Thursday, 24 September 2020


రేపు ఆశ్వీయుజ బహుళ ద్వాదశి

ఇది #ధన్వంతరి_జయంతి తిథి. ధన్వంతరి గొప్ప వైద్య విద్యావేత్త. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అది ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు జరిగిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. భరద్వజుని వద్ద ధన్వంతరి శిష్యరికం చేసి ఆయర్వేద విద్యను నేర్చుకున్నాడని ప్రతీతి. దివోదాసు పేరుతో ఆయన కాశీకి రాజయ్యాడని కూడా పురాణ కథనం. ఒక చేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో పుట్టాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం వల్ల అన్ని విధాలైన రోగాలు నశించాయని ఐతిహ్యం. ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరి పూజ చేసే వారికి రోగ భయం ఉండదని చెబుతారు. ఇక, ఇదే రోజును దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాఘ్ర ద్వాదశిగా కూడా జరుపుకొనే ఆచారం ఉంది. గుజరాతీలు దీనిని ‘వాగ్‍బరాస్‍’ అంటారు. అక్కడి వాగ్‍ బరాస్‍ నాటికి దీపావళి మూడు రోజులు ఉంటుంది. దీపావళి పండుగ గుజరాతీయులకు కొత్త సంవత్సరాది. మాళవ దేశ మహిళలు గోవత్స ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. దూడతో కూడిన ఆవును పూజించడం వారి ఆచారం. ఈ పూజ శిశువు క్షేమార్థం నిర్వహిస్తారని అంటారు.


#శ్రీధన్వంతరి-స్తోత్రం👇

శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం

చారుదోర్భిశ్చతుర్భిః ౹

సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక

పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ ౹

కాలాంభోదోజ్జ్వలాంగం

కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ ౹

వందే ధన్వంతరిం తం

నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ౹౹

#మంత్రం :

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే

అమృతకలశ హస్తాయ సర్వామయవినాశనాయ

త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే నమః ౹

#గాయత్రీ :

ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ ధీమహి

తన్నో ధన్వన్తరి ప్రచోదయాత్ ౹

#తారకమంత్రం :

ఓం ధం ధన్వంతరయే నమః ౹

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ

ధన్వంతరయే అమృత కలశ హస్తాయ

సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ

త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే

శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప

శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా||

---()--+

 

 

 *ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం జీవిత  ప్రస్థానం:*  *(Get well soon)*

సుప్రసిద్ధ గాయకుడు

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (జ. 1946 జూన్ 4) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.


ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం

జననం

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

1946 జూన్ 4 (వయస్సు: 74  సంవత్సరాలు)

కోనేటమ్మపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

నివాసం

చెన్నై, తమిళనాడు

ఇతర పేర్లు

బాలు, గాన గంధరర్వుడు

వృత్తి

నేపధ్య గాయకుడు

సంగీత దర్శకుడు

నిర్మాత

, నటుడు

క్రియాశీలక సంవత్సరాలు

1965 - ప్రస్తుతం

మతం

శైవ బ్రాహ్మణ హిందూ

జీవిత భాగస్వామి

సావిత్రి

పిల్లలు

చరణ్ & పల్లవి

తల్లిదండ్రులు

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి)

శకుంతలమ్మ (తల్లి)



1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.


సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.


బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.


బాల్యం, విద్యాభ్యాసం

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు.


వృత్తి జీవితం


బాలసుబ్రహ్మణ్యం

మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు] ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు.

చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.


2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.

నటునిగా

1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు బాలు.

 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.

డబ్బింగ్ కళాకారుడిగా

కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.

ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2016 లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

వ్యక్తిగత జీవితం

నెల్లూరు లోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించిన తన తండ్రి సాంబమూర్తి విగ్రహం

బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది.

2020 ఆగస్టు నెలలో కోవిడ్-19 వ్యాధి సోకగా ఆసుపత్రిలో చేరాడు

 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు

భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు


పద్మశ్రీ (2001)

డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా

పద్మభూషణ్ (2011)

శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా

నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి.

**: *🌹. వివేక చూడామణి - 7 🌹*
✍️ రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 3. సాధకుడు - 5 🌻*

36. ప్రపంచములోని సంసారమనే మహారణ్యములో, దావాలనములో చిక్కుకొని మరణించే చావు నుండి మమ్ములను రక్షించుము ప్రభూ! మేము గత జన్మలలో చేసిన పాపకర్మల వలన, ఇప్పుడు మేము అనుభవించుచున్న భయంకరమైన తుఫాను గాలులవంటి సంసార బాధల నుండి విముక్తి పొందుటకై మాకు మీరే దిక్కు ప్రభూ!

37. కొన్ని ఉన్నతమైన ఆత్మలు ప్రశాంత స్థితిలో ఔన్నత్యము సాధించి తాము ఇతరుల ఉన్నతికి, వసంత ఋతువులో ప్రకృతి ప్రతిస్పందించినట్లు, వారు తాము భయంకరమైన పుట్టుక, చావుల నుండి విముక్తి చెంది, ఇతరుల ఉద్దరణ కొరకు నిస్వార్ధముగా తోడ్పడుచుండురు.

38. ఉన్నత స్థితిని పొందిన జ్ఞానులు తమ స్వభావాన్ని అనుసరించి స్వార్ధ రహితులై ఇతరుల కష్టాలను తొలగించుటకు కృషిని చేయుచుందురు. ఉదాహరణకు చంద్రుడు ఎవరు కోరకుండానే భూమి యొక్క ఉన్నతికి సూర్యకిరణాలను మళ్ళించి తన చల్లని కిరణాలతో ప్రకృతికి తోడ్పడుట జరుగుచున్నది.

39. ఓ ప్రభూ! మీ యొక్క అమృత వాక్కుల ద్వారా మాలో బ్రహ్మ జ్ఞానము యొక్క మాధుర్యమును నింపి, చల్లని మీ యొక్క వాక్కు అనే అమృత భాండము నుండి అమృతమును కురిపించి, మా చెవులకు వీనులవిందును కలిగించిన, మా యొక్క ప్రాపంచిక విషయ వాంఛలు అడవిలోని దావాలనమువలె దగ్దమవుతాయి. చల్లని నీ దయా దృష్టిని మాపై ప్రసరింప జేయవలసినదిగా కోరుచున్నాము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*: *🌹. వివేక చూడామణి - 9 🌹*
✍️ రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 4. వివిధ మార్గాలు  - 2 🌻*

44. ఈ ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తిని పొందుటకు ఒక బంగారు బాట కలదు. ఆ మార్గమును అనుసరించిన నీవు సంసారసాగరమును సులువుగా దాటి ముక్తిని పొందగలవు.

45. వేదాంత విజ్ఞానమును చిలికిన బ్రహ్మాన్ని తెలుసుకొనే అత్యున్నత జ్ఞానమును పొందగలవు. అది ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల నుండి విముక్తి పొందుటకు తోడ్పడగలదు.

 46. సాధకుడు సృతులలో చెప్పినట్లు సంసార బంధముల నుండి విముక్తి కొరకు నమ్మకము, భక్తి మరియు ధ్యాన మార్గమును అవలంబించవలసి ఉండును.

47. పుట్టుక చావులనే చక్ర భ్రమణముల నుండి విముక్తి పొందాలంటే, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాధకుడు అనాత్మ బంధనాల నుండి విడివడాలి. అందుకు జ్ఞానాగ్నిని ఆత్మ, అనాత్మ విచక్షణ జ్ఞానము ద్వారా రగిల్చి, అజ్ఞానమును కూకటి వేళ్ళతో దహించివేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
**: *🌹. వివేక చూడామణి - 10 🌹*
✍️ రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. ప్రశ్న, జవాబు - 1 🍀*

48. శిష్యుడు గురువుగారిని ఈ విధముగా ప్రశ్నించును. దయయుంచి నేను అడిగే ఈ క్రింది ప్రశ్నకు సమాధానమును తమ నోటి ద్వారా వినాలని కోరుచున్నాను.

49. బంధనమనగా నేమి? అది ఎలా ఆత్మను పట్టి ఉంచింది? అది ఎలా కొనసాగుతుంది? ఎవరైన దాని నుండి ఎలా విముక్తి పొందగలరు? అనాత్మ అంటే ఏమిటి? ఉన్నతమైన ఆత్మ ఎవరు? ఆత్మ అనాత్మల భేదమును ఎలా తెలుసుకొనగలము? ఈ విషయములన్నింటిని వివరించవలసినదిగా కోరుచున్నాము. 

50. గురువు ఈ విధముగా సమాధానము చెప్పుచున్నాడు.
ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు భగవంతుడు నిన్ను దీవించుగాక! నీవు జీవితములో ఉన్నత స్థితిని చేరుకున్నావు. నీ కుటుంబమును పవిత్ర పర్చినావు. అజ్ఞాన బంధనాల నుండి విడివడి బ్రహ్మత్వమును పొంది యున్నావు.

51. ఒక తండ్రి తన కుటింబీకులందరిని అప్పుల బంధనాల నుండి విముక్తి కలిగించుగాక. కాని తనను తాను తన బంధనాల నుండి విముక్తి పొందియుండలేదు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
**: *🌹. వివేక చూడామణి - 11 🌹*
✍️ రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. ప్రశ్న, జవాబు - 2 🍀*

52. ఇతరులు తన నెత్తిన మోపిన బరువు బాధ్యతలను ఇతరులే దింపివేయవలెను. కాని వ్యక్తి తనకు తానే కల్పించుకున్న ఆకలి వంటి బాధలను తనకుతానే తొలగించకొనవలెను.

53. ఒక రోగి తనకు తగిన ఆహారమును, మందును తాను తీసుకొన్నప్పుడు రోగము పూర్తిగా తగ్గుతుంది. కాని ఇతరుల కృషి వలన కాదు.

54. వస్తువుల యొక్క నిజమైన స్వభావమును ముందుగా వ్యక్తి తనకు తాను తన దృష్టి ద్వారా వివరముగా చూసి గ్రహించాలి గాని ఇతర పండితులు చెప్పినప్పటికి అర్థము కాదు. చంద్రుడు ఎలా ఉంటాడు అనేది తన కండ్ల ద్వారా చూసి తెలుసుకోవాలి. ఇతరులు ఎలా తెలియచెప్పగలరు.

55. అజ్ఞానము, కోరికలు, కర్మల లాంటి వాటిని వ్యక్తి స్వయముగా తనకు తాను తొలగించుకోవాలి గాని, 100 కోట్ల జన్మలెత్తినను ఎవరు తొలగించలేరు. అజ్ఞానము వలన కోరికలు, కోరికల వలన కర్మలు, కర్మల వలన పాపపుణ్యములు తప్పవు. ఇవన్నీ పోవాలంటే వాటి యొక్క జ్ఞానాన్ని పొందాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
**: *🌹. వివేక చూడామణి - 12 🌹*
✍️ రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. ప్రశ్న, జవాబు - 3 🍀*

56. హఠయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మరియు జ్ఞాన యోగముల ద్వారా బ్రహ్మమును పొందలేము. కేవలము బ్రహ్మమునకు తనకు భేదము లేదని స్వయముగా తెలుసుకొన్నప్పుడే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. 

పై యోగాలను యాంత్రికముగా అనుసరించిన బ్రహ్మమును పొందలేమని బంధనాల నుండి విముక్తి లభించదని అద్వైత సిద్ధాంతము తెలుపుచున్నది. సాంఖ్యయోగములో పురుష, ప్రకృతిలోని భేదమును స్వయముగా గ్రహించినప్పుడే విషయముల నుండి విముక్తి లభిస్తుంది. 

ప్రకృతిలో ఉన్న పురుష మామూలుగా వ్యక్తము కాదు. కాని పనులన్ని ప్రకృతిలోనే జరుగుచున్నవి. పురుష లేకుండా ప్రకృతి లేదు. ప్రకృతి పురుష నుండి స్వేచ్ఛను పొందియున్నది. ఇంకను సాంఖ్య యోగము వివిధ ఆత్మలను గూర్చి నమ్ముచున్నది. 

సాంఖ్య యోగానికి వేదాంత సిద్ధాంతాలకు ఇదే ముఖ్య భేదము. విషయ వాంఛలకు సంబంధించిన యజ్ఞాయాగాదుల వలన స్వర్గ సుఖాలు పొందవచ్చు గాని బ్రహ్మాన్ని చేరలేము. బ్రహ్మాన్ని పొందాలంటే బ్రహ్మాన్ని దర్శించుటయే మార్గము.

57. గిటారు వాయిద్యాలు, శృతులు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించగలవే గాని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి తోడ్పడవు.

58. వాక్చాతుర్యముతో కూడిన ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలలోని విషయ పరిజ్ఞానము వ్యక్తీకరించుట అనునవి కేవలము వ్యక్తిగతమైన ఆనందానికి తోడ్పడునే గాని వాటి వలన ఏ విధమైన సాంసారిక బంధనాల నుండి విముక్తి లభించదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. వివేక చూడామణి - 14 🌹*
✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. బ్రహ్మ జ్ఞానము - 2 🍀*

63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదాత్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. 

ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేము కదా!

64. ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు.

65. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయాలంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగారము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. 

అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. 

Tuesday, 22 September 2020

 

🙏🌷ధర్మం’ అంటే ఏమిటి?🌷🙏

ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాల లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’

ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.

ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.

ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.

శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
       హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||

“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;

1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిమర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.

2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.

3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.

4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.

5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.

7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.

8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.

9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.

అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.

కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.

వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.

గారెల రాజ్యంలో...

పులిహోర పురం రాజధానిగా....

దద్దోజనం చక్రవర్తి...

చక్రపొంగలి  రాణితో...

మలై కాజా మహా మంత్రి సలహాలతో...

సమోసా సైన్యధిపతిగా పరిపాలిస్తుండగా....

అతడి తమ్ముడు అప్పాలు...

వంకాయ బజ్జీ వంకర మాటలువిని...

వేడి వేడి పకోడీల్లా వేరుపడి...

కుడుముల రాజ్యం చేసుకుని...

రవ్వ లడ్డు రాజధానిగా...

మిరపకాయ బజ్జీ మంత్రిగా...

సేమ్యాపాయసం సేనానిగా... రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి,

నీరుల్లి వడలా వగ పడ్డాడు...

మడత కాజా లెవల్లోని లేఖకునితో...

అన్నకు కట్లెట్ భాషలో కమ్మగా వ్రాసి... 

కలాకండతో కబురంపాడు...

లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని..

మిర్ఛి బజ్జీ బండిలో...

తీపి గారెల కబుర్లు వింటూ...

కలాకండ వెళుతుండగా...

ఇది వేసవి కాలం కావటాన

వేరుశనగ ఉండల్లా  వడదెబ్బతగిలి...

పరమాన్నపురంలో...

సున్నుండల సలహాతో...

ఇడ్లీ ఇంట విశ్రమించి...

మినపట్టు మెడికల్ సేవలతో...

మొక్క జొన్న వడల మందేసుకుని...

టమాట జామ్ తో సేదతీరి...

పాయసం ఫలహారం చేసి...

మసాలా పకోడితో మంచం దిగి... 

బ్రెడ్ హల్వా బండిలో...

కరివేప వడ కళ్ళెం పట్టుకోగా...

పాలకోవా బాట చూపగా...

పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది...

వెజిటబుల్ వడ వెంట వస్తుండగా...

బర్ఫీ బిగువుతో...

సున్ని ఉండల కొండలూ...

కజ్జికాయల కోనలూ...

పూతరేకుల పర్వతాలూ...

సగ్గుబియ్యపాయస సముద్రాలూ... 

ఖర్జూరం హల్వా  కోనేరునూ...

కొబ్బరి పాయసపు కొలనునూ...

జాంగ్రీల  జాగీరు నూ దాటుకుని...

ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా...

బూరెల దొంగలూ...

కట్లెట్ కర్రలతో అడ్డుకోగా...

రవ్వ కజ్జి కాయల రక్షకులు...

బూందీ లడ్డు బూరలూది...

కాజాల జాగిలాలను రప్పించి...

సేమ్యా హల్వా శూలాలతో...

బొబ్బట్లు బొబ్బలతో  భయపెట్టగా...

తొక్కుడు లడ్డు దొంగలంతా...

ఆవడల అరణ్యంలోకి పారిపోయారు...

రాజభక్తి గల రవ్వ కేసరి...

వడియాల వేగులూ...

బఠానీ వడ బంట్రోతులు...

చెర్రి జామ్  చారులూ...

కలాకండ కారణం లేని రాక తెల్సుకుని...

అన్నం పరవాన్నం పారించి...

ఉల్లిపాయ పకోడి,

అరటికాయ బజ్జీలూ దారికడ్డం వేసి...

అరిసెలు బండి అడ్డంపెట్టి...

ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి...

గవ్వలతో గవదలూడ గొట్టి...

పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి...

బాదం కేకుతో బాది...

కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి...

గులాబ్ జామ్లతో గుచ్చి గుచ్చి...

ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి...

పాయసం తో పనిష్ చేసి...

బొంగుమిఠాయ్ తో బొమికెలు విరగ్గొట్టి...

అదిరి పోయే అల్లం, బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి...

ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు....

చిమ్మిరుండల చారులూ...

సజ్జప్పాల సమాచరకులూ...

వెనిల్లా వేగులూ...

అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని... 

బూంది బాబాయ్  పెట్టిన భయంతో...

కొబ్బరి వడలా వణికిపోయి...

మిర్ఛి బజ్జీ మైత్రితో...

పెసరట్టు దొంగ ప్రేమతో...

మైసూరుపాక్ మైత్రితో...

జీళ్ళ జాయింట్లు జారిపోయి...

చిలకడ దుంపల లడ్డులా చింతించి...

సజ్జ బూరెల్లా స్వాంతనపడి...

పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి...

ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా...

కరుణగల క్యారట్ పాయసపుదేవుని  కారుణ్యంతో...

మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి...

మినప్పిండి అప్పడాల్లా  ముసిరిన ఆలోచనలు వదిలి...

నువ్వుండల నయ వంచకత్వం...

చెగోడీల  చెప్పుడు మాటలూ...

బీరకాయ బజ్జీ బీరాలూ...

జిలేబీల జాడ్యాలూ అంటించినవి  వదలుకుని...

అప్పాల్లా ఆగి ఆగి...

క్యారట్ కేక్ లా కేకలేసి...

ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి...

హల్వా లా అరచి అరచి...

బొబ్బట్ల లా బొబ్బలేసి...

వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు..

పూర్ణం లా పూర్తిగా మారిపోయి...

బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి...

బాస్మతి బియ్యపు పరవాన్నంలో...

స్పాంజ్ కేక్ తోస్నానం చేసి...

సగ్గుబియ్యం  వడియంలా శుధ్ధిపడి... 

బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి... 

జీడిపప్పు మైసూరుపాక్ లాంటి "అన్నప్రేమ " తల్చుకుని, మైమరచి...

ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని...

ఉప్మా తో దేవుని ఉపాసించి...

పైనాపిల్ కేక్ లా ఫ్రెండ్సును పక్కకు నెట్టి...

తనకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు...

పిండి వడియంలా  పరవసించి... 

అప్పడాల వంటి అన్నను చూడాలని...

పకోడి పళ్ళెం పట్టుకుని...

బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని...

కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని...

ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు...

స్నేహితుల కోసం  సొరకాయ వడియాలు...

మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు...

ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ...

కొలువులోవారి కోసం  కొబ్బరి ఉండలు...

సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసంతీసుకుని...

అన్నపు పాయసం లాంటి అన్నను చేరి...

కొబ్బరి హల్వా  పాయసం వంటి పాదాలు పట్టుకుని...

కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా...

అన్న ఆల్మండ్ చాకొలెట్‌ బార్  లా కౌగలించుకుని...

తీపికాజా లాంటి తమ్ముడ్ని...

ఆవడలా ఆలింగనం చేసుకుని...

బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి...

బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు... 

రవ్వ లడ్డు లాంటి  వారి లవ్వుకు...

శాండ్ విచ్ వంటి సభికులంతా...

ఆవపెట్టిన  పనసపొట్టు కూరలా ఆనందించారు 


ఏమైనా మన తెలుగు రాష్త్రాల్లో లభించే మన తెలుగు వంటకాలు ని మర్చిపోయుంటే గుర్తుచేయగలరు.


---((()))--+

కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది....

అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.

కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.

నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి.

అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది.

మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.

కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది..

నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...

 

 నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో   చాలా  రోజులపాటు తెగ తిరిగాడు. 


చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు.


 ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు.


 నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది.


తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. 


ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు.


కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన.


‘ఓస్‌ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు. ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?...’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.


పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ... వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు.


‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన.


ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు.


 ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. 


అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. 


ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన.


‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు.


‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే..... నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.


ఏమి జరిగినా మన మంచి కే అని అనుకోవడము అలవాటు చేసుకోవాలి.అప్పుడే హాయిగా, సుఖంగా వుండగలవు, లేదంటే బాధ, వ్యధల తో జీవితం ముగిసిపోతుంది.


ఇందుకు చిన్న ఉదాహరణ చెపుతాను విను.


సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.


అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.


ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.


 ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.


ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.


ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. 


తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.......

తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  


తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.


తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. 


అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. 


ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.


“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.


ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు.


ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది.


రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందుకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తెలుసు.

సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు.


ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.

 

ఆధ్యాత్మిక కథలు - 21
                   - టి. వి. యల్. ప్రసాద్
కుటుంబం - అనుబంధం
      ఒక ఊరిలో శివయ్య అనే గృహస్థు ఒకతడు ఉండేవాడు. అతడితో పాటు తల్లిదండ్రులు, భార్య, తోబుట్టువులు, పిల్లలు ఉండేవారు. శివయ్య ఒక మఠానికి పోతూ ఉండేవాడు. ఒకనాడు మఠంలోని సన్యాసితో "స్వామీ!  నాకు కూడా మీలాగా సన్యాసం స్వీకరించాలని ఉంది. కానీ నా తల్లిదండ్రులకు, భార్యకు నేనంటే ప్రాణం. వారు నన్ను విడిచి ఉండలేరు. వారి కోసమే నేను సన్యాసం తీసుకోవడానికి సంకోచిస్తున్నాను" అని చెప్పాడు. గురువుగారు నవ్వి అతడికి ఒక వేరు ఇచ్చి, "ఇంటికి పోయిన తరువాత, ఈ మూలికను నోట్లో ఉంచుకో. నీ శరీరం నిశ్చేష్టితమవుతుంది. కదలలేవు. అయితే ఎవరేమీ మాట్లాడేది నీకు తెలుస్తుంటుంది" అని చెప్పాడు. గృహస్థు ఇంటికి వెళ్ళి పడుకొని వేరు నోట్లో ఉంచుకొన్నాడు. శరీరమంతా బిగుసుకుపోయింది. కాళ్ళు చేతులు కూడా కదిలించలేకపోయాడు. అతడి పరిస్థితి చూచి, కుటుంబమంతా శోకాలు పెట్టసాగారు. అప్పుడు సన్యాసి వారింటికి వచ్చాడు. ఆ దారిన పోతుంటే ఏడుపులు వినబడి లోపలికి వచ్చానన్నాడు. శివయ్య కుటుంబానికి ఆయన ఏదైనా చేయగలడనే ఆశ కలిగింది. సన్యాసి కాళ్ళమీద పడి, శివయ్యను కాపాడమని వేడుకొన్నారు. సన్యాసి శివయ్యను పరీక్షించి, వారితో అతడు జీవించాలంటే ఒకే ఉపాయం ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులు అదేదో చెప్పమన్నారు. సన్యాసి అతడి బదులు కుటుంబంలోని వారెవరైనా తమ ప్రాణాన్ని అర్పిస్తే శివయ్య బతుకుతాడని చెప్పాడు. ఆ మాటలు వినగానే శోకాలు ఆగిపోయాయి. సన్యాసి అతడి తండ్రి వంక చూచాడు. ఆయన "స్వామీ!  శివయ్యకు లౌకిక వ్యవహారాలు అంతగా పట్టవు. నేనే ఈ కుటుంబానికి ఆధారం. నేను పోతే ఈ కుటుంబం వీధిన పడుతుంది" అన్నాడు. సన్యాసి శివయ్య తల్లి వంక చూచాడు. ఆమె "స్వామీ!  నేను సిద్ధమే. కాని నాకు ఆడపిల్లలున్నారు. నేను పోతే వారి పెళ్ళిళ్ళు, బాగోగులు చూచేవారుండరు" అనింది. సన్యాసి శివయ్య భార్య వైపు చూచాడు. ఆమె "స్వామీ!  నాకు చిన్న పిల్లలున్నారు. నేనుపోతే, ఆయన మరొకరిని పెళ్ళి చేసుకొంటే, సవతితల్లి వారి ఆలనాపాలనా సక్రమంగా చూస్తుందా?" అనింది. పడుకొని ఉన్న శివయ్య ఈ మాటలన్నీ విన్నాడు. నోట్లో ఉన్న మూలికను ఉమ్మేశాడు. శరీరం స్వాధీనంలోకి వచ్చింది. లేచి సన్యాసితో "గురువుగారు!  సన్యాసం స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని సన్యాసితో పాటు బయలుదేరాడు.

      అయినవారి మధ్య ఆపేక్షలు, అనురాగాలు చాలావరకు స్వార్థపూరితాలు, నటనలు. వాటిని సత్యాలని భ్రమించి, మానవుడు మమకార బంధాలలో చిక్కుకొని, పరమాత్మకు దూరమవుతాడు. లౌకిక ప్రేమలలోని డొల్లతనం గ్రహిస్తే, ముక్తి మార్గంలోకి అడుగిడ గలుగుతాడు.

 

ఓ ఫలంలోని విత్తనాల్ని ఎవరైనా చూడగలరు.
కానీ ఓ విత్తనంలో ఎన్ని ఫలాలున్నాయో చూడగలిగేవారే వివేకవంతులు.

నిజాయితీ అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఇతరుల విశ్వాసాన్ని పొందవచ్చు.

మంచితనం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా ఇతరుల స్నేహాన్ని పొందవచ్చు.

వినయం అనే ఇత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా గొప్పతనాన్ని పొందవచ్చు.

పట్టుదల అనే విత్తనాన్ని నాటితే...
దానికి  విజయాన్ని ఫలంగా పొందవచ్చు.

దయ అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఇతరులతో సమన్వయాన్ని పొందవచ్చు.

నిరహంకారం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా సుహృద్భావాన్ని పొందవచ్చు.

నిష్కపటం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఆత్మీయతను ఫలంగా పొందవచ్చు.

ఓర్పు అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా అభివృద్ధని పొందవచ్చు.

విశ్వాసం అనే విత్తనాన్ని నాటితే...  
దానికి ఫలంగా అద్భుతాలనే పొందవచ్చు.

Monday, 21 September 2020

 ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది


*పుష్ప ప్రసాదం..!*

*ఓం నమః శివాయ..!*


*దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది*

దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే..

మీ జీవితం..భవిష్యతు.. భాగుంటుంది


1.దేవునికి కాగితం పూల మాలను  వేస్తే..

నిత్య దరిద్రులు అవుతారు


2.దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే..

చర్మ వ్యాధి వస్తుంది.


3.ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు

ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే..

గ్యాస్ట్రిక్  వ్యాధి వస్తుంది.


4.పాడయిన పూలతో పూజ చేస్తే..

దేహంలో అయిన గాయాలు నయం కావు.


5.పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే..

పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి.


6.సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే..

మీ జీవితం సుఖమయం అవుతుoది.


7.పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా ,హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు.


8.ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో

వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది.


9.ఎవరైతే దేవునికి కనకాంభరం పూలతో పూజచేస్తారో వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు .

కనకాంబరం పూలు పూజకు పనికిరావు.


10.విచ్చని పూలతో పూజ చేస్తే..

మీ పనులు చాలా ఆలస్యం గానూ ,

కొన్ని సార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి


*ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

1.దేవునికి జాజి పూలు..అర్పించి

ప్రసాదం స్వీకరిస్తే ..

మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి

మంచి గుణం వస్తుంది .

ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి


2.దేవునికి సంపెంగ పూలు అర్పించి..

ప్రసాదం స్వీకరిస్తే ..

మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు .

శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది


3.పారిజాత పువ్వుని అర్పిస్తే ....

కాల సర్ప దోషం నివారించబడి

మనస్సుకు శాంతి లబిస్తుంది.


4.రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ...

ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం

మీదే అవుతుంది.


5.మొగలి పువ్వును అర్పిస్తే .....

అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.


6.లక్కీ పువ్వుతో పూజిస్తే ....

భార్య పిల్లలతో కలహాలు లేకుండా

సంతోషంగా ఉంటారు.


7.పద్మం లేదా కమలంతో పూజిస్తే .....

సమస్త దారిద్ర నివారణ.

శ్రీమంతులు అవుతారు.


8. మల్లె పువ్వుతో పూజిస్తే ......

అన్ని రోగాలు నయం అవుతాయి .

ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.


9.గన్నేరు పూలతో పూజిస్తే..

కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.


10.కల్హార పుష్పం తో పూజిస్తే ...

అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి

ఆకర్షణ పెరుగుతుంది.


11.పాటలీ పుష్పంతో పూజ చేస్తే ..

వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.


12.కంద పుష్పంతో పూజ చేస్తే ....

ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.


13.తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే ...

దేవునిఫై భక్తి అధికం అవుతుంది.


14.నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే ... జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది.


15.కణగాలే పుష్పం ...దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి

గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .

విద్య ప్రాప్తి సిద్దిస్తుంది .

దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే

దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.


16.అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే .... జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి


17.నల్ల కలువ పుష్పాలతో శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల

శని సమస్యలు తొలగిపోతాయి


18.పాదరి పుష్పంతో పూజ చేస్తే ...

అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.


19.మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే..

అన్ని పాపాలు తొలగిపోతాయి.


20.పున్నాగ పుష్పం... ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి  ,శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది .


21.వకుళ పుష్పం ... శ్రీ భూవరాహ స్వామికి ,

శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.


22.ఉత్ఫల పుష్పం ...జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం

మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..

ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే..

జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.


23. తెల్లని జిల్లేడు పువ్వుతో ... గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.


24.ద్రోణ పుష్పం ... ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనం , మిత్రలాభం అవుతుంది.

అధికారం ప్రాప్తిస్తుంది.


25. భందూక పుష్పం ... ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే..

బంధువులు క్షేమంగా ఉంటారు.


26.అగసి పువ్వుతో .... దేవికి పూజ చేస్తే..

పాపాలు తొలగిపోతాయి.


27.సురభి పుష్పం ... శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.


28.పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే .... పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె

అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.

Thursday, 17 September 2020

Nate stories ...  

 * మీ అడుగుల అరికాళ్ళకు కొబ్బరి నూనె వేయండి *

 87 ఒక తాత 87 సంవత్సరాల వయస్సులో కూడా, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, దంతాల నష్టం లేదు.  కొబ్బరి నూనెను పూయడం అతని చికిత్స మరియు ఫిట్నెస్ యొక్క మూలం.

 Man మణిపాల్‌కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను నా అరికాళ్ళ క్రింద వేయమని నా తల్లి పట్టుబట్టింది.  చిన్నతనంలో తన దృష్టి బలహీనపడిందని చెప్పారు.  ఆమె ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు, నా కంటి కాంతి క్రమంగా పూర్తిగా మరియు ఆరోగ్యంగా మారింది.

  కేరళకు నేను సెలవు కోసం వెళ్ళానని ఒక పెద్దమనిషి రాశాడు.  నేను అక్కడ ఒక హోటల్‌లో పడుకున్నాను.  నేను నిద్ర పోలేకపోయాను.  నేను బయట నడవడం ప్రారంభించాను.  రాత్రి బయట కూర్చున్న పాత కాపలాదారు నన్ను "ఏమిటి విషయం?"  నేను నిద్రపోలేనని చెప్పాను!  "మీకు కొబ్బరి నూనె ఉందా?"  నేను చెప్పలేదు, అతను వెళ్లి కొబ్బరి నూనె తెచ్చి, "మీ పాదాల అరికాళ్ళను కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి" అని అన్నాడు.  నేను నిద్రలోకి తిరిగి వెళ్ళాను.

  • నాకు కడుపు సమస్య వచ్చింది.  కొబ్బరి నూనెతో నా అరికాళ్ళకు మసాజ్ చేసిన తరువాత, నా కడుపు సమస్య 2 రోజుల్లో నయమవుతుంది.

 15 నేను గత 15 సంవత్సరాలుగా ఈ ట్రిక్ చేస్తున్నాను.  ఇది నాకు బాగా నిద్రపోయేలా చేస్తుంది.  కొబ్బరి నూనెతో నా పిల్లల అరికాళ్ళను కూడా మసాజ్ చేస్తాను.  ఇది వారిని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

 Legs నా కాళ్ళు ఎప్పుడూ వాపుతో ఉంటాయి మరియు నేను నడుస్తున్నప్పుడు, నేను అలసిపోతాను.  నేను రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనె మసాజ్ యొక్క ప్రక్రియను నా పాదాల అరికాళ్ళపై ప్రారంభించాను.  కేవలం 2 రోజుల్లో, నా కాళ్ళ వాపు మాయమైంది.

  • ఇది అద్భుతమైన విషయం.  విశ్రాంతి చిట్కా కోసం నిద్ర మాత్రల కంటే ఈ చిట్కా మంచిది.  ఇప్పుడు నేను ప్రతి రాత్రి నా అడుగుల కొబ్బరి నూనె అరికాళ్ళతో నిద్రపోతాను.

 • నా తాత పాదాలకు మండుతున్న అనుభూతి మరియు తలనొప్పి ఉన్నాయి.  కొబ్బరి నూనెను తన అరికాళ్ళపై వేయడం ప్రారంభించే సమయానికి, నొప్పి పోయింది.

   • నాకు థైరాయిడ్ వ్యాధి వచ్చింది.  నా కాళ్ళు అన్ని వేళలా దెబ్బతింటున్నాయి.  గత సంవత్సరం ఎవరో రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పాదాల అరికాళ్ళకు మసాజ్ చేయాలని సూచించారు.  నేను శాశ్వతంగా చేస్తున్నాను.  ఇప్పుడు నేను సాధారణంగా నిశ్శబ్దంగా ఉన్నాను.

 • నాకు పన్నెండు సంవత్సరాల క్రితం హేమోరాయిడ్స్ వచ్చాయి.  నా స్నేహితుడు నన్ను 90 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక age షి వద్దకు తీసుకువెళ్ళాడు.  కొబ్బరి నూనెను అరచేతులపై, వేళ్ళ మధ్య, వేలుగోళ్ల మధ్య, మరియు గోళ్ళపై రుద్దమని ఆయన సూచించారు మరియు ఇలా అన్నారు: నాభికి నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె వేసి నిద్రపోండి.  నేను అతని సలహాను అనుసరించడం ప్రారంభించాను.  నాకు చాలా ఉపశమనం కలిగింది.  ఈ చిట్కా నా మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరించింది.  నా శరీర అలసట కూడా మాయమైంది.  గురకను నివారిస్తుంది.

 
  Legs నా కాళ్ళు మరియు మోకాళ్ళలో నొప్పి వచ్చింది.  కొబ్బరి నూనె మసాజ్ యొక్క కొనను నా పాదాల అరికాళ్ళపై చదివినప్పటి నుండి, ఇప్పుడు నేను రోజూ చేస్తాను, అది నాకు నిద్ర వస్తుంది.

  Bed చాలా సంవత్సరాల నుండి నాకు వెన్నునొప్పి వచ్చింది, నేను పడుకునే ముందు కొబ్బరి నూనె మసాజ్ ను నా కాళ్ళ మీద వాడటం మొదలుపెట్టినప్పటి నుండి, నా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది మరియు నా నిద్ర బాగా మెరుగుపడింది.

   దక్షిణ భారత రహస్యం ఈ క్రింది విధంగా ఉంది:

   రహస్యం చాలా సులభం.
 "మీరు కొబ్బరి నూనెను మాత్రమే వర్తించనవసరం లేదు. మీరు ఏదైనా నూనె, ఆవాలు, ఆలివ్ మొదలైనవాటిని పాదాల అరికాళ్ళపై మరియు మొత్తం పాదాలకు వర్తించవచ్చు, ముఖ్యంగా అరికాళ్ళపై మూడు నిమిషాలు మరియు పాదాలకు మూడు నిమిషాలు.

 అరికాళ్ళపై 100 యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి.
 మానవ అవయవాలను నొక్కడం మరియు మసాజ్ చేయడం ద్వారా కూడా నయం చేస్తారు.
   * ఫుట్ రిఫ్లెక్సాలజీ *

 * దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి *

జై శ్రీ కృష్ణా.....💐🙏
 

neti story .. 1

ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .

ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !

మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?

అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :- బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు .

నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .

వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .

ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .

నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .

అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .

అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? "

ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల 🗓 నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .

సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .

మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .

ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .
ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .

ఆ ముసలావిడకు చదువు రాదు .
అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .

మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .

మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది .

కానీ , మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .
మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .

మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .

ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం

సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .

చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .

ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత .

ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి

దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.

గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .

ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత .

ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత.

ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .

దేవుడు మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి , అర్థం చేసుకొని , దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను !

ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి మన భారతదేశ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 *🙏🙏నమస్కారం🙏🙏*

*ఏపనులు చేయకూడదు? ఏపనులు చేయాలి?*

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.

2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.

3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.

4. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనక వుండాలి.

5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి.

6. అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చరించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.

7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.

8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.

9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.

10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

*అన్నం పరబ్రహ్మ_స్వరూపం అని తెలుసుకున్నాం కదా, కొన్ని నిజాలు చూద్దాం*

అరటి ఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం.. అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది., వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి.. మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్య వంతులుగా ఉంటారు.

తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.

బాదాం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.

టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.

1) ధర్మ శాస్త్రం ప్రకారం మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం వచ్చే అవకాశం ఎక్కువ. 

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకనగా, దీర్గాయుష్షు వస్తుంది.

తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.

పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది.

ఉత్తర ముఖంగా కూర్చుంటే, సంపద వస్తుంది.

దక్షిణ ముఖంగా కూర్చుంటే, కీర్తి వస్తుంది.

*కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు.*

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట దుర్భాష లాడతం చేయరాదు.

ఏడుస్తూ తింటూ, గిన్నె/ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు. 

ఎట్టి పరిస్థితిలో నైనా ఒడిలో కంచం/పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము,  అట్టివారికి నరకము ప్రాప్తించును. 

భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.

భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఆనందమే విజయానికి సోపానం.

సర్వేజనా సుఖినోభవంతు.

ఇది సేకరణ🙏🙏🙏🙏

*🙏🙏నమస్కారం🙏🙏*

*ఏపనులు చేయకూడదు? ఏపనులు చేయాలి?*

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.

2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.

3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.

4. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనక వుండాలి.

5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి.

6. అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చరించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.

7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.

8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.

9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.

10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

*అన్నం పరబ్రహ్మ_స్వరూపం అని తెలుసుకున్నాం కదా, కొన్ని నిజాలు చూద్దాం*

అరటి ఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం.. అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది., వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి.. మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్య వంతులుగా ఉంటారు.

తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.

బాదాం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.

టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.

1) ధర్మ శాస్త్రం ప్రకారం మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం వచ్చే అవకాశం ఎక్కువ. 

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకనగా, దీర్గాయుష్షు వస్తుంది.

తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.

పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది.

ఉత్తర ముఖంగా కూర్చుంటే, సంపద వస్తుంది.

దక్షిణ ముఖంగా కూర్చుంటే, కీర్తి వస్తుంది.

*కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు.*

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట దుర్భాష లాడతం చేయరాదు.

ఏడుస్తూ తింటూ, గిన్నె/ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు. 

ఎట్టి పరిస్థితిలో నైనా ఒడిలో కంచం/పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము,  అట్టివారికి నరకము ప్రాప్తించును. 

భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.

భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఆనందమే విజయానికి సోపానం.

సర్వేజనా సుఖినోభవంతు.

ఇది సేకరణ🙏🙏🙏🙏

stories

కాలం విలువ

ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి.
కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... ఆకు చివర మంచు బిందువులా- అని వర్ణిస్తారు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కాలం కదలడం లేదని, మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు... అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి. మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.
సమయపాలనంటే గడియారాన్ని అనుసరించి బతికేయడం కాదు. స్వయం నిర్వహణ. ముఖ్యమైన విషయాలకు ‘అవును’ అని చెప్పగలగడం. ‘కాదు’ అని చెప్పాల్సిన విషయాలకూ, అంతే శక్తితో చెప్పగలగడం. చేయాలనుకున్న పనులే కాదు. చేయకూడనివేమిటో క్రమశిక్షణతో, జీవితం పట్ల బాధ్యతతో వేరు చేయగలగాలి. ‘రేపు ఎక్కడుండాలి’ అని అనుకుంటే, కాలాన్ని ఆ దిశలోనే వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు. ఆధ్యాత్మికమైన ఆలోచనలను ఆకళింపజేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రతించే పని తప్పుతుంది. మనశ్శాంతీ దక్కుతుంది.
చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరూ విజేతలు కాలేదు. విజేతలను చూసి వారు అదృష్టవంతులని ఆసూయపడటంకంటే కాలాన్ని మనసు పెట్టి సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నం కావాలి. కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది! జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటుంటాడు. కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.
జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించాలి. ‘నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.
కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. ఒక రుతువు తరవాత మరొకటి. రోజులు, నెలలు సంవత్సరాల్లో ప్రచండ వేగంతో ఎగిరిపోతున్నట్లు ఉంటుంది. ‘ఏం సాధించలేకపోతున్నాం’ అని చింతించేవారు ఎందరో. కదిలిపోయే ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. దేనికోసం లావాదేవీలు జరుపుతున్నాం... కోపం, అసూయలతోనా, గతం గురించిన వ్యక్తమైన బాధతోనా, భవిష్యత్తు గురించిన చింతతోనా... ఈ భూమ్మీదకు మనమెందుకొచ్చాం, దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకళింపజేసుకోవడానికా... వీటి పై జీవితంలో స్పష్టత అవసరం.
ప్రకాశానికి అడ్డుతగలకుండా ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించాలి. లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు... ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతుంటుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. కాలం నేర్పే పాఠాలెన్నో! కాలం
విలువను గ్రహించకపోతే, ఆ తరవాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలి.
- మంత్రవాది మహేశ్వర్‌

మహర్షి శంఖం !

అనగనగా ఒకరోజు. ఒక  ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు."వజ్రాల హారం వేసుకుని మరీ బయల్దేరారేంటండీ..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా ఏంటీ..?" ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి.

"నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ...? పది వేళ్ళకూ ఉంగరాలు పెట్టుకోలేదూ...? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది" అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి. ఇంతలో మూడో వ్యాపారి కలుగ జేసుకుని.. "డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు, నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు... ఇదంతా సంపద వల్లనే కదా...!!" అంటూ చెప్పుకొచ్చాడు.

"మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే... అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి" మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైనవాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక.. మహర్షిని ఆటపట్టించసాగారు."నీ దగ్గర ఏముంది ముసలోడా...?" అన్నాడొక వ్యాపారి.ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ...

"నా దగ్గరేముంటుంది నాయనలారా...! అంటూ, జోలె లోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ... ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు" అన్నాడు. "అయినా.. ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే...!" అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు. దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు.పడవ అలా నది మధ్యలో సాగుతుండగా... ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి, బలమైన ఈదురుగాలులు వచ్చాయి.

గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను "సాములూ.. అందరూ గట్టి అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు" అని చెప్పాడు.దీంతో... వ్యాపారులంతా పెద్ద పెట్టున... రక్షించండి... రక్షించండి... అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి.. వ్యాపారులను, మహర్షిని కాపాడారు.

బ్రతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ... మహర్షి వద్దకు వచ్చి... "నిన్న ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా.. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం..." అంటూ, అన్యధా భావించకుండా, దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు.అప్పుడు మహర్షి నవ్వుతూ... "నాయనలారా... డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు" అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంటంటే పిల్లలూ... ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం.

*****

ఈరోజు మొగాళ్ళ దినం ....!

అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి
వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న......
మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. ఎందుకో... మచ్చుకు కొన్ని ....
చెడ్డి చొక్కాతో బాల్యం అంతా గడిపెయ్యాలి. కొన్ని సార్లు చెడ్డి కూడా వెయ్యరు చదువు చదివితే సరిపోదు
మొగాడివి రాంక్ రావాలి  అని అరచి గోల చేస్తారు.

భయమేసినా భయపడి చావకూడదు. మగాడు భయపడేది ఏంటి అంటారు. ఎలకవచ్చినా... పాము వచ్చినా బల్లి చచ్చినా.. మనమే తియ్యాలి... వారు తియ్యరు అరవడం మాత్రమె చేస్తారు.

ఉద్యోగాలు చెయ్యల్సింది మనం.... కోయిలమ్మ.... కుంకుమరేఖ... రచ్చబండలు...
లాంటి సీరియల్స్  చూసేది వాళ్ళు. నోములు వ్రతాలు వాళ్ళకి... సరుకులు,సామాన్లు తేవాల్సింది మనం. పెళ్లి చేసుకుంటే.. వాళ్ళని బుట్టలో తెస్తారు మనల్ని బుట్టలో వేసుకుంటారు

పట్టు చీరలు వుంటాయి కాని పట్టు పాంటులు వుండవు, ఉన్నా పెట్టరు. మనం అమ్మాయిలని చూసినా...
వాళ్ళు మనన్ని చూసినా... పళ్ళురాల గోట్టేది మనన్నే...

ఫలానా ఆవిడ మొగుడు అని చెప్తారు కాని... ఫలానా వాడి పెళ్ళాం అని ఎందుకు అన రో...
కాఫీ ఇస్తే తాగాలి.లేకపోతే... మంచినీళ్లని కాఫీలా భావించాలి... నోరు ఇచ్చాడు..
కాని వాడకూడదు. ఇలాంటి బాధల మధ్య కూడా...
ఓ రోజు మనకంటూ ఇచ్చినందుకు తోటి మొగవాళ్ళకి...
నా అభినందనలు.. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మన బాధలు మనమే పడాలి.
మనకు శుభాకాంక్షలు మనమే చెప్పుకుందాం!!

చివరిగా.... అదే ఉమెన్సు డే అయితే ప్రత్యేక సెలవు . టీవీల్లో ఆడవాళ్ళ కోసం ప్రత్యేక ప్రోగ్రాంలు,
పాటలు.... మరి మగవారి కోసం ఒక్క. పాట కూడా లేదు

ఇక వాట్సాపుల్లో అయితే ఉదయం నుండి పడుకునే వరకూ ఒకటే మెసేజులు...
వాటిని డిలీట్ చేయాలంటే ఓ పూట పడుతుంది మన గ్రూపులో ఉన్న ఆడలేడీసులో ఇప్పటి వరకూ
మగవారికి ఎవరూ శుభాకాంక్షలు చెప్పినవారు లేరు!
ఏదైనా మగవారిదే  విశాల హృదయం అని నిరూపించారు

ఈ జన్మకింతే....హ్యాపీ మగవాళ్ళ డే.......
--(())--

 

 " శిరీ ..! ఒక సారి ఇలా రా" వేడి నీటి స్నానంతో సేదతీరి , perfume వేసుకుంటున్న శిరీష ని పిలిచాడు కుమార్ లాప్ టాప్ లో పని చేసుకుంటూ ..!

"ఒక్క నిమిషం" జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది .

"అబ్బబ్బ! ఈ పిల్లలు ఒకపట్టాన పడుకోరు కదా! పెద్దవాడిి కి కథలు కావాలి. చిన్నోడు  అయితే నా వొళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్ట మంటాడు. ఇద్దరూ పడుకునే సరికి ఇంత లేట్ అయింది. ఎప్పటి కి పెద్ద వాళ్ళు అవుతారో ఏమో"!   

పిల్లలు ఇద్దరినీ వాళ్ళ రూం లో నిద్రపుచ్చి, తలుపులు వేసి వచ్చెసరికి రోజూ ఇదే టైమ్ అవుతుంది.

"ఆ..చెప్పండి. ఏంటో పిలిచారు కదా! వచ్చి పక్కనే.కూర్చుంది.

ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి,హాల్ కి మరో పక్కగా.ఉన్న బెడ్రూం దగ్గర  ఆగాడు.

దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద. ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరి.చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని...

ఏదో అనబోతున్న శిరీష ని హుష్ అంటూ సైగ చేసి, నిశబ్దం గా తలుపులు మూశాడు కుమార్ .

విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూంలో కి వచ్చింది.

"చూసావుగా శిరీ! వాళ్ళు ఎలా పడుకున్నారో వొళ్ళు తెలియకుండా! ...confusing గా చూసింది అతనివైపు.

"మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట. మీ అమ్మగారు ఏమంటున్నారు?". ఏ భావం మొహం లో కనబడ నీయకుండా అడిగాడు.

ఉలిక్కి పడింది శిరీష, 'తాను పిల్లల రూంలో కూర్చుని, అమ్మతో ఫోన్లో మాట్లాడింది  విన్నాడన్నమాట..

"అమ్మ తమ్ముడు కి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని, వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నదీ?!

"మా ఇంట్లోనే ఉంటాడు లేమ్మా! రూం అడ్జస్ట్ చేస్తాలే!  మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్ లో కి షిఫ్ట్ చెస్తాలే! అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకోళ్లు చేయ్యేసుకొని పడుకుంటారు. చూడటానికి మాకే సిగ్గు వేస్తుంది. హాల్ లో అలా పడుకుంటే అసహ్యం గా ఉంటుందని ఆలోచిస్తున్నా! సరే ..ఏదో చెప్పి వాళ్ళని హల్ లో పడుకో బెడితే వాళ్ళే సర్దుకుంటారు. సర్దు కోక ఏమి చేస్తారు? ఎక్కడికీ పోతారు? అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా పోనీ"

తను మాట్లాడింది అంతా అతను విన్నాడని అర్ధం కాగానే కొంచెం గాభరాగా అనిపించినా, మాట్లాడకుండా తల దించుకుంది.

"శిరీ! ఎక్కడో మా వూళ్ళోఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి, ఇక్కడ మూడు బెడ్రూంల ఫ్లాట్ కొనుక్కునే దాకా సతాయించావు.  సరే! వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా, అని వాళ్లకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకు వచ్చాను."

" మనం ఇక్కడ అద్దెలు కట్టుకొలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసివస్తుంది అని వాళ్లు వొప్పుకున్నారు. వచ్చినప్పటి నుండి మనకు చాకిరీ చేయటం లోనే మునిగిపోయారు వోపిక లేకున్నా!

నువ్వు, నేను పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లి ఏ రాత్రో వచ్చేదాకా, పిల్లలని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు.

వాళ్ళ కి వేరేగా వండి, తినిపించి,ఆడించి, పగలంతా వాళ్ళ, అల్లరి భరించి, సాయంత్రం మనం వచ్చే సరికి కడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు శ్రమపడుతున్నరో గమనించావా ఎప్పుడైనా! ఒక్క రోజైనా హాస్పిటల్ కి తీసుకెళ్లే  అవసరం రానీయకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా?

పూట పూటకీ రుచిగా, వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే, కడుపు నిండా తినటమే తప్ప ఒక్క రోజైనా ఆమెకి సహాయం చేసావా?

నాన్న ఈ వయసు లో కూడా ఇల్లు శుభ్రం గా ఉంచటానికి, పిల్లల్ని శుభ్రం గా ఉంచటానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా!?

ఆదివారం రాగానే , నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు. ఒక వారం ఛారిటీ కలెక్షన్స్, ఇంకో సారి కిట్టిపార్టీ, ఒకవారం పిల్లలతో outing, ఒక వారం రెస్ట్..... అయినా అమ్మ ఒక్క రోజు కూడా విసుక్కొలేదు పైగా"పోనీలే! వారమంతా ఆఫీస్ పని కదా! ఒక్కరోజు దానికి ఇష్టం అయినట్టు ఉండనీ"! అంటుంది.

తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలిసి పోయిన అమ్మకి రెస్ట్ తీసుకో వాలనీ, పడుకోవాలని అనిపించదా చెప్పు!

ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి, రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్లనొప్పి, నడుం నొప్పితో బాధ పడుతుంటే నాన్న ఆమె  కి ఆయిట్మెంట్ రాసి కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే, అది నీకు వేరే విధంగా అనిపించిందా?

80 ఏళ్ల నాన్నకి రాత్రి పూట చాలా సార్లు బాత్రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది. నిద్ర మత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేక పోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది. ఆయన తో పాటు మెళకువ రావటానికి. అది నీకు శృంగారం గా కనిపిస్తున్నదా?

వయసు మళ్ళిన ఇద్దరికీ ఎవరు ముందు తమను విడిచి వెళ్లి పోతారో అని లోలోపల భయం.  దానికి తోడు మనకి కూడా మాట్లాడటానికే time ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరికి ఒకరు నీడగా ఉంటారు. అది కూడా నీకు తప్పు గా ఉంది.

మీ తమ్ముడికి రూం ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు. అతడి హాస్టల్ ఖర్చు మనం ఇద్దాము.

మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాము. మనకు కూడా అలాంటి స్థితి వస్తె ఎలా ఉంటుందో వూహించుకో!

"వార్థక్యం తప్పేది కాదు, తప్పూ కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చక పోతే నేను ఉన్నది ఎందుకు? దండగ కదా!"

"ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను వోప్పు కోను. "  ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదికి చేరుకున్నాడు కుమార్ ....

#ఎవరికిఏంఅర్ధమయితే_అది#
--(())--

Monday, 14 September 2020

 [16:36, 14/09/2020] +91 99660 52134: 💐💐దీర్ఘాయుష్మాన్ భవ అంటే? అర్థం 💐💐

చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు.

“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”

మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు.

”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.

”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.

మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.

పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.

సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కానీ మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.

వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు.

”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తాయో అది శ్లాగ్యము - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం.

ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.
[16:38, 14/09/2020] +91 99660 52134: శ్రీమహాభారతం లోని ధర్మవ్యాధుని కథ!!

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

విలువ : ధర్మము
అంతర్గత విలువ : సత్ప్రవర్తన

పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.

ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.

అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.

కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.

నీతి :

“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.

హిందూ సాంప్రదాయాన్ని ఆచరిద్దాం-పాటిద్ద

Sunday, 13 September 2020

stories

: దాతృత్వం

దాత పిసినారి. చచ్చినా భూమిపై దేన్నీ వదిలిపెట్టడు. అంతా దానం చేసి వెళ్ళిపోతాడు. పిసినారి గొప్ప త్యాగి. చచ్చిన తరవాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తనవెంట ఏదీ తీసికొని వెళ్ళడు. దాతను, పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కార వ్యాఖ్య ఇది!
దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తరవాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి.
దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. లోకంలో ఉదార చరితులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారిగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపర భేదాలను సృష్టించుకొంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతోంది.
దానం చేసేవాడి చేయి ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. యాచించేవాడి చేయి ఎప్పుడూ కిందనే ఉంటుంది. ఇదీ దాతకు, యాచకుడికి ఉన్న తేడా!
సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది. కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లను కూడా ఇవ్వలేదు. ఎక్కడో మూలలో ఉన్న చేదబావి చిన్నదే. కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్నబావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావిలాంటివాడే. పిసినారి సముద్రంతో సమానుడు!
దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక చేయినుంచి మరొక చేతిలోనికి తీసుకొనేలోగా బుద్ధి మారిపోవచ్చు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు! అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలి, శిబి, దధీచి, కర్ణుల వంటివారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి.
సంపాదించిన ధనానికి మూడే మార్గాలుంటాయి... వాటిలో మొదటిది, శ్రేష్ఠమైంది దానమని, రెండోది మధ్య మార్గమైన భోగమని, ఈ రెండూ చేయకపోతే మూడో మార్గం నశించిపోవడమేనని భర్తృహరి సుభాషిత త్రిశతిలో అంటాడు. కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని సందేశం.
పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు... ఎప్పుడూ పరోపకారమే చేస్తాయి. అలా జీవించడం ప్రశంసార్హం.
తేనెటీగలు ఎంతో శ్రమించి, పుప్పొడులను సేకరించి తేనెలను దాచుకుంటాయి. కానీ, ఏం లాభం? ఎంతగా దాచినా, ఆ తేనెలను మనుషులు దోచుకుంటారు. అవసరానికి మించి ఎంతగా దాచినా, అది పరుల పాలవుతుంది.
మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు బాగా చేయాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు. అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి.
ఆర్తులకు దానం చేయడం ఉపయోగం. అందుకే పాత్రోచిత దానం ఫలాన్నిస్తుంది. ఆకలిగొన్నవాడికి ఆహారం పెట్టాలిగాని, అజీర్ణమైనవాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం?
పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలనిస్తాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషికి భగవంతుడు ఇచ్చిన అమూల్య శరీరమూ పరోపకారానికే ఉపయోగపడాలి. బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంతగా పోషించినా, శారీరక శక్తిని పరోపకారం కోసం వినియోగించకపోతే, కొవ్వు పెరగడానికి తప్ప దేనికీ ఉపయోగపడదు.
దాతృత్వం ఒక వరం. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ప్రపంచంలోని చరాచరాలన్నీ అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్యజీవన సాధనాలైనాయి. చేసిన దానం తరతరాలూ చెరిగిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది అదే!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ
 

 మూలాలకు తరలి వెళదాం
××××××××××××××××××××
"నాన్నగారు! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు.          పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు...                ఎందుకని నాన్నా... " నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది వైష్ణవి.

"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే పిలుస్తారు చంద్రశేఖరం గారు...

"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది. కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు. ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు చంద్రశేఖరం గారు.

విషయం గంభీరమైనదిగా అనిపించి కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్న కూచి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది. కూతురి తల నిమురుతూ చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖరం గారు.

"మా నాన్నగారు నాకు 16, మీ అమ్మకు 12 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేశారు. అప్పటికి బాల్యవివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ వృద్ధులైన మా తాతా బామ్మల కోర్కె తీర్చడానికి మాకు పెళ్లి చేసేశారు. అయితే నా చదువు పూర్తయి, ఉద్యోగం సంపాదించేవరకు , మీ అమ్మ వాళ్ళింట్లోనే ఉండటానికి, తనకు కూడా నచ్చినట్లు చదువుకోవడానికి , ఆతర్వాతనే కాపురానికి పంపడానికి రెండువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నా అదృష్టమో, దైవబలమో 23 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. ఉన్న ఊళ్ళోనే ఉండే అవకాశం కలిగింది. అప్పటికి మీ అమ్మ ఇంకా డిగ్రీ చదువులోనే ఉంది. ఇంకా చదువుకుంటానని ఆశ పడింది. సరే అన్నాను. ఒక పి.జి. పూర్తిచేసింది. ఈలోగా గోపాలకృష్ణ, వంశీకృష్ణ పుట్టేరు.  పిల్లల ఆలనపాలనలో చదువు సాగలేదు. ఇంతలో బంగారుతల్లి పుట్టింది. వీళ్ళు ముగ్గురు చదువుల్లో పడేసరికి మళ్ళీ మీ అమ్మకు చదువుపై ధ్యాస మళ్లింది. వొద్దనలేదు నేను. మరొక పి.జి. చేసింది. అప్పుడు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన నాకు చెప్పింది. మన కుటుంబ పోషణకు నా జీతం సరిపోతోంది. నువ్వు ఉద్యోగం చేస్తే, ఇంట్లో నేను ఎంత సహాయం చేసినా కూడా ఒత్తిడితో సతమతమౌతావు. అంతే కాక నీవు చేసే ఉద్యోగం నీకు కాలక్షేపం మాత్రమే... మన చదువు విజ్ఞానాన్ని ఇవ్వాలి కానీ మరొకరి భవిష్యత్తును కాలరాసేది గా ఉండకూడదు, మరొకరి జీవనోపాధిని మనం అడ్డుకోకూడదు అని చెప్పేను.

మీ అందరికి గుర్తుండే ఉంటుంది... మీ అమ్మ ఇంట్లో ఉండి, మీకు బోధించిన జ్ఞానం వలన మీ చదువుల్లో మీకు వచ్చిన బహుమతులు, స్కాలర్షిప్పులు ... మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారని అందరూ అడగడం... మా అమ్మ దగ్గర అని మీరందరు గర్వంగా చెప్పడం..."

కాసేపు చెప్పడం ఆపి పిల్లల వైపు చూసారు. అందరూ తల ఊచారు.

"చదువు జ్ఞాన సముపార్జనకే కానీ ఉద్యోగం చేయడానికి కాదు. మన ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు కదా... ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అవసరానికి మించి ధన సంపాదన చేయాల్సిన పని లేదు"

"నాన్నా! మీ మాటలకు అడ్డువస్తున్నాను అనుకోకండి. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయడం కాదా ఇది?" ప్రశ్నించింది వైష్ణవి.

"శైలజా, నీకు మీ పుట్టింటివారు ఇచ్చిన నగలు, ధనం, నాకు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

" నా దగ్గర బీరువాలో కొన్ని, లాకర్ లోకొన్ని నగలు, బాంక్ లో డబ్బు, మీకు ఇచ్చిన కట్నం డబ్బులు కూడా నా పేరునే వేశారు కదా... మా నాన్న ఇచ్చిన భూమి కూడా నా పేరునే ఉంది" అన్నది శైలజ.

"అమ్మా సుహాసిని, నీ సంగతి?"

"నా డబ్బు, నగలు అన్ని నా దగ్గరే ఉన్నాయి మామగారు"

"వైష్ణవి, నీకు చేయించిన నగలు, నీకు మీ అన్నలు, అమ్మ, నేను ఇస్తున్న డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

"నా దగ్గరే, బాంక్ లో డబ్బులు ఉన్నాయి"

"మీకెవరికైనా భావ వ్యక్తీకరణ లో కానీ, చదువు సంధ్యలలో కానీ, ఏ పని చేయడానికైనా కానీ షరతులు, కట్టుబాట్లు ఉన్నాయా?"

"లేవు"

"అంటే మనింటికి సంబంధించినంత వరకు స్త్రీధనం, స్త్రీస్వేచ్ఛకు భంగం లేనట్లే కదా" నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు.

"చూడమ్మా... మన ఇంట్లో పురుషాధిక్యత కానీ, స్త్రీ అణచివేత కానీ ఉండదు. స్త్రీ భావి తరాలకు ఆరోగ్యమైన సంతానాన్ని అందించాలి. అది మగవారిగా మాకు చేతకాని పని. సాధ్యమైనంత వరకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండి, వేళకు తింటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చక్కని బిడ్డలు కలుగుతారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, తనవాళ్ళు వచ్చేసరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, బయటనుంచి వచ్చేవారికి, ఇంట్లో ఉన్నవారికి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే బంధాలు బాగుంటాయి.  

పగలంతా ఉద్యోగం పేరుతో ఇద్దరు అలసిపోయి వచ్చి, ఒకరి మీద ఒకరు విసుక్కుంటు, ఏదో తప్పనిసరిగా ఇంత ఉడకేసుకుని తినగానే అలసిన శరీరాలు యాత్రికంగా విశ్రాంతి కోరుకొని, మళ్ళీ ఉదయం నుండి ఉరుకులు పరుగులు, తీరా పిల్లల్ని కనే సమయానికి సెలవు దొరక్క వత్తిడి, తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని సరిగ్గా పెంచే తీరిక లేక, ఆయాలకు, బేబీ కేర్ సెంటర్ కు అప్పగించడం, కాస్త పెద్దవగానే హాస్టల్ లో వెయ్యడం, మేము ముసలి అవగానే వృద్ధాశ్రమానికి వెళ్లడం... అవసరం అంటావా?"

అందని దూరాలకు పరుగులెత్తి,  అందే ఆనందాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవడం ఎందుకు తల్లి? సమాజం మారాలంటే మార్పు మనతోనే మొదలు పెడదాం. ఆరోగ్యకరమైన జాతిని అందిద్దాం. ఇదే నా ఉద్దేశ్యం" ముగించారు చంద్రశేఖరం గారు.

"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం మామయ్యగారు. చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నన్ను ఉద్యోగం మాన్పించినందుకు మొదట్లో కోపం వచ్చినా, మీరు, అత్తయ్యగారు, మిగతా కుటుంబసభ్యులు నన్ను ఆదరించిన తీరు, నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మన కుటుంబాలలో ఇద్దరూ ఉద్యోగస్టులవడం వలన బంధువులను పెళ్లిళ్లలో , అదికూడా మొక్కుబడిగా మాత్రమే కలవగలుగుతున్నాం.  ఇప్పుడు ఇంట్లో ఉన్న మేము మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న మిగతా సభ్యులతో తరచుగా తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని సామాజిక అనుసంధాన వేదికల కంటే మన కుటుంబ, బంధువర్గమే పెద్దది, శ్రేయోదాయకమైనది అని అర్ధమైంది.  వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో కొత్తవిషయాలు గూగుల్ అవసరం లేకుండానే తెలుస్తున్నాయి. మీ విశాలమైన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇది నాకే కాదు మరో మూడునెలల్లో మన కుటుంబం లోకి రాబోయే నా బిడ్డకి కూడా నేను నేర్పుతాను" అంది సుహాసిని.

"చాలా సంతోషం సుహాసిని, పిల్లలూ.. మీరేమంటారు..."

"నాన్నగారు, నేను కూడా మీరు పదవీవిరమణ చేసేవరకు ఉద్యోగం మానేస్తాను" అన్నాడు వంశీకృష్ణ...

"చిన్నన్నా... నువ్వు చేసే ఉద్యోగం మానేసేది కాదు... పదిమందికి భుక్తి పెట్టే వ్యవసాయం.. నీ పరిశోధనలు నువ్వు చేస్తూ, మరిన్ని ఎక్కువ పంటలు నిచ్చే సేంద్రీయపద్దతులు కనిపెట్టు..." అన్నది వైష్ణవి

"అంతేనంటావా.. "

"నాన్నగారు మీ ఈ విలువైన ఉపన్యాసం మా వరకే పరిమితం కాకూడదు. మీరు అనుమతిస్తే మన కుటుంబాలలో అందరికి పంపిస్తాను. సాంకేతికత మేలును కూడా చేస్తుందిగా" అన్నాడు వంశీకృష్ణ...
   * ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యనివ్వడం లేదని నన్ను ఆడిపోసుకునే మన కుటుంబంలో ని ఇతరులకు కూడా నా ఉద్దేశ్యం అర్ధమవుతుంది. నావి కుత్సిత, సంకుచిత భావాలు కావని వాళ్ళు కూడా తెలుసుకుంటారు."

కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మూలాలకు తరలి వెళదాం
కాలం విలువ

ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి.
కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... ఆకు చివర మంచు బిందువులా- అని వర్ణిస్తారు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కాలం కదలడం లేదని, మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు... అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి. మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.
సమయపాలనంటే గడియారాన్ని అనుసరించి బతికేయడం కాదు. స్వయం నిర్వహణ. ముఖ్యమైన విషయాలకు ‘అవును’ అని చెప్పగలగడం. ‘కాదు’ అని చెప్పాల్సిన విషయాలకూ, అంతే శక్తితో చెప్పగలగడం. చేయాలనుకున్న పనులే కాదు. చేయకూడనివేమిటో క్రమశిక్షణతో, జీవితం పట్ల బాధ్యతతో వేరు చేయగలగాలి. ‘రేపు ఎక్కడుండాలి’ అని అనుకుంటే, కాలాన్ని ఆ దిశలోనే వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు. ఆధ్యాత్మికమైన ఆలోచనలను ఆకళింపజేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రతించే పని తప్పుతుంది. మనశ్శాంతీ దక్కుతుంది.
చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరూ విజేతలు కాలేదు. విజేతలను చూసి వారు అదృష్టవంతులని ఆసూయపడటంకంటే కాలాన్ని మనసు పెట్టి సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నం కావాలి. కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది! జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటుంటాడు. కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.
జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించాలి. ‘నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.
కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. ఒక రుతువు తరవాత మరొకటి. రోజులు, నెలలు సంవత్సరాల్లో ప్రచండ వేగంతో ఎగిరిపోతున్నట్లు ఉంటుంది. ‘ఏం సాధించలేకపోతున్నాం’ అని చింతించేవారు ఎందరో. కదిలిపోయే ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. దేనికోసం లావాదేవీలు జరుపుతున్నాం... కోపం, అసూయలతోనా, గతం గురించిన వ్యక్తమైన బాధతోనా, భవిష్యత్తు గురించిన చింతతోనా... ఈ భూమ్మీదకు మనమెందుకొచ్చాం, దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకళింపజేసుకోవడానికా... వీటి పై జీవితంలో స్పష్టత అవసరం.
ప్రకాశానికి అడ్డుతగలకుండా ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించాలి. లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు... ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతుంటుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. కాలం నేర్పే పాఠాలెన్నో! కాలం విలువను గ్రహించకపోతే, ఆ తరవాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలి.
- మంత్రవాది మహేశ్వర్‌

🙏 *శుభోదయం*🙏
ప్రాంజలి ప్రభ.. అంతర్జాల పత్రిక
1. *ఎంత సంపాదించినా కలగని ఆనందం.*
*ఒక మంచి మిత్రుణ్ణి సంపాదించినపుడు కలుగుతుంది.*
2. "కోపం కళ్ళల్లో ఉండాలి.... బాధ గుండెల్లో ఉండాలి.... పెదాలపై ఎప్పుడు చిరునవ్వే ఉండాలి
ఇవి మంచివాళ్ళ లక్షణాలు..."!
3.*గెలవడం అంటే మనుషులను కాదు, మనస్సులను గెలవాలి.*
*ముందుకు వెళ్లడం అంటే నలుగురిని తొక్కుకుంటూ కాదు నలుగురిని కలుపుకుంటు వెళ్లాడమే నిజమైన విజయం*

 

 

💐💐💐కథ : కాకి. 💐💐💐 ఈ కథ పూర్తిగా చదవండి

......నాపేరు "కాకి"నాకది మనుషులు పెట్టిన పేరు... "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు... ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.....

నాకు నలుగురు పిల్లలు..... అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ....కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు... కానీ ,మాకు గుడ్లు పెట్టడం ,వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.....

ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను...

పిల్లలేమో ఆకలి అంటున్నాయి.. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది....

"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా".. అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....

ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి... కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను...

సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ...నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు ..వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ ...ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ...

మొత్తం నలుగురు... ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి ...పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి...

"అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా".. అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు...
వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .."ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ... దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు... కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...

ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత....

అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ..
"ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి "అని పోయించుకుని తింటున్నాడు ...
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ....పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???

పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో... మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు... వెంటనే నీళ్లు తాగాడు ...బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది ...
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన...
వాళ్లు తినడం అయిపోయింది.. అందరూ లేచారు ...ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ...అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....

"పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు ...నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని.. నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.....

సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా" ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన...." ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి...

"అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి ...మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి".. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి....

వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు ... బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??

పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??

బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??

ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...

పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి...

ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా ... కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??

ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ..పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??

అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది ...వెంటనే గాల్లోకి ఎగిరాను ...చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు...

గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి... పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది... "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు" అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు" అని ఇంకొకరు... "నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ...
అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది ...అలాగే ఉండిపోయాడు... కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి ... నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను... ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....

రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!
" సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం...

అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..

"ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు" ..రేయ్ !మనిషి అర్థమైందా...

"ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ "....త్వరగా బయటపడరా మనిషి....

ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ....అందుకే  కథకు సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ....రేయ్ మనిషి విను....

"ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం" ...వృధాగా పోవు....

"బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం.... వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు"....

చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్...

చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు.... 

--(())--


రాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు :
+++++++++++++++++

నదులు పర్వతాలు ఉండే పర్యంతం రామాయణ కావ్యం ఉంటుందని, రామకథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామ, అయనం రామాయణం. అంటే రాముని ప్రయాణం. రాముని మార్గమంతా, ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం, ప్రజాహితం, జాతి హితం. ధర్మనిష్ఠని కార్యదీక్షని తను తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. పైగా ఈనాడు అంతా 'రామరాజ్యం' కావాలి అంటుండడం మనం వింటుంటాం, కంటుంటాం. కలలు కంటుంటాం. అదీ రామాయణం విశిష్టత. అదీ రాముని పరిపాలనా ప్రత్యేకత. అదే.. 'రామరాజ్యం' పరమోత్కృష్టత.

పితృవాక్య పరిపాలనకోసం శ్రీరాముడు వనవాసానికి కొచ్చేడు. భరతుడు రాముడిని వెదుక్కుంటూ మందీ మార్బలంతో, పరివారంతో రాముడ్ని కలవడానికి వస్తాడు. భరతుడు రాముడు కలుసుకుంటారు. ఆ సందర్భంలో- భరతుడు రాజు కాబట్టి రాజనీతిజ్ఞతని, ఎన్నో రాజధర్మాలని శ్రీరాముడు భరతునికి చెప్తాడు.

రాముడు భరతునికి వివరించిన ఆ రాజ ధర్మాలను ఓసారి పరిశీలిద్దాం..
©©©©©©©©©©©©

1. రాజ్యాన్ని పాలించే రాజు- దేవుడు లేడు, పరలోకం పర జన్మ లేదు. విశృంఖలత్వంతో ఇంద్రియములు ఏ రకంగా చెబితే ఆ రకంగా భ్రష్టుడేయ్య నాస్తికత్వాన్ని విడనాడాలి.

2. ఆడిన మాట తప్పకూడదు.

3. అసత్యాన్ని పలకరాదు.

4. క్రోధము విడనాడవలెను. క్రోధమువల్ల అనరాని మాటలు మాట్లాడ్డంవలన పాపము వచ్చును.

5. పెద్దలవలన పొరపాటు సంభవించినను తొందరపడి క్రోధము, కోపం తెచ్చుకోకూడదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు.

6. వ్యసనాలకు బానిసైపోకూడదు.

7. అలసత్వమును వదులుకోవాలి. అంటే సోమరితనాన్ని, మందబుద్ధిగా మత్తు మత్తుగా ఉండకూడదు.

8. నేను, చక్రవర్తి అనే అహంకారం ఉండకూడదు. తత్ఫలితంగా నేనే అధికుడ్ని అనుకుని జ్ఞానుల్ని, సిద్ధుల్ని దర్శించకుండా ఉండకూడదు.

9. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే వెంటనే చేయాలి. తర్వాత్తర్వాత చేద్దామనే అశ్రద్ధ వదులుకోవాలి.

10. రాజు ఎప్పుడూ అతి జాగరూకుడై ఉండి అప్రమత్తతతో మెలగవలెను. అప్పుడే రాచకార్యాలు సవ్యంగా సాగును. కాబట్టి మరపున కొనితెచ్చే 'ప్రమాదము'ను వదులుకోవాలి. ఇవీ రాజు ఆచరించవలసినవి.. రాజు వదులుకోవలసినవీ. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, పైన చెప్పిన వాటిలోని అవలక్షణాలను వదులుకుని సుగుణాలతో తను పాలన సాగించాలి.

ఇక రాజ్యపాలనలో చేయవలసిన ఇతర అంశాలను  పరిశీలిద్దాం
%%%%%%%%%%%%%

1. రాజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు మంచిని దృష్టిలో పెట్టుకునే ఉండాలి. ప్రజలమీద ఎనలేని భారాన్ని మోపే అధికమైన పన్నులు వేసి, ప్రజలను పీడనకు గురిచేయకూడదు.

2. రాజు యజ్ఞయాగాదులు చేసి దేవ, పితృ, రుషి రుణాలను తీర్చుకోవాలి. గురువులను మహర్షులను ఆచార్యులను, పెద్దలను పూజించాలి. గౌరవించాలి.

3. రాజ్యములోనున్న దీనుల, హీనుల, అనాథల, అన్నార్తుల, వృద్ధుల యోగక్షేమములు చూస్తూ మెలగాలి. అలా మెలగటం రాజధర్మం.

4. తల్లిదండ్రుల్ని, ప్రజల్నీ ప్రేమతో చూసుకోవాలి. సదాచార సంపన్నత, సత్ప్రవర్తన లోకహితం గావించేవారిని పురోహితులుగా నియమించి యజ్ఞ హోమ ఆధ్యాత్మిక కర్మలు జరిగితే చూడాలి.

5. బుద్ధి కుశలతలోను ఆలోచన శక్తిలోను ఉన్నతంగా ఉండేవారిని, తనతో సమానమైన వారిని, పరాక్రమంలో, రాజుకి తగ్గ జోడి అయ్యేటటువంటి యోధులైనవారిని మంత్రులుగా నియమించాలి. విశ్వసనీయతగలవారిని మాత్రమే మంత్రాంగం చేసేందుకు నియమించుకోవాలి.

6. ప్రలోభాలకు, ఆశలకు, భౌతిక సుఖలాలసకు, వ్యసనాలకు దూరంగా ఉండేవారిని, ఈ దౌర్భల్యాలకు లొంగని దృఢ మనస్తత్వం గలవారిని మాత్రమే ఉద్యోగిగా తీసుకోవాలి. అక్రమాలకి, అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడేవారిని, ధనాశాపరులను దూరంగా ఉంచాలి. ఉంచగలగాలి.

7. అక్రమార్కుల్ని, నేరస్థుల్ని, చెడ్డవాళ్ళను, నేరం రుజువు అయిన తర్వాత మాత్రమే శిక్షించాలి. తప్పులు చేయని, దుర్మార్గులు కాని నిరపరాధులు ఒక్కరైనా శిక్షింపబడకూడదు. ఆ రకంగా నిరపరాధుల్ని శిక్షిస్తే దారిద్య్రం కలుగుతుంది.

8. ఉద్యోగులకు, మంత్రులకు వారు చేసే విధులన్నీ వారికి నిర్దేశించాలి. నిర్దేశించి వారు వారికి అప్పగించిన విధులు, బాధ్యతలు సరిగా సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి. రాజు ఎల్లప్పుడు ప్రజలకు అనువుగా అందుబాటులో ఉండాలి.

9. నిజాయితీ స్వచ్ఛత ఉన్నవారినే, దేశ రక్షణకు బాగా పాటుపడే సేనాపతులుగా, సంబంధిత మంత్రులుగా నియమించి, దేశ రక్షణ పటిష్టంగా, భద్రంగా ఉండేలా చూసుకోవాలి.

10. శత్రువుల, శత్రురాజుల జాడల్ని, ఎత్తుగడల్ని పసికట్టేందుకు చారుల్ని, గూఢచారుల్ని ఏర్పాటుచేసుకోవాలి.

11. దేశభక్తిపరులను, జన్మభూమిమీద నిబద్ధత కలిగినవారినే రాయబారులుగా, ఇతర రాజ్యాలకు నియమించుకోవాలి.

12. అన్నివర్ణములవారు వారి వారి విధుల్ని, ధర్మాల్ని ఆచరించేలా నడిపించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులందరూ ధర్మబద్ధులై ఉండేలా సత్యవర్తనులై ఉండాలి. అలా వారంతా రుజుమార్గంలో ఉంటూ ప్రజలను ధర్మపథంలో, సత్యమార్గంలో నడిచేలా చూడాలి. ప్రజలను నడిపించేలా చేయాలి.

13. ప్రజల అభిమానాన్ని, ఆదరణని తన పరిపాలనా విధులతో విధానాలతో రాజు పొందగలగాలి.

ఇవీ సంక్షిప్తంగా శ్రీరాముడు భ
రతునికి చెప్పిన రాజధర్మాలు. రాజనీతిజ్ఞతలు. ఈ విధులను, విధానాలను, ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతల్ని రాజు అనేవాడు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఆచరించాలి. అమలుచేయాలి. అమలు అయ్యేలా చూడాలి. ఆచరణలో రాజు సఫలీకృతుడు కావాలి. రాజ్యం సుభిక్షం కావాలి. సౌఖ్యవంతం కావాలి. సమృద్ధివంతం కావాలి. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభోగ్యాలతో సిరిసంపదలతో తులతూగాలి. రామరాజ్యం నేపథ్యంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పాలకులు సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడే శ్రీరాముడు అందించిన అసలు సిసలైన రామరాజ్యం మళ్లీ ఆవిష్కృతమవుతుంది.

--(())--