*ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?!
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే...
జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు...
ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు
ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు
లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది.
ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో
చేతులు ఎర్రగా పండుతాయి.
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.
ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా!! అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే" లాసోన్ "అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.
(సేకరణ)
***
ఓ మిత్రుడు పంపిన అంశం మీకోసం మిత్రులారా👈👇👌👍
ప్రేమైక ఆనందమయ అనుభూతిని కలుగించే జీవితంకు గొప్ప ఆలోచన
🍃 డబ్బుతో కొనలేని సంతోషం!!🌺
ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది!
సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది!
వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి.
అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు!
తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది!
"నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు!
ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది.
అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది! కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది!!
నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.
ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను. ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుం
ది!
డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు! కాని సంతోషాన్ని కొనుక్కోలేరు!
అది మనకి మనం పొందాల్సి ఉంటుంది. ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది!
నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది!
నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది!
సంతోషం అనేది గమ్యం కాదు! అది ఒక ప్రయాణం! సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది!
సంతోషం పరాధీనత కాదు! అది ఓ నిర్ణయం!
((( ఇది తెలుగు ప్రచార సభ ముఖ పుస్తకం లో ఈ రోజు పెట్టిన దానికి నకలు ... నేను ముఖపుస్తకంలో 5సం. క్రితం పంచుకున్నది ... గౌరీశంకర్ )))
💐💐💐మంగళసూత్రం వెనక ఉన్నపరమ రహస్యం..!💐💐💐
పెళ్లి అంటే మూడు ముళ్లు ఏడు అడుగులు…. మూడు ముళ్లు వేసి కట్టే తాళి లేకుండా అసలు పెళ్లే జరగదు…. ముహూర్తం సమయంలో మూడు ముళ్లు బిగించి కట్టే తాళి అత్యంత పవిత్రమైనది… మంగళసూత్రానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది..వివాహం అంటే అత్యంత పవిత్రమైన కార్యక్రమం… సుముహూర్తంలోనే మాంగల్య ధారణ చేస్తారు… అంటే తాళి కడతారు…తాళి గురించి ఎగతాళిగా మాట్లాడేవాళ్లు కొందరు ఉన్నా… హిందూ వివాహ వ్యవస్థలో తాళికి ఎంతో పవిత్రత, ప్రాధాన్యత ఉంది….ఆడదానికి మంగళసూత్రం ఉంటేనే పెళ్లయినట్టు లెక్క…. అది ఉంటే లైసెన్స్ ఉన్నట్టే… మంగళసూత్రం ఉన్న మహిళను అందరు గౌరవిస్తారు… మంగళసూత్రం కట్టడంలో ఎం
తో పరమార్థం ఉంది… పరమ రహస్యం ఉంది… అసలు మంగళసూత్రం ఎందుకు కడతారో తెలుసా… పెళ్లికొడుకు పెళ్లికూతురుకి మంగళసూత్రం కట్టడంలో ఉన్న పరమా ర్ధాన్ని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే… పెళ్లి కొడుకుని అయిన నేను, పెళ్లికూతురివైన నీ మెడలో మాంగల్యం కడుతున్నాను..
నా జీవితం ఈ క్షణం నుంచి నీతో ప్రారంభం… నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్షుతో మనం కలిసి ఉండాలి…. రెండు తాళి బొట్లు గౌరీశంకరులకు సంకేతం…. మనం కూడా గౌరీశంకరుల వలె కలిసి ఉండాలి….మనమిద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా పరస్పరం ఒక్కటై ఉండి అటు అత్తింటివారిని, ఇటు పుట్టింటివారిని రెండు తాళిబొట్ల వలే కలిపి ఉంచుదాం…ఇలా మనం సుఖ జీవితం గడుపుదాం.. ఇదీ మంగళసూత్రం వెనక ఉన్న పరమార్థం… వేదమంత్రాల వెనక ఉన్న పరమ రహస్యం ఇది. సో.. మంగళసూత్రం అంటే పవిత్రమైనది, కలిపి ఉంచేది అని అర్థం అని పండితులు వివరిస్తున్నారు.
(సేకరణ)
***
తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!
వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు !
కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!
పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !
నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!
ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!
భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!
వేరేకులంవాడిని వివాహమాడిందని
సోదరిని సంహరిస్తున్న సహోదరులు!
మరోమతంవారిని మనువాడాడని
మట్టుబెడుతున్న బంధువులు !!
వెల్లువవుతున్న విడాకులు!
వీచేనా విలువల వీచికలు !!
పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!
ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!
ఆధునికత అవధులు దాటిపోతుంది!
అనుభవం పరిధులు మించిపోతుంది!!
వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది!
విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!
అన్యాయం న్యాయం చెబుతోంది!
అక్రమాలు అంబరమంటాయి!!
నేరాలు నింగిని తాకాయి!
ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!
అలుముకుంటున్న అరాచక రీతులు !
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!
విశృంఖలత సోపానాలపై జీవనగతులు !
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!
స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!
ఆటవికత ఆవరిస్తోందని
అరాచకత్వం అలుముకుంటోందని
అవగతంకాని అయోమయంలో ఉన్నాం!!
....,...
భగవాన్ బుద్ధుణ్ణి‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. అంటే పండితులకూ, పామరులకూ శాస్త అని. శాస్త అంటే గురువు. ఆబాలగోపాలానికీ అర్థమయ్యేట్లు చెప్పగల దిట్ట, నేర్పరి. తాత్త్విక విషయాల్ని చెప్పేటప్పుడు సరైన ఉపమానాల్ని చూపి సులభంగా అర్థమయ్యేలా చెప్పగల మహా గురువు. మనిషి పరిపూర్ణతని చెప్తూ ఆయన సముద్రాన్ని ఉపమానంగా చెప్పిన తీరు అమోఘం.
ఒకనాడు బుద్ధుడు శ్రావస్తి నగరానికి తూర్పుదిక్కున విశాఖమాత నిర్మించిన పూర్వారామం లో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణతని గురించి మౌద్గల్యాయనునితో చెప్తూ ‘మౌద్గల్యా’ సముద్రానికి ఎనిమిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాగరానికున్న అద్భుత గుణాలు, అవి మనిషికీ ఉండాలి’ అన్నాడు. ‘భగవాన్! అవేమిటో తెలియజేయండి’ అన్నాడు మౌద్గల్యుడు.
‘మౌద్గల్యా! వాటిలో మొదటిది: సముద్రంలో దిగుతున్నప్పుడు ఒకేసారి లోతు రాదు. క్రమేపీ దాని లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన జ్ఞానాన్ని క్రమేపీ సాధించుకోవాలి. ఒక్కసారే వచ్చిపడాలి అనుకోకూడదు. నెమ్మదిగానే క్రమంలో జ్ఞానలోతులు చూడాలి. నేను చెప్పే జ్ఞానం కూడా అంతే! అది క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది’ అన్నాడు.
‘భగవాన్ అద్భుతం’ అన్నాడు మౌద్గల్యాయనుడు. ‘అలాగే... సముద్రం ఎంత హోరుపెట్టినా, అలలు ఎగసి పడుతున్నా, ఎప్పుడూ అది తన చెలియలికట్ట దాటదు. మన మనస్సూ అలాంటి స్థితినే కలిగి ఉండాలి. నా ధర్మం అలాంటి స్థిర చిత్తాన్ని కలిగిస్తుంది. భిక్షూ! సముద్రాన్ని పరిశీలించు. అదెప్పుడూ తనలో చనిపోయిన జీవుల్ని, కుళ్ళిన శవాల్ని ఉంచుకోదు. ఒడ్డుకు నెట్టేస్తుంది. అలాగే... నా ధర్మం కూడా మనస్సులోని చెడు తలపుల్ని నెట్టేస్తుంది. మనం కూడా చెడ్డ ఆలోచనల్ని అలా నెట్టేయాలి. ఇక నాలుగో ప్రత్యేకత... నదులన్నీ సముద్రంలోకి చేరాక వాటి పేరూ, తీరూ, ఉనికీ కోల్పోతాయి. అన్నీ ఒకటే అయిపోతాయి. మనుషులు కూడా జాతి, మత, కుల ప్రాంతీయ భేదాలు మరచి ఒక్కటై పోవాలి. నా ధర్మం అలాంటి సమసమాజాన్ని నిర్మిస్తుంది.
‘‘ఓ భిక్షూ! ఎన్ని నదులు వచ్చి కలసినా, ఎంతెంత వర్ష కుంభవృష్టి కురిసినా సముద్రం రవ్వంత పెరగదు. మనలో ప్రజ్ఞ కూడా అలాగే ఉండాలి. నా ధర్మంలో ఎందరు నిర్వాణం పొందినా అది ఎప్పటికీ నిండిపోదు. నిర్వాణం పొందేవారికి ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇక సముద్రానికి ఉన్న మరో విశేషం విను, ఎక్కడైనా సముద్రానికి ఒకే రుచి ఉంటుంది. అలాగే నా ధర్మంతో కలిగే ధర్మరుచి కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. మౌద్గల్యా! మణులకూ, రత్నాలకూ, పగడాలకూ, శంఖులకూ సముద్రం నిలయం. ప్రతి మనిషీ అలాంటి సుగుణాల్ని తనలో నింపుకోవాలి. నా ధర్మంలోని పంచశీల, అష్టాంగ మార్గం దశపారమితులు, ఆర్యసత్యాలు అలాంటి మణులే!
ఇక సముద్రానికున్న మరో విశేషగుణం– దాపరికం లేని తత్వం. మన మనస్సు అలాగే ఉండాలి. దాపరికం ఉన్నవాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. నా ధర్మం కూడా మనిషిని, మనస్సుని అలా నిష్కల్మషం చేస్తుంది.
ఈ ఎనిమిది విశేషణాల్ని మనం సముద్రంనుండి నేర్చుకోవాలి. మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. మౌద్గల్యాయనా!’’ అన్నాడు బుద్ధుడు. ‘‘అద్భుతం, అమోషం, అద్వితీయం... భంతే!’
...........
పురానీతి!
ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు. కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు.అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు.అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది.రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు.రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి.కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు.ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు.శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు.శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి.సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. ‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’ అని అడిగారు. వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు.బలరాముడు, సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు. ‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు.
నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.
సేకరణ:-
..........
శంకర భగవత్పాదులు అంటారు..‘‘మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం, మాయామయమితి సర్వం హిత్వా బ్రహ్మ పదం త్వాం ప్రవిశ విదిత్వా’’. మా కురుధన... డబ్బు ఉంటుంది, లక్షాధికారులు భిక్షాధికారులయిన రోజులున్నాయి. ఎంతో ఐశ్వర్యవంతులు కటిక దరిద్రాన్ని అనుభవించిన వారున్నారు. జనం నా వెనుక ఇంతమంది ఉన్నారు అన్నవాడి వెనుక ఉండేవారులేక.. జారిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. యవ్వన సర్వం... ఇంత బలవంతుణ్ణి–యవ్వనంలో ఉన్నానంటాడు.
గిర్రున పాతికేళ్ళు తిరిగేసరికి పటుత్వం సడలి, సంధిబంధములు జారిపోయి వృద్ధాప్యం ఆవహిస్తుంటుంది. హరతి నిమేషాత్ కాలస్సర్వం – కాలం చాలా తినేస్తుంది. నాకు తిరుగులేదు అన్న ఆరడుగుల నిండు మనిషి చివరకు రుద్రభూమిలో పిడికెడు బూడిద కింద మారిపోతాడు. ఎందుకీ అతిశయం? వినయంగా ఉండడం నేర్చుకో.. నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నిస్సహాయ స్థితిలో ఉండి నీ వల్ల బాధలకు గురయినవారందరూ ఒకనాడు నీ పని పడతారు. అపకీర్తి మూటగట్టుకుని వెళ్లిపోతావు.
భారతంలో దుర్యోధనుడి సంగతే చూడండి... ‘ఆ పాండవులెంత, ఆ భీముడెంత, ఆ అర్జునుడెంత... చిటికెలో చంపేస్తా... నాదగ్గర భీష్ముడున్నాడు, కర్ణుడు, ద్రోణుడున్నాడు, నాకింతమంది సోదరులున్నారు. నాకిన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది...’ అంటూ విర్రవీగేవాడు. ఆయనకు మంచి మాటలు చెప్పనివారెవరు, అందరూ చెప్పారు. కానీ వినలేదు. వినకపోగా చెప్పేవాళ్ళను అవమానించేలా ప్రవర్తించేవాడు. చివరికి రాయబారం చేయడానికి వచ్చిన కృష్ణుడిని కూడా బంధించబోయాడు. ఒకరోజు మైత్రేయ మహర్షి వచ్చాడు.
‘తప్పు దుర్యోధనా! పాండవులు ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళతో నీకు గొడవలెందుకు, వాళ్లకివ్వాల్సిన రాజ్యభాగం ఇచ్చేయి.’’ అని నచ్చచెప్పబోయాడు. ప్రతిరోజూ ఎవడో ఒకడు రావడం ధర్మపన్నాలు వల్లించడం అలవాటయిపోయిందంటూ మహర్షి మాట్లాడుతున్నప్పుడు వెటకారంగా తొడల మీద తాళం వేస్తున్నట్లు చెయ్యి తిప్పుతున్నాడు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నేను వ్యయప్రయాసలకోర్చి నీ మంచి కోరి నీకు నాలుగు మంచిమాటలు చెప్పిపోదామని వస్తే శ్రద్ధతో వినకపోగా ఎగతాళి చేస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. ఏ తొడలను తక్కువగా భావించి వాటిమీద వెకిలిచేష్టలు చేసావో ఆ తొడలే భీమసేనుడి చేతిలో చితికిపోయి యుద్ధభూమిలో పడిపోయెదవుగాక!’’ అని శపించాడు.
హడిలిపోయి ధృతరాష్ట్రుడు వెళ్ళి మైత్రేయ మహర్షి కాళ్ళమీద పడ్డాడు, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ. ‘‘పాండవులతో నీ కొడుకు సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం కాదు, చేసుకోకపోతే ... చెప్పిన మాట వినలేదు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది’’ అన్నాడు మహర్షి. ఏమయింది... అదే జరిగింది.
బలవంతుడ నాకేమని విర్రవీగినందుకు ఫలితం అది...తన బలం, బలగం అనుకొన్నవారిలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, సోదరులు అందరూ వెళ్ళిపోయారు.. ఓ నలుగురు తప్ప. యుద్ధభూమిలో భీముడి గదాఘాతానికి తొడలు విరిగిపోయి, నెత్తురు ఓడుస్తుండగా అప్పుడు ఏడ్చాడు. రుషులు చెబితే వినలేదు, విదురుడు చెప్పినా వినలేదు... చివరకు అందర్నీ చంపేసుకొన్నా...అంటూ తన దుస్థితిని తలుచుకుని విలపించాడు.
ఎందుకంత పొగరుబోతుతనం... ధనం కానీ, అధికారం గానీ, ఇతరత్రా నైపుణ్యాలు, పాండిత్యం కానీ నీకు భగవంతుడేదో ఇచ్చి ఉండవచ్చు.. అది కాస్త ఎక్కువే ఇచ్చి ఉండవచ్చు. అవి ఇచ్చినందుకు భగవంతుడిపట్ల వినయ విధేయతలతో కృతజ్ఞుడిగా ఉండడానికి బదులు, నీ బలం చూసుకొని అహంకారంతో వదరి మాట్లాడడం అత్యంత ప్రమాదకరం.
విధేయుడు : మల్లాప్రగఢ శ్రీదేవి రామకృష్ణ
‘భగవంతుడు ఎవరు? ఆయన దేవుడా? లేక మానవ రూపంలో ప్రస్ఫుటమయ్యే శక్తినా?’ సర్వసాధారణ సందేహం ఇది. ‘భగవంతుడు’ అనేవాడు ఒక రూపంలోనో లేక మానవాకృతిలోనో వికసించేవాడు కాదు. ఒక భాషలో అక్షరాలకు, పదాలకు వాటి వ్యుత్పత్తులనుబట్టి అర్థాలు ఉంటాయి. వాటిని లోతుగా అర్థం చేసుకోవడమే సత్యశోధనకు తొలిమెట్టు. మన పూర్వీకులైన దార్శనికులు, ఋషులు ఆయా విషయాలను పరిశీలించి, పరిగ్రహించి, దర్శించి స్థిరపరచిన విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే వారు కనుగొన్న సత్యాన్ని మనం సులువుగా అర్థం చేసుకోగలం.
మన ఋషులు కనుగొన్న భగవంతుని అర్థం చేసుకోవడానికే ‘ఆర్యసమాజ్’ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ‘బ్యాక్ టు వేదాస్’ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. మనమూ మన భాష మూలాల్లోకి, వాటి వైదిక అర్థాలలోకి వెళ్లడం ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. భగవంతుడనే పద వ్యుత్పత్తిని పరిశీలిస్తే, ‘భగము’ నుంచి భగవాన్, భగవంతుడు అనే పదాలు వచ్చాయి. ‘జ్ఞానం, ఐశ్వర్యం, బలం, వీర్యం, తేజస్సు, శక్తి’ అనే ఆరింటిని ‘షడ్గుణాలు’ (భగము) అంటారు. వీటిని సంపూర్ణంగా కలిగి ఉన్న చైతన్యమే ‘భగవంతుడు’. ఇవి ఆయన నిరంతరం అభివ్యక్తీకరించే సహజ లక్షణాలు. విశ్వ చైతన్యమంతా తొలి గుణమైన ‘జ్ఞానం’తోనే నిండి ఉంది. జ్ఞానమే ‘విశ్వరచన’ చేస్తుంది. జ్ఞానం లేనిదే గ్రహాలు, నక్షత్రాలన్నీ ఒక క్రమపద్ధతిలో, క్రమశిక్షణతో పరిభ్రమించ లేవు. ఇదే విషయాన్ని ‘విజ్ఞానమానంద బ్రహ్మ’ అని బృహదారణ్యకోపనిషత్తు, ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అని తైత్తిరీయోపనిషత్తు ప్రకటించాయి. రెండో గుణమైన ‘ఐశ్వర్యం’ మనం అనుకునే భూమి, బంగారం, వజ్రాలు లాంటివన్నీ ఆయన సొత్తే కదా! వీటన్నిటినీ కలిగి ఉండే గ్రహాలు, నక్షత్రాలు ఆ అనంత చైతన్యం నుంచే కదా పుట్టేది. ‘ఐశ్వర్యం’ అంటే ‘అన్నిటినీ లొంగదీసుకునే తత్త్వం’ అని మరో అర్థం కూడా ఉంది. సృష్టిలోని అన్నిటితోపాటు కాలాన్ని కూడా లొంగ దీసుకున్నాడు కాబట్టే, ఆయన అందరిలోకెల్లా ఐశ్వర్యవంతుడు.
మూడో గుణమైన ‘బలం’ ఆ అనంత శక్తిని మించి ఎవరికి ఉంటుంది? మన సూర్యుడికన్నా వేల రెట్లు బరువైన నక్షత్రాలను నియంత్రించగలిగేదొక్క అనంతశక్తి మాత్రమే. అనాత్మరూపాన్ని నశింపజేసుకునే తత్త్వమే ‘బలమని’ అసలు అర్థం. ఈ సృష్టిని నశింపజేసేది ఆ అనంతశక్తియే. సృష్టి క్రియ అనేది 4వ గుణమైన ‘వీర్యాన్ని’ తెలుపుతుంది. విశ్వశక్తి నిత్యం విశ్వాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. దాని పునఃసృష్టి అనంతమైన, నిరంతరమైన చర్య కాబట్టి, ఆయనకు అనంతమైన ‘వీర్యమే’ ఒక గుణమై అలరారుతున్నది. ఉదయం పూట దివాకరుని ‘తేజస్సు’ సౌమ్యంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఆయన ‘తేజస్సు’ను మన కళ్లు భరించలేవు. విశ్వంలోని తేజోరూపాలైన సూర్యుడు, నక్షత్రాలు ఆ విశ్వచైతన్యంలో స్వల్పకాలికమైనవి, అల్పమైనవని గుర్తిస్తే ఆ అనంతశక్తి యొక్క ఐదవ గుణమైన ‘తేజస్సు’ మన అంచనాకు అందదు.
‘షడ్గుణాల’లో ఆరవ గుణం ‘మాయాశక్తి’కి సంబంధించింది. ‘సృష్టి, స్థితి, లయ’లను చేయగలిగే సామర్థ్యమే ‘శక్తి’. దీనికి ‘ప్రసరించే తత్త్వమని’ మరో అర్థమూ ఉంది. ఆయన నిరంతరంగా ప్రసరిస్తాడు కాబట్టే, శక్తి తత్త్వమై విరాజిల్లుతున్నది. ఈ విధంగా ‘భగము’ అనే ఆరు గుణాల మహోన్నత చైతన్యమే భగవంతుడు. కనిపించేవన్నీ ఆయన ప్రతీకలుగానే మనం అర్థం చేసుకోవాలి.
*'ఈర్ష్య' వెంట మరో మూడు..!*
*“అతడు బాగా సంపాదిస్తున్నాడు. అందుకే ఆ బడాయి!"*
*“ఆమెను చూడు! ఎంత గర్వమో! మంచి పేరు, ప్రతిష్ఠలున్నాయని పొగరు"*
*”అతడికి గొప్పపేరుంది. ఏం లాభం అన్నీ వ్యసనాలే!"*
*“ఇప్పుడు మంచి సంపన్నులు కనుక తెగమిడిసి పడుతున్నారు! ఎప్పటికో అప్పుడు 'కరిమింగిన వెలగపండు'లా అంతా నాశనం కాకపోతుందా!”*
* ... ఇలా రకరకాల మాటలు మన జీవితాల్లో వినబడుతుంటాయి. అలా అనే వాళ్లలో మనమూ ఉంటుంటాం అనడంలో సందేహం లేదు.*
*ఈ ఈర్ష్యాజనిత భావాలు ఎందుకు పుడుతున్నాయి?*
*మనిషి తన అవసరం, తన సౌఖ్యం కోసం ఏమి ముఖ్యమో వాటిని సంపాదించడం తప్పులేదు. కానీ మరొకరితో పోల్చుకోవడం వల్ల రకరాల విపరీత భావాలు పుడతాయి. వినబడుతుంటాయి.*
*ధనంలోకానీ, పదవిలోకానీ, విద్యలోకానీ, కీర్తిలో కానీ మన కంటే ఒకడు అధికంగా ఉంటే, అదీ మన సమీపస్థుల్లో ఉంటే... వెంటనే ఈర్ష్య కలుగుతుంది. ఒకే రంగంలో మనతో పాటు ఉన్న వ్యక్తి ఎదిగినా ఇదే బాధ!*
*ఈ భావం ఎన్నో వైపరీత్యాలకు దారితీస్తుంది. అతడి ఆధిక్యాన్ని దెబ్బతీయాలని యత్నించే కుటిలత్వం కొందరు చూపిస్తే, అతడిలో ఇతర బలహీనతల్నీ, కొద్దిపాటి లోపాల్నీ భూతద్దాలలో చూసి, చూపించి 'అతగాడు చాలా వ్యర్ధుడు' అని అనుకొని తృప్తి పడడమో లేదా వాటిని అక్రమాలు, నేరాలుగా ప్రచారం చేసి అప్రతిష్ఠపాలు చేసి సంతోషించడమో కొందరు చేస్తారు. వీరికి మీడియా కూడా తోడైతే మరీ వ్యాప్తిచేసి వినోదిస్తారు.*
*మరికొందరు...*
*లోలోపల ఈర్ష్యతో వేదనపడుతూ, న్యూనతా భావానికి కూడా గురౌతారు.*
*ఇంకొందరు... వారి వలె తామూ ఉన్నతస్థితికి వెళ్ళాలనుకుంటారు. ఇది సరియైన ఆలోచనే! దీనిని 'ఈర్ష్య' అనకుండా, 'ఆదర్శంగా గ్రహించడం' అనవచ్చు. ఈ భావం మనలో స్ఫూర్తినీ, ప్రయత్నశీలతనీ వృద్ధిచేసి లక్ష్యాలను సాధించడంలో తోడ్పడుతుంది.*
*అలా కాకుండా - అక్రమ మార్గాలలో, కుటిలయత్నాలతో లక్ష్యసాధన కోసం ముందుకుసాగితే ఇది మళ్లీ 'ఈర్ష్యాది' దుర్గుణాలలోకే చేరుతుంది.*
*అవతలివాడి అభ్యున్నతిని చూసి ఓర్వలేనితనం 'ఈర్ష్య' అయితే - దానినంటిపెట్టుకున్న చతుష్టయంలో మరో మూడు దుర్గుణాలు తయారౌతాయి .*
*అవి…*
*అసూయ, ద్వేషం, హింస. అవతలి వారిలోని సుగుణాలని కూడా దోషాలుగా చూసి, చూపించే దుర్గుణమే అసూయ. దానికి మిగిలిన రెండు (ద్వేషం, హింస) కూడా తోడైతే మరీ ప్రమాదం. ఈ భావాలు అవతలి వారికే కాదు, తమకే విపత్కరమని గ్రహించగలగాలి.*
*ప్రతాపంతో, విస్తరణార్ధం, తద్వారా సుస్థిర సౌఖ్య పాలనార్ధం యుధిష్ఠిరుడు రాజసూయయాగం చేశాడు. విశాలపృథ్వికి చక్రవర్తి అయ్యాడు. ఆయన, సోదరులు ధర్మబద్ధంగా సాధించిన గొప్ప ప్రగతి ఇది. దానితో వచ్చిన వైభోగాలు, సంపదలు ధర్మమయ అర్ధాలుగా అనుభవించారు.*
*కానీ ఈర్ష్యాపరుడైన దుర్యోధనుడు రగులుకు పోయాడు. తన దుర్గుణానికి 'మానధనుడు' అనే బిరుదునిచ్చుకుని తృప్తిపడ్డాడు.*
*అతడినీ, అతడి అవలక్షణాలనీ మెరమెచ్చుల కోసం, స్వార్థపరులై కీర్తిస్తూ పైకెత్తారు శకుని, కర్ణ, దుశ్శాసనులు. అందునా - కర్ణునికి అర్జునుని పట్ల ఉన్న ఈర్ష్యాసూయలు జతపడ్డాయి.*
*ఈ దుర్లక్షణాలకి ఫలమే కుఱుక్షేత్ర సంగ్రామం. సమూల కౌరవ వంశనాశనం, భయంకరమైన జననష్టం.*
*విద్యలలో, వాణిజ్యంలో స్పర్ధ ఒక విధంగా మంచిదేగానీ, దానిని ధర్మమయమైన పద్ధతుల్లో, అణచివేతలు లేకుండా కృషితో, పట్టుదలతో సాధించగలిగితే గొప్పవిషయమే.*
*'స్పర్ధయా వర్ధతే విద్య' అన్నారు.*
*విద్య స్పర్ధతోనే వృద్ధి చెందుతుందట. కానీ అది చక్కని ఆరోగ్యకరమైన పోటీగా ఉంటే మంచిదే*
*అలాకాక బాలదుర్యోధనుడిలా భీముని నీటిలో పడేయడం, విషం పెట్టి చంపాలని ప్రయత్నించడం లక్కయింటిని తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడరాదు.*
*”పూనుస్పర్ధలు విద్యలందే*
*వైరములు వాణిజ్యమందే*
*వ్యర్ధ కలహం పెంచబోకోయ్....”*
*అని గురజాడవారి మాట.*
*మనకి సరిపోయేటంత సుఖానికి లోటులేనంతగా మన దగ్గరున్నా, మన కంటే మన దగ్గర్లోవాడు సంపదాదుల్లో అధికంగా ఉన్నాడని కడుపుమంట కొందరిలో ఉంటుంది.*
*ఇది లేని దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. దీనితో తెలియని విసుగు, చిరాకు, అశాంతి ముప్పిరిగొంటాయి.*
*”కంటికి నిద్ర వచ్చునే, సుఖంబగునే రతికేళి,*
*జిహ్వకున్ వంటక మిచ్చగించునె”*
*అని శ్రీనాథుడు వర్ణించినట్లుగా స్పర్ధతో జీవితం ఉన్న సుఖాలని కూడా గుర్తించనీయకుండా, సుఖపడకుండా సాగిపోతుంది.*
*తాము దెబ్బతిన్నా ఫరవాలేదు. ఎదుటివాడిని ఎదగన్వికూడదనే వింత క్రౌర్యం కలవారూ ఉంటారు.*
*మొత్తానికి - అనేక వైపరీత్యాలకీ, మానసిక వికారాలకీ హేయమైన ఈర్ష్యను జయించగలగడం శాంతికరమైన సాధన.*✍️
----బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.
