల)

భోస్తాత!కోను ఖల్వేషః!

తె౹ఓతండ్రీ!ఇతడెవడో కదా!

సూత్రధారః౹హంత!దృఢం విజ్ఞాతమ్ ౹ఏష ఖలు 

పాండవ మధ్యమస్యాత్మజో హిడింబారణి సం

భూతో రాక్షసాగ్నిరకృత వైరం బ్రాహ్మణ జనం 

విత్రాసయతి ౹భోః!కష్టం ఖలు పత్నీసుతపరివృతస్య 

బ్రాహ్మణస్య వృత్తాంతః అత్రహి ౹


తె౹అయ్యో!బాగుగా తెలిసినది.ఇతడు పాండవ 

మధ్యముని కుమారుడు.'హిడింబ'అరణియందు 

పుట్టినవాడు.రాక్షసుడను అగ్ని.ఏవైరమునెరుం 

గని బ్రాహ్మణుని భయపెట్టు చున్నాడు కదా!

భార్యాపుత్రులతో కూడియున్న బ్రాహ్మణుని పరిస్థితి

కష్టమైనది!ఇచ్చట-


  అచ్యుతానంద బ్రహ్మచారి

యీ పక్షం 15 కథలు.. ప్రాంజలి ప్రభ



016.. రాజు కధ 

ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,

తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.

ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.

తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,

ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,

తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,

దాని సాయంతో ఆతని శిక్షించమని చెప్పింది.

రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో

సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని

అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.

ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,

ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,

తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,

అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి

నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.

రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.

ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.

రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన

ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.

ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,

నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.

ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,

విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి

రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక

ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,

అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే

ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.

ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.

ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.

పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,

కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.

రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.

అంటే బిపికి రహదారి కోపం.

తలనొప్పులు వస్తాయి.

ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.

వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,

రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.

అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.

ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.

చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు

మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.

తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.

శుభసాయంత్రం
 😊💐

 🙏

017..ఏమి కావాలి నీకు

ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?

సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.

దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.

షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.

ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు. భూతం ప్రత్యక్షం అయ్యింది." ఏమి కావాలి నీకు? అని అడిగింది.

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.

భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.

 నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.

వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.

ఏమి కావాలి నీకు అని అడిగింది.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.

ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?

పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం అలసిపోయి

స్థంభం ప్రక్కన నిద్రపోతోంది.

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.

ఈ కధ మనది.

ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?

మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని.

 ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం  "మంత్రం" (దైవ నామ స్మరణ) 

ఎక్కడం దిగడం మంత్రం జపం. జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన) 

అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.

అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.

మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక 

దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా 

మహోజ్వల జ్యోతి రూపం.

మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.

ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.

ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.

జై శ్రీ కృష్ణా...💐

018..రక్త సంబంధం*🙏🙏

*తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో  ఒక బరువులా  భావిస్తున్నారు.....*

*ఒకే తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటాం...*

*పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోము....*

*అప్పట్లో.....*

*ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.   అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.  పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు....     రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది...*

*బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది...*

*వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది...     తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ...*

*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.*

*ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు...*

*అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు.* *అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే....     జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే...    అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.*

      *ఇక వెళ్ళొస్తామంటూ...    బయల్దేరారు ముగ్గురూను.*

    *తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.*  👍

    *"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా...     నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు* *భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ...*

*ఆలోచించుకుంటూ....!*

*సోదరులంటే ఇలా ఉండాలి కదా....!*  

*బంధం అనే కాదు...    కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.*

          *ఆత్మీయతను కోల్పోకండి.!*

*దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా...      మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.*

              *"ఏమంటారు"*..?

*ఇలాంటి ఆత్మీయతలను;* *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం, కానీ ఈ మెసేజ్ ని సాధ్యమైనంత ఎక్కువ గ్రూవులలో షేర్ చేసి మళ్ళి ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది ఇది నా చిన్న ప్రయత్నం 

నా ప్రయత్నం కు మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ..🙏🙏🙏

****

019..*పక్షి నేర్పిన పాఠం

ఓ వూరి దగ్గరి పొలంలో సారసపక్షుల జంట నివసిస్తూ వుండేది. ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది. కొంత కాలానికి గుడ్లలో నుంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరటానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు చుట్టు కొనింది. రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి ఎగిరి వెళ్లాలి. కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది - 'మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.'

ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయం కాలం గూడు చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి - “ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది. ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను.” అన్నాడు.

“మీరేమీ భయపడకండి. రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా వుండొచ్చు” అని పక్షి పిల్లలతో చెప్పింది.

కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకొంది. అప్పుడు

పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి.

“మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లీ వచ్చాడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తాను.”

సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పాలం విడిచి మరో చోటికి పోనక్కర్లేదు.”

“అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నేపంతో తప్పించుకొంటున్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతు న్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలెడ్తాను.”

అప్పుడు సారసపక్షి భయపడింది. “అరరే! వెంటనే బయలుదేరండి. ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్లి తలదాచుకొందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని. 

పిల్లలు ఆదుర్దాగా అడిగారు “ఎందుకు వెళ్లాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?”

సారసపక్షి ఇలా బదులు చెప్పింది.  “రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తన పని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడ్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. కాని ఎవరంతట వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్నప్పు డు, అవి చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది.” అన్నది.

సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటికి ఎగిరిపోయ్యాయి.

ఆ మరుసటి రోజు రైతు తానే పనిముట్లు తెచ్చుకుని పంట కోత మొదలుపెట్టాడు.

నీతి: ఒకరి మీద ఆధారపడకుండా పనులు మొదలుపెడితేనే పనులు సజావుగా, చక్కగా సాగుతాయి.

🦩

 *సమాప్తం*

020..శాంత స్వభావం

జీవితం పట్ల సరైన, స్పష్టమైన అవగాహన లేక మనసు పరిపరి విధాల పరిగెడుతూంటుంది. ముందు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మారిపోయి దృష్టి ఎటో మరలిపోయి సాధారణమైన మన జీవన విధానంలో భయాలు, ఆందోళనలు, సందేహాలు కలిగి ఎటూ తేల్చుకోకుండా సందిగ్ధం ఏర్పడుతుంది. గతంలో జరిగినదానికి విచారించకూడదు. వర్తమాన కాలంలో జరుగుతున్న పరిణామాలను మనం అడ్డుకోలేం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవలసిందే! భవిష్యత్తులో జరగబోయేది తెలియదు. అందుచేత ఏం జరగబోతోందో అని ఊహించుకుని భయాందోళనలకు గురి కావడం ఎందుకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయని భావించకూడదు ప్రతికూలంగా జరుగుతాయని మానసికంగా సిద్దపడితే ధైర్యంగా ఉండగలుగుతాం. అప్పుడు మనసు వైకల్యం చెందదు

మన ఆలోచనా సరళిలో స్పష్టమైన అవగాహన ఉంటే సందేహాలు కలగవు. ఒకవేళ కలిగినా ఆ సందేహాలకు సమాధానాలు వాటంతట అవే లభిస్తాయి. ఎవరి సలహాలు సూచనలు పాటించకుండానే సందేహ నివృత్తి కలుగుతుంది. ఒక నిబద్ధతతో, మార్గనిర్దేశనంతో మనం ముందుకు సాగాలి

చిన్నచిన్న విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి భూతద్దంలో చూసి భయపడకూడదు. అటువంటి చిన్న విషయాల్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేయాలి. కొందరు కొన్ని పనులు సాధించుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడ్డారనుకుందాం. ఆ సంఘీభావం వల్ల అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆసంఘ సభ్యులు తమ లోపాలను ఒకసారి అవలోకనం

చేసుకుని, వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఇతరులు ఆ వైఫల్యాలను గోరంతలు కొండంతలుగా చిత్రీకరించి ఆ సభ్యులను దెప్పి పొడవకూడదు. "సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తిని మనం ఆదుకుంటాం. మనం చేసిన సహాయానికి ఆ వ్యక్తే కృతజ్ఞతలు చెప్పకపోతే బాధపడతాం

మనం పలకరింపుగా చిరునవ్వు నవ్వితే, అవతలివాళ్లు చిరునవ్వుతో స్పందించకపోతే కుంగిపోతాం, క్షోభపడతాం వీడికింత తలబిరుసు అనుకుంటాం. అలాగే మనకూ తలబిరుసు లేకుండా చూసుకోవాలి. ఎదుటివారిలో ఏ లోపం ఉందనుకుంటామె ఆ లోపం మనలో ఉండకుండా జాగ్రత్తపడాలి. మిన్ను విరిగి మీద పడిపోతున్నా, ప్రశాంతంగా ఉండే ఉత్తమ పురుషులు మన పౌరాణిక గాథల్లో కనిపిస్తారు. అందులో ప్రహ్లాదుడు అయిదేళ్ల బాలకుడు. తన తండ్రి ఎన్ని బాధలు పెట్టినా, శ్రీహరి నామాన్ని నిరంతరం మననం చేసే ప్రశాంత స్వభావుడు

తరవాత- రాజర్షి అయిన అంబరీషుడు. దుర్వాసమహర్షి క్రుద్ధుడై తన జటాజూటం నుంచి 'కృత్య' అనే అగ్ని జ్వాలలతో ఉన్న శక్తిని అంబరీషుడిపై ప్రయోగించాడు అంబరీషుడు ప్రశాంతంగా రెండు చేతులూ తల మీద పెట్టుకుని శ్రీహరి నామస్మరణలో నిమగ్నుడైపోయాడు. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవడానికి కించిత్తెనా ప్రయత్నించలేదు. ఆ శ్రీమహావిష్ణువే 'వెర్రితపసే చేయు వేడబంబు చక్కవెట్టుమనుచు' సుదర్శన చక్రాన్ని పంపి దుర్వాసుని పొగరు అణచివేశాడు.

ప్రశాంతచిత్తుల జాబితాలో ఉండాల్సినవాడు ఉత్తమోత్తముడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు, తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కాదగినవాడు, జటాధారియై నారచీరలు ధరించి అడవులకు వెళవలసి వచ్చినప్పుడు ప్రశాంత చిత్రంతోబయలుదేరాడు. 'పయోనిధి' అయిన సముద్రంలో బడబాగ్ని ఉంది. అటువంటి బడబాగ్నిని తనలోనే అణచుకుని గంభీరంగా అడవులకు వెళ్లాడు. అందుకే 'కరుణాపయోనిధి' అని స్తుతించాడు కంచర్ల గోపన్న అనే భద్రగిరి రామదాసు

పైన పేర్కొన్న ఉత్తమ పురుషులు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మేరునగధీరులై, ప్రశాంత చిత్తులై, ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా నిలబడగలిగిన ధీరోదాత్తులు. వాళ్లను తలచుకుంటూ మనం ముందుకు సాగితే జీవితంలో అపజయాలు సైతం విజయాలుగా పరిణమిస్తాయి

--(())--

21..ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
🙏🙏🙏🙏🙏



నేను తండ్రిని ..నేను తండ్రిని ..
‘పిల్లలకి పెళ్ళి చేసెస్తే ప్రశాంతంగా ఉండచ్చు’అని అనుకోవడం...

*{“ఈ దశ పిల్లలకు పెళ్ళి చేసి ..ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది ..
అంటే ఒకప్పటి భర్త ..తండ్రి దశ దాటి తాత అవ్వడం..”}*

9)చల్లారిన’భర్తలు:

పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూంటారు..
వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు..
ఓపికా ఉండదు..కానీ అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ..ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి..
అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం..జరుగుతుంది..
కానీ ఏమీ వినపడనట్టు “వంటైందా..?”
అని అమాయకంగా అడగడం పడక్కుర్చీలో కళ్ళ జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డు పెట్టుకుని ..”అన్నీ గుర్తున్నాయ్ దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయనో పెళ్ళంత నరకం లేదు..
నడుం వొంగాక పూర్తి జ్ఞానం వచ్చి
ఏం ప్రయోజనంలేదు..
పోనీ ,తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపాడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టివి లో ప్రసంగం విన్నాంగా..అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు”అని సమాధాన పడతారు..ఈలోపు “మింగడానికి తగలడు”
అని పిలుపు వినపడగానే ..కిక్కురుమనకుండా వచ్చి అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం..

“ఈదశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది...”}

*అంకితం:
భర్తగా మారిన వారికి..,
భర్తగా మారాలనుకునే వారికి..,
భర్తగా మారకూడదు ,అని అనుకునే వారికి..
బాధ్యయతాయుతంగా ఈ వ్యాసం అంకితం.....*
 కాసేపు హాయిగా నవ్వుకోటానికే అని మనవి
*****



023.. ప్రాంజలి prabha👍.. సమదృష్టి 

భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో సాధన చేయాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆయనను ఆరాధించాలి. భగవంతుడు లేదా సద్గురువు కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మనుషులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవ స్వరూపంగా ఎంచి ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారి పట్ల సదా భక్తిప్రపత్తులు ప్రదర్శించాలి. వారు చేసే బోధనలు, ఉప దేశాలు ఆత్మవికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరి నుంచీ ఏదీ ఆశించడు.

ఒక రాజు జ్ఞానమూర్తి అయిన గురువు పాదాలపై శిరసు ఉంచి వినయపూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు.

‘దేశానికి రాజైన మీరు ఆ జ్ఞాని పాదాలపై శిరసును ఎలా ఉంచారు? ఈ దేశ సార్వభౌముడిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకున్న శిరసు మీది’ అన్నాడు మంత్రి.

‘తగిన సమయంలో నీకు సమాధానం చెబుతాను’ అన్నాడు రాజు.

కొద్ది రోజుల తరువాత రాజు మంత్రిని పిలిచాడు.

‘నాకు ఒక మేక తల, పులి తల, మనిషి తల కావాలి. వెంటనే తీసుకుని రా’ అని రాజు ఆజ్ఞాపించాడు.

రాజాజ్ఞతో మంత్రి అయోమయస్థితిలో పడ్డాడు. చివరకు మేక తలను తీసుకుని రావాలని తన మనుషులను పంపాడు. డబ్బు చెల్లించగానే ఒక కసాయి వాడు మేక తలను ఇచ్చాడు. పులి తల బజారులో ఎక్కడా దొరకదు. కాబట్టి మంత్రి ఆరితేరిన వేటగాళ్లను అడవికి పంపాడు. వాళ్లు పులిని చంపి దాని తలను తీసుకువచ్చారు. ఇక మనిషి తల ఎలా సంపాదించాలి? అనేది మంత్రికి సమస్యగా మారింది. మృతదేహం నుంచి తలను వేరు చేయడానికి ఎవరూ అంగీకరించరు. మొత్తానికి ఎలాగో అష్టకష్టాలు పడి మంత్రి మనిషి తలను కూడా సంపాదించాడు. మొత్తం మూడు తలలను తీసుకుని రాజు వద్దకు వెళ్లాడు.

అప్పుడు రాజు మంత్రితో- ‘ఈ మూడు తలల్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ ఇచ్చేయ్‍’ అన్నాడు.

మంత్రి కంగుతిన్నాడు. ఎంతో కష్టపడి తెస్తే ఇచ్చేయమంటారేమిటి? అనుకున్నాడు. మేక తలను వెనక్కి ఇచ్చేయడం కష్టం కాదు కాబట్టి దాన్ని ఇచ్చేశాడు. పులి తలను ఎవరూ తీసుకోలేదు. పైగా అందరూ భయపడ్డారు. కొంత ధనం ఎరవేసి దానిని ఒకరికి అంట గట్టాడు. మనిషి తలను తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.

మంత్రి రాజు వద్దకు వెళ్లి ‘మనిషి తలను ఎవరూ తీసుకోవడం లేదు మహారాజా’ అని చెప్పాడు.

‘అంటే మేక తలకు కానీ, పులి తలకు కానీ చచ్చిన తరువాత కూడా ఎంతో కొంత విలువ ఉంటుంది. మనిషి తలను ఎవరూ స్ప•శిం చరు. అటువంటి ఎందుకూ కొరగాని నా తలను జ్ఞాని పాదాలపై ఉంచాను. నేను చేసింది తప్పా?’ అని రాజు మంత్రిని ప్రశ్నించాడు.

ప్రాపంచిక విషయాలు, విజయాలు, సుఖాలు నిత్యం, నిరంతరం మనల్ని వ్యామోహంలో ముంచెత్తుతుంటాయి. నిజానికి అవి ఏ విలువా లేనివి. జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైన పని మరొకటి లేదు. ఆ పాదాలు మోక్షానికి సోపానాలు. భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకొన్న జ్ఞాని సాక్షాత్తూ భగవత్‍ స్వరూపుడే. ఆయన పాదాలు భగవంతుని పాదకమలాలతో సమానమైనవి. కాబట్టి జ్ఞాను లను గౌరవించడం నేర్చుకోవాలి. వారితో సాంగత్యం చేయాలి. మానవ జీవితాలకు మోక్షాన్ని ప్రసాదించి తరుణోపాయం చూపించేది జ్ఞానులే.

----

024.. ప్రేమ కధ 

అమ్మా ! రేపటి లోపు నీ నిర్ణయం తేల్చాలి.మీ ఇద్దరికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నా మాట విని నాయనమ్మను వృద్ధాశ్రమానికి  పంపి నువ్వు, నేను, నా భార్య కలిసుందాం. అత్తగారినే కాక అత్త గారి అత్తగారిని కూడా చూడాలంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందమ్మా చెప్పు.. అలా నువ్వు నాయనమ్మని పంపిస్తేనే ఉష నన్ను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే నా ప్రేమ విఫలమే " అన్నాడు శశి.

తల్లీ కొడుకుల మాటలు ఎంత వినకూడదు అనుకున్నా చెవిన పడుతూనే ఉన్నాయి పూర్ణమ్మకి. వినపడాలనే గట్టిగా మాట్లాడుతున్నాడని అర్ధం కాకపోలేదు ఆవిడకి.

నిమిషం మౌనం తరువాత...

స్వరూప మాట్లాడుతోంది " శశి ! నీ పెళ్ళికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. పెళ్లి అయ్యాక నువ్వు, నీ భార్య కలిసి ఉండండి విడిగా..  నేను, మా అత్తగారు ఇక్కడే ఉంటాం. నా నిర్ణయం ఇదే !

పంతొమ్మిదేళ్ళ వయసు నుండి నాకు ఆవిడతో అనుబంధం. నాకు తల్లి వంటిది. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆవిడే మనకి పెద్ద దిక్కుగా నిలబడింది. ఈ రోజు ఆవిడ జవసత్వాలుడిగాయని  ఆవిడని మనకి పనికి రాని వస్తువుగా చూడలేను. అలా చేస్తే నన్ను మీ నాన్న క్షమించరు పై నుండి. మీ నాన్న కోసం కాకపోయినా నాలోని తల్లి  ఆ తల్లిని  వదలలేదు.

అలాగని నువ్వు మనసు పడిన అమ్మాయి నుండి దూరం చేయలేను. తల్లిగా నేనెపుడు నిన్ను వదలలేను. నువ్వెక్కడ ఉన్నా నీ క్షేమమే కోరుకుంటాను.

ఒక్కటి మాత్రం ఆలోచించుకో... ఇవాళ నాయనమ్మ ఉంటే పెళ్లి చేసుకోనని చెప్పిన అమ్మాయి.. నేను నీతో వచ్చేస్తే  రేపు పెళ్లి అయ్యాక నన్ను కూడా పొమ్మంటే ?? అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఆ అమ్మాయి ప్రేమ పొందాలంటే నువ్వు నీ ప్రేమానుబంధాలను తాకట్టు పెట్టాల్సినందుకు మాత్రం బాధగానే ఉంది.

ఇప్పటికే ఆలస్యం అయింది. పడుకో " అని చెప్పి బయటికి వచ్చేసింది.

బయటికి వచ్చిన కోడలులో తల్లి కనిపించింది పూర్ణమ్మకి !! ఏ జన్మ ఋణానుబంధమో అనుకుంది మనసులో !!

*******

*-**

025.. ప్రాంజలి prabha🌹.. జ్ఞానం 

నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!*🌸

జ్ఞానం అంటే ఉన్నది తెలియడమే. ఉన్నది అంటే కనిపించేదాని వెనుక ఉన్నదేదో తెలియడం. నేను అంటే మనసే. మనసంటే ఆలోచనలే. ఇది అర్ధమైతే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గితే నేను తగ్గుతుంది. నేను అదృశ్యమయ్యే కొద్ది ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది. సుఖం కోసం, సౌఖ్యం కోసం మరో దానిపై ఆధారపడే కొద్దీ నేను పెరుగుతుంది. నేను పెరిగే కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది. ఆధునికత పేరుతో మనిషి సాంకేతికపై ఆధారపడటమే ప్రస్తుత అజ్ఞానానికి కారణం. అంటే సాంకేతికత వద్దని కాదు. దాని అతివినియోగం, దుర్వినియోగం వద్దని భావం. ప్రాపంచిక విషయాలపై కాకుండా పరిపూర్ణ విశ్వాసంతో పరమాత్మను నమ్మితే, అహంకారంతో కూడిన నేను పోయి జ్ఞానం అంకురిస్తుంది. నేను అస్తమించడమే జ్ఞానం ఉదయించడం !

