ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
అయితే ఈ శ్లోకం ఎందులోది? ఏ సందర్భంలోది? ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! అందుకే ఈ టపా. ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి (ప్రశ్నలేమీ అడగనులెండి).
కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు (ఆయన పేరు నాకు గుర్తులేదు). ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.
ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.
కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.
ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.
అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ టపా అంకితం....
సేకరణ
వాస్తు శాస్త్రము
(వాస్తు పురాణం):పూర్వకాలంలో అంధతాసురడనే రాక్షసుడు ముల్లోకాల
వాసులను ముప్పతిప్పులు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం
పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం
నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళ
వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి, ఆకాశాలను
ఆవరించి సాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు
భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను
సంభవించువాడు,
సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును
ఆధోముఖంగా భూమి యందు పడవేసి విధానం చెప్పాడు. బ్రహ్మదేవుని ఆనతి
ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు
పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున
పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండునట్లు ఆధోముఖంగా
భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు.
ఇంతమంది దేవతల తేజస్ర్సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ
భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మ దేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా
సృష్టిగావించాడు. వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ, శనివారం,
కృత్రికా నక్షత్రము, వ్యతీపాత యోగము, భద్రనా కరణము గుళికతో
కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై
అధిష్టించి ఈ దేవతలు పీడించుచున్నారు. వీరి నుండి నన్ను కాపాడమని
వాస్తు పురుషుడు బ్రహ్మదేవున్ని వేడుకున్నాడు.అప్పుడు బ్రహ్మదేవుడు
సంతోషించి వాస్తు పురుషా !
గృహములు నిర్మించునప్పుడు, త్రివిధమయిన గృహ ప్రవేశ సమయములందు,
గ్రామ, నగర పట్టణ, దుర్గ దేవాలయ, జలాశయ, ఉద్యానవన నిర్మాణ
సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి
దరిద్రముతో పాటు అడుగడుగునా విఘ్నములు చివరకు మృత్యువు కూడా
సంభవించునని వాస్తు పురుషునికి వరమిచ్చారు. అంతేకాక వాస్తు పరుషునిపై
అష్టదిక్కులలో వున్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో
నివసించే దేవతలు వారివారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు
సర్వసుఖములు, సత్ఫలితులు కలుగునట్లు ఆశీర్వదించారు.
బ్రహ్మదేవుని ఆశీస్సులు ప్రకారము ఈశాన్యమున – ఈశ్వరుడు (ఈశ),
ఆగ్నేయమున – అగ్ని, నైరుతిన ఆదిత్యడు, వాయువ్యమైన – వాయువు, తూర్పున –
వరుణుడు, ఉత్తరమున – కుబేరుడు (సోమ), అష్టదిక్కులలో అధిష్టించిన ఈ
దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమం వుంటే ఆ గృహంలో నివసించే
వాళ్లు సర్వసుఖ సంపదలను పొందుతారు.
ఇదీ వాస్తు – పురాణం. ఈశాన్యములో పూజలు, పవిత్ర కార్యములు
అగ్నేయమున గ్నిదేవునికిసంబంధించిన వంటావార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి,
వాయువ్యమున స్వతంత్రాభిలాష చిహ్నములు, తూర్పున ఆధిత్యునికి
ప్రీతికరమైన పనులు,యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించుట,
కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలు కొనుట, వరుణ స్థానమైన
పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న
దేవతలకు తృప్తిని కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియమాలు
మనకు వెళ్లడిస్తున్నాయి.
గృహ నిర్మాణాలు చాలా రకాలు వీటిలో మనష్యోపయుక్తములు, పశవులకు
సంబంధించిన నిర్మాణాలు, పక్షులకు సంబంధించిన నిర్మాణాలు దేవతలకు
సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా వున్నాయి. వాస్తుశాస్త్రకర్తలు
నిర్మాణాలను ముఖ్యంగా 4 భాగాలుగా విభజించారు. (1) సాధారణ మనుష్య
నివాసములు (2) ప్రభుత్వ నిర్మాణములు (3) దేవతా నిర్మాణములు (4)
సర్వసాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు.
వాస్తు అనేది ఆరోగ్యానికి ముఖ్య కారణం.
సేకరణ
--(())--
04. .చిన్న కధ ప్రాంజలి ప్రభ . అంతర్జాల పత్రిక
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
డాక్టర్ గారు నాకు మంచి మందు ఇవ్వండి తుమ్ములు తగ్గటంలేదు, అవును నీకు
నాకు తెలిసిన మందులన్నీ వ్రాసి ఇచ్చాను, ఎవీ పనికి రాలేదు, మీతుమ్ములు
కాలమే తగ్గించాలి ఇంతకన్నా నేను ఏమి చేయలేను అన్న ఆమాటలకు ఒక్కసారి కల అని
తెలుసుకొని నవ్వు కున్నాడు రామకృష్ణ....
లేచారా నిద్ర , మీరు బాత్ రూమ్లోకి పోయి రండి, కాఫీ తెస్తా సరే అని
లోపలి వెళ్ళగా, వస్తూనే పెద్దగా తుమ్మాడు రామకృష్ణ, చేతులు వణికి ఉన్న
కాఫీ కప్పు ఎగిరి మొహం మీద, చీరమీద పడింది. శ్రీమతి పెద్దగా కేక
పెట్టింది, అప్పుడే భయమేసింది రామకృష్ణకు , చూడండి మీ తుమ్ములు ఎంత
పనిచేస్తున్నాయో, నేను చీరలు మార్చుకోలేక చస్తున్నా ....
ఇదిగో మనం పెళ్ళికి వెళుతున్నాం అక్కడ తుమ్మటం మాత్రం చేయకండి, అందరిలో
పరువు పోతుంది. ఇదిగో పిత్తు వచ్చిన, తుమ్ము వచ్చిన, ఆపలేరని శాస్త్రంలో
ఉన్నది, మీరు నామాట వినండి , అట్లాగే లే నన్ను చొ చొ అంటూ ఉండు ...
తాళి కట్టే సమయాన పెద్దగా తుమ్మాడు, అంతే అప్పుడే శ్రీమతి కుంకం పసుపు
ఉన్న పళ్ళెం క్రింద పడేసింది పెళ్లి ఆగిపోయింది అందరూ అపశకునం అని తిట్టారు
ఒకరు, సరిఐన కట్నం ఇవ్వలేదని పోట్లాడు కున్నారు. అందరూ వెళ్లి పోయారు .
చివరకు రామకృష్ణ భార్యతో వెల్లపొతూ ఉంటే పెల్లికూతురు వాల్లు మీ తుమ్ము
మాకు మంచే చేసింది పెళ్ళివారు మోసకార్లు అని తెలిసింది, ఇప్పుడే
పోలీసులకు అప్పచెప్పి వచ్చాము .
రామకృష్ణ గారు మీ శ్రీమతి ఉన్నదా, మా అమ్మ యి పురిటి నేప్పులతో భాదపడుతున్నది, ఒక్క సారి చూడటానికి
పంపుతారా, మ ఆవిడా భయపడుతున్నది, పక్కింట్లో కొత్తగాదిగాము మేము అన్నాడు
సుబ్బారావు. డాక్టర్ వచ్చి చూసి కడుపులో పిల్ల అడ్డం తిరిగింది
అనిచెప్పారు పెద్ద హాస్పటల్ చేర్పించండి, ఆపరేషన్ చేయాలి అన్నారు,
చేర్చామన్నారు తోడుగా నర్సు ఉన్నది .
నేను మా ఆవిడా వస్తాం మీరు భయపడకండి అని, అమ్బులేన్సుకు పోన్ చేసారా. అ వస్తున్నదండి.
అంబులేన్సులో బయలు దేరారు అందరూ. డ్రైవర్ ప్రక్కన రామకృష్ణ కూర్చున్నాడు
వ్యాను బయలు దేరింది రామకృష్ణ పొగకు తట్టుకోలేక పెద్దగా తుమ్మాడు, డ్రైవర్
ప్రక్కనే ఉన్న బండ రాయిని కొట్టి ఒక్క కుదుపుతో వ్యాన్ కుదుపుతూ ఆగింది, అక్కడే ఉన్న భార్య పెద్దగా అరిచింది, ఆ కుదుపులకు మగ బిడ్డ పుట్టినట్లు కేవ్వుమనికేక వినబడింది.
మా పాలిట పుణ్య దేవతలు అని అందరూ ఆహ్ఫానిమ్చటం మొదలపెట్టారు, మీ తుమ్మె మంచే చేస్తుంది, కాదు నీ కాకే మంచి చేస్తుంది ఆ..... ఆ...
ఇది మా గొప్పకాదండి అంతా ఆ దేవుని లీలలు ఇంట కన్నా మేము ఏమి చెప్పలేము అప్పుడే రేడియో యఫ్ .ఎం వినబడుతుంది
05 ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
రచయత" శ్రీదేవి రామకృష్ణ మల్లాప్రగడ
నేటి కవిత ..... వేరు
జీవమ్ ఒక్కటే - జీవితమ్ వేరు
రూపమ్ ఒక్కటే - గుణం వేరు
కాలం ఒక్కటే - గమ్యం వేరు
వనం ఒక్కటే - ఔషదాలు వేరు..... .... ..
ఆశ ఒక్కటే - ఆశయం వేరు
ఆకలి ఒక్కటే - రుచులు వేరు
ఆరాటం ఒక్కటే - ఆదరణ వేరు
కలం ఒక్కటే - కావ్యాలు వేరు .... ... ...
కత్తి ఒక్కటే - ఉపయోగం వేరు
ఖంఠం ఒక్కటే - గాత్రాలు వేరు
భాష ఒక్కటే - భావాలు వేరు
బంధం ఒక్కటే - బాధ్యతలు వేరు ..... ..
తపస్సు ఒక్కటే - కోరిక వేరు
తేజస్సు ఒక్కటే - విస్తరణ వేరు
బలం ఒక్కటే - ఉపయోగం వేరు
మనస్సు ఒక్కటే - ఆలోచన వేరు .... ....
తరుణం ఒక్కటే - తమకం వేరు
చరణం ఒక్కటే - చరిత్ర వేరు
ప్రయాణం ఒక్కటే - దూరాలు వేరు
ప్రాణం ఒక్కటే - మరణం వేరు .... ....
నవ్వులు ఒక్కటే - ఫలితం వేరు
ఏడుపు ఒక్కటే -- రోగాలు వేరు
తుమ్ములు ఒక్కటే -- కష్టాలు వేరు
తుమ్ములు ఒక్కటే -- ఫలితాలు వేరు
--((*))--
06.. ఇదేమి ఖర్మ...??....::ఐన్ స్టీన్ :::
భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా. బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు . అతను విద్యార్థి గా ఉన్న రోజులలో . ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు. ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.
ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత బాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా, పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టేరు.
"హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చేరు. మీదేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో వుంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.
ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, "ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాదానమిచాడు.
"ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు ఐన్ స్టీన్ ని ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను" ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఏమన్నారంటే!
మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు.అన్నారట.
భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే. దాని గొప్ప దనాన్ని గుర్తుపట్టడం లేదు.
🇮🇳🌹💞❣💞🌹🇮🇳
🙏దయచేసి ఈ విలువైన విషయం ప్రతి భారతీయుడికి అందేటట్లుగా ప్రచారం చేయడం మన కర్తవ్యం🙏
శుభోదయం మిత్రులారా 🙏🙏🙏
భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా. బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు . అతను విద్యార్థి గా ఉన్న రోజులలో . ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు. ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.
ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత బాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా, పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టేరు.
"హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చేరు. మీదేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో వుంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.
ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, "ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాదానమిచాడు.
"ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు ఐన్ స్టీన్ ని ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను" ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఏమన్నారంటే!
మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు.అన్నారట.
భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే. దాని గొప్ప దనాన్ని గుర్తుపట్టడం లేదు.
🇮🇳🌹💞❣💞🌹🇮🇳
🙏దయచేసి ఈ విలువైన విషయం ప్రతి భారతీయుడికి అందేటట్లుగా ప్రచారం చేయడం మన కర్తవ్యం🙏
శుభోదయం మిత్రులారా 🙏🙏🙏
06 *🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు 🌹*
*Q:- బాధ్యత, సేవ రెండూ ఒకటేనా?*
*A:-- కాదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, మన ధ్యేయాన్ని నిర్వర్తించడానికి మనకున్న ఉపకరణం మన శరీరం, మనం అనారోగ్యానికి గురైతే మనకు అసంతృప్తి, అజ్ఞానం వచ్చి మన మనస్సును పాడు చేస్తుంది.*
*మనం ఎందుకు జన్మ తీసుకున్నామో తెలుసుకోలేని పరిస్థితికి మనము వస్తాము, మన తల్లిదండ్రులును, తాతనో, బిడ్డానో, భర్తనో, చూసుకోవడం మన బాద్యత, త్యాగం చేస్తున్నామనే భావనతో సేవ చేయకూడదు.*
*మనం సాయం చేస్తామని ఆత్మలోకంలో ప్రమాణం చేసి వచ్చాం,వారు మనకు స్నేహితులు, వారికి మనం, మనం వారికి సాయం చేసుకోవాలి, అలా ఇద్దరు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలి.*
*వారిని సంరక్షించడం మన బాధ్యత, వారికి సేవ చేయడం కూడా మన బాధ్యతే, కానీ వారు సన్మార్గంలో లేక పోతే వారికి ఎలాంటి సేవ చేయకూడదు.*
*ఇది ఎరుకలో ఉంచుకుని సాయం, సేవ చేయండి. సన్మార్గంలో లేని వారికి సేవ చేసినట్లయితే ఇంకా పాపం మూటకట్టుకున్నట్లే.*
*ఎందుకంటే మీ ద్వారా సేవ చేయించుకుని వారు ఇంకా దుర్మార్గపు ఆలోచనలు, మోసం చేయటానికి ఎక్కువ అవకాశం మన వల్లే వారికి లభిస్తుంది కాబట్టి, వారికి వారి ఆలోచనలు మార్చుకోవాలని చెప్పి, వారు నిజంగా మారారు అని మీకు తెలిస్తేనే సాయం చేయడానికి ఉపక్రమించండి.*
*Q:- బాధ్యత, సేవ రెండూ ఒకటేనా?*
*A:-- కాదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, మన ధ్యేయాన్ని నిర్వర్తించడానికి మనకున్న ఉపకరణం మన శరీరం, మనం అనారోగ్యానికి గురైతే మనకు అసంతృప్తి, అజ్ఞానం వచ్చి మన మనస్సును పాడు చేస్తుంది.*
*మనం ఎందుకు జన్మ తీసుకున్నామో తెలుసుకోలేని పరిస్థితికి మనము వస్తాము, మన తల్లిదండ్రులును, తాతనో, బిడ్డానో, భర్తనో, చూసుకోవడం మన బాద్యత, త్యాగం చేస్తున్నామనే భావనతో సేవ చేయకూడదు.*
*మనం సాయం చేస్తామని ఆత్మలోకంలో ప్రమాణం చేసి వచ్చాం,వారు మనకు స్నేహితులు, వారికి మనం, మనం వారికి సాయం చేసుకోవాలి, అలా ఇద్దరు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలి.*
*వారిని సంరక్షించడం మన బాధ్యత, వారికి సేవ చేయడం కూడా మన బాధ్యతే, కానీ వారు సన్మార్గంలో లేక పోతే వారికి ఎలాంటి సేవ చేయకూడదు.*
*ఇది ఎరుకలో ఉంచుకుని సాయం, సేవ చేయండి. సన్మార్గంలో లేని వారికి సేవ చేసినట్లయితే ఇంకా పాపం మూటకట్టుకున్నట్లే.*
*ఎందుకంటే మీ ద్వారా సేవ చేయించుకుని వారు ఇంకా దుర్మార్గపు ఆలోచనలు, మోసం చేయటానికి ఎక్కువ అవకాశం మన వల్లే వారికి లభిస్తుంది కాబట్టి, వారికి వారి ఆలోచనలు మార్చుకోవాలని చెప్పి, వారు నిజంగా మారారు అని మీకు తెలిస్తేనే సాయం చేయడానికి ఉపక్రమించండి.*
🌹 🌹 🌹 🌹 🌹
07.. పెద్దవయసు - మాట
సేకరణ, రచయత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.
పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?
అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..
"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేసావా?? ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?? కరెంట్ బిల్లు కట్టారా !!!" లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !!!
"మా కొడుకు కోడలు పట్టించుకోరు" అని హైరానా పడకండి..
ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ?? ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !! చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో.. "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి..
"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!!
'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకోండి.. మీ మంచికేనండీ చెబుతున్నాను ...
"మా కాలంలో",
"మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి. మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకోండి ..
పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే స్పందించకండి...
మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!! మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి..
ఇంకొక విషయం...
ఎవరో పెద్దాయన అన్నాడు...
"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని.
కాలం మారింది... మారుతున్నది..
"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"
ఉద్యోగాలైనా అంతే ! పద్దతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??
*చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !! అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...*
భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి... ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది..
హాయిగా పూజలు చేసుకోవచ్చు.. భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయించవచ్చు..
*ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself... I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..*
చివరగా............ మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ... Platform అదిగో ..... సమయం దగ్గర పడింది.
ఇక మనకి బోగీలో ఉన్నవారితో తగువులు... మనస్పర్థలు ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా...
*మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది ...*
పెద్దతనం మనకి వరంలాంటిది ... అది ముఖ్యంగా మన 'అహం' తగ్గించి, మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది ... కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!!
*నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!*
పెద్దవాణ్ణి యైన ఇ మాటలు చదవండి
*పదవి శాశ్వతం కాదు* ఆస్తి పాస్తులు శాశ్వతం కాదు
దేహ దారుడ్యం చతురత ఇవన్నీ ఇతరులను ఇబ్బంది పెట్టేటందుకు కాదు
కష్టనష్టాలకోర్చి సుఖః దుఖం ఓర్చుకోవాలి
లోక కళ్యాణం కాని విషయాలన్నీ *నిరర్థకాలే నిష్ప్రయోజనాలే*
కొండంత మాటల కన్నా *గోరంత పరోపకారం మిన్న*
సృష్టి లో కొనలేనిది వెలకట్టలేనిది * ప్రేమ *
ప్రతీది నాకు డబ్బులు బాగా ఉన్నాయి నేనే అందరికన్నా *గొప్ప*
అనుకునే అవివేకి గుణ హీనుడే
గుణములేని ధనము * రసములేని చెరకు వంటిది *
బంగారు ఉసిరి కాయలు కురిపించే శక్తి గల ఆది శంకరులే తను ఎన్ని ఉన్నా ...
*ఒక సామాన్య మానవుని కొరకే * తన అసమాన శక్తి యుక్తులను వెచ్చించారు
మహా మహులందరూ సాధారణంగా జీవించి * అసాధారణంగా * వెలుగొందారు
చరిత్ర పురాణాలు ఇతిహాసాలు సర్వం * పరోపకారమిదం శరీరం * ఇది సత్యం పునః సత్యం
••••••••••••••••••••••••••••••••••
08..భేతాళుడు చెప్పిన రుణ మాఫీ కథ
‘‘రాజా
నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను ’’అని శవంలోని భేతాళుడు అనగానే
విక్రమార్కుడు నవ్వాడు. ‘‘రాజా ఈ కాలంలో కూడా కథ లేమిటనే కదా నీ నవ్వుకు
అర్ధం. కథలను అంత తేలిగ్గా తీసిపారేయకు! అందమైన అమ్మాయి అబ్బాయికి
పడిపోయేది కథలు వినే! నాయకుల నిజ స్వరూపం తెలిసినా ఓటర్లు పడిపోయేది
ఎన్నికల సమయంలో వాళ్లు చెప్పే కథలు వినే! హీరో అయినా హీరోయిన్ అయినా ముందు
పడిపోయేది కథ విన్నాకే! అందుకే కాలం ఏదైనా కథ పవర్ తగ్గలేదు. కథ చెబుతా
విను అంటూ భేతాళుడు చెప్పడం ప్రారంభించాడు.
***
అనగనగా రెండు రాజ్యాలు.
ఏ
కథ అయినా అనగనగా ఒక ఊరు అని లేదా అనగనగా ఒక రాజ్యం అని ప్రారంభం అవుతుంది.
కానీ అనగనగా రెండు రాజ్యాలు అని చెప్పాల్సి రావడానికి కారణం ఒకప్పుడు ఇదీ
ఒక రాజ్యమే. కాలమాన పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల రెండు రాజ్యాలు
అయ్యాయి. చంద్రవర్మ, విష్ణువర్మ ఈ రెండు రాజ్యాలను పాలిస్తున్నారు. ఇద్దరు
రాజులు ఒకే పాఠశాలలో చదువుకొని వచ్చారు. ఈ ఇద్దరే కాదు పాలించే రాజులందరిదీ
ఒకే సిలబస్, ఒకే స్కూల్. అందువల్ల అంతకు ముందే వీరిద్దరి మధ్య స్నేహం,
వృత్తిపరమైన ద్వేషం, వైరం అన్నీ ఉన్నాయి. రాజ్యాధికారం చేపట్టాక ఇద్దరి
మధ్య పోటీ ఏర్పడింది.
మాకు
పట్ట్భాషేకం చేస్తే రైతుల అప్పులను రాజ ధనాగారం నుంచి చెల్లిస్తామని
ఇద్దరూ హామీ ఇచ్చారు. రంగరంగ వైభవంగా పట్ట్భాషేకం జరిగింది. దేశ దేశాల
ప్రధానులు, దేశంలోని ప్రజలు పట్ట్భాషేకాన్ని వేనోళ్లుగా పొగిడారు.
పట్ట్భాషేక వేడుకలు ముగిశాక ధనాగారం వైపు ఆశగా అడుగులు వేశారు. తాళం తీసి
చూస్తే పట్ట్భాషేకానికి ఎంత ఖర్చు చేశారో అంత మొత్తం సొమ్ము కూడా ధనాగారంలో
లేదు. రైతుల అప్పులు అన్నీ ఇప్పుడే తీర్చలేం అని విష్ణువర్మ చెప్పగానే
రైతుల్లో హాహాకారాలు బయలు దేరాయి. రాజుగారి సొంత ఊరిలోనే రైతులు రోడ్డున
పడ్డారు. గొట్టాలు రోడ్డుపైకి వచ్చి విప్లవ శంఖాలు పూరించాయి. తడబడ్డ రాజు
ఆలోచనలో ఉన్నామని ప్రకటించారు. పొరుగున ఉన్న చంద్రవర్మ సైతం దీన్ని
తీవ్రంగా ఖండించారు. విష్ణువర్మ తన హామీని సంపూర్ణంగా నెరవేర్చకపోతే
పొరుగుదేశం రైతుల కోసం మేము సైతం ఉద్యమిస్తామని చంద్రవర్మ ప్రకటించారు. దీం
తో విష్ణువర్మ తన హామీ నెరవేరుస్తాడని రైతులకు పూర్తి నమ్మకం కలిగింది.
దేవుళ్ల పటాల స్థానంలో రైతులు విష్ణువర్మ ఫోటోలను అమర్చుకున్నారు. రైతులు
నాగళ్లకు విష్ణువర్మ ఫోటోలు తగిలించి పూజలు చేసి పొలం దున్నతున్న బొమ్మలు
రాజ్యమంతా రాజ్యమేలాయి. కొన్ని రోజులు గడిచాయి. లెక్కలు, కూడికలు,
తీసివేతలతో మేధావులు కుస్తీ పట్టారు. చంద్రవర్మ రైతుల అప్పు పాతిక శాతం
తీర్చి మూప్పాతిక శాతం అప్పుకు లిఖిత పూర్వకంగా భరోసా ఇచ్చి గండం నుంచి
బయటపడ్డాడు.
విష్ణువర్మ
మాత్రం అలా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. అమావాస్య అడ్డంగా వచ్చింది,
చక్రవర్తి కరుణించడం లేదు, కోశాధికారికి జలుబు చేసింది అంటూ కాలం
వెళ్లబుచ్చుతున్నాడు. రాజాధి రాజ రాజమార్తాండ జయహో అంటూ విష్ణువర్మ
కీర్తనను వందిమాగదులు వేనోళ్లుగా పొగడసాగారు.
***
రాజా కథ విన్నావు కదా ఇప్పుడు చెప్పు ఇద్దరు రాజుల పోటీలో విజేత ఎవరు? గెలించింది ఎవరు? ఓడింది ఎవరు? అని భేతాళుడు ప్రశ్నించాడు.
‘‘నేను
చంద్రవర్మ పేరు చెబుతానని అనుకున్నావేమో కాదు.. ముమ్మాటికీ విష్ణువర్మదే
విజయం...’’ అన్నాడు విక్రమార్కుడు. ప్రేమలో, యుద్ధంలో అన్నీ చెల్లుబాటు
అవుతాయి. యుద్ధంలో గెలుపు ముఖ్యం, ప్రజాస్వామ్యంలో అధికారం ముఖ్యం. ఎలా
గెలిచాడు అని కాదు గెలవడం ముఖ్యం. కోశాగారం నుంచి నిధులు తీసి రైతులకు
చెల్లించడంలో గొప్పతనం ఏముంది. ఖాళీ ఖజానా... రైతుల కోసం నిధులు ఇచ్చింది
లేదు, మాట నిలుపుకొన్నది లేదు. కానీ పూజలందుకుంటున్న ప్రచారం అంటే ఆషామాషి
వ్యవహారం కాదు. రాజు దేవుని రూపం అంటారు. కానీ ఏకంగా దేవునిలా రాజు పూజలు
అందుకుంటున్నట్టు ప్రచారం పొందడం సామాన్యమైన విజయమా? నా సమాధానం నీకు
నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఏ కోణంలో చూసినా విష్ణువర్మదే విజయం అని
విక్రమార్కుడు చెప్పాడు.
విక్రమార్కుడికి
మౌనభంగం కలగగానే సంప్రదాయం ప్రకారం భేతాళుడు తిరిగి చెట్టుపైకి వెళ్లాలి.
కానీ ఏదో ఆలోచనలో మునిగి భేతాళుడు అక్కడే ఉండిపోయాడు. రాజా నా సందేహం ఇంకా
తీరలేదు. విష్ణువర్మ ఇంతకూ రైతులను రుణవిముక్తి చేశాడా? లేదా? చేయకపోతే
ఎప్పుడు చేస్తాడు ఈ ఒక్క సందేహం తీర్చండి లేకపోతే ఈ ప్రశ్న నన్ను నిద్ర
పోనివ్వదు అని భేతాళుడు వేడుకున్నాడు.
విక్రమార్కుడు
నవ్వి పిచ్చివాడా! దైవలీలను విప్పిచెప్పడానికి మనమెంతటి వారం. ఆ రెండు
రాజ్యాల విభజన జరిగి ఎవరి రాజ్యం వాళ్లు పాలించుకుంటున్న తరువాత కూడా ఇంతకూ
విష్ణువర్మ రాజ్యవిభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే ప్రశ్నకు సమాధానం
లభించలేదు. ఇక రుణమాఫీకి సమాధానం దొరుకుతుందని నువ్వెలా అనుకుంటున్నావు.
దేవుడు ఉన్నాడా? లేడా? అంటే నువ్వేమంటావు. కోడి ముందా గుడ్డు ముందా? అంటే
నువ్వేం చెబుతావు. చెట్టు ముందా? విత్తు ముందా? అని అడిగితే సమాధానం
లభిస్తుందా? అని విక్రమార్కుడు అడిగాడు.
‘‘లేదు
రాజా! బ్యాంకుకు వెళ్లి అడిగితే నీ అప్పు అలానే ఉందంటున్నాడు. పొలంలోకి
వెళ్లి చూస్తే విష్ణువర్మ ఫోటోలకు పూజలు జరుగుతున్నాయి. ఏది నిజం... ఏది
అబద్ధం. అర్ధం కాక మీరైనా సందేహం తీరుస్తారేమోనని అడిగాను’’ అని భేతాళుడు
వినయంగా అడిగాడు. ‘‘యద్భావం తద్భవతి’’ అన్నట్టు దేవుడు ఉన్నాడు అనుకుంటే
ఉన్నాడు లేడు అనుకుంటే లేడు. అలానే రుణమాఫీ అయింది అనుకుంటే అయింది కాలేదు
అనుకుంటే కాలేదు. ఇంతకు మించి ఆలోచిస్తే నా తల కాదు నీ తల ముక్కలవుతుంది
అని విక్రమార్కుడు చెప్పగానే భేతాళుడు బుర్ర గోక్కుంటూ చెట్టు పైకి
వెళ్లాడు. సమాధానం లేని ఇలాంటి ప్రశ్నలపై ఆలోచించడం కన్నా చెట్టుపైన
తలక్రిందులుగా వేలాడడమే మేలు అనుకున్నాడు భేతాళుడు.
09...రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మంచు
దుప్పటి తీసి, మత్తు కన్నులు తెరచి. మొబైల్ ని వెదికి, మాంచి మెసేజ్ టైపు
చేసి, ప్రియ మిత్రుల గుండెల్లో అలజడి సృష్టించి కుర్ర కారులు ఇప్పుడు
విజ్రుమ్భించు తున్నారు, దీనికి కారణం తల్లి తండ్రులు, అవసరానికి మించిన
ధనము. అని భార్యతో రామారావు చెప్పుతున్నాడు. వారు చూసే దృశ్యాలు చుస్తే
నాకు భయమేస్తుంది. నాకు 50 ఏళ్లకు కళ్ళజోడు వస్తే 5 ఏళ్లకే వస్తున్నాయి
పిల్లలకు. ప్రకృతి అందాలు ఎప్పుడు చూస్తారు అదేనాకు భాధ. ఇప్పుడు ఆన్ లైన్
ఉద్యోగాలు, చదువులు ఇంటికో లాబ్ టాబ్ 4 సెల్ ఫోన్లు అవసరమా అవునండి మీ
కాలంలో లేవు ఇప్పుడున్నాయి అంతే . చాలా చక్కగా చెప్పవే అప్పుడు ఒక్కని
సంపాదనతో అందరూ బతికేవారు ఇప్పుడు ఇద్దరు పనిచేసినా ఎల్కేజీ ఫీజు
సరిపోవటంలేదంటున్నారు. సుఖము లేదు పని కళ్ళకు శ్రమ. ఇక ఆపండి మీ సోది మనకి
పిల్లలున్నరు కదా మనం కూడా పిల్లల భవిషత్ కారకులవుతాము కదండీ. అన్నది భార్య
సీత
ఖచ్చితముగా అందుకనే చెప్పేది మన పిల్లలు చెడుదారి పడకుండా నేను నువ్వు గమనించాలి. నిజమే నండి అట్లాగే ఇద్దరం చూద్దమండి.
అందమైన పువ్వును చూడగానే కలిగే ఆకర్షణ వేరు, మొహం, కృతజ్ఞతగా, నిత్యం, ఆ
పువ్వు నే చూడాలనిపించడమ్ ప్రేమ అంటారు. సృష్టి కర్త ఏర్పాటు " మొగ్గకు
రేయి అంతా, చల్లని వెన్నలను పంపించి, చిక్కటి చీకటిని తరిమి రేకులు
విప్పుకొని ఉల్లాసముగా ఉవిల్లురుతూ ఉంటుంది" . గాలి సెగలకు చేరి సంతోష
పడాలను కుంటాయి, భోగానికి సహకరించాలను కుంటాయి, మరికొన్ని దేవుని పాదాలను
చేరి యోగులుగా మారాలను కుంటాయి. పావనమయ్యే జీవితము భగవంతుని సాక్షిగా. పత్ర
హరితాలను పీల్చుకొనే హృదయాలకు పూదోటలు సంజీవ కల్పలతలు. కలువలు, పొన్నలు
మొగలి పొత్తులు నలిగిన కొద్ది పరిమళాలు పెరుగుతాయి. అబ్బా ఏమిటండి మీ వర్ణన
పువ్వునా స్త్రీ నా నీవు ఎదను కుంటే అది.
సంపెంగది
మరో రకం నూన్యత, తెనటీగలు వాటి జోలికో పోవు, భార్య కొప్పులో సంపెంగ
పువ్వులు ధరిస్తే అదొక పారవశ్యం భర్తకు. ప్రకృతి పరవసిమ్చినప్పుడు,
పువ్వులు వికసిమ్చి నప్పడు వచ్చే పరిమళాలు మనసుకు ఉల్లాస భరితాలు. మండు
టెన్డల్లో సీతల పానీయాలు, మల్లె పూల గుభాలిమ్పులు ఆస్వాదించని వారెవరు.
బహుళ
అంతస్తులు భవనములు వచ్చాక, శబ్ద కాలుష్యము పెరిగాక, గాలి నీరు అందని
ప్రాంతలో జీవనములు గడపటం సహజ మానవులకే సాద్యము కావటములేదు. తుమ్మెదలు,
తెనటీగలు పుష్ప గుచ్చాలాపై దాడి చేసి కోరికలు తీర్చుకొవటానికి విపరీత
ప్రయత్నాలు చేస్తున్నాయి. గండు తుమ్మెదలను తరిమే శక్తి పువ్వులకు రావాలి.
ప్రత్యూష వేళల్లో పరిమళాలు వెదజల్లుతూ పరవసించి పోవాలి.
--((*))--
.
10.....ఇమిటండి ఇంత పీనాసి బుద్దులు మీకు, సంపాదించినది కట్టుకు పోతామా, అనుభవించటానికే కదా
కాదని ఎవరన్నారు, నా సంపాదనంతా నీకు మన పిల్లలలుకు కాక ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వను, ఇతర ఖర్చులకు వాడను, అది నీకు తెలుసు.
మరి నీవు నన్ను పీనాసి అను, సన్నాసి అను, ఏబ్రాసి అను ఏ పదముతో నయినా తిట్టు, నేను నోరు విప్పితే నీమీద ఒట్టు.
మీరు కారు కొనుక్కుంటే ఎంతో చక్కగా అన్ని ఊరులు తిరిగి రావచ్చు, చుట్టాల నందరిని కలసి రావచ్చు, భ్న్దు వర్గాన్ని పెంచు కోవచ్చు.
దాని వలన ఫలితాము ఏదన్న ఉన్నదా
ఎందుకు లేదండి సమయము సందర్భము కలసి వస్తుంది, ప్రేమ బంధం పేరుగు తుంది.
దాని కోసం " కారే " కొనాలా పుణ్యక్షేత్రాలు చూడాలన్న, చుట్టాలింటికి పోవాలన్నా క్యాబ్ మీద పోదాం, ఇప్పుడు కొన్నామనుకో మన పుత్రికా రత్నం నడుపుతాడు వాడి వేగాన్ని అడ్డు కట్ట వేయలేము, రోజు చూస్తూనే ఉన్నాము కదా యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారో రోజు వింటున్నాము కదా.
మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఏమి చేస్తారు, కారు కొని డ్రైవర్ను పెట్టు కోవచ్చు కదా అని హెచ్చరించింది. ఏది ఎమన్నా నేను మాత్రం నాకున్నస్కూటర్ మీదే పోతాను, ఎక్కడకన్నా పోవాలన్న బస్సు, రైలు దాని మీదే వెళదాం. మరోసారి ఈవిషయం నాముందు తీసుకు రాకు అన్నాడు భర్త .
ఏమిటే ఆ కాగితాలు తెచ్చావు, ముందు జాగర్త అండి
ఇప్పుడు నాకేమైందని రేపు ఏమైనా జరగ వచ్చు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీలునామా వ్రాసుకొని రిజిస్టర్ చేసుకుంటే మంచిదికదాఅన్నది భార్య .
ఇది నీ ఆలోచనా, లేదా నీ పుత్రుని ఆలోచనా ఎవరిదైతేనేమి మా ఉద్దేశ్యం చెప్పాము ముందు జాగర్తగా అన్నది
నాది గట్టి ప్రాణం " నీకు వడ్డాణం, అబ్బాయికి కాస్ట్లీ కారు కొనలేదని ఏమి ఆలోచనే మీది '
రేపు బిసినెస్ కాన్ఫరెన్స్ పోవాలి చాలా పని ఉన్నది.
నేను నీవు చెప్పినట్లు నీకు గిఫ్ట్ గా 2 కోట్ల పెట్టి కారు కొన్నాను, ఇంటికి తెచ్చాను అందరు మెచ్చు కున్నారు,ఇక మన కుమారుడయితే ఒక్కసారి నడుపుతానని కారు తీసు కెల్లడు
జాగర్తగా వెళ్ళమని చెప్పగా స్నేహితులతో రింగ్ రోడ్డులో౦ అధిక వేగం తో ఆగి ఉన్న బస్సు గుద్దేసి
అక్కడే ప్రాణాలు విడిచాడు.
ఆ విషయం అప్పుడే నాకు ఎవరో ఫోన్ ద్వారా తెలిపారు, స్నేహితులకు గాయాలు దాగిలాయ్ అని
అంతే నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.....
న ఆత్మా కలవరిస్తున్నది.
కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
కాన్ఫరెన్స్ కు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?
వసారాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దాని ప్రక్కన నా కొడుకు దేవుడా!
నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్కగదిలోకి తొంగి చూశాను....
నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.
కొడుకును చూసి వీడు ఎప్పుడు చని పోయాడు అని అడుగు తున్నాను ఎవ్వరు పట్టించు కోవటం లేదు.
భార్యను పిలిచాను.
తనకు నా మాటలు వినిపించలేదు........
మరో గదిలోకి వెళ్ళి చూశాను.
ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు దు;ఖంలో.
" నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను.
.ఎవ్వరూ నన్ను చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను.
అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు.
వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి, వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడ్టం మానేశాను,ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.
మరి వాడెందుకు ఏడుస్తున్నాడు.
అవును నేను చనిపోయాను.
నిజంగానే చనిపోయాను.
' దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు
తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని ఇవ్వు.
.ఇన్ని రోజులు నేను నా వ్యాపార వత్తిడితో నా భార్యను, కొడుకును మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను.
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను, నానా బిడ్డను కూడా తీసుకెళ్లినావు .
ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను.
చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను."
" దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు..నా తల్లి మొహంలో నవ్వును చూడాలి.
.నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు ప్రాణబిక్ష పెట్టు స్వామీ! "
ఓ దేవుడా నాకు నాకొడుక్కి ప్రాణ బిక్ష పెట్టు అని గట్టిగా నిద్రలో అరుస్తున్నాడు
ఏమండి ఏమండి ఏమైంది మీకు అలా కలవరిస్తున్నారు.
అంటూ లేపింది
కళ్ళు తెరిచి చూశాను.
కళ్ళ ముందు నా భార్య.
" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.
అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! మన అబ్బాయిని పిలువు ముందు వాడు బ్రతికి ఉన్నడా
వాడు నిద్ర పోతున్నాడు.
ముందు వాడిని పిలువవే అన్నాడు.
బాబు నాన్న గారు పిలుస్తున్నారు, ఏమిత్తి నాన్న నిక్షేపం లాంటి కలను పాడు చేసావు చెప్పి మొఖం కడుక్కొని వస్తా అని చేపి వెళ్ళాడు.
కాంఫరెన్సు టైం అయిందన్నా నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని
.నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం.
నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను......
ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,
మీరు బ్రతికే ఉన్నారు అంతే చాలు మరో ఆలోచన పెట్టుకోకండి.
ఎం కల గన్నారు.
అబ్బా ఆకల ఒక పీడకల
ఏమిటో చెప్పండి
ఏముందే కారు కొన్నా కొడుకు నేను దేవునిదగ్గర చేరాము అంతే
ఆమ్మో అప్పుడు కలేమి టండి.
ముందు అబ్బాయిని పిలువ ఆంజనేయస్వామి గుడికెళ్ళి పూజ చేయిన్చుకొని మరి కాన్ఫరెన్సుకు బయలు దేరుతా
--(())--
ఓ
No comments:
Post a Comment