Wednesday, 28 February 2024




పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!

💥ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...


💥ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


💥ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


💥మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


💥ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...


💥మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


💥మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...


💥కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


💥తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


💥ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 


💥పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 


💥అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...


💥ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 


💥ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


💥నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


💥ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


💥ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...


💥కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


💥అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 


💥ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.

035..*దేవుడు మన కళ్ళకు…* *ఎందుకు కనబడడు….?*

            

*ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…,         అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు.* 


*నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.*

ఉదాహరణకు…


*మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.*


*ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.*


*మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.*


*కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.*


*మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.*

*‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.*


మరి *మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా?* అన్నదే ఈనాటి మన ప్రశ్న!


*పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం.* *అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…, వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు.* 

*ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….*


*ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.!*


*వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ!*


*అగ్ని* కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.


*’జలము’ కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.*


*’భూమి’ కి ఉన్న గుణాలు ఐదు శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు. ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.*


*’జలము’…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.*


*’అగ్ని’…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.*


*’వాయువు’…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.*


*’ఆకాశం’…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.*


*కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?             అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే.  ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.*


🙏🌹🌴🪔🌴🌹🙏

                                                                                                                                                                                                                                  *అతిధిదేవో భవ*

           

అతిథిరూపంలో ఆ పరమేశ్వరుడికన్నా గొప్పవాళ్ళు రావచ్చు. అందుకే పూజలో కూర్చున్నప్పుడు... శాస్త్రం మినహాయింపు ఇచ్చింది.


పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం. కానీ పూజచేస్తుండగా గురువుగారొచ్చినా, మహాత్ములు వచ్చినా పూజ విడిచిపెట్టి వెళ్ళి వారిని ఆదరించాలి. ఎందుకొచ్చారో కనుక్కుని పంపించి తరువాత పూజచేసుకోవాలి. అంతేతప్ప ‘నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను’ అని అనకూడదు.


అతిథిరూపంలో వచ్చినవాడు మహాత్ముడయితే వారిని సేవించకుండా తనదగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు.

*గజేంద్రమోక్షం కథామూలం అదే కదా!*


ఒకానొకప్పుడు ద్రవిడదేశంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండమీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు.


ఆ సమయంలో మహాత్ముడయిన అగస్త్యుడొచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాలిచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కానీ ఆయన వస్తే నాకేంటన్నట్లు ఉండిపోయాడు.


‘నీవు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువయి పుడతావు!’ అని శపించాడు అగస్త్యుడు.


’అయితే ఈ జన్మలో జపతపాదులు చేసావు కాబట్టి నీ ప్రాణంమీదికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావ’ని వరమిచ్చాడు.


అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు.


‘అతిథి దేవోభవ!’ అని శాస్త్రం అన్నదంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది.


అమర్యాద అంటే–అతిథి పూజ చేయకుండుట!  అంటే... ఇంటికొచ్చిన వాళ్ళకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా, ఫలహారం పెట్టావా ... అన్న లెక్క ఉండదు. నీ మర్యాద ఎటువంటిదన్నదే ప్రధానమయి ఉంటుంది.


*కుటిల బుద్ధులయిన వారి ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో చెప్పిందదే... ‘వారేం నష్టపోతున్నారో వాళ్ళకు తెలియదు పార్వతీ...! దుర్మార్గులైన వారేం చేస్తారో తెలుసా? పరమ భాగవతోత్తములు,పూజనీయులు ఇంటికొస్తే ఆదరబుద్ధితో తలుపు తీయరు. ‘రండిలోపలికి’ అని పిలవరు. తలుపుకొద్దిగా తీసి కనుబొమలు ముడేస్తారు, ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు, నిన్ను పలకరించరు, నువ్వలా బయటే చాలాసేపు కూర్చుని ఉంటే... వస్తున్నా ఉండండి.. అని ...                            ఆ తరువాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తరువాత వారు నీకు అన్నం పెట్టినా, పరమాన్నం పెట్టినా... నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు పార్వతీ! నా మాట విను. ఆదరబుద్ధి లేనివారి ఇంటికి వెళ్ళవద్దు!’ అని పరమశివుడంతటివాడు చెప్పాడు.*


*నీకు శక్తి ఉంది. అతిథికి మర్యాదలు ఘనంగా చెయ్యవచ్చు. శక్తిలేదు. అసలు చెయ్యలేకపోవచ్చు. చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు. చెయ్యలేక పోతున్నానన్నమాట పరమ మర్యాదతో చెప్పాలి. ‘అయ్యా! నన్ను మన్నించండి. మీవంటి మహాత్ములు వస్తే ఇవ్వాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా. ఫలానా నిస్సహాయ పరిస్థితిలోఉన్నా. క్షమించండి!’ అని ఒక్కమాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తిమంతం.*


🙏🌹🌴🪔🌴🌹🙏


*_ఓంతో కలిపి అష్టాక్షరి అయితే, ఓం లేకుండానే పంచాక్షరి అవుతుంది. అసలు మంత్రాలను అక్షర సంఖ్యతో ఎందుకు వ్యవహరిస్తున్నారు? అలా వ్యవహరించినందువల్ల తేడాలు వస్తున్నాయి కదా. వివరించండి._*

⚡⚡⚡ ⚡⚡⚡ ⚡⚡⚡

*_ముందు ప్రసిద్ధ మంత్రాలను అక్షర సంఖ్యతో ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసుకుందాం. ఏ మంత్రమైనా ఉపదేశం చేసినప్పుడు అది ఆరు చెవులకు వినపడకూడదని శాస్త్రం. అంటే గురుశిష్యులే ఆ మంత్రాన్ని వినాలి. మంత్రం జపించినప్పుడు అది వారిద్దరికే వినపడాలి. మననం చేసేదే మంత్రం. మనన ప్రక్రియలో శబ్దం బయటకు వినపడే ప్రసక్తేలేదు. అందుకే మంత్రాన్ని గుహ్యమని, అన్నారు. అట్టి మంత్రాలను పేరుపెట్టి పిలిస్తే, గుట్టు విప్పినట్లే కదా! అందుకే ప్రసిద్ధ మంత్రాలకు మన పెద్దలు అక్షర సంఖ్యను ఏర్పరిచారు. అష్టాక్షరి అంటే 'ఓం నమో నారాయణ' అని పంచాక్షరి 'సమశ్శివాయ' అని, ద్వాదశాక్షరి అంటే 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని, షడక్షరి అంటే 'ఓం నమో విష్ణవే' అని అర్ధం. అయితే పంచాక్షరికి స్వతస్సిద్ధంగా ఓం లేదు. ఓం కలుపుకుంటే తప్పులేదు. ఏ మంత్రానికైనా ప్రణవం (ఓం) చేర్చినప్పుడే అది వైదికం అవుతుంది. లేకపోతే తాంత్రికం అవుతుంది. ఏది ఏమైనా మంత్రం ఇచ్చే గురువు మీద, మంత్రం మీద, మంత్రాధిదైవతం మీద విశ్వాసం ఉంచి ఏ మంత్రం జపించినా సత్ఫలితం ఉంటుంది._*

🙏🌹🌴🪔🌴🌹🙏

036..దయ్యం వదిలింది -- చందమామ కథలు

వాణీ, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్ళకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్మా, వాణీ భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే, వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. ‘‘పట్నానికని బయలుదేరి, వర్షంలో చిక్కుపడ్డాం.

ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా?'' అని వాళ్లు అడిగారు. ‘‘లోపలికి రండి,'' అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి, భోజనం పెట్టి, పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళుతిన్నాక అన్నం కొద్దిగామిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు. ముద్దగా తడిసి పోయాయి. ‘‘ఇద్దరమూ చెరిసగమూ తిందాం,'' అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని, పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్లు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని, వెక్కివెక్కి ఏడుస్తున్నది. వాణీ వర్మలు నిర్ఘాంతపోయి, ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. ‘‘నా కాపరం గంగపాలయింది! రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది.

రాత్రి నా భర్త మీ ఆలూమగల అన్యోన్యం చూసి, ‘నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా నాలుగు మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి?' అని, ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళి పోయాడు. మొండిమనిషి! మళ్లీ తిరిగి రాడు. ఇక నా బతుకేంగాను? ఏం చేయను? ఎక్కడికని వెళ్ళను?'' అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్తకోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. ‘‘నాకు తెలుసు, ఆయన రాడు. నా కింకెవరూ లేరు. లోతయిన బావి చూసి దూకేస్తాను,'' అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. ‘‘నువ్వు ఏమీ బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు,'' అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్లింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి, నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు రెండు, మూడు నెలల కొకసారి అలా వస్తూంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికి చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలా సేపటిదాకా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపట్టుతూండగా ఏదో అలికిడి అయి, మెలుకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని, చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది! వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తనా, కిటికీ చప్పుడూ అనుమానం కలిగించాయి. ఆమె వంట గదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి, చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నమూ, కూరా, పులుసూ, పెరుగూ అమర్చి, కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ‘‘ఇంకా ఎన్నాళ్లు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చెయ్యి,'' అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణంచేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ‘‘ఇప్పుడిప్పుడే వీళ్ళకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపికపట్టు,'' అన్నది చంద్రమతి. ‘‘అమ్మ దొంగముండా! పైకి అమాయకంగా కనిపిస్తూ, మావాళ్ళ మంచితనాన్ని ఆసరాచేసుకుని, మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను!'' అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకుని, చంద్రమతి గురించి వాణీ, వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, ‘‘బాబోయ్‌, రాత్రి నేను కన్నుమూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జెలచప్పుడు! నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటివైపుకు ఈడ్చుకు పోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయట పడ్డాను. మరొకరైతే, హరీ అనేవాళ్ళు,'' అన్నాడు. వాణీ, వర్మా ఈ మాట విని హడలి పోయి, ‘‘అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం,'' అన్నారు. ‘‘మీరేమీ కంగారుపడకండి, ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను,'' అని మురారి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని, అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తరవాత అతను తలగడను మంచంమీద నిలువుగా అమర్చి, వాటిమీద దుప్పటి కప్పి, పెరటివైపు వెళ్ళి, వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలా సేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని, చంద్రమతి వచ్చి, గిన్నెలో అన్నీ సర్ది, మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి, ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి, మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి, ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి, కిటికీని సమీపించి, బయట తన భర్త జాడ కనబడక, వంటగది తలుపు మూసి, తనగదిలోకి వెళ్ళి, కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మా, వాణీ ఉలిక్కిపడి లేచి, చంద్రమతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు.

 చంద్రమతి భయంతో, ‘‘దయ్యం ఉన్న మాట నిజమే! నాకూ గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదికి వచ్చింది,'' అన్నది. ‘‘భయపడకండి. త్వరలోనే ఈ దయ్యం భరతం పట్టుతాను,'' అన్నాడు మురారి. రెండు రోజులపాటు అతను రాత్రిళ్ళు గజ్జెలచప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే, తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది. మూడోరోజు రాత్రి మురారి బయటనే పొంచి వుండి, చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా, తాను అదే దారిన వెళ్ళబోతున్నవాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, ‘‘నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా? నేను చూస్తాను!'' అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ‘‘ఏం జరిగిందండి?'' అని అనుమానంగా అడిగాడు. ‘‘ఇంకా ఏం జరగాలండీ? ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిణ్ణి చేసుకుంటాడట! ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే వున్నది!'' అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి, వీధితోవన లోపలికివచ్చి, తనమంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పినమాటమీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మూడు రోజులుగా అతనికి కిటికీ తెరవటంలేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, ‘‘నేను బుద్ధి గడ్డితిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను. ఆమెను నాతో పంపెయ్యండి,'' అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణీ, వర్మలు బాధ పడుతూంటే, ‘‘దయ్యం వదిలిందని సంతోషించక బాధ పడుతున్నారా?'' అంటూ మురారి జరిగిన సంగతి వాళ్ళకు చెప్పి, వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.

_037*💫 జీవిత నగ్న సత్యాలు  ⚜️*_

➖➖➖➖➖➖✍️

*_⚡1. నేను నేను నేను అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒక రోజు._*


*_2. నాది నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు._*


*_3. ఒక్క చావుతో బంధాలు అన్ని  తెగిపోతాయి ఏదో ఒక రోజు._*


*_4. ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు, ఏదో ఒక నాడు చుట్టూ అందరు ఉన్నా ఎందరు వున్నా సరే._*


*_5. ఇద్దరు కలిస్తే జనం నలుగురు మోస్తే మరణం._* 


*_6. మాయతో పుట్టావు, మాయలో జీవిస్తావు, మాయ మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు._*


*_7. జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు, పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు._*


*_8. ఎన్నో అనుభవిస్తావు నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్ని మర్చిపోతావు._*


*_9. నీ కష్టాలకు నీ సుఖాలకు కారణం నీవే._*


*_10. నీవు పుట్టడానికి కారణం కూడా నీవే. ఇలా బ్రతకడానికి కారణం నీవే. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే. చేతులారా నీవు చేసుకున్నవే._*


*_11. ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే లేకపోతే మరో జన్మకు సిద్ధం అవుతాడు._*


*_12. బ్రతికి ఉన్నప్పుడే దైవ నామాన్ని పట్టుకో లేదా బతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు._*


*_13. ఒట్టి చేతులతో వచ్చావు. పది మంది సహకారంతో బ్రతుకుతావు. పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావు.._*


*_ఎల్లప్పుడూ లభించే ఆనందం ఎక్కడ ఉంది ? ఈరోజు రమణీయంగా ఉన్న పుష్పమాల రేపటికి వాడిపోతుంది. ఎల్లుండికి కృళ్ళిపోతుంది. నేడు ఎంతగానో ఆకర్షణముగా ఉన్న భోజనము, రేపటికి పాచి పోతుంది. ఈనాడు మహా సుందరముగా ఉన్న స్త్రీ లేక పురుషుడి శరీరము 40 సంవత్సరాల తర్వాత ముడతలు పడి కృశించి వికారముగా అవుతుంది._*


*_ఇలాగే ప్రపంచంలో ప్రతి పదార్థము కొంతకాలమునకు పూర్తిగా మారిపోతుంది. ఇటువంటి చంచల పదార్థములను నమ్మి వాటి నుండి ఆనందమును కోరుకునే వారందరూ ఆశాభంగమే పొందగలరు. ఎందుకంటే నశించే వస్తువుల నుండి కలుగు సుఖము నశ్వరముగానే ఉంటుంది. చపల వస్తువుల నుండి కలుగు ఆనందము చపలముగానే ఉంటుంది. కావున శాశ్వత ఆనందమయుడైన భగవంతుణ్ణి అన్వేషించాలి..!_*


*_జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది._*


*_రేపు ఎప్పుడూ రేపే. ఈ రోజు కాదు. దాన్ని ఒక్కలాగే వుండాలని వూహించ కూడదు. అట్లా వూహించడం ప్రమాదకరం. రేపు ఎప్పుడూ ఈ రోజు కాదు. అందువల్ల నువ్వు చిరాకుపడతావు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఈ రోజులాగే రేపు జరిగితే నీకు విసుగు వస్తుంది. చిరాకు ఆనందం కాదు, విసుగు ఆనందం కాదు. భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోనీ. దానిపైన ఎట్లాంటి ఆశలూ పెట్టుకోకు. దాన్ని అజ్ఞాతమయిందిగానే వదిలిపెట్టు. అనూహ్యమయిందిగానే వదిలిపెట్టు. విషయాల్ని శాశ్వతమయినవిగా వుండేలా ప్రయత్నించకు. జీవనతత్వం మారేది. మనం  ప్రకృతిని బట్టి సాగాలి, తావుని బట్టి సాగాలి._*


*_అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. కొత్త కాంతి, కొత్త జీవితం, కొత్త దైవత్వం ఆవిష్కారమవుతాయి. నిరంతరం ప్రేమ ప్రవహించే వ్యక్తి, దేనితోనూ ఘర్షించని వ్యక్తి విశాలమవుతాడు. ఆకాశమంత అవుతాడు. విశాలత్వంలో అస్తిత్వమంటే ఏమిటో అతనికి తెలిసి వస్తుంది. ఆ విశాలత్వమే అస్తిత్వం._*


*_మనం అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదైనా వినగానే చదవగానే నేను నేర్చుకున్నాను అనిపిస్తుంది. కానీ కృతజ్ఞతను నేర్చుకోము. కృతజ్ఞత లేకుండా ఏ దైవీ గుణం కూడా పని చేయదు. అనేటువంటి ఎరుకలో ఉండాలి..._*


*_తనను తాను లొంగదీసుకుంటే చాలు. శరణాగతి అంటే తన ఉనికికి అసలు కారణం. అటువంటి మూలాన్ని మీకు వెలుపల ఉన్న దేవుడు అని ఊహించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఒకరి మూలం మీలోనే ఉంది. దానికి మిమ్మల్ని మీరు వదులుకోండి. అంటే మూలాన్ని వెతుక్కుని అందులో విలీనమవ్వాలి. మీరు దాని నుండి బయటపడినట్లు మీరు ఊహించుకున్నందున, మీరు "మూలం ఎక్కడ ఉంది ?" అనే ప్రశ్నను లేవనెత్తారు._*


*_చక్కెర దాని స్వంత తీపిని రుచి చూడదని, రుచి చూసేవారు దానిని రుచి చూసి ఆనందించాలని కొందరు వాదించారు. అదేవిధంగా, ఒక వ్యక్తి అత్యున్నతుడు కాలేడు, ఆ స్థితి యొక్క ఆనందాన్ని అనుభవించలేడు ; అందుచేత ఒకవైపు వ్యక్తిత్వాన్ని, మరోవైపు భగవంతుని తలరాతని కొనసాగించాలి, తద్వారా ఆనందం కలుగుతుంది ! భగవంతుని ప్రవృత్తి పంచదార లాంటిదా ? అత్యున్నతమైన ఆనందం కోసం ఒక వ్యక్తి తనను తాను లొంగిపోయి, తన వ్యక్తిత్వాన్ని ఎలా నిలుపుకోవచ్చు ? అంతేకాకుండా, ఆత్మ, దివ్య ప్రాంతాన్ని చేరుకుని, అక్కడే ఉండి, పరమాత్మకు సేవ చేస్తుందని కూడా వారు చెప్పారు._*


*_"సేవ" అనే పదం యొక్క ధ్వని ప్రభువును మోసగించగలదా ? అతనికి తెలియదా ? అతను ఈ ప్రజల సేవ కోసం ఎదురు చూస్తున్నాడా ? అతను-స్వచ్ఛమైన స్పృహ-ప్రతిస్పందంగా అడగలేదా : “నేను కాకుండా నువ్వు ఎవరు "అది నాకు సేవ చేయాలనే ఊహ ?"..._*

*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*

🙏🇮🇳

038*మన శరీరంలో ప్రసరించే పది రకాల వాయువులు, వాటి ఉపయోగాలు*:-


(1) ప్రాణ వాయువు = ఇది మన శరీరంలోని జ్ఞానేద్రియాలు సక్రమంగా పని చెయ్యటానికి ఉపయోగపడుతుంది.


(2) అపాణ వాయువు = ఇది శరీరంలోని వ్యర్థ్యాలను బయటకు పంపించటానికి ఉపయోగపడుతుంది.


(3) సమాన వాయువు = ఇది మనం తిన్న ఆహరం యొక్క శక్తి శరీరం మొత్తానికి సమానంగా తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుంది.


(4)ఉదాన వాయువు = ఇది మన మనస్సులోని ఆలోచన వాక్కు రూపంలో రావటానికి ఉపయోగపడుతుంది.


(5) వ్యాన వాయువు = ఇది శరీరం మొత్తానికి రక్తం సరఫరా అవ్వటానికి ఉపయోగపడుతుంది.


(6) నాగ వాయువు = వాంతి అవ్వటానికి ఉపయోగపడుతుంది.


(7) కూర్మ వాయువు = ఇది కనురెప్పలు వేయటానికి ఉపయోగపడుతుంది.


(8)కృకర వాయువు = తుమ్ము, దగ్గు రావటానికి ఉపయోగపడుతుంది.


(9)దేవాదత్త వాయువు = ఇది ఆవలించటానికి ఉపయోగపడుతుంది.


(10) ధనుంజయ వాయువు = ఇది మనిషి చనిపోయాక శరీరం త్వరగా చెడిపోకుండా ఉండటానికి  ఉపయోగపడుతుంది.


ఈ పది వాయువులు సక్రమంగా పనిచెయ్యటానికి చేసే ప్రయత్నమే ప్రాణాయామం. ప్రతి మనిషి రోజుకు కనీసం ఐదు నిమిషాలు ప్రణాయామం చేయగలిగితే అద్భుతమైన ఉపయోగం ఉంటుంది.

0039..జీవిత సూత్రం*ప్రాంజలి ప్రభ            

*మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు.*

*ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*

*“సర్వే క్షయాంత నిచాయంః పతనంతఃసమ్రుశ్ఛాయః”* 

*“సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్”*

*ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.*

*వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*

*1. సర్వే క్షయాంత నిచాయంః*

*ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు.*

*వారు ఎలాంటి పనిచేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.*

*కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత మేరకు డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది.*

*2. పతనంతః సమ్రుశ్ఛాయః*

*ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి.*

*3. సంయోగ విప్రయోగంత:*

*ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.*

*అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.*

*4. మారాతంత జీవితమ్*

*దీని అర్థం   పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ, చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.*

*ఈ విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవమైనవి.*

*మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే.*

*మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి, పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది*

*మార్పు మన నుండే మొదలవ్వాలి....!*

***

040..ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి ఎలా వచ్చాయో   తెలుసా?  చిన్న కధ...

వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్తుంటాడాయన.

అలా నడుస్తుండగా... ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన "సూర్యుడా...! దూరంగా వెళ్ళు" అంటూ ఆజ్ఞాపించాడు.

అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని.... వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.

అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా ఇంకా పెంచుతున్నాడు.

అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో.... తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు.

ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ.... ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.

"ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని" హెచ్చరించాడు.

అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ... "ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ... మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా...! అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు" అన్నాడు కసిగా...

జమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. "ఓ మహామునీ...! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం" అని చెప్పుకొచ్చాడు.

అంతేగాకుండా... జమదగ్నికి వేడినుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్య భగవానుడు. అవేంటంటే... పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా... అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు.

041..కర్మ   కర్మణా   నశ్యతి"

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది... వెంటనే గంగానదినే అడిగాడట.

"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు.  మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ... అని. 

అందుకా తల్లి  "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"  అని బదులిచ్చిందట. 

వెంటనే, అయ్యో  అన్ని పుణ్యనదులు ఇంతేకదా... పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని... సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని... దానికా సముద్రుడు 

నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట. 

అరే ... ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాప భారాన్ని అని అడగగా... అవి పకపకా నవ్వి  'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...

ఓహో...ఆ పాపాలన్నీ మన  మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట. 

కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః 

ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే.

పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది. 

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. 

ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?...అని ఈ శ్లోకం అర్థం

కర్మ కర్మణా నశ్యతి.... అనగా,  కర్మ కర్మతోనే నశిస్తుంది.

***

042..ఏమి కావాలి నీకు

ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?

సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.

దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.

షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.

ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు. భూతం ప్రత్యక్షం అయ్యింది." ఏమి కావాలి నీకు? అని అడిగింది.

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.

భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.

 నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.

వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.

ఏమి కావాలి నీకు అని అడిగింది.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.

ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?

పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం అలసిపోయి

స్థంభం ప్రక్కన నిద్రపోతోంది.

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.

ఈ కధ మనది.

ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?

మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని.

 ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం  "మంత్రం" (దైవ నామ స్మరణ) 

ఎక్కడం దిగడం మంత్రం జపం. జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన) 

అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.

అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.

మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక 

దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా 

మహోజ్వల జ్యోతి రూపం.

మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.

ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.

ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.

జై శ్రీ కృష్ణా...💐🙏

043..*విముక్తి :*
*₹₹₹₹₹₹₹₹₹₹₹*

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్య వేక్షిస్తున్నాడు.

అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది." అని శ్రీ రాముని అనుమతి అడిగాడు." నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని అన్నాడు శ్రీ రాముడు.

హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండ బోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు."నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు ." సరి , ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు .. అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు
శనీశ్వరుడు .హనుమంతుడు , రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టు కోవాలసిందిగా కోరాడు.అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"
అని అడిగాడు. హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"అన్నాడు." సరి, నీ చేతులు పట్టుకోనా"అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి
తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు హనుమంతుడు."అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు శనీశ్వరుడు.

"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.
" పోనీ, నీ హృదయంలో వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.
"ఈ హృదయంలో, మహాలక్ష్మీ రూపిణి అయిన సీతాదేవి,నా దేవుడైన శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు చోటు లేదు. " అన్నాడు హనుమ.

" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది. అక్కడే వుంశ్వరుడు , హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు.

హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళు తేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు.

" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామ భక్తుడవు. నీముందు నా శక్తి చాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్ట మహానుభావా"
అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!

నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది.

*సేకరణ :*
*_ ప్రాంజలి ప్రభ .*

044..ప్రాంజలి ప్రభ 

ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.

 నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. 

తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.

కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.

 అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.

 అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా,  'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.

అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.

“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది.

****

045.. Pranjali👌prabha👌

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.

తండ్రి శాపం :-
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష :-
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నేయి ,ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు . వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట :-
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన :-
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట :-
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి :-
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను
వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం  :-
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ :-
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత
విషయం బాగుందని పంపిస్తున్నాను.

🙏🙏🙏🙏🙏🙏 *మగవాడు_ఆడదానిలా_ఎలా_మారతాడు?*

*మగాడికి_మగాడికి_పిల్లలు_ఎలా_పుడతారు?*

*మచ్చుకు కొన్ని ఉదాహరణలు*
      🙏🙏🙏
*మహా భారత రచయిత శ్రీ వేద వ్యాస మహర్షి చేసిన కొన్ని అధ్భుత ప్రయోగాలు..*
         🔥🔥🔥
*1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.*
          🐢🐍🦎
*2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*
         🦆🪿🦇
*3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*
*పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..*
          🐗🐴🦄
*4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..*
          ☀️🌤️💥
*5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..*
        🌞🌞🌞
*6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..*
        🌎🌏🌍
*7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..*

*8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.*
         💧💦❄️
*9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..*
          🌟⭐💥
*10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..*
        🙈🙉🙊
*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?*
      🌼🌻🌞
*ఇవేమిటి, నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?*
              🪷🌺🌸
 *ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు..అది వారికున్న పరిమితత్వాన్ని తెలియజేస్తుంది...ఒకవేళ ఊహ అనుకున్నా కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?*
         💐🌷🌹
*ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బయటికి వస్తాయి అని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..*
        🦚🦜🦤
*కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని దైవం ఉనికి ఉండి తీరుతుంది..*
       🎄🌲🌳
*ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ వైదికులుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..*

*సనాతన సంప్రదాయం చాలా గొప్పది*
     👍👍👍
 *భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా?*
      🙏🙏🙏
*👉భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యభట్ట)*

*👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)*

*👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)*

*👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)*

*👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*

*👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే*

*👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన*

*వాల్మీకి మహర్షి మనవాడే*

*👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*

*👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు*

*👉అణువులు గురించి వివరించిన కణాదుడు*

*👉DNA గురించి చెప్పిన బోధిధర్మ*
*👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*

*👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు*

*👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని*
*ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏*

 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.*
*నా దేశం గొప్పది నా "సనాతన ధర్మం" గొప్పది నా హైందవ ధర్మం గొప్పది*
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment