*
***
విషాదమైన చక్కెర కథ ::
ఒక నిమిషం కంటే తక్కువైన డాలర్ విలువగల ఉపన్యాసం.
అద్భుతమైన ప్రసంగం ఒక నిమిషం కంటే తక్కువ - మన జీవితంలో చేసుకునే ఒక తప్పు మరియు నిజంగా వాస్తవమైనది.
ఇది మన జీవితంలో ఎక్సెస్ షుగర్ గురించిన విషాద కథ.
1) పిల్లల మెదడులోని చక్కెరను ADHD అంటారు - అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్.
2) పెద్దవారి మెదడులోని చక్కెరను డిమెన్షియా & అల్జీమర్స్ అంటారు.
3) మీ కంటి (దృష్టి) లో చక్కెరను గ్లూకోమా అంటారు.
4) మీ దంతాలలోని చక్కెరను కేవిటీస్ (CAVITIES) అంటారు.
5) మీ చర్మంలోని చక్కెరను ముడతలు (wrinkles) అంటారు.
6) నిద్రలో ఉండే చక్కెరను ఇన్సోమ్నియా (insomnia) అంటారు.
7) మీ రక్తంలో చక్కెరను మధుమేహం (డయాబెటిస్) (diabetes) అంటారు.
8) మీ సిస్టమ్లో ఎక్కువ చక్కెరను క్యాన్సర్ అంటారు.
9) మీ స్నాక్స్ మరియు ఆహారంలో చక్కెరను బిలియన్ డాలర్ల పరిశ్రమ అంటారు.
మన సమాజంలో చక్కెరను పెరగడం అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అధిక లాభాలు.
కొకైన్ కంటే చక్కెర 8 రెట్లు ఎక్కువ వ్యసనపరమైనది.
ఇది మీ జీవిత ఆట ముగింపు కు పునాది వేస్తుంది.
****
ప్రాంజలి ప్రభ కథలు..12/02
మల్లాప్రగడ
ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!
పుట్టుకతో మనిషీ, మనసూ వేరువేరు. అవి అనివార్యంగా మిళితం కావాలన్నా.. ఒకదానితో ఒకటి మమేకమై, ముందుకు సాగాలన్నా..ఆదర్శవంతమైన మార్గదర్శి వెన్నంటే ఉండాలి. తొలి తొలిగా తల్లి వెచ్చని పొత్తిళ్లు ప్రేమానుబంధాలను వల్లెవేస్తాయి. ఆపై, తండ్రి గుండె చప్పుళ్లు నిశ్చింతగా బుడిబుడి నడకలను నేర్పిస్తాయి. కాస్త ఊహ తెలిసి, ఊసులెరిగి, ఉబలాటంతో ఊగిసలాడే పసిమనసుకి..కళ్లెం వేసినట్లు, కంచె కట్టినట్లు.. అప్పుడు ఎదురొస్తారు గురువులు. మొక్కను వంచి మానును చేస్తారు. ఈ లోకంలో కాలం మెచ్చిన ఆదర్శగురువులెందరో.. గురువును మించిన శిష్యులూ అందరే! అదే గురువు ఘనతకు ప్రతీతి.
ఓం సహనావవతు, సహనౌభునక్తు,
సహవీర్యం కరవావహై! తేజస్వి నావధీతమస్తు
మా విద్విషావహై!
భావం: గురుశిష్యుల మధ్య బంధాన్ని తెలిపే శ్లోకమిది. ఒకప్పటి గురువుల ఆశ్రమాల్లోనూ.. ఇప్పటికీ కొన్ని గురుకులాల్లో గురుశిష్యులు కలసి చెప్పుకునే శాంతి మంత్రమిది.
‘ఆ భగవంతుడు గురుశిష్యులమైన మనిద్దరినీ రక్షించును గాక.. మనిద్దరినీ వృద్ధి చేయును గాక.. మనిద్దరికీ ఈ అధ్యయనానికి అవసరమైన శక్తిని పెంపొందించు గాక.. మనం చదివేది, నేర్చుకునేది మనిద్దరికీ వెలుగుని ఆపాదించు గాక.. మన మధ్యలో విభేదాలు తలెత్తకుండా ఉండు గాక’ ఇదే ఈ శ్లోకతాత్పర్యం.
దీన్ని బట్టి బోధన అనేది ఎంతటి పవిత్రతను ఆపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు!‘మనిషి తలరాతలను రాసేవాడు విధాత. తరాల తలరాతలను మార్చగలిగేవాడు విజ్ఞానదాత’ అనేది లోకోక్తి. ‘నీ కులమేదైనా, నీ మతమేదైనా నువ్వు చదువుకున్నవాడివైతే చాలు.. ఈ సమాజం నీకో కుర్చీ వేసి కూర్చోబెడుతుంది’ అంటారు సమాజోద్ధారకులు. ‘గురువు, దేవుడు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే, దేవుడ్ని నాకు పరిచయం చేసింది నా గురువే కనుక’ అన్నాడు రామభక్తుడైన కబీర్ దాస్. ఇవన్నీ కేవలం సూక్తులు కాదు గురుబోధలు. తరచి చూస్తే ఈ ప్రపంచం మొత్తం గురుకృపతోనే నిండి ఉంది. ప్రతి అణువూ జ్ఞానాన్నే పంచుతుంది. దాన్ని ఆస్వాదించే వినమ్రత మనలో ఉండాలంతే!
మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునులను అసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. అరణ్యపర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలో యక్షుడు ‘మనిషి మనీషిగా ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తే ‘గురువు కారణంగా, అధ్యయనంతో మాత్రమే’ అని బదులిచ్చాడు. గురువు శక్తి అంత గొప్పది. పాశ్చాత్య నాగరిక చరిత్రను తిరగేస్తే.. గ్రీకు దేశానికి చెందిన సోక్రటీస్ తత్వబోధకు ఆద్యుడు. గురువుగా ఆయన ప్రభావం ప్లాటో మీదే కాదు.. ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్పైన కూడా ఎంతో ఉంది. ఈ గురుపరంపరలోని అరిస్టాటిల్ వద్ద జగజ్జేత అలెగ్జాండర్ చదువుకున్నాడు.
భరతఖండంలో వేదాల వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గురుబోధన కొనసాగింది కాబట్టే నాటి జ్ఞానం నేటికీ తార్కాణమైంది. హరప్పా నాగరికత బయటపడిన తర్వాత సింధు లిపి, శాసనాలు కూడా గురుప్రస్థానానికి నిదర్శనమేనని చెప్పుకోవాలి. శివాజీ అనే వీరుడ్ని సమర్థ రామదాసు చెక్కితే, ఆధ్యాత్మిక శిఖరమైన వివేకానందుడ్ని రామకృష్ణ పరమహంస మలచారు.
