Wednesday, 2 September 2020

పెళ్ళిసందళ్ళు* .... ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

Friends
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
ఈకధలపై అభిప్రాయం తెలపండీ
సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఈనాడు జన్మించిన వారికి ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక శుభాకాంక్షలు
నువ్వేం టో తెలుసుకో
సర్వాగం మలచుకో
విశ్వాసం నిలుపుకో
కాలాన్నే తెలుసుకో
......,,,....,,,
*ఓం గం గణపతియే నమః*
విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః!
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే!!
ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్!
తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్!!
పంచమం శక్తి విఘ్నేశం, షష్ఠం ధ్వజ గణాధిపమ్!
సప్తమం పింగళదేవ మష్ట మోచ్చిష్టనాయకమ్!!
నవమం విఘ్నరాజం చ దశమం క్షిప్ర నాయకమ్!
ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీ నాయకమ్!!
త్రయోదశం మహావిఘ్నం భువనేశం చతుర్దశమ్!
నృత్తాఖ్యం పంచదశకం, షోడశోర్ధ్వ గణాధిపమ్!!
గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్థతః!
సంస్మరేత్ సర్వకుశలం స ప్రయాతిన సంశయః!!
*🐀శుభ శుభోదయం🐀*
........
*ఏ రోజు ఏం పూజ చేస్తే జీవితం అద్భుతంగా మారుతుంది?*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
నిత్యం దేవారాధ‌న శుభ‌క‌రం. అయితే ఏ రోజు ఏ పూజ చేయాలో చాలా మందికి తెలియ‌దు. నిజానికి ఏ రోజు ఏ పూజ చేస్తే సంపూర్ణ ఫ‌లాన్ని , అభిష్ట‌సిద్ధిని పొంద‌గ‌ల‌గుతారో తెలుసుకుందాం.
*ఆదివారం చేయాల్సిన పూజలు:*
*ఆదివారం* ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి పేద‌ల‌కు అన్న‌దానం చేస్తే శుభ‌క‌రం. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
*సోమవారం చేయాల్సిన పూజలు:*
సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. అదే విధంగా ప‌ర‌మ‌శివుడిని అభిషేకించి ఆరాధ‌న చేయ‌లి. ఆ రోజున పూజ తర్వాత నెయ్యితో వండిన ప‌దార్థాల‌ను అతిథుల‌కు, బంధువుల‌కు పెట్టి, తాము కూడా స్వీక‌రించాలి.
*మంగళవారం చేయాల్సిన పూజలు:*
ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. శ‌త్రువుల నుంచి న‌ర‌దృష్టి నుంచి విముక్తిపొందుట‌కు శ్రీ‌సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని ఆరాధించి ఆరోజు మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో అన్న‌దానం చేయాలి.
*బుధవారం చేయాల్సిన పూజలు:*
మంచి ఆలోచ‌న‌తో కార్య‌సిద్ధిపొందుట‌కు విద్యార్థుల‌కు మేధాశ‌క్తి పెరిగి ప‌రీక్ష‌ల‌యందు విజ‌యాన్ని సాధించుట‌కుగాను బుధవారం రోజున క‌లియుగం దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామిని మ‌రియు జ్ఞాన స‌ర‌స్వ‌తిని ఆర్చించి ఆరాధించి పెరగ‌న్నంను నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచ‌న శ‌క్తి పెరిగి అన్నింట విజ‌యం సాధించ‌గ‌ల‌రు.
*గురువారం చేయాల్సిన పూజలు:*
ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవంతో పాటు శివునికి అర్చ‌న అభిషేకం చేసి పాలు-నెయ్యితో చేసిన పాయ‌సంతో పాటు ఇత‌ర పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను దేవ‌త‌ల‌కు స‌మ‌ర్పిస్తే కూడా శుభకరం.
*శుక్రవారం చేయాల్సిన పూజలు:*
*శుక్రవారం* రోజు ల‌క్ష్మి ప్రాప్తికై శ్రీ‌ల‌లితాంబ, అష్ట‌ల‌క్ష్ముల‌తో పాటు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం ముత్తైదువుల‌కు తాంబూలంతో పాటు ఫ‌లాలు స‌మ‌ర్పించి తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది.
*శనివారం చేయాల్సిన పూజలు:*
*శనివారం* రుద్రాది దేవతలతో పాటు విష్ణు, శ‌ని, ఆంజ‌నేయ‌స్వామిస్వామి వారి ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో అన్న‌దానం చేస్తే, పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శని దోష నివార‌ణ క‌లిగి శుభం చేకూరుతుంది.....
*మీ...*
ప్రాంజలి ప్రభ
**********
లాల్ కృష్ణ అద్వానీ
1927,నవంబర్ 8 జన్మదిన శుభాకాంక్షలు
ఆయన రాజకీయ ప్రస్థానం ,ఎదుగుదల..
భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ . 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందినాడు.
భారతదేశపు రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందినాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభ ఎన్నికలలో గుజరాత్ లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.విజయం సాధించాడు.
లాల్ కృష్ణ ఆడ్వాణీ
పార్లమెంటు సభ్యుడు,
మాజీ ఉపప్రధాని
మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు
నియోజకవర్గముగాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1927 నవంబరు 8 (వయస్సు: 92 సంవత్సరాలు)
కరాచిరాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీనివాసముఢిల్లీజూన్ 6, 2008నాటికి
ప్రారంభ జీవనం
1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించిన అద్వానీ కరాచీ, హైద్రాబాదులలో విద్య నభ్యసించి 15 సం.ల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)లో ప్రవేశించి ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటపట్టించుకొని ఇంజనీరింగ్ చదువును కూడా మానివేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. దేశ విభజన అనంతరం 12 సెప్టెంబర్ , 1947 నాడు భారత్ కు తరలివచ్చాడు. మహాత్మా గాంధీ హత్య అనంతరం అనేక మంది ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరుపొంది, రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా నియమించబడ్డాడు.
1960, 70 దశాబ్దం
1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే ఢిల్లీమున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యాడు. 1970లో రాజ్యసభకు ఎన్నికైన అద్వానీ జనసంఘ్ లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించాడు. 1975లో మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికైనాడు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం కల్గింది.
1980 దశాబ్దం
కాని ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన లోక్‌సభ స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంక్యను 86 కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించినది కూడా 1989లోనే.
అయోధ్య రథయాత్ర
అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభించిన అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయిననూ అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణను పొందినాడు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.
ఆ తర్వాత పరిణామాలు భారతీయ జనతా పార్టీని కానీ అద్వానీని కానీ అంతగా ప్రభావితం చేయలేదు. 2004 ఎన్నికలలో పరాజయం తర్వాత పార్టీ సీనియర్ నాయకులే అద్వానీపై విమర్శలు గుప్పించారు. ఉమా భారతి, మదన్ లాల్ ఖురానా లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా జిన్నా సమాధి వద్ద విజిటర్స్ బుక్ లో అద్వానీ రాసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి.
పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ
అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో అటల్ బిహారీ వాజపేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండో పర్యాయము 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా మోడో పర్యాయము 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి ఉచ్ఛస్థితిలోకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ఉక్కుమనిషిగా పేరుగాంచాడు.
పార్లెమెంటు సబ్యుడిగా
1970లో తొలిసారిగా రాజ్యసభ ద్వారా లోక్‌సభ లోకి ప్రవేశించారు. 1989 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1980 ప్రాంతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తనపాత్రను పోషించారు. 1989లో తొలిసారిగా లోక్‌సభ లోకి ప్రవేశించారు. లోక్‌సభ లోనూ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనారు
కేంద్ర మంత్రిగా అద్వానీ
1977లో మురార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడా కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మధ్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు కూడా చేపట్టారు.
నాదేశం నా జీవితం
2008లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల కావించాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీత జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.
ప్రధాని అభ్యర్థిగా అద్వానీసవరించు
2007, డిసెంబర్ 10 నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై అటల్ బిహారీ వాజపేయి వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. పాకిస్తాన్ పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్ చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అధ్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. మరళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.
అవార్డులు, బిరుదులు
1999లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలుసవరించు
1927, నవంబర్ 8 న పాకిస్తాన్ లోని కరాచిలో జన్మించారు
1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరిక
1951లో భారతీయ జనతా పార్టీకు పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్లో చేరిక
1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మెన్ గా ఎన్నిక
1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం
1977 మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా నియామకం
1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు
1998 వాజపేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు
1999 ఉప ప్రధానమంత్రిగా నియమిమ్చబడ్డారు
2004 లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు
2005 జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదలిపెట్టాల్సి వచ్చింది
2007 ప్రధాన మంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది
2008 "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు.
..........
*కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడన భోజనాలు ఎందుకు చేయాలి?*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*.....
*కార్తీక వనభోజనాలు 😘
కార్తీక మాసంలో ఉసిరిచెట్టుకు పూజ చేయటం, ఉసిరికాయ పచ్చడి తినటం ప్రధానమైన నియమంగా చెబుతారు.
ఉసిరికి కార్తీకమాసానికి ఉన్న పవిత్ర సంబంధం గురించి మన పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి.
ఇదే విధంగా కార్తీకమాసంలో వనభోజనాలకు ఉసిరి చెట్టుకు మధ్య కూడా ధర్మ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన కారణాలు ఉన్నాయి.
పెద్దలు చెబుతున్న ప్రకారం కార్తీక మాసంలో వనభోజనాలు తప్పనిసరిగా చేయాలి, అదీ కూడా ఉసిరి వనంలో… లేదా చెట్టు కింద వన భోజనం చేయాలి. ఉసిరి చెట్టు, మారెడు చెట్టు రెండూ ఉన్న చోట వనభోజనాలుచేస్తే మరీ మంచిది… పుణ్యప్రదం ఇంకా ఆరోగ్యం కూడా.
వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది.
ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన ఇతర వృక్షాల నడుమన అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని పురాణాల వచనం.
సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను… తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది.
*వనభోజనాల సమయంలో పాటించాల్సిన నియమాలు*
ంంంంంంంంంంంం
వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు.
ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి.
ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు.
ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు.
వనభోజనం అంటే అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్లి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు.
దీని వెనక ఒక పరమార్థం ఉంది. ప్రకృతి మనకు ఆరోగ్యము ఇస్తుంది. అదే విధంగా ఉపద్రవాలు కూడా కలగజేస్తుంది. మనకు ఎల్లప్పుడు ఆరోగ్యాన్ని కలగజేస్తూ.. ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక సారైనా ప్రకృతిని కోరుకోవాలి. దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది?
వనము, అన్నము పరబ్రహ్మ స్వరూాపాలే
కార్తీకమాసంలో వనభోజనాలు పెడతారు.
దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెబుతారు. వనం అంటే పరబ్రహ్మం. అన్నం కూడా పరబ్రహ్మమే. అందుకే ఈ రెంటినీ ఒకే చోట చేర్చి ఆరాధించడంలోని పరమార్థమే వనభోజనాలు అని చెబుతారు.
దీనికి మరొక కోణం కూడా ఉంది. సాధారణంగా వానప్రస్థాశ్రమం అంటే- అరణ్యంలో ఎవరికీ సంబంధం లేకుండా రాగద్వేషాలను విడిచిపెట్టి ఉండగలిగే ఆశ్రమం… అందుకే మన ఋషులు, మునులు వనాలను వేదికగా చేసుకుని నివాసం సాగిస్తూ తపో నిష్టతో భగవంతుని ఆరాధిస్తారు. అందుకే వారు సిద్ధపురుషులుగా పిలువబడుతున్నారు.
మనం కూడా జీవితంలో ఈ లౌకిక ప్రపంచం నుండి దూరంగా వెళ్లి గడిపితే మన అంతరంగం అంతా ప్రక్షాళన అవుతుంది. దీనికి తోడు ప్రశాంతమైన వాతావరణంలో భగవదారాధన చేస్తుంటే ఆ అనుభూతి వేరు కదా… అంతే కాకుండా వన భోజనాలు మనుషులను మాససిక వత్తిడుల నుండి దూరంగా ఉంచుతాయి. బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలను పెంచుతాయి.
పూర్వీకుల నిర్వచనం ప్రకారం ఆశ్రమం మారటం అంటే – ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకున్నట్లు అర్ధం.
ఉదాహరణకు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి మారడం… వానప్రస్థానికి వెళ్లటం అంటే గృహస్థాశ్రమం వీడి మరోక లోకానికి వెళ్లడం… ఇలాంటి మార్పులకు సాధన కావాలి. ఈ సాధనలో ఒక భాగంగా ఈ వనభోజన కార్యక్రమాలను మన పురాణ గ్రంధాలు కూడా నిర్వచిస్తున్నాయి.
శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ఇలా మనం ఆరాధించుకునే దేవతలందరూ కూడా వనభోజాలలో పాల్గొన్నవారే.
*సేకరణ :..........
సాలెపురుగు, పాము, ఏనుగు – ఈ ముగ్గురు భక్తుల గురించి చెప్పుకోవాలి. ఇందులో కథ, తత్త్వము ఉన్నాయి. పూర్వజన్మ సంస్కారాల వల్ల కలుగుతాయి భక్తి అనేది. సాలెపురుగుకీ, పాము, ఏనుగులకీ పూర్వజన్మ కథ ఉన్నది. కృతయుగంలో సాలెపురుగుని; త్రేతాయుగ అంతం, ద్వాపర యుగారంభంలో పాము, ఏనుగులను లీనం చేసుకున్నాడు. కలియుగంలో కన్నప్ప లీనమయ్యాడు. యుగభేదాలు కూడా ఉన్నాయి. ఆయన మాత్రం ఎప్పటివాడో. ఆయన అక్కడ తేజోరూపుడై ఎప్పుడు ఉన్నాడో మనకి తెలియదు. కానీ అనాదియై ఏనాటి యుగాలనాడో వశిష్ఠుని అనుగ్రహించిన వాడు ఆయన.
కృతయుగవేళ మర్కటక కీటకమొక్కటి పూర్వవాసనా
గతమతి దేవదేవు గరకంధరు గొల్వ దలంచి కుంభజ
క్షితి ధరకన్యకాంబు పరిషిక్త శరీరముతోడ నాత్మ ని
ర్గత బహుతంతు పంక్తి గృహకల్పన శిల్పకళా ప్రవీణతన్ !!95!!
కృతయుగంలో ఒక సాలెపురుగు ఉండేది. గూళ్ళు కట్టడం నా లక్షణం. ఆ గూళ్ళేదో శివుడికే కడతాను అనుకొని గూళ్ళు కట్టడం మొదలుపెట్టింది. దానికీ శివాలయం ఎలా ఉండాలి? ప్రాకారాలు, గోపురాలు, కళ్యాణమండపం, ఉత్సవమూర్తుల వివిధ సేవలకి మండపాలు, పరివార దేవతల మండపాలు, ప్రదక్షిణం చేయడానికి ప్రదక్షిణాయతనం, వంటశాల ఉండాలి అని కొంత జ్ఞానం ఉంది. ఇన్నీ జాగ్రత్తగా కట్టింది.
ప్రాకారములు గోపురమ్ములు కొలువుకూటములు నర్తన మందిరములు కోశ
గేహముల్పందిళ్ళు కేళీ నివాసంబు లంతః ప్రదక్షిణాయతన వీథి
యుపహార భోగమండపము గర్భగృహంబు పరిణయ హైమవైభవనిశాంత
మంతఃపురంబు కక్ష్యాంతరంబులు జాలకంబులు మేడలు గణకతోడ
నిభముఖానలజాత చండీశపుండ; రీకలోచన మాతృకాలోకనయన
దక్షిణామూర్తి వటుకాది దైవతముల; నిలయములు గట్టె నత్యంత నిష్ఠతోడ !!96!!
ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళడానికి ద్వారాలు, కిటికీలు, గణపతి(ఇభముఖుడు)కి ఒక గుడి, సుబ్రహ్మణ్యస్వామి(అనలజాత)గుడి, చండీశ్వరుని గుడి, విష్ణుమూర్తి(పుండరీకలోచన)మందిరం, మాతృకాదేవతల మందిరం, దక్షిణామూర్తి మందిరం, వటుక భైరవ మందిరం, మొదలైన దేవతల గుళ్ళు కట్టింది.
సాలెపురుగు కట్టుకున్న గూట్లోకి కూడా వచ్చి కూర్చున్నాడు. పైగా గూళ్ళు మన ధూర్జటి గారికి ఎంత అందంగా కనబడుతున్నాయో చూడండి. ప్రేమగా కట్టుకున్న గూళ్ళు గుళ్ళు అయిపోతాయి.
ప్రాతఃకాల తుషార శీకర చయప్రాప్తిన్ లసనౌక్తికో
పేతా గారములట్లు చెల్వెసగి తద్బిందుచ్ఛటా జాత ఖ
ద్యోతచ్ఛాయల గొంతసేపు బహురత్నో దీర్ణ గేహంబులై
లూతాకల్పిత తంతు సద్మములు వొల్చుం జెప్ప జిత్రంబులై !!97!!
ఆ సాలెగూళ్ళ మీద మంచు చినుకులు పడుతున్నాయి. మంచు చినుకులు పడడం వల్ల ఆ గూళ్ళు ముత్యాలతో కట్టిన గూళ్ళులా కనబడుతున్నాయి. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంతి ఆ బిందువుల మీద పడి సప్తవర్ణాలూ దానిమీద విశ్లేషింపబడుతున్నాయి. అప్పుడు అది రకరకాల రత్నాలతో కట్టిన గూళ్ళలా కనబడుతున్నాయి.
తీరుగనీ గతి నిండులు తీరగగట్టియును గాలిద్రెవ్విన పోగుల్
జారిన పోగులు నదుకం దీరుపనేకాని నిలువదీరక దినమున్ !!98!!
ప్రొద్దున లేచినప్పటి నుంచి దాని పని ఏమిటంటే కట్టినవి సరిగా ఉన్నాయా లేవా? గాలికి గానీ, మంచుకు గానీ తెగిపోయాయా? అని చూసుకొని తెగిపోయినవి అతికించుకుంటూ ఉంటోంది. ఒక్కరోజూ కూడా తీరికలేదు దానికి.
అలా చేస్తూ ఉంటే ఎంతకాలం అలాగే చేయిస్తాడు స్వామి! మనం విసిగిపోకుండా చేస్తే ఇక చాల్లే అని లోపలికి లాక్కుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాక మరి విసుగు రాదు.
సేవింపంగ జెలంది నేమము బరీక్షింపన్ లలాటాక్షుడా
త్మావాసంబున నున్న దీపశిఖి కీలాఖీలతీవ్రప్రభా
వ్యావిద్దంబరమై తగుల్గొని తదీయాగారముల్ ధూమమై
పోవంజేసిన రేగి కీటకము హృద్భూతవ్యథా క్రోధమై!!99!!
భక్తి అనేది పరీక్షా కాలం వచ్చినప్పుడు తేలుతుంది. నిష్ఠ, భక్తి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడే తేలుతుంది. ఏ మనిషి ఏమిటి తెలుసుకోవడానికే భగవంతుడు కష్టకాలం అనేది పెడతాడు. అలాగే భగవంతునిపై మనకున్న భక్తి కూడా అన్నీ అనుకూలిస్తేనే. కాస్త ప్రతికూలమైతే ఎగిరిపోతుంది. సాధకుడికే ఉంటాయి పరీక్షలు, ఏ సాధనా లేనివాడికి పరీక్షలేం ఉంటాయి? కష్టాలన్నీ పరీక్షలు అనుకోవద్దు, పరీక్షలు కష్టాