హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.
===================
1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది.
ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం,
రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం.
దైవమే కాంతి.
ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు.
కాంతివి నీవే.
నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి,
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.
3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము.
వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి.
వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి.
విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన
అందరిలో కలుగుతుంది.
ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ
జ్ఞప్తి చేసినట్లవుతుంది.
4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం.
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని
భక్తులు కోరుకుంటారు.
5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది.
భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు.
అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది.
ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు.
ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు.
కాని భగవంతునికి వీటితో పనిలేదు.
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు.
కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది.
పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు
అని అర్థం కాదు.
సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం
అని అర్థం.
ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.
దాన్నే త్యాగం అంటారు.
10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు
దైవానికే అర్పితం కావాలి.
11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది.
దానిలో ఉండే నీరు సంస్కారము.
కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి.
అదే నిజమైన నివేదన.
లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం,
హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది.
హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు.
మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.
మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి.
ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు.
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి.
ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది..
అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.
🙏🙏🙏🙏🙏
జీవన మాధుర్యం
తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని
అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి
వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.
మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు
అయింది.కొడుకు....కూతురు అమెరికాలో
స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు
వచ్చేయమంటారు.కానీ నాకే ఇష్టం లేదు.
ఆయన పోయాక నాకు జీవితం మీద
ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో
కాలం గడుపుతున్నాను.
కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!
చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్
చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది.
అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.
నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.
ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని
గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.
కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో
విష్ చేసింది.
అలా వారం గడిచింది.ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!
నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.
ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.
నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.
అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.తన మాటకు
నేను నవ్వేసాను.నేను నవ్వి చాలా కాలం అయింది.ఆ విషయం మనసు గుర్తు చేసింది.
" నీ పేరు?" అని అడిగాను."స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ
వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు.గుండెలో సంతోషం పొంగింది.
మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి.ఉత్తేజంగా అనిపించేది.
ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.
స్వప్న సరేనంది.ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.
"నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.
"అయింది.ఒక బాబు...పాప" అంది స్వప్న.మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను.మావారు పోయినందుకు
సంతాపం తెలియ బరిచింది.
కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి
వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.
"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.
"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.
"ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి.మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి
తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు
ఇష్టం అయినవి చేసి పె ట్టి ఉంటారు.ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు
తినండి" అన్నది.ఆ తరువాత మేం విడి
పోయాము.
ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.చాలా కాలం తరువాత
నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.
మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి
జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను.ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది.మాటల్లో జీవితం నిరాసక్తత
గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.
నెల తరువాత ఒక రోజు " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను
మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.
సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.
నాకు సంతోషం అనిపించింది.
తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్
లో పోసి ఉంచాను.చెప్పినట్లు సరిగ్గా
నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.
వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ తెచ్చింది.
"ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.
స్వప్న సోఫాలో కూర్చుంది.కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా
తీసుకోవడం లేదు" అన్నాను.
తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద
ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది.నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను.చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది. అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..
బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకు కొంచెం
మైండ్ సెట్ మార్చుకో వాలి" అన్నది.
కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.
తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"
అన్నాను.తను రెండు అగరొత్తులు తీసి వెలిగించింది.క్షణంలో గది పరిమళ భరితం
అయింది.అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు
మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.
" ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో
బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.
స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు
మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"
అన్నది."అలానే" అన్నాను.
గదిలో అలుముకున్న అగరొత్తుల
పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను
గుర్తు చేస్తూనే ఉంది.
మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో
లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే
బాగుంది అనిపించింది.చాలా కాలం తరువాత
ప్రభాత సమయంలో ఉత్సాహంగా అనిపించింది.
వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి
చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.
స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను.క్రమేపీ దానితో
అనుబంధం పెరిగింది.ప్రతి రోజూ దాన్ని
శ్రద్ధగా పరిశీలించ సాగాను.మొగ్గ తొడగడం...పువ్వు విచ్చడం...పరిమళం
అద్భుతం అనిపించ సాగింది.
మావారు ఉన్నప్పుడు పూల కుండీలు
ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు.ఇప్పుడు ఇది నాకు సరి
కొత్త అనుభవం.
మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం
పంచుకుంది.
ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి
ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.
"ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.
రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో
బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి
మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.
తన భావం గ్రహించి" సరే" అన్నాను.
అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...
దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.
ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...
అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...
నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న
మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.
నాలోని మార్పుకు స్వప్నే కారణం.
ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద
వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.
బాగా చదువుతారు.కానీ వీళ్ళమ్మ వీళ్ళను
చదివించలేక పోతున్నది.అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.
మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది.
నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసు
కున్నాను.వాళ్లకు సహాయం చేయడం నాకు
ఎంతో తృప్తిని ఇచ్చింది.
పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు.స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.
" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.
"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.
నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి
చాలా కాలం అయింది.వేయగలనో! లేదో!"
అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.
ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్
తెచ్చి ఇచ్చింది.
దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.
ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.
పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.ఆ విషయం స్వప్నకి చెప్పాను.
ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.
నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.
" పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.
ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్
మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"
అన్నది.
కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి
ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు
వెళ్ళింది.ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ అందమైన ఫ్రేమ్ లో
కనిపించి కనువిందు చేసింది.నాకు మనసులో గర్వంగా అనిపించింది.
స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను
పరిచయం చేసింది.నేను సోఫాలో కూర్చున్నాను.స్వప్న కాఫీ తేవడానికి లోనికి
వెళ్ళింది.
స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..
" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.అంతలో
స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు
అక్కడినుంచి వెళ్లి పోయారు.
అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు.ఆ పాప అనాధ.స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.అం తే కాదు...
మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.
అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.
మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని
చెప్పింది.
అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు
కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే
ఎంత పరిపక్వత అనుకున్నాను.కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.
స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?
చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.
నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"
అన్నాను.
ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం
బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.
నా దగ్గర బాగానే డబ్బు ఉంది.నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో
నిర్ణయం తీసుకున్నాను.అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.
కొద్ది కాలానికి మా వారి పేరు మీద
ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.దానికి
సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.
ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు.సంతోషంగా...
ఉత్సాహంగా అనిపిస్తున్నది.ఒకప్పుడు సమయం గడవని నాకు ..ఇప్పుడు సమయం చాలడం లేదు.
వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే
ఇచ్చాను!!
.....ఎన్.శివ నాగేశ్వర రావు
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌹🌹 పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు...🌹🌹
🌹1). విలువ లేని చోట మాట్లాడకు. .!
🌹2). గౌరవంలేని చోట నిలబడకు..!
🌹3). ప్రేమ లేని చోట ఆశ పడకు..!
🌹4). నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు..!
🌹5). నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు..!
🌹6). నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు..!
🌹7). అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు..!
🌹8). వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు..!
🌹9). ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు..!
🌹10). చులకనగా చూసే చోట చొరవ చూపకు..!
🌹11). జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు..!
🌹12). భారం అనుకునే చోట భావాలు పంచుకోకు..!
🌹13). దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు..!
🌹14). నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు..!
🌹15). ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు..!
🌹16).
ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు..!
🌹17). నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు..!
☘️🍁🌱🌺🍂🌴🌸🪴☘️🍁🌱
వివేకజ్ఞానం
మనిషి ధనవంతుడే కావచ్చు, విద్యావంతుడే కావచ్చు, సర్వాంగ సుందరుడే కావచ్చు కాని బుద్ధిమంతుడు కాకపోతే ఆ ధనం, విద్య, సౌందర్యం ఎందుకూ కొరగావు.
బుద్ధిమంతుడు అంటే ఏకసంథాగ్రాహి, మహామేధావి అని కాదు- సద్బుద్ధి కలవాడని అర్థం. సద్బుద్ధి అంటే వివేకంతో కూడిన బుద్ధిశక్తి. మంచీచెడుల మధ్య తేడా తెలియడమే వివేకం. మనిషికి బుద్ధిశక్తి ఉన్నా వివేకం లేకపోతే అది వక్రమార్గం పడుతుంది. మనిషికి గొప్ప తెలివితేటలు లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు కాని దుర్బుద్ధి ఉంటే చాలా ప్రమాదకరం. మనిషి ఎదిగినా, దిగజారినా, పేరు ప్రఖ్యాతులు గడించినా, అపఖ్యాతి మూటకట్టుకున్నా- అదంతా బుద్ధి మహిమే. ఇహపరాలు రెండూ బుద్ధి చేతుల్లోనే ఉంటాయి. సద్బుద్ధి ఉంటే మంచి స్నేహితులు, శీల సంపద, గౌరవ మర్యాదలు, సత్సంబంధాలు, మనోనిర్మలత, ఆత్మవివేచన కలిగి ఉంటారు. దుర్బుద్ధి ఉంటే కపటత్వం, అసూయాద్వేషం, అసహనాలు ఆవరిస్తాయి. మనిషి దేహాంగాలన్నీ దివ్యంగా పనిచేస్తున్నా, బుద్ధి ఒక్కటి వక్రంగా పనిచేస్తే చాలు- జీవితం పతనమవుతుంది.