మౌర్యరాజ్య స్థాపకుడు చంద్రగుప్తుని గురువు చాణక్యుడు. ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. ఆ సమయంలోనే ఆయన చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన ‘అర్థాన్ని’ గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. మరోవైపు 5, 6 శతాబ్దాల్లో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు బౌద్ధుల విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లాయి. ఆ రెండు విశ్వవిద్యాలయాల్లో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. కొన్ని వేలమంది విదేశీ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చేవారు. అమరశక్తి అనే దక్షిణ భారత రాజు.. తన పుత్రులకు విద్యాబుద్ధులు నేర్పించమని వృద్ధుడైన విష్ణుశర్మని కోరడంతోనే ‘పంచతంత్ర కథలు’ పుట్టుకొచ్చాయి. అవి ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా అయి, ఎంతో ప్రాచుర్యం పొందాయి.
బ్రిటిష్కాలంలో ఆధునిక విద్యాలయాలు మొదలైనా, ఆ కాలంలోనూ మన దేశంలో సంప్రదాయబద్ధమైన గురుకులాలు చాలానే నడిచేవి. నిజాం రాజ్యంలో ‘అఘోరనాథ ఛటోపాధ్యాయ’ నిజాం కాలేజ్ తొలి ప్రిన్సిపాల్గా పనిచేశారు. దేశంలో స్త్రీ విద్య కోసం తప్పించిన తొలిగురువు సావిత్రిబాయ్ పూలే. ఆమె బోధన కృషిని తరతరాలూ స్మరించుకుని తీరాల్సిందే. కట్టమంచి రామలింగారెడ్డి నాటి విద్యావేత్తల్లో ప్రసిద్ధుడు. మైసూరు విశ్వవిద్యాలయ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్చాన్సలర్గా పనిచేశారు.
రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోనే ఎందరో ప్రముఖులు ఆరితేరారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన మౌలానా అబుల్కలాం ఆజాద్ స్వయంగా కవి, పండితుడు. ఆయన అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ వంటి భాషలలో ప్రవీణుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖమంత్రిగా పనిచేసి గుర్తింపు పొందారు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లంతా ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.సర్వేపల్లి ఘనత
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టిన ఘనుడు. సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజునే మనం టీచర్స్డేగా జరుపుకుంటున్నాం. భారతదేశపు అత్యంత క్లిష్టకాలమైన చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయాల్లో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. చేపట్టిన పదవులు, పొందిన గౌరవాలు, రాసిన రచనలే సర్వేపల్లిని ఉన్నతంగా నిలబెట్టాయి. భారతరత్న పురష్కారం ఆయన్ని వరించింది. ‘తత్వం అనేది జీవితాన్ని అర్థం చేసుకునే ఒక మార్గం’ అంటారు ఈయన. ‘భారతదేశ మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి.బోధకుడే కాదు, శిక్షకుడు కూడా..
పురాణాల్లో అవతారపురుషుడైన పరశురాముడు.. కుంతీపుత్రుడైన కర్ణుడికి గురువు. అయితే తన దగ్గర సకల అస్త్రాల ప్రయోగాలు నేర్చుకున్న కర్ణుడు కౌరవుల పక్షాన, అధర్మం వైపు నిలబడ్డాడని తెలిసి శపించాడు. విద్యాబుద్ధులు నేర్పే సమయంలో కర్ణుడి తెలివికి, గుణానికి మెచ్చి.. బ్రహ్మాస్త్రాన్నీ గురువరంగా ఇచ్చిన పరశురాముడు.. కర్ణుడి తప్పిదాన్ని ముందుగానే భవిష్యత్ దర్శనంలో చూసి ఆగ్రహించాడు.
మొదట దుర్యోధనుడితో స్నేహం వదులుకోమని హెచ్చరించాడు. కర్ణుడు వినకపోవడంతో.. అత్యవసర సమయాల్లో అస్త్ర ప్రయోగ మంత్రాలు గుర్తుకురావని శపించాడు. అలా అధర్మ పక్షం వహించిన కర్ణుడిని అదుపు చేయగలిగాడు. స్వార్థం లేకుండా తన జ్ఞానాన్ని పంచే గురువు.. తన శిష్యుడు దారి తప్పితే గుర్తించి శిక్షిస్తాడని, అవసరమైతే శపిస్తాడని చెప్పే గాథ ఇది.
ప్రాంజలి ప్రభ కథలు..11/02
మల్లాప్రగడ
ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…
అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…
ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…
ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…
రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు…
నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…
ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…
ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…
మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
చదవండి చదవమని చెప్పండి - మనస్సు ప్రశాంతముగా ఉంచుకోండి
సర్వేజనా సుఖోనోభవంతు
ఎందఱో మహానుభావులు అందరికి వందనములు, నేను (ఓం శ్రీ రాం ) కధలు రచించి,సేకరించి,
స్వయంగా వ్రాస్తున్నాను , ప్రాంజలి ప్రభను ఆదరించే వారు ప్రపంచ తెలుగు ప్రజలందరూ విని మీ అభి ప్రాయాలు తెలుపగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు
***
తల్లి ఋణం.. ప్రాంజలి ప్రభ....11/02
ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.
తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో - తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు.
అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.
అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.
తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.
తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు.
అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.
నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు - నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.
ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు,ఆమె చేసే సేవలకు,ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు.
నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు.
అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. తల్లి దేవత. తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
నవమాసాలు తన బిడ్డను కడుపులో మోసి, ఎన్నో బాధలకు ఓర్చి, బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తినట్లే.
***
(09/02/2024) చొల్లంగి అమావాస్య :*ప్రాంజలి ప్రభ
*పుష్య మాసం లో వచ్చే ఈ చొల్లంగి అమావాస్యకి ప్రాముఖ్యత ఏమిటి..?*
*చొల్లంగి అమావాస్య :*
💎పుష్యమాసంలో చివరిరోజైన అమావాస్యని బకుల అమావాస్య... అర్ధోదయ అమావాస్య అని ధర్మశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి. చొల్లంగి అనేది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం. కాకినాడకి దక్షిణంగా, యానాం రహదారి మీద మూడుమైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి. గోదావరి ఏడు పాయల్లో (సప్త గోదావరి) ఒకటి తుల్యభాగ. ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఆ సంగమప్రాంతంలో స్నానం చేస్తే పుణ్యనదిలోనూ, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది.
💎ఈ ఏడు గోదావరీ సాగరసంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడాన్ని 'సప్తసాగరయాత్ర' అంటారు. ఈ యాత్రని పుష్యబహుళ అమావాస్యనాడు చొల్లంగి దగ్గర స్నానం చెయ్యడంతో ఆరంభిస్తారు. వరుసగా మిగిలిన సాగరసంగమాల్లో స్నానాలు చేస్తూ మాఘ శుద్ధ ఏకాదశినాటికి అంతర్వేదికి చేరుకుంటారు. అది వసి ష్టుని పాయ సముద్రంలో కలిసిన ' ప్రదేశం. ఆ రోజు బ్రహ్మోత్స వాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి కల్యాణమహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు.
సప్తసాగర యాత్ర..
💎కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి ఆయన జటాజూటం నుంచి ఒక జటను వరంగా పొందాడు. గౌతమ మహర్షి గంగాజలంతో తడిసి ముద్దయిన ఆ జటని ఆయన చనిపోయిన మాయగోవు మీద పిండాడు. ఆ గోవుగా బతికింది. అక్కడి నుంచి ఆ గంగాజలం నదిగా ప్రవహించింది. గోవుని బతికించిన ఆ నది గోదావరి అయింది. గౌతమమహర్షి మూలంగా భూమికి దిగి వచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఏడుగురు మహర్షులు ప్రార్ధించగా గోదావరి ఏడుపాయలుగా చీలి సప్తగోదావరి అయింది.
💎ఆ ఏడుపాయల్ని గౌతముడు, తుల్య భాగుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వసిష్ఠుడు మొదలైన ఏడుగురు మహర్షులు తమ వెంట తీసుకుపోయి ఏడు చోట్ల సముద్రంలో కలిపారు. ఆ కారణంగా ఆ ఏడుపాయలూ ఏడుగురు మహర్షుల పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందాయి. తుల్యభాగుడు తన వెంట తీసుకుపోయిన గోదావరి పాయ చొల్లంగి దగ్గర, ఆత్రేయుని పాయ మసకపల్లి దగ్గర, భరద్వాజుని పాయ మొండి దగ్గర, కౌశికుని పాయ రామేశ్వరం దగ్గర, వసిష్టుని పాయ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి.
అక్షయపుణ్యఫలం
💎పుట్టుకతో దానవుడైనా, నడవడిలో ఏమాత్రం దానవ లక్షణాలు లేని మహర్షి తుల్యభాగుడు. ఎప్పుడూ పరమార్థ తత్త్వచింతనలో ఉంటూ, తరచుగా చీటికి మాటికీ దేవదానవుల మధ్య ఏర్పడే వివాదాల్ని ఏ మాత్రం పక్షపాతం లేకుండా చాకచక్యంగా అతను పరిష్కరించేవాడు. అందుకని అతనిని అందరూ తుల్యభాగుడని పిలిచేవాళ్లు. సప్తగోదావరుల్లో ఒక పాయని తీసుకెళ్లి అతను సముద్రంలో కలిపాడు. అందుచేత ఆ పాయకి తుల్యభాగ అనే పేరు వచ్చింది.
చొల్లంగి అమావాస్య సందర్భంగా..
💎లోకకంటకుడైన తారకాసురుని కంఠంలోని అమృత లింగాన్ని కుమారస్వామి ఛేదించాడు. ఆ లింగం ఐదు శకలాలై (ముఖాలై) వాటిలో ఒకటి దక్షవాటిలో పడింది. ఆ శకలాన్ని సప్తగోదావరీజలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతి ష్ఠించాలని సప్తర్షులు సంకల్పించారు. వెంటనే వాళ్లు నదిని అర్థించగా అంగీకరించింది. మహర్షుల వెంట దక్షవాటికి వెడుతూ దారిలో దానవమునుల ఆశ్రమాల్ని ముంచెత్తింది సప్తగోదావరి.
💎అందుకు కోపించిన దానవమునులు సప్తగోదావరిని శుష్కతోయగా (నీళ్లు ఎండిపోయిన నదిగా) ఉండమని శపించారు.అప్పుడు తుల్యభాగుడు మధ్యవర్తిగా ఉండి. ఆ రెండు పక్షాల శాపాల్ని ఉపసంహరింపజేశాడు. పుష్య బహుళ అమావాస్యనాడు తుల్యభాగ సముద్రంలో సంగమించే చోట చొల్లంగిలో స్నానం చేసినా, దానజపాలు చేసినా అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, పితృతర్పణాలు చేసే 21 తరాల పితృదేవతలు తరి స్తారు. అమావాస్యతిథి పితృదేవతలకి ప్రీతికరమైంది. అమావాస్య నాడు పితృవ్రతం చెయ్యాలని చతుర్వర్గ చింతామణి చెప్పింది.
💎పుణ్యస్నానాల్లో సముద్రస్నానం ఉత్తమమయింది. ఉప్పు. నీటిలో స్నానం చెయ్యటం వల్ల చర్మగత దోషాలు పోతాయని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. ఇక జీవనదిలో స్నానం చెయ్యటం వల్ల జలాధిదేవత అయిన వరుణుని శక్తి, సూర్య చంద్రకిరణశక్తి, మహర్షుల తపశ్శక్తి, మూలికలశక్తి, ఖనిజ శక్తి లభిస్తుంది.
'ప్రతి సంవత్సరమును పౌష్యబహుళ అమావాస్యనాడు. చొల్లంగి గ్రామమునకు తుల్యసాగర సంగమస్థలమున నవ గాహనము సేయవచ్చు. వేలకొలది యాత్రికులకు తుల్యనదీ ప్రభావము వినుతి కెక్కనదే' అనే కథ ప్రచారంలో ఉంది.
పుష్యమి అమావాస్య పూజా విధానం:
💎పుష్యమి అమావాస్య రోజు శ్రీమహావిష్ణువుని పూజించాలి
💎ముఖ్యంగా ఉదయాన్నే శుభ సమయాల్లో నిద్రలేచి పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది.
💎ఇలా స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
💎ఇంట్లో ఉన్న శ్రీమహావిష్ణువు ఫోటోకి పూలమాలను సమర్పించి స్తోత్రాన్ని చదువుతూ ధ్యానం చేయాల్సి ఉంటుంది.
💎ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికల నెరవేరుతాయి.
పుష్యమి అమావాస్య ప్రాముఖ్యత:
💎పుష్యమి అమావాస్యకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది.
💎ఈ అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం వల్ల వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
💎అంతేకాకుండా ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించి అర్ఘ్యం సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి.
*ఓం శనైశ్చరాయనమః* 🙏🏻
*సేకరణ :*
*_ మల్లాప్రగడ *
ప్రాంజలి ప్రభ... 09-02-2024
తెలుగు భాషాభిమానుల కోసం.👇
*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*
అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:
అరుఁగు = వీధి అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏఁడు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కాఁపు = కులము
కాపు = కావలి
కాఁచు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువు, కాలము
కాఱు = కారుట (స్రవించు)
చీఁకు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱుఁగు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దాఁక = వరకు
దాక = కుండ, పాత్ర
నాఁడు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పేఁట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పోఁగు - దారము పో( గు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బోఁటి = వంటి [నీబోఁటి]
వాఁడి = వాఁడిగా గల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడుఁగు = వంగు, అడఁగు
మడుగు = కొలను, హ్రదము
మొదలైనవీ ఉన్నాయి.
అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!
(డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి నుండి సేకరణ.)..
మల్లాప్రగడ .🙏
*****
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, విశ్రాంతి ఉద్యుగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వేధింపులు మీరు చదవండి పెన్షన్స్ కూడా సరిగా ఇవ్వని ప్రభుత్వo
*ఉద్యోగుల సమస్యలు* *పరిష్కరించకుంటే*
*ఈనెల 12 నుంచి* *ఆందోళనబాటే....*
--- ఇప్పటివరకు ప్రభుత్వానికి సహకరించాం
--- వాయిదాల మీద వాయిదాలే తప్ప
సమస్యలు పరిష్కారం కాలేదు
--- ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ స్పందన
నిరాశాజనకం
--- మా సహనాన్ని పరీక్షించవద్దు...
తేలికగా చూడొద్దు...
విజయవాడ :
గత ఐదేళ్లుగా ఉద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నాయి. ఇంతకాలం సహకరించాం... మా సహనాన్ని ఈ ప్రభుత్వం తేలికగా చూస్తోంది. మా సహనం నశించింది. ఇక ఉద్యమ బాట తప్పదని
ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు.
గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక
సమస్యలను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం
పాలనాపగ్గాలు చేపట్టి ఐదేళ్లు పూర్తికావస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి ప్రభుత్వానికి పాలన, పాలనేతర అంశాలలో సంపూర్ణంగా సహకరించామన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు హక్కుగా రావలసిన డి ఎ బకాయిలను గత ఐదేళ్లలో ఒక్క డీఎ బకాయి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పి ఆర్ సి లో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ప్రతి పి ఆర్ సి లోను సాధారణంగా జీతభత్యాల పెంపు ఉంటుందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెంచకపోగా తగ్గించిందని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల కు వలసిన బకాయిల సొమ్ము సుమారు 25 వేల కోట్ల రూపాయలు పైబడి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. తమ కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు లోన్స్ పెడితే తమకు సమయానికి డబ్బు చేతికందటం లేదని వివరించారు. ఇటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న చరిత్ర గతంలో ఇప్పుడు లేదన్నారు. తమ డబ్బులకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం బాధాకరమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తమ ఆరోగ్య అవసరాల కోసం ప్రతినెల చెల్లిస్తున్న వైద్య బీమా డబ్బులు సైతం ప్రభుత్వం ఆసుపత్రుల ఖాతాలకు జమ చేయకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యాలు తమ అనారోగ్య సమస్యల సమయంలో వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నాయన్నారు. డిఏ తదితర బకాయిలు ఒక్కో ఉద్యోగికి కనీసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవ్ ల సొమ్ములు కూడా ప్రభుత్వం తనవద్దే ఉంచుకొని గత మూడు సంవత్సరాలుగా చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంద న్నారు.8 వేల కోట్లకు పైగా సరెండర్ లీవుల డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప ఒక్క ఉద్యోగికి కూడా బకాయిలు చెల్లించలేదన్నారు.
ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల పైగా సొమ్ము గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఉద్యోగులు చెల్లిస్తున్నప్పటికీ, సుమారు పదివేల కోట్ల మూలధనం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఒక్క పైసా కంట్రీ బ్యూషన్ లేకపోయినప్పటికీ. APGLi రుణాలు గాని ,రిటైర్ అయితే చెల్లించడం గాని, చనిపోతే చెల్లించడం కానీ జరగటం లేదన్నారు. ఇంతకుమించి నా విషయం ఏమిటంటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన పోర్టల్ కూడా గత ఆరునెలల కాలంగా మూసివేయటం సోచినీయమని, దీనివల్ల కనీసం లోన్లుగానే కొత్త బాండ్లు గాని రిటైర్మెంట్ విషయంలో గానీ అప్లికేషన్ పెట్టుకోడానికి కూడా సదుపాయం లేదనే తెలిపారు.రిటైరైన ఉద్యోగికి జిపిఎఫ్ సొమ్ము కూడా చెల్లించక పోవడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు తమ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అధిగమించలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిల విషయం ఒక అంశం అయితే, ప్రతినెల నిర్ణీత సమయానికి జీతాలు, పెన్షన్ వచ్చే పరిస్థితి లేదన్నారు.
కేంద్రం ప్రతి 6 నెలలకు కొత్త డీఎ ప్రకటిస్తుంటే, రాష్ట్రప్రభుత్వం కనీసం పాత డిఏలను కూడా ఉద్యోగులకు చెల్లించలేక పోతోందన్నారు. . సి పి ఎస్ కు ఉద్యోగుల నుంచి 10% మినహాయిస్తున్న ప్రభుత్వం, మరియొక 10 శాతం తమ వాటా కింద చెల్లించాలని, ఈ రెండిటినీ ప్రాన్ ఎకౌంట్కి జత చేయాల్సింది ఉండగా, కనీసం సిపిఎస్ ఉద్యోగులు కడుతున్న 10% అమౌంట్ను కూడా సంవత్సర కాలముగా మాత్రం జమ చేయడం లేదన్నారు.
సిపిఎస్ రద్దు చేసి, OPS పునరుద్ధరిస్తారని మాట ఇచ్చిన ప్రభుత్వం దానికి కట్టుబడక పోవటం శోచనీయమని చెప్పారు.
12వ పిఆర్సికి కమిషనర్ను అపాయింట్ చేసినప్పటికీ గత ఎనిమిది నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటీరియర్ రిలీఫ్ ను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 11వ తేదీన విస్తృత స్థాయి జేఏసీ సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి నోటీసు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిచి డిమాండ్స్ ని పరిష్కారం చేయాలని, లేకుంటే ఆందోళన బాట పట్టేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నానని చెప్పడం పైన పటారం లోన లొటారం చందంగా ఉందన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అదే మాటకు కట్టుబడాలన్నారు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గిస్తోందని, కొత్తగా అధ్యాపక నియామకాలు చేపట్టడం లేదన్నారు. కేవలం ప్రచారమే తప్ప పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. గతంలో ఉపాధ్యాయులు బి ఆర్ టి ఎస్ రోడ్లో చేసిన ఆందోళన తర్వాత ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందన్నారు. ఇటువంటి దుస్థితి ఉపాధ్యాయ రంగ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి తరఫున ప్రభుత్వానికి మరొకసారి తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాలి నాయుడు
మాట్లాడుతూ తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వంపై నమ్మకంతో దాచుకున్న తమ డబ్బును సైతం నిర్ణీత సమయానికి విశ్రాంత ఉద్యోగుల ఖాతాలో జమ చేయకపోవడం విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణిని ప్రతిబింబిస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎడిషనల్ క్వాంటం ఆఫ్ అమౌంట్ కూడా ఈ ప్రభుత్వం తగ్గించిందని దానిని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ కార్యదర్శి ఎండి ఇక్బాల్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎ. సాంబశివరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి సాయిరాం, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సహాధ్యక్షులు డి ఎస్ ఎన్ రెడ్డి, జిల్లా ఎన్జీవో సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం రాజాబాబు, కె. సంపత్ కుమార్, ఎస్.కె. నజీరుద్దీన్, బివి రమణ, కె. శివలీల, జయశ్రీ, సత్యనారాయణ రెడ్డి, సిహెచ్ మధుసూదన రావు, ఎస్.కె. ఖాసిం, సిహెచ్ రాధాకృష్ణ తదితరులతో సహా పలువురు జిల్లా సంఘ నేతలు పాల్గొన్నారు
pranjali prabha ... విలువ * 10/2
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజు తన పని చేసుకుంటూ ఉండగా..,
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగాకనిపించింది. అతను ఆ రాయిని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు.ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి దాన్ని ఉపయోగించుకుంది!
ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికిఅటుగా మిఠాయిలు అమ్ముకునే అతను
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాయి చేతిలో పట్టుకుని వెళ్ళాడు.
ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక లడ్డూ ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితేఅతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక లడ్డూ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపిచెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయివస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి భలే ఉంది! నాకు ఇచ్చేయ్ అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బుతీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గావాడసాగాడు.
కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికివచ్చి ఆ రాయిని చూసి, అతనికి మరి కొంత సొమ్ము ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకితీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లువిలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
*నీతి *అదే రాయిని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకోవడానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక లడ్డూ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్నిపేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు.*
*🙏అట్లాగే ఈ మానవ జన్మ ఎంతోవిలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి మీద ఆధార పడి ఉంటుంది! మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలుగుతారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
***
ప్రాంజలి....10/02
🙏ఈ కధ చదవండి ఇటువంటి వాళ్లున్న చోట వృద్ధాశ్రమం అవసరం రాదు.
👏👏👏👏👏👏👏👏👏
*తాత - మనుమడు - తండ్రీ*
🌞ఆ రోజు ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన తాతగార్ని ఓ మనవడు నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని జాగ్రత్తగా కూర్చో బెట్టాడు.
చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అడిగాడు మనవడు.
🌞నాకు మటన్ చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.
ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్ చాల మెత్తని మటన్ ఖైమా, బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు.
🌞ఐదు నిమిషాల్లో చికెన్ సూప్ వచ్చింది!
ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి....సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆబోసి నోరు చుట్టూ అంటుకుంది. కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది.
🌞తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ....నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం...ఓ పక్క కంటనీరు.
🌞రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు.
కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్ , రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు!
ఒక్కరోజుకు ఏం కాదు డాడీ.... నేను చూసుకుంటాను కదా అని....రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.
🌞మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన.... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు.
🌞ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు..,,ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్ ! తాతయ్య అంటే అంత ఇష్షమా?
దానికి కొడుకు చెప్పిన సమాధానం....డాడీ ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా ! ... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ....నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్ధు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచ గలను. నానమ్మ ఇప్పుడు లేదుగా. అందుకే వచ్చిన ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అని చెప్పాడు.
🌞సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు....నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం.. చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...! యు ఆర్ గ్రేట్ మై సన్.
గమనిక :-డబ్బువెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే.... !
అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ...!
ఈ గ్రూప్ లో ఇది అనవసరం అని అనుకోవద్దు. కుటుంబ వ్యవస్థ ఇలా ఉంటే సమాజం కూడా బాగుంటుందని భావిస్తూ.....
మీ ప్రాంజలి ప్రభ
🙏🙏🙏
ప్రాంజలి ప్రభ కథలు...11/02
మల్లాప్రగడ
*మరణం ఎందుకు ముఖ్యం*
మరణం ఎందుకు ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను వివరించే చాలా అందమైన కథనం. మృత్యువు ప్రతి ఒక్కరూ భయపడే విషయం. పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా?
ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతను "ఓ స్వామీ, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియ జేయండి?" సన్యాసి అన్నాడు "ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి, అక్కడ మీకు ఒక సరస్సు కనబడుతుంది. మీరు దాని నుండి నీరు త్రాగండి, అమరత్వం పొందుతారు. పర్వతాలు దాటి, ఒక సరస్సు ను కనుగొన్నాడు. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు, నీరు తాగకుండానే ఆ గొంతును అనుసరించాడు, చాలా బలహీనమైన వ్యక్తి పడుకుని నొప్పితో ఉన్నాడు. రాజు కారణం అడగగా, "నేను సరస్సులోని నీటిని తాగాను. అమరుడయ్యాడు. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు, గత ఏభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం, త్రాగటం మానేశాను. కానీ, ఇంకా బ్రతికే ఉన్నాను." రాజు ఆలోచించాడు "అమరత్వం వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి. నేను కూడా అమరత్వం, యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసిని అడిగాడు. సన్యాసి ఇలా అన్నాడు, "సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి. అక్కడ మీకు పసుపు పండిన పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తినండి. మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు". రాజు చెప్పినట్లే చేశాడు. అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు. పండ్లను తెంపి తినబోతుంటే, కొందరు పోట్లాడుకోవడం అతనికి వినిపించింది. ఇంత మారు మూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచిస్తున్నాడు. నలుగురు యువకులు గొంతెత్తి వాదించు కోవడం చూశాడు. అలా మారుమూలలో పోట్లాడు కోవడానికి కారణం ఏమిటని రాజు అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. అతను సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు. నా కుడి వైపున మా నాన్న ఉన్నారు. 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఒకరి ఆస్తి కోసం ఒకరి అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి వెళ్లగొట్టారని" వారందరూ రాజుతో చెప్పారు. దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి *మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు* అన్నాడు.
అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు *మరణం ఉంది కాబట్టి, ప్రపంచంలో ప్రేమ ఉంది* మరణాన్ని నివారించే బదులు, మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం, ప్రతి సెకను జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి. మిమ్మల్ని మీరు మార్చుకోండి అపుడు ప్రపంచం మారుతుంది.
1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది.
2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది.
3. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్ర (తీర్థయాత్ర) లాగా ఉంటుంది.
4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.
5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది.
6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది.
7 . ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.
*శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః*
****
తల్లి ఋణం.. ప్రాంజలి ప్రభ....11/02
ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.
తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో - తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు.
అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.
అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.
తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.
తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు.
అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.
నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు - నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.
ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు,ఆమె చేసే సేవలకు,ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు.
నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు.
అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. తల్లి దేవత. తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
నవమాసాలు తన బిడ్డను కడుపులో మోసి, ఎన్నో బాధలకు ఓర్చి, బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తినట్లే.
***
`*జ్ఞాన సంపద*
*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:*
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా
*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.*
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్
*సముద్రమే వెనక్కివెళ్లే*
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి* అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం.*
1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు*
1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి
*స్వయంభువుగా*
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే*
1. బదరీనాథ్,
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.
*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు*
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
*స్వయంగా ప్రసాదం*
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం
*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.
*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు*
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి
*మనిషి వలె గుటకలు*
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.*
*ఛాయా విశేషం*
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం
*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్
*ఇంకా...*
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం లాంటి మహా పుణ్యక్షేత్రాలు .....
*పూరీ*
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.
ఇవి మన అపూర్వమైన ఆధ్యాత్మిక సంపద , వారసత్వ సంపద ...... 🙏🙏Jai Sree Ram🙏🙏
***-
మాతరం ప్రీణీమః
పితరం ప్రీణీమః
భ్రాతరం ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
గురుం ప్రీణీమః
మిత్రం ప్రీణీమః
పత్నీం ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
పుత్రం ప్రీణీమః
పుత్రీం ప్రీణీమః
శిష్యం ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
మాతామహీం ప్రీణీమః
మాతామహం ప్రీణీమః
ననందాం ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
పితామహీం ప్రీణీమః
పితామహం ప్రీణీమః
పితృవ్యం ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
శ్వశురం ప్రీణీమః
శ్వశురీం ప్రీణీమః
శ్వశ్రూః ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
అనుజాం ప్రీణీమః
అగ్రజాం ప్రీణీమః
ప్రజావతీం ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
బంధూన్ ప్రీణీమః
దుర్జనాన్ పరివర్తయామః
సజ్జనాన్ ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
జామాతరం ప్రీణీమః
ప్రతివేశినం ప్రీణీమః
కవీన్ ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
ఉద్యోగినం ప్రీణీమః
నిరుద్యోగినం ప్రీణీమః
ఉద్యమకారాన్ ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
నాయకాన్ ప్రీణీమః
నాయికాః ప్రీణీమః
పండితాన్ ప్రీణీమః
ప్రేమలోకం సృజామః
*****
`*ఇచ్చింది అవే తిరిగొస్తాయి* మంచైనా, చెడైనా
*ఋణం*
( మంచి కధ తప్పక చదవండి)
*అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక ఛస్తున్నా! కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయ్ వెధవ కాకులు. అయినా మీఛాదస్తానికి వేగలేక ఛస్తున్నాననుకోండి. ఈకాలంలోకూడా ఏమిటీ నూనె ఆడించుకోవడాలు, నాఖర్మకాకపోతే? పెచ్చులు తీయడం, ముక్కలు కోయడం, ఎండబెట్టడం.. నావల్లకాదుబాబూ. గుళ్ళోకొట్టినవన్నీ తెచ్చి నా నెత్తినపాడేస్తారు. ఇకనుంచి నా వల్లకాదు.*
*తెల్లవారుఝామున నాలుగింటికి గుడికెళ్ళిన శాస్త్రిగారు పదకొండుగంటలకి ఇంటికొచ్చారు. ఆచమనంతప్ప పచ్చిమంచినీళ్ళుకూడా తాగలేదు. ఈవిడ దండకంలో కొత్తేముంది? ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిక, స్తోత్రం, పూర్వపీఠిక, ఫలస్రుతి చెప్తేగాని ఆపదు.*
*నాక్కాస్త ఫలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తాను అన్నారు ఆవూరి శివాలయం పూజారి శాస్త్రిగారు*
*తిన్న తరువాత కాసేపు పేపర్ తిరగేసి గదిలోకెళ్ళి మంచమ్మీద వాలారో లేదో... గుప్పున కొట్టింది చేపల వాసన. లలితా! ఏమిటీవాసన? గదిలోంచే అరిచారు శాస్త్రిగారు. ఆకిటికీ తలుపు తెరచుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికొస్తుంది అని అరిచారు లలితమ్మ పెరట్లోంచే, సమాధానంగా.*
*కిటికీ తలుపు తెరచిన శాస్త్రిగారు ఒక్కనిముషం కూడా అక్కడ ఉండలేకపోయారు. అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకొచ్చేసింది. గబగబా బయటికి వచ్చేసి, ఏంటోచూడు అరుగుమీద ఏముందో.... దుంపతెగ ప్రేగులు కూడా బయటికి వచ్చేసేటట్టున్నాయ్!" అనగానే....*
*ఇంద ఈ ముక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధితలుపు తెరచి మళ్ళీ ఏదో దండకం మొదలెట్టారు లలితమ్మ.* *ఈసారి ఎవరిమీదనో భద్రకాళిలా విరుచుకు పడిపోతోంది. విసురుగా పెరట్లోకొచ్చి శాస్త్రిగారికి చెప్పింది ఎవరో ముసలమ్మ.... చేపలగంప పెట్టుక్కూర్చుంది అరుగుమీద. ఇంకే అరుగు దొరకనట్టుంది. ఓ బకెట్టు నీళ్ళు పట్టుకెళ్ళి జల్లండి ఆవేశంగా చెప్పి వెళ్ళి మరల కొబ్బరి ముక్కలదగ్గర స్టూలుమీద కూర్చున్నారు లలితమ్మ.*
*వీధి అరుగు మీదికి నీళ్ళు పట్టుకెళ్ళేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది, లేచి నిలబడటానికి కూడా సత్తువలేనట్టుంది. గంప ఎత్తుకోబోయి తూలిపడి, ఎలాగో తమాయించుకుని లేచింది. ఏమ్మా, ఒంట్లో బాలేదా? ఏమయ్యింది? అడిగారు శాస్త్రిగారు.*
*అవును బాబయ్యా, జొరమొచ్చేసింది. గొంతెండిపోతుంది చాల నీరసంగా చెప్పింది ముసలమ్మ.*
*సరే ఆగంప అలా సందులో పెట్టుకుని వచ్చి కుర్చో! ఈలోగ మంచినీళ్ళు తెస్తాను అని లోపలికెళ్ళి, నీళ్ళు, గోరువెచ్చని పాలు చెరో గాజు గ్లాసులోనూ పట్టుకొచ్చారు శాస్త్రిగారు.* *సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాణ్ణి పిలిచి పదిరూపాలిచ్చి కిరాణాకొట్టుకెళ్ళి ఒక రొట్టె తీసుకురమ్మన్నారు.*
*ఇంద ఈ రొట్టెతిని పాలుతాగు. తరవాత ఈ బిళ్ళవేసుకుని అలా కాసేపు ఒరుగు. అదే సర్దుకుంటుంది అని ఒక క్రోసిన్ టేబ్లెట్ కూడా ఇచ్చారు.*
*గంటతరవాత వచ్చిచూస్తే అమె అక్కడ లేదు. గంపతీసుకుని వెళ్ళిపోయింది.*
*విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలెట్టారు. పళ్ళెంలో పడే రూపాయి దక్షిణకోసం పాకులాడే బ్రతుకులు మనవి. సంఘసేవొకటి. సాయంత్రం ప్రసాదంకోసం ఉంచిన పాలు అవి ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొబ్బరిముక్కలు ఎండబెట్టుకోవడానికి వలనేయించమని ఏళ్ళుగా మొత్తుకుంటున్నా. నన్ను ఎండలో కాపలా పెడతారు గాని ఓ వంద రూపాయలిచ్చి వల మాత్రం అల్లించరు. పదిరూపాయలిచ్చి రొట్టెకూడా కొనిచ్చేరంట. ఏంత ఉదారమో? వ్యంగ్యంగా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పారు.*
*పోన్లేవే జ్వరంతో ఉంది. పాలదేముంది.. ప్రెసిడెంటుగారికి కబురెట్టి ఒక లీటరు పాలు పంపించమంటే సరి. ప్రసాదానికే కదా. సర్దిచెప్పడానికి చెపుదామనుకున్నారు గాని, తనలో తానే అనుకోగలిగారు.*
*నెలరోజులు గడిచాయి. సాయంత్రం అయిదింటికి పంచె కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు శాస్త్రిగారు గుడితలుపులు తెరవడానికి.* *వీధి తలుపు తెరవగానే, గుమ్మంలో నుంచుని ఉంది ముసలమ్మ. అరుగుమీద గంప పెట్టి ఉంది. కానీ వాసన రావట్లేదు. చక్కగా వుతికి ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని చేతులు జోడించి దణ్ణంపెట్టింది, శాస్త్రిగారిని చూసి.*
*ఏమ్మా ఇప్పుడెలాఉన్నావ్ అని అడిగారు శాస్త్రిగారు.*
*బాగున్నాను బాబయ్య. ఆపదలో కాపాడేరు. మీరుణం తీర్చుకోలేను.*
*ఏంపర్లేదమ్మా. నేనేంచేసాను. ఒక బిళ్ళ , కాసిని పాలు ఇచ్చాను అంతేకదా! వెళ్ళిరా! అని ముందుకి కదలబోయారు శాస్త్రిగారు.*
*లేదుబాబయ్యా. ఇది మీకోసమే తెచ్చాను అంది గంపచూపిస్తూ.*
*ఏముంది అందులో అడిగారు శాస్త్రిగారు.*
*మాయింటికాడ కొబ్బిరి సెట్టుందండి. పదికాయలు దింపించి ఒలిపించాను.* *మా ఆయన మోకుతాళ్లు అల్లుతాడండి పదిగజాల తాడు అల్లించాను. గిలకబావి సేద క్కట్టుకోవచ్చండి. మరేమోనండి సిక్కం కూడా అల్లించేనండి.*
*సిక్కమా, అదేంటి? అర్థంకాక అడిగారు శాస్త్రిగారు.*
*వలండీ వల. ఏవన్నా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కమేసేత్తే ఇంక కాకుల గొడవుండదండి. ఇంకా చింతచిగురు, సీమసింతకాయలు కూడా వున్నాయండి. కొత్త గంపండి. సేపలు గట్రా దీనికి అంటుకోలేదండి. గంపను ఉన్న పళంగా లోపలకట్టుకుపోండి. మీరు పంతులుగోరు కదండి బాబయ్యా. మడీ ఆశారం ఉంటాదని నేనే తానం సేసి కట్టేనండి అన్నీని. ఆయ్!*
*గుక్కతిప్పుకోకుండా చేప్పేస్తుంటే.. నిశ్చేష్టులై వింటున్నారు శాస్త్రిగారు. పువ్వుల పొట్లం మర్చిపోయారండీ అంటూ ఉంటే... శాస్త్రిగారి వెనకాలే వచ్చి అన్నీ విన్న లలితమ్మకు నోటమాటలు రాలేదు.*
*ఎల్లోత్తానండి పంతులుగోరు... దండాలండి అమ్మగోరు అని ఇద్దరికి దణ్ణాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి మొల సంచిలోంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు శాస్త్రిగారు.*
*వద్దు బాబయ్య. తమలాంటి దర్మ పెబువుల దగ్గర మేం పుచ్చుకోగూడదు. వత్తానండయ్యా అని మళ్ళీ దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది.*
*( *మనిషి ఆర్థిక- సామాజిక స్థితికి, సంస్కారానికి సంబంధంలేదు )*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
`1➕ నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి, కూర్చుని త్రాగండి.
2➕ వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.
3➕ 70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.
4➕ కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
5➕ అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.
6➕ షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.
7➕ పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగవుతారు.
8➕ దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.
9➕ ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం. ......
*ధన్యవాదములు* మీ శ్రేయోభిలాషి*```👏
******
శుభోదయం .సేకరణ ప్రాంజలి ప్రభ..12/02
ఈ రోజు ఆంధ్రప్రభ చింతనలో వచ్చిన వ్యాసం
పరహితమే పరమధర్మం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు
పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥
అన్నాయి ధర్మశాస్త్రాలు. పరోపకారం కోసమే వృక్షాలు ఫలిస్తాయని, పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయని, పరోపకారం కోసమే ఆవులు పాలనిస్తాయని, పరోపకారం కోసమే మానవ శరీరం ఉందని, ఇలా ప్రకృతిలోని చెట్లు, నదులు మొదలైన వాటి వలన జీవకోటికి ఎంతో ఉపకారం జరుగుతోందని శ్లోకం యొక్క భావం.
భువిపై నివసించే జీవులలోకెల్లా ఉత్కృష్టమైనది మానవ జన్మ. 87 లక్షల జీవరాసుల్లో మానవుడు మాత్రమే ప్రత్యేకం. ఇతర జీవులకు లేని ఆలోచనా శక్తి, జ్ఞానం ఉన్న ఏకైక జీవి మానవుడు. గ్రంథాలలో బోధించినట్టే సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడంటే చేయూతనిచ్చి సాయపడేవారు మానవులు. అవతలివారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తూ ఆసరాగా నిలిచేవారు.
పరోపకారం చేయమని పరహితం తలపెట్టమని బోధించాయి మన గ్రంథాలు. అలాంటి ఒక సంఘటన మహాభారతంలో కనిపిస్తుంది.
అరణ్యవాసంలో ఉన్న పాండవులను వారణావతములో గల లక్క ఇంట్లో దహింపజేసి హతమార్చాలని దుర్యోధనుడు పథకం వేసాడు. ఆ రహస్యాన్ని విదురుడి ద్వారా తెలుసుకున్న పాండవులు, అక్కడ నుండి క్షేమంగా బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రయం పొందారు.
ఒకరోజు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుండి బకాసురుడుకి ఆహారం కావడం కోసం ఒకరు వెళ్లాల్సి ఉండగా, ఆ కుటుంబీకులంతా భోరున విలపించారు. వారి రోదనలు విన్న కుంతీ దేవి ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని ఓదార్చి, వారికి బదులుగా తన కుమారుడు భీముడిని ఆహారంగా పంపిస్తుంది. ఇంత గొప్పగా ఆలోచించడం సామాన్య విషయం కాదు. ప్రాణహాని ఉందని తెలిసీ కొన్నాళ్ళు ఆశ్రయం పొందినందుకే ఆ కుటుంబానికి వచ్చిన ఆపద నుండి గట్టెక్కించాలని ఆలోచించింది కుంతీదేవి. ఆమె యోచన వెనుక ఉన్న పరోపకార బుద్ధి కొనియాడదగినది.
ప్రాణ ప్రమాదమని తెలిసినా పరోపకారం కోసం వెనుకడుగేయకూడదని తెలుపుతున్న ఇంకో సన్నివేశం పరిశీలిద్దాం.
క్షీరసాగర మథన సమయంలో సముద్రం నుండి అగ్నిజ్వాలలతో కూడిన హాలాహలమనే మహావిషం కారుమేఘాల లాగా వెలువడనారంభించింది. రాక్షసులు, దేవతలు భయంతో వాసుకిని విడిచి పరుగెత్తసాగారు. ఆ హాలాహలము భుగభుగమనే పొగలతో, చిటపటమనే నిప్పు కణాలతో ధగధగమనే జ్వాలలతో ఆకాశాన్ని ఆవరిస్తున్నది. అడవులు మండిపోతున్నాయి. జీవరాసులు మాడిపోతున్నాయి. నదులు, సముద్రాలు ఇంకిపోతున్నాయి. పర్వతాలు బద్దలవుతున్నాయి. ముల్లోకాలు తల్లడిల్లుతున్నాయి. అకాల ప్రళయం సంభవించిందేమోనని భయభ్రాంతులయ్యారు బ్రహ్మాది దేవతలు. ఆ ఆపద నుండి లోకాలని రక్షించమని ప్రార్ధిస్తూ పరమశివుడిని శరణు కోరారు.
వారి ప్రార్ధనలను ఆలకించిన పరమశివుడు, ఆ హాలాహలాన్ని స్వీకరించి లోకాలను రక్షిస్తానని అభయమిచ్చాడు. అది విన్న పార్వతీదేవి అభ్యంతరం తెలుపగా, శివుడు ఇలా సమాధానమిచ్చి నట్టు భాగవతం వర్ణించింది.
పరహితము సేయునెవ్వడు
పరమహితుండగు భూతపంచకమునకున్
పరహితమె పరమధర్మము
పరహితునకు నెదురు లేదు సర్వేందుముఖీ !
“లోకాల ఆర్తిని చూసావు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది. పరహితమే పరమ ధర్మం” అన్న భర్త శివుడి మాటలకు తలొగ్గింది పార్వతి. లోక రక్షణ కోసం పరమశివుడి నిర్ణయాన్ని ఆమోదించింది.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
మ్రింగ వలసినది హాలాహలమని తెలిసి, మ్రింగ దలచుకున్న వాడు తన పతి దేవుడే అని తెలిసి కూడా , దాని వలన లోకాలకు మేలు కలుగుతుందనే సదుద్దేశంతో , సర్వమంగళ అయిన పార్వతీ దేవి విషాన్ని మ్రింగమని అనుమతించింది. ఇది కదా పరహితం కోరడమంటే!. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తన కంఠంలో దాచుకుని గరల కంఠుడు అయ్యాడు శివుడు.
అటువంటి ఉదాత్త, లోకఃశ్రేయకర ఆదర్శాలను ఉదహరించారు పురాణ కారులు. వాటి నుండి తగిన ప్రేరణ పొందాలి మానవులు.
కేవలం అవసరానికి సాయపడడమే కాకుండా ప్రాణాపాయంలో
ఉన్న వారికి రక్త దానం, అవయవ దానం చేస్తూ ప్రాణాలు నిలబెట్టాల్సిన అవసరమూ పెరిగింది. మారుతున్న కాలంతోబాటు మనుషుల అవసరాలు పెరగడంతో ఉరుకుల పరుగుల గమనం అయింది మానవ జీవితం. కార్యార్ధి అయి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేవరకు ఏమీ చెప్పలేనంత ప్రయాణ వేగం పెరిగింది నేటి సమాజంలో. ప్రమాదాల సంఖ్య కూడా అంతే పెరిగింది. రహదారుల్లో ప్రమాదానికి గురైన బాధితులు కనబడితే వదిలేసి వెళ్లకుండా వారిని ఆసుపత్రులకు చేర్చి మానవత్వం చాటుకోవాలి జనులు. రక్త దానం, అవయవ దానం చేసి కొడిగడుతున్న ప్రాణాలను రక్షించాల్సిన అవసరం పెరిగింది. అందుకు ఎన్నో సంస్థలు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు చేయూత అందిస్తున్నారు. ఈ మంచి లక్షణం ఇంకా వ్యాపించి ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్యను తగ్గించాలి. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించి పరహితమే పరమ ధర్మం అని చాటి చెప్పాలి.
—-&&&&------
No comments:
Post a Comment