ఆత్మజ్ఞానం భగవంతుడు బహుమతి గా ఇచ్చేదే కానీ, మనం

అడిగి తీసుకునేది కాదు.

జ్ఞానం పొందాలంటే సుఖపడాలనే కాంక్ష పోవాలి. సుఖపడే రోజులు రావడం లేదు అనేది ఒక ఆపేక్ష. నీవు అనుకున్నా అనుకోక పోయినా జరిగేది జరిగి తీరుతుంది.

కలియుగంలో ఎవరిని ఎలా హింసించాలనే ఆలోచనలు ఉంటాయి. మనకు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉండాలి.

అందరినీ ఆయనే చూసుకుంటు న్నాడు. ఎవరిని హింసించినా భగవంతుని హింసిస్తున్నాము అనే భావన రావాలి.

ఈ దేహం ఎందుకు వచ్చిందో ఆ పనులు పూర్తి అయ్యేవరకు అది ఈ భూమి మీద తిరుగాడుతూనే ఉంటుంది. దేనికీ ఆందోళన వద్దు.


026..ఇదెప్పుడైనా ఆలోచించారా 

రాజు ఉదయాన్నే లేచి వాకింగ్ కు వెళ్ళాడు 

తెలియకుండా ఎదురుగా వస్తున్న వ్యక్తి చెయ్యి తగిలింది 

అతను సారీ అని చెప్పాడు 

రాజు పర్లేదండి అని చెప్పి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుండి ఇంటికి వచ్చాడు 

ఇంట్లో స్నానం అన్ని ముగించుకుని అల్పాహారం తీసుకుని చెయ్యి కడుక్కుని వెనక్కు తిరగ్గానే తన ఆరేళ్ళ కొడుకు వెనుక నిల్చుకున్నాడు 

అతని చెయ్యి తగలడంతో రాజుకు కోపం వచ్చేసింది 

అడ్డంగా ఎందుకు ఇలా నిలబడ్డావు పక్కకు తప్పుకో అని అరిచాడు అంతే బాబు బయపడిపోయాడు 

దూరంగా వెళ్ళిపోయాడు 

రాజు అతడి పని ముగించుకుని కాసేపు అలా కూర్చుని ఆలోచిస్తుండగా పొద్దున జరిగిన విషయం గుర్తుకువచ్చింది 

మనకు అసలు తెలియని వ్యక్తిని క్షమించాను కానీ నా బాబుపై కోపాన్ని ప్రదర్శించాను 

ఒక్క నిమిషం అరవకుండా ఉండాల్సింది 

వెంటనే వెళ్ళి బాబును పలకరించాడు 

బాబు కళ్ళలో కన్నీళ్లు

సారీ చిన్నా అన్నాడు 

బాబు అన్నాడు నాన్న మనం పెంచిన చెట్లలో రంగురంగు పూలు పూశాయి 

అన్ని రంగులు కలిపి పూలగుచ్చాన్ని నీకు అందివ్వాలని నిన్ను ఆశ్చర్య పరచాలని నీ వెనుక నిలుచుకున్నాను నాన్న అన్నాడు 

ఇప్పుడు రాజు కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు సారీ బాబు ఇంకెప్పుడూ కోపగించుకొను అన్నాడు 

ఇది రాజు మాత్రమే చేసిన చేస్తున్న తప్పు కాదండి 

అందరం చేస్తున్నది 

ముక్కుమొహం తెలియని వ్యక్తులతో సర్దుకు పోయే మనం మన కుటుంబంతో అసలు సర్ధుకోము 

సారీ థాంక్స్ అనే పదాలు వాడనే వాడము 

ఆ పదాలు ఐనవారితో చెప్పాల్సిన అవసరం లేదు అంటారు కానీ నిజానికి ఆ పదాలు ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది

పరాయివాళ్ళ గురించి అలోచించి నడుచుకునే మనం ఒక్క క్షణం అయినవారి గురించి ఆలోచించొచ్చుగా 

పరాయివాళ్ళకు నువ్వొక వ్యక్తివి 

కనిపిస్తే పలకరిస్తారు 

కనిపించకపోతే ఒక్కసారి లేదంటే రెండూ సార్లు తలచుకుంటారు 

కానీ నీ కుటుంభానికి నువ్వే ముఖ్యం 

నీ ఎడబాటు వారికి మాత్రమే బాధ 

ప్రతి క్షణం వారి ఊపిరి ఆగేవరకు నువ్వు పక్కన ఉన్నా లేకున్నా నీ గురించి ఆలోచన ఉండే ఉంటుంది 

అందుకే 

ఎక్కడో సర్దుకుపోయే నువ్వు నీ తోడు నీ పిల్లలతో కొంచం సర్దుకోవచ్చుగా 

ఆలోచించండి ఒక్కసారి .

*****

027..*ఖర్చులేని స్వర్గం!*

**           

*వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*

*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*

*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*

*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 

భగవంతుని లీలలు చదవడానికి డబ్బు అవసరం లేదు, ఆయన శ్లోకాలు అందరికీ షేర్ చేయడానికి డబ్బు అవసరం లేదు, 

కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*

*చిన్న చీమలైన ఒక్కటిగ కలగలసి

పెద్ద పామునైనా సుళువుగ చంపు

'ఐఖ్యత' బలమేమిటో తెలుసుకో.*


పుల్లలను ఒక్కటొక్కటి శ్రమతో పేర్చి

చిట్టి పిట్ట చూడ చక్కని గూడు కట్టు

'ఓర్ప' మహిమేమిటో నేర్చుకో..


రాళ్ళ దెబ్బలు తినిన కూడ సహించి 

తరువు తన తియ్యని ఫలముల నిచ్చు 

'గొప్పతనము' మాటకర్థము తెలుసుకో.. 


పిడికెడు కూడు పెట్టిన నమ్మకముంచి 

కుక్క కడదాకా నిను కనిపెట్టుకొనిండు

'విశ్వాసము' విలువేందో నేర్చుకో.. 

మూగ జీవులకైన ఉండు మంచి మనసు

నేర్వవలె నరుడు వీటినుంచెన్నో నీతులు 

మంచి బోధ విను ఎవ్వరు తెలిపిననేమి. 

                       

*దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


*సుఖం న కృషితోsన్యత్ర యది

ధర్మే వర్తతే ౹

అవస్త్రత్వం నిరన్నత్వం కృషితో నైవజాయతే ౹౹

      

      

 వ్యవసాయం వదిలితే సుఖః ఉండదు.ధర్మాంగా నడుచుకుంటే వ్యవసాయదారుడికి ఎప్పటికీ అన్నం బట్టల కొరత ఉండదు.


*సత్సంగత్వే నిస్సంగత్వం !* 

*నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

*నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

*నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషులు ..*  *మార్గదర్శనం* 

*సత్సంగత్యం ..* *సహవాసం* 

*సత్ప్రవర్తన ..* *జీవించడం* 

*మించి, ఈ  భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ..*

* :*

*_ ప్రాంజలి ప్రభ *

028..ప్రాంజలి ప్రభ..

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం, మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామికి కూడా దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు. ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..

నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు. కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళోత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 

నువ్వు తక్కువ వాడివి కావు సామీ... 

నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.

కానీ సామీ! 

నేనూ తక్కువవాణ్ని కాదు నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే నీవే నన్నెత్తుకుంటావని..

ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ

ఆ ఒక్క వరం మాత్రం నాకివ్వు సామీ !!!

****

029.. భగవంతుని దర్శనం?

ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు.

ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు.

“భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..”

భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి” అన్నాడు. భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు తన నగరంలో దండోరా వేయించాడు. "రేపు అందరు కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికి కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇది రాజుగారి ఆజ్ఞ!”

రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు.

అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి, "అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే.. మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు.

కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. 

వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు 

'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!

రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక అందరికి ఒకచోట వెండి నాణేల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. 

వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు కదా!’ అనిపించింది.


ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది. ప్రజలలో ఇక మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంక కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు.

“చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగవంతుడి నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!” 

నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు. 

కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించి, "మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగుచేసి ఉంచుతాను" అంది.

అదిచూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.

నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు.

"ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో.. ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.” రాజుగారు చాలా సిగ్గుతో, భగవంతుని ముందు తలదించుకున్నాడు.

ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు.

“ఓ రాజా, ఎవరైన సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికి నేను లభించను, కనిపించను! వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”

ఎవరైన సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతున్ని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, ఇష్టంతో భక్తితో భగవంతున్ని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. మన తిరుమల శ్రీనివాసున్ని కలియుగ ప్రత్యక్ష దైవం అని పెద్దలు ఊరికే అనలేదు. స్వామి వారి మహిమలు వర్ణణాతీతం, ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చెంత పెట్టండి చాలు, ఇక ఆయనే అన్ని చూసుకుంటాడు. ఇది మా అనుభవం నేర్పిన పాఠం, మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకోండి చాలు.

,***

030..))నాన్న నేర్పిన చదువు(())మిత్రుల కోసం))


[[తండ్రి]]

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ, పద్మము - అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


{{కొడుకు}}

కమలము, నళినము, తామరపూవు


[[తండ్రి]]

అంతేనా?


{{కొడుకు}}

నాకంతే తెలుసు.


[[తండ్రి]]

నేను చెబుతాను చూడు - వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

నాన్నా, నాన్నా, ఆగు.


[[తండ్రి]]

చెప్పు.


{{కొడుకు}}

వీటన్నిటికీ అర్థం పద్మం అనేనా?


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

మరి #డిక్షనరీ వెదికితే ఇవన్నీ దొరుకుతాయా?


[[తండ్రి]]

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది.  అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


{{కొడుకు}}

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు కూడా నీకెలా దొరికాయి?


[[తండ్రి]]

నేను #అమరకోశం చదువుకున్నాను.  అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


{{కొడుకు}}

అదెలా?


[[తండ్రి]]

#అమరం లో కొన్ని పర్యాయపదాలను #అమరసింహుడు ఉపదేశించాడు. వాటికి కొన్ని ప్రత్యయాలు జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


{{కొడుకు}}

ఎలా?


[[తండ్రి]]

చెబుతా చూడు - 1 వారి, 2 నీరమ్, 3 జలమ్, 4 సలిలమ్, 5 కమ్, 6 తోయమ్, 7 ఉదకమ్, 8 పుష్కరమ్, 9 పయః, 10 అంభః, 11 అంబు ... ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు నీరు అనే అర్థంలో చెప్పాడు.


{{కొడుకు}}

అయితే?


[[తండ్రి]]

పద్మము పుట్టేది ఎక్కడ?  నీటిలో కదా?  అందువల్ల పైన చెప్పిన పదాలకు 'జ' అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - పద్మము అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి.  మళ్లీ చెప్పనా?  వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

చివరలో 'జ' - అని ఎందుకు చేర్చాలి?


[[తండ్రి]]

'జ' - అంటే జాతము, జన్మించినది అని అర్థం వస్తుంది. జలజ అంటే జలములో జన్మించినది అని అర్థం. అలాగే నీరజ అంటే నీటిలో జన్మించినది అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


{{కొడుకు}}

జ అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా?


[[తండ్రి]]

జాతము అనవచ్చు.


{{కొడుకు}}

అయితే నేను చెబుతాను చూడు. వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము..


[[తండ్రి]]

బలే.  నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


{{కొడుకు}}

జ, జాత మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా?


[[తండ్రి]]

భవ, ఉద్భవ, సంభవ అనే పదాలను చేరిస్తే పుట్టినది లేదా పుట్టినవాడు అనే అర్థం వస్తుంది.  ఉదాహరణకు జలభవము, జలోద్భవము, జలసంభవము అంటే జలంలో పుట్టినది అని అర్థం.  అలాగే నీరభవము, నీరోద్భవము, నీరసంభవము అని చెప్పవచ్చు.


అలాగే రుహ అనే ప్రత్యయం చేర్చవచ్చు. రుహము అంటే పెరిగేది. 


{{కొడుకు}}

అయితే నేను చెబుతా దానితో పేర్లు - వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము..


[[తండ్రి]]

బాగా చెప్పావు.  ఏక సంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా పద్మము అనే అర్థం.  ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా?


{{కొడుకు}}

నీటికి 11 పర్యాయవాచకాలు చెప్పావు.  వాటికి జ అనే ప్రత్యయం చేర్చి, పద్మం అనే అర్థంలో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. జాత అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను.  రుహ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను.  భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, ఉద్భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, సంభవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను.  అంటే, మొత్తానికి పద్మము అనే అర్థంలో ఇప్పటికిప్పుడు 66 పదాలను చెప్పగలను.


[[తండ్రి]]

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు?  ఇప్పుడేమో ఏకంగా అరవై ఆరు పదాలు చెప్పగలనంటున్నావు?


{{కొడుకు}}

నువు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను?


[[తండ్రి]]

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


{{కొడుకు}}

అదెలా నాన్నా?


[[తండ్రి]]

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు?


{{కొడుకు}}

పద్మాన్ని హస్తంలో ధరించే విష్ణువు ఉన్నాడు.  పద్మాన్ని నాభిలో ధరించిన అదే విష్ణువు ఉన్నాడు. పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు ఉన్నాడు.  క్షీరసాగరమధ్యంలో పద్మంలో జన్మించిన లక్ష్మీదేవి ఉన్నది. 


[[తండ్రి]]

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు?  సరే, ఇప్పుడు చూడు.  పద్మం అనే అర్థంలో నీవు 66 పదాలు చెప్పగలవు కదా?  వాటికి చివర హస్తుడు అని చేర్చు.  వాటన్నిటికీ పద్మాన్ని చేతిలో ధరించినవాడు అనే భావంలో విష్ణువు అనే అర్థం వస్తుంది.  అంటే ఈ క్షణంలో నీవు విష్ణువు అనే పదానికి పర్యాయవాచకాలు 66 చెప్పగలవు.


{{కొడుకు}}

ఓహో.  బలే.  అర్థమైంది. వారిజహస్తుడు, నీరజహస్తుడు ఇలా అన్నమాట.  


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

అయితే నాన్నా, హస్తం అనే పదంతో పాటు కరము, పాణి అనే పదాలను కూడా చేయి అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా, వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా?  


[[తండ్రి]]

హాయిగా ఉపయోగించవచ్చు.  ఆవిధంగా హస్తుడు అనే ప్రత్యయాన్ని చేర్చి 66, కరుడు అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66, పాణి అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66 మొత్తం 198 పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


{{కొడుకు}}

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే?


[[తండ్రి]]

నీటికి ఇంకా కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము - ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి.  నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను.  ఆ పదాలతో పద్మం అనే అర్థం సాధించి, మరలా ఆ పద్మాన్ని చేత ధరించినవాడనే అర్థంలో ఇంకెన్ని విష్ణుపర్యాయవాచకాలను సృష్టించవచ్చో చూడు. 


{{కొడుకు}}

బలే నాన్నా, బలే.  అలాగే పద్మంలో పుట్టిన బ్రహ్మ అనే అర్థంలో -  పద్మం యొక్క 66 పర్యాయవాచకాలకు జ, జాత, భవ, సంభవ, ఉద్భవ,  రుహ అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం 396 (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


[[తండ్రి]]

ఓహో, సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా?  పద్మజుడు, పద్మసంభవుడు అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే బ్రహ్మ అనే అర్థం వస్తుంది.  


వాటిని పద్మజ, పద్మసంభవ అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే లక్ష్మి అనే అర్థం వస్తుంది.


మరి ఆ బ్రహ్మకు తండ్రి విష్ణువు అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు? 

 

{{కొడుకు}}

పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా,  తండ్రి అనే అర్థాన్నిచ్చే జనక, గురు, పితా, జన్మద అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ 396 పదాలకు చేరిస్తే (396x4) 1584 పదాలను విష్ణువు అనే అర్థంలో సృష్టించగలను.


[[తండ్రి]]

మరి లక్ష్మీదేవికి భర్త విష్ణువు అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు?


{{కొడుకు}}

పద్మంలో పుట్టినది లక్ష్మి అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా, వాటికి పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ వంటి నాకు  తెలిసిన ఓ 6 ప్రత్యయాలను చేర్చి (396x6) 2376 పదాలను సృష్టించగలను. 


[[తండ్రి]]

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు.  విష్ణువుకు మొత్తం 3960 నామాలను సృష్టించావు. (1584+2376)


{{కొడుకు}}

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


[[తండ్రి]]

పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు అంటే విష్ణువు కదా,  పద్మానికి 66 పర్యాయపదాలు నీకు తెలుసు కదా, వాటికి చివర నాభుడు అనే ప్రత్యయం తగిలించు.  వారిజనాభుడు, జలజనాభుడు అంటూ.  కాబట్టి, 3960+66=4026 నామాలు వచ్చాయి.  మొత్తానికి ఇలా విష్ణుచతుస్సహస్రనామాలు సృష్టించగలవు.


{{కొడుకు}}

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా.


[[తండ్రి]]

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు.  ఇన్నేసి పదాలను #డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు.  అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ అంటూ ఉంటారు.  


{{కొడుకు}}

అవును నాన్నా, ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


[[తండ్రి]]

సరే, నళినదళేక్షణ అనే పదం విన్నావా?


{{కొడుకు}}

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా?


[[తండ్రి]]

నళినదళేక్షణుడు అంటే అర్థం ఏమిటి?


{{కొడుకు}}

రాముడు.


[[తండ్రి]]

పాటలో విని రూఢి-అర్థాన్ని గ్రహించావు.  మరి #యౌగికార్థం చెప్పు?


{{కొడుకు}}

అదేమిటి?


[[తండ్రి]]

నళినము అంటే పద్మము. నళినదళము అంటే పద్మదళము, ఈక్షణము అంటే చూపు లేదా కన్ను.  కాబట్టి నళినదళేక్షణుడు అంటే పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు అని అర్థం. అది యౌగికార్థం అంటే.  నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


{{కొడుకు}}

ఓహో.


[[తండ్రి]]

ఓహో అని ఆశ్చర్యపోవడం కాదు.  నళినదళేక్షణుడు అంటే యౌగికార్థం తెలిసింది కదా?   మరి ఇప్పుడు సమానార్థకాలైన ఇంకెన్ని పదాలను సృష్టించగలవు?


{{కొడుకు}}

నళినము అంటే పద్మము అనే అర్థంలో మునుపు 66 పదాలను సృష్టించివున్నాము కదా, వాటికి చివర కన్ను అనే అర్థంలో ఈక్షణ, నేత్ర, నయన, లోచన, చక్షు, అక్ష అని నాకు తెలిసిన ఆరు ప్రత్యయాలను ఉపయోగించి పద్మేక్షణుడు, పద్మనేత్రుడు, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మచక్షువు, పద్మాక్షుడు ఇలా 396 పదాలను (66x6)  సృష్టించగలను. ఇలా పుంలింగంలో ఉపయోగిస్తే 396 పదాలతో రాముడు వస్తాడు.  అలాగే పద్మేక్షణ, పద్మనేత్ర, పద్మనయన, పద్మలోచన, పద్మచక్షువు, పద్మాక్షి అంటూ మరో 396 పదాలను స్త్రీలింగంలో ఉపయోగిస్తే సీతమ్మవారు. అంతేనా?


[[తండ్రి]]

అవును.  ఆ పదాలకు రాముడు, సీతమ్మ అని మాత్రం అర్థాలను గ్రహిస్తే అవి రూఢార్థాలు.  అలా కాదు, పద్మం వంటి కన్నులు కలిగిన ఎవరైనా పద్మాక్షుడు లేదా పద్మాక్షి కావచ్చును అనే అర్థంలో గ్రహిస్తే అవి యౌగికార్థాలు.


)))(((


{{కొడుకు}}

ఓహో, మరి #అకాయుడు అనే పదాన్ని మనం రూఢార్థంలో గ్రహించాలా లేక యౌగికార్థంలో గ్రహించాలా?


[[తండ్రి]]

ఎలాగైనా గ్రహించవచ్చు.


{{కొడుకు}}

అర్థమైంది నాన్నా.


[[తండ్రి]]

శుభమస్తు.


{{కొడుకు}}

సర్వం శ్రీ నళినదళేక్షణార్పణమస్తు.  

అంటే #శ్రీరామార్పణమస్తు.


[[తండ్రి]]

తథాస్తు.


)))(((

"నాన్న నేర్పిన చదువు" 

)))(((


ప్రాంజలి ప్రభ... మల్లాప్రగడ