.
.......
*రాముడు ఏమి తపస్సు చేశాడు?*
*రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది? రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?*
*కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు.*
*నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం".*
*ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.*
*ఇందులోని విచిత్రమేమిటంటే ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.*
*తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక "అస్త్ర శస్త్రాలను" కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.*
*అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.*
*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః | |*
*అని ఉపనిషద్వాక్యం.*
*ఋజు వర్తనము, సత్య వాక్పరిపాలనము , వేదశాస్త్రముల అధ్యనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే.*
*దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు. మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.*
*కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.^
*అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు. కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".*
*ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.*
......
శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.
శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.
అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.
కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.
...........
*కృష్ణపరమాత్మ-* *ఐదుగురు..మాతృమూర్తులు..!*
*1. దేవకి..!*
*వసుదేవుడు సతీమణి అయిన దేవకి.. శ్రీ కృష్ణుడి నిజమైన తల్లి.*
*మధురలో ఆమె సోదరుడు కంసుడు చెఱసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిన ఆ కారగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకి మాత.*
*దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు. అయితే ఆకాశవాణి పలికిన మాటలలో.. సోదరి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధిస్తాడు.*
*దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా చెబుతారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది.*
*ఈ కారణంగా శ్రీ కృష్ణుడిని దేవకి నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.*
*2. యశోద..!*
*కన్నయ్యను కనకపోయినా కంటికి రెప్పలా చూసుకుంది యశోద. నందుడు-యశోద దంపతులు. వీరితో కలిసి శ్రీ కృష్ణుడు గోకులంలో పెరిగాడు.*
*మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేస్తాడు చిన్ని కృష్ణుడు. భాగవత ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం, ముక్తి ఆ బ్రహ్మ, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు.*
*చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతడిని మందలిస్తూనే.. ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది.*
*3. రోహిణి..!*
*వసుదేవుడు దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకుంటాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానం.*
*దేవకి-వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు.*
*రోహిణి తన కుమార్తె, కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు.*
*శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడు, ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగ జాతికి చెందిన వారని చెబుతారు. అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనవుడు సోదరుడు బాహిలిక కుమార్తే అని కూడా అంటారు.*
*4. సుముఖి దేవి..!*
*సందీపని ముని భార్య అయిన సుముఖి దేవికి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీ కృష్ణుడు.*
*కృష్ణుడు, బలరాముడు, సుదాముడు, సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే సుముఖి దేవి కృష్ణుడిని తన కుమారుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది.*
*ఎందుకంటే ఆమె శంఖాసురుడి అధీనంలో ఉంటుంది.*
*మాధవుడు ఆమెను అతడి చెఱ నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది.*
*అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవదని చెప్పింది. అందుకే కృష్ణుడు బతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది.*
*5. పూతన..!*
*శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు.*
*పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది.*
*తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని చిన్ని కృష్ణుడిని చంపాలని చూస్తుంది.*
*అయితే పసిరూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించే పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు.*
*పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరం గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది.*
*ఆ సువాసన వాతవరణం అంతటా వ్యాపించింది. దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు.*
.............
*🌻భక్తుని హృదయ నివాసి భగవంతుడు🌻*
🍃🌺అనేక తలలు అనేక ముఖాలు, అనేక కళ్ళు అనేక కాళ్ళతో భగవంతుడు అంతటా వ్యాపించి ఉం టాడు. అన్నింటా భగవంతుడు ఉంటాడనే విషయాన్ని ”సహస్ర శీర్షా: పురుష: సహస్రాక్ష సహస్ర పాద్..” అంటూ పురుష సూక్తం వివరిస్తోంది
🍃🌺భగ వంతుడు ఉండే ప్రదేశాన్ని, మరోవి ధంగా, మరో కోణంలో ఇలా చెబుతారు. భక్తుడి హృదయంలో భగవంతుడు ఉం టాడని, భగవంతుడు భక్తుని హృదయ నివాసి అని అం టారు. భగవంతుడు ఉండే స్థానం విషయంలో పైన చెప్పిన రెండూ భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తాయి. భగవంతుడు సర్వత్రా ఉంటాడని ఓ వైపు చెబుతూనే, మరో పక్క భక్తుడి హృదయంలో భగవంతుడు ఉంటాడు అనే విషయం విన్నప్పుడు/ చెప్పినప్పుడు, ఏమిటీ గందరగోళం అనిపి స్తుంది. పరస్పర విరుద్ధంగా అనిపించే ఈ రెండు విషయా లకు సమన్వయం కుదరక అయోమయంలో పడిపోతాం. విషయం ఏమిటో అర్ధంకాక ఆధ్యాత్మికం అంటే అర్థంకాని బ్రహ్మ పదార్ధంగా భావిస్తాం.
🍃🌺ఓసారి ఓ కుర్రాడికి ఈ సందేహమే వచ్చింది. తల, నుదురు, కాళ్ళు, భుజాలు, చేతులు, పొట్ట, ఇలా ఎన్నో భాగాలు భక్తుడి శరీరంలో ఉండగా, భక్తుడి హృదయాన్నే తానుండే స్థానంగా, ఆ భగవంతుడు ఎందుకు ఎంచు కున్నాడో ఎంతగా ఆలోచించినా అంతు చిక్కలేదు ఆ కుర్రా డికి. ఎందరినో ఈ విషయం గురించి అడిగాడు. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపో యారు. చివరకు ఆ కుర్రా డు తిన్నగా పెద్ద గురువుగారి దగ్గరికి వెళ్లాడు. విషయం అంతా చెప్పి తన సందేహాన్ని నివృత్తి చేయమని గురువుని ప్రార్ధించాడు.
🍃🌺అప్పుడు గురువుగారు. ”వెయ్యి ఎకరాల భూమి ఉన్న ఓ జమిందార్ తనకు ఇష్టమైన చోట తాను నివాసం ఉంటే, అది తప్పని ఆయన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందా?” అని ఆ ప్రశ్నించారు.
”ఆయన స్థలం ఆయన ఇష్టం. ప్రశ్నించే హక్కు ఎవ రికీ ఉండదు.” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పు డు గురువుగారు ”ఆ వెయ్యి ఎకరాల్లో మనం ఓ ప్రాంతాన్ని ఎంచుకుని, అందులో ఒక ప్రదేశాన్ని చూపించి, అందులో మీరు ఉండండి అని మనం జమిందారుని ఆజ్ఞాపించగల మా? అని మరో ప్రశ్న వేసారు గురువుగారు.
🍃🌺”ఆజ్ఞాపించ లేం” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పుడు గురువు గారు ”అయితే ఆ జమిందారు గాలి, వెలుతురు బాగా వచ్చే అనువైన స్థలాన్ని తానే ఎంచుకుని, తనకు అను కూలమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు . అవునా?” అని ఆ కుర్రాణ్ణి ప్రశ్నించారు. ”అవును. ఆ జమిందారు అలానే చేస్తాడు. అది అతనిష్టం” సమాధానమిచ్చాడు కుర్రాడు.
”అవును కదా! భగవంతుడు కూడా అంతే! సర్వం సమస్తం ఆ భగవంతునిదే కాబట్టి తనకు అనువైన అను కూలమైన చోటు, శుభ్రమైన చోటు, పరిశుద్ధమైన చోటు హృదయం కాబట్టి, భక్తుడి హృదయాన్ని తన నివాస స్థానంగా భగవంతుడు ఎంచుకున్నాడు.
🍃🌺దేవుడు నివాసం ఉండే చోటును నిర్మలంగా పవిత్రంగా స్వచ్ఛంగా భక్తు డు ఉంచుకోవాలి. శరీరం మొత్తంలో స్వచ్ఛంగా ఉంచుకోవ డానికి అవకాశం ఉండేది ఒక్క హృదయం మాత్రమే అను వైనది. కాబట్టి భక్తుడికి ఆ సౌలభ్యం ఇవ్వడం కోసమే భక్తుడి హృదయాన్నే తన నివాసంగా భగవంతుడు ఎంపిక చేసుకు న్నాడు.” అని చెప్పటం ముగించారు గురువుగారు.
🍃🌺గురువుగారు చెప్పింది సంభ్రమాశ్చర్యాలతో విన్నాడు శిష్యుడు. విషయం పూర్తిగా అర్థం చేసుకున్న ముఖం ఆనం దంతో వెలిగిపోయింది.
🍃🌺భగవంతుడు తన నివాసంగా భక్తుని హృదయాన్ని ఎందుకు ఎంచుకున్నాడో చెప్పేందుకు చమత్కారంతో కూడిన సహితుకమైన గమ్మత్తయిన కథ యిది. అందుకే ”ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది ఆధ్యాత్మిక రహస్యమంతా” అన్నారు పెద్దలు. సాధన చేసి
ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకో వాలి. అందరు ఆచరించాలి.
No comments:
Post a Comment