ఈశ్వరుణ్ని తపస్సుతో మెప్పించి వరాలు పొందిన రావణ విభీషణ కుంభకర్ణులలో, రావణకుంభకర్ణులను ఆ వరాలు రక్షించలేదు. కాని సద్బుద్ధినే వరంగా వేడిన విభీషణుడు మాత్రం చిరంజీవి అయ్యాడు. పూర్వకాలం గురుకుల విద్యలో సద్బుద్ధిని పుట్టించే అంశాలను విశేషంగా బోధించేవారు. గురువులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యాబుద్ధులు రెండూ నేర్పేవారు. నిజానికి విద్య అంటేనే బుద్ధిని మేల్కొల్పేదని అర్థం. దురాలోచనలకు, వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా విద్యార్థులను ఉంచేందుకు నాటి గురువులు తీవ్రంగా శ్రమించేవారు. చిటికెడు ఉప్పు కలిస్తే బిందెడు పాలూ విరిగిపోతాయి. ఒక చెడు స్నేహం చాలు మనిషి పాడయ్యేందుకు. అర్జునుడిపై అసూయతో రగిలే కర్ణుడి స్నేహమే దుర్యోధనుడి పతనానికి కారణమంటారు పెద్దలు. ఒక వస్తువు నాణ్యత దాన్ని ఉత్పత్తిచేసే యంత్రసామర్థ్యంపైనా, దానిలో వినియోగించే ముడిసరకు నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి నాణ్యత (వ్యక్తిత్వం) అతడి అంతరంగంలోని మనోబుద్ధులపై ఆధారపడి ఉంటుంది. మనసు వ్యామోహాలకు, త్రిగుణాలకు, వాంఛలకు, అసూయాద్వేషాలకు, ప్రేమపగలకు, ఇష్టాయిష్టాలకు, సుఖదుఃఖాలకు, భావోద్రేకాలకు స్వస్థానం. బుద్ధి వివేకానికి, విచక్షణకు, తాత్విక తార్కిక ఆలోచనలకు, నిశ్చయాత్మక శక్తికి, క్రియాజ్ఞానశక్తులకు, సంకల్పబలానికి, శ్రద్ధకు మూలస్థానం. మనసు బుద్ధి వేరు వేరు అంశాలయినా లోతుగా అవి అనుసంధానమై ఉండటం వలన ఒకటిగానే మనిషికి స్ఫురిస్తాయి. మనసుకు వశుడై బతికితే ఒకలా, బుద్ధిని ఆశ్రయిస్తే మరోలా మనిషి జీవితం ఉంటుంది.
బుద్ధి మనసుకన్నా శక్తిమంతమైనదైనా, సర్వసాధారణంగా అది మనసు చెప్పినట్లే వింటుంది. మనిషి బుద్ధి శక్తి అనంతమైనది. దాని శక్తియుక్తులకు అవధులు లేవు. సాధనతో బుద్ధిని సూక్ష్మతరం చేయాలని వేదం పదేపదే చెబుతుంది. ధ్యాన, యోగ, పూజ, అనుష్ఠాన అభ్యాసాలన్నీ దీనికోసమే. బుద్ధి సూక్ష్మస్థితిని పొందుతున్నకొద్దీ మనసు తనంతట తానుగా నియంత్రణకు వస్తుంది. సద్బుద్ధి కలుగుతుంది. దాన్ని సారథిగా చేసుకుంటే జీవితం సాఫీగా క్షేమంగా శ్రేయోమార్గంలో సాగుతుంది. మనసు లోకోపకారానికి ఉర్రూతలూగుతుంది. పరోపకారమే జీవిత ధ్యేయమవుతుంది.
- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
ఎంత సేపు పూజ?🙏🌼🌾🌷🌿
పూజ గదిలో - 30 నిమిషాలు
బయట - 23 గంటల 30 నిమిషాలు
1) ఏది పూజ? ఎంత సేపు పూజ?
2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?
3) నిద్ర లేవగానే -
i) శ్రీహరి గుర్తుకు రావాలి
ii) భూమికి నమస్కరించాలి
iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి
4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.
5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.
6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.
7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.
8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.
9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.
10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.
11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.
12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.
13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.
14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.
15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప
కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.
అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.🙏
🔸🔸🕉️ 🕉️🔸🔸
శ్రవేంకటేశ్వర: తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి? 🌻
భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు. పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.
కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది. సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవా…
శ్రీహరి పరాధీనత
భూదేవీ ! బ్రహ్మాది దేవతలారా ! ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు బ్రహ్మదేవుడూ శివుడు ఇంద్రుడూ దిక్పాలకులు చంద్రుడు సూర్యుడూ అగ్ని - ఎవ్వరూ స్వతంత్రులు కారు.
సృష్టి అంతా యోగమాయావశంవదం. బ్రహ్మాదిస్తంభపర్యంతమూ గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే.
నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగానూ ఒక తాబేలుగానూ జన్మిస్తానా ? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా ? పోనీ అంటే, క్షుద్రజంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా ? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు ? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ - ఎవరైనా ఎన్నడైనా ఇష్టపతారా ? ఇరవైయొక్క సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం ! ఎంత నీచం ! గర్భస్థ శిశువులనుకూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా ? తరవాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న (పచ్చి) మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గు పడవలసిన విషయమా ? మీరే చెప్పండి.
బంగారులేడి కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటిరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడుకూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నామాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారుమ్రోగేట్టు విలపించాను. కార్యవశాత్తూ సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞచేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను.
నేనూ నా సోదరుడూ నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్య పోయినవారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులుపడ్డానో మీకు తెలుసా ! దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై అసహాయుడనై పాదచారినై భార్యతో కలిసి పధ్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను.
క్షత్రియుడనై పుట్టి బోయవాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగిపొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం ! లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యా వియోగ దుఃఖం. వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది.
రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి.
చతుర్వదనా ! నీకు తెలుసును గదా ! నువ్వూ రుద్రుడు ఇంద్రుడూ అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు అధీనులమే.
(అధ్యాయం - 18, శ్లోకాలు - 60)
దేవతలారా ! మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడూ శాంతుడూ అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను - అని అహంకరించి మోహితులమవుతున్నాం. అతి సనాతనమూ పరాత్పరమూ అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఐంద్రజాలికుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేనూ ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూంటాను.
పద్మసంభవా ! కల్పారంభంలో నువ్వూ నేనూ శివుడూ కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాంకదా ! సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి. మనస్సుల్లో స్మరించండి.
శ్రీమహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకలభువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు.
జగన్మాతా ! సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీనుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరీ ! ఓ కరుణాసముద్రమా ! నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు (జ్ఞాన రూప). దేవీ ! మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మీ ! ఓ మహాశక్తి ! మమ్ము నడిపించు.
ఓ భువనార్తి హారిణీ ! అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావుకదా ! కంస కేశి సాల్వ జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకుకూడా లొంగని మహామహాదానవులను నువ్వు ఒక కేళీవిలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చెయ్యలేరుగదా ! అనంతుడు ఈ భూమిని ధరించలేడుగదా ! ఓ చంద్రకళావతంసా ! మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు - అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు. అభ్యర్థించారు.
జగన్నాయకీ ! సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చినదానవు నువ్వేకదా - అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు.
ఓ త్రిలోకీ ! నీ కళావైభవాన్ని మాకు అందించావు కనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం. ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే - అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు.
జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది. దేవతలారా ! పని ఏమిటో చెప్పండి. ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైనా సురల కోరిక తీరుస్తాను. మీకుగానీ ఈ భూదేవికిగానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి - అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు.
భువనేశ్వరీ ! పాలకులందరూ దుష్టులై పీడిస్తూంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్ధురాలవు నువ్వే అని నిన్ను ప్రార్ధించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతిక్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లీ !
దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొసలు ఎరుపెక్కాయి. మేఘగంభీర స్వరంతో పలికింది -
దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం
దేవతలారా! ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను.
కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో అనకదుందుభి గా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతాకార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణీ గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్టసంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడూ, అశ్వినీ దేవతల అంశలతో నకులసహదేవులూ, అష్టమవసువుగా (వసు అంశంతో) భీష్ముడూ జన్మించి శత్రుబలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది.
మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహమూ, కామమూ మొదలైన దోషాలతోనూ, బ్రాహ్మణశాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాపకారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీమీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.
(అధ్యాయం - 19, శ్లోకాలు - 46)
(రేపు.... వ్యాసకృత యోగమాయా ప్రశంస )
🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ........🙏
..... సశేషం
శ్రీ మాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
[7:36 am, 27/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.
🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.
🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా రేపటి నుంచి ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.
🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.
🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.
🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో జాయిన్ చేయడం జరుగుతుంది.
🌹మీ పేరు ఇలాంటివి తెలపడానికి ఇష్టం లేని వారు గ్రూపులో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు.
--
గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము
--
అమలమ్ముగ నుంచి యెడఁద
సమభావముఁ బెంచుకొమ్ము
గమనించుచు సృష్టి రచన
ప్రముదమ్మునఁ బ్రణతులిడుము
--
నిరుపేదల నిరసించకు
ఒరులెవ్వరి దూరఁబోకు
గరిమమ్మిడు గుణముఁ బెంచు
సరసంబగు బాసలాడు
--
అతిగానెటఁ బల్కఁ బోకు
మతినుంచుము మాతనెపుడు
స్తుతిసేయకు దుష్టజనుల
గతిమార్చకు మాశమీఱి
--
ప్రాప్తమైనదానితోడఁ
దృప్తి గలిగి బ్రతుకనగును
ఆప్తవాక్యమంచునెంచి
జ్ఞప్తినుంచ సూక్తి మేలు
--
వెంటరావు కాసులేవి
జంటయగును గర్మమొకటె
మంటలోన బూడిదగుచు
మంటిలోనఁ గలయఁ దనువు
--
పాపభీతిఁ గలిగి యుండు.
ఆపలేని వాఁడననుచు
వేపఁబోకు పెచ్చుమీఱి.
తాపమిడును యముఁడు పిదప
--
మర్మముంచఁబోక మదిని
ధర్మమార్గమందె సాగి
కర్మఫలము విభునికిడుము
వర్మమగును దైవమతఁడె
--
ఆశలెన్ని యున్నఁగాని
నాశనమునుజేయకొరుల.
పాశమెపుడొ తగులుకొనును
క్లేశమొదవ నీకుఁ గూడ
--
మోసగించి బ్రతుకఁబోకు
హాసములను బయికిఁ జిమ్మి
దాసజనము మెచ్చఁబోరు
మాసిపోవునున్న పేరు
--
పిల్లపాపలందఱలర
మెల్లఁగాను దరికిఁ దీసి
చల్లఁగాను గాయుచున్న
నిల్లె స్వర్గమగును జూడ
--
కల్లలాడఁ గాదు ముద్దు
చెల్లదెపుడు దాట హద్దు
అల్లరవఁగ నెమ్మి రద్దు
తల్లి చెప్పుదొకటె కద్దు
--
చల్లనైన తల్లి యగుట
నెల్లరొకటె కనఁగఁ దలికి
నుల్లసిల్లు నేకమయిన
kaalamaay tapp dika
--((***))--
మనోరమ ముద్దు కోసం... కవిత
మను వాడ గా వచ్చితి నే సహనమ్ము తొ
తను వంత యు తాపము దాహము దేహము
విను మాటలు నచ్చితి వే మన సైనది
కనుక సైగలు చేయుము కాలము నీదియు
అటులే ఇక నాకు యు నీ కును శోభ యె
చిటికేసిన పిల్పు కు వచ్చె ద వెంట నె
కటి నేల ను తాకి యు ఉంటిని ఆశలు
ఇటు తీర్చు ము వేడి కి చల్లగ ఉండును
కళగా ఇచటే కొలువే మనకుందిలె
ఇలలో కలిసే తెలిపే వరసుందిలె
కలలో కదిలే కథలే శుభ కాంక్షలె
వలలో మనమే ఒకటై సుఖముందిలె
తనువే తపనే కలిగే ఇక ఏలిక
మనసే బిగువై వరదై ఇక పొంగులె
మనువే ఇకలే కలలే ఇక తీర్చుకొ
అణువైనవి సేవకులుగా మనకుందిలె
తరుణం ఇదియే శరణం అనుచుంటిని
పరువం మనదీ పదిలం ఇక విదితం
సరళం సుముఖం సహనం మన జంటకు
కరుణా లయమే కథనం చిరు శాంతిగ
0
నేటి ఛందస్సు ...
కోరు వయసులోన - కొరికే తృప్తిగా
చేష్టలగను - కలలు తలపు గాను
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం
ప్రేమ బ్లు చూపుటే
చేరు తనువులోన - తాపమే తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం
కాల కలలు తీర్చుటే
అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు
వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు
ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ
No comments:
Post a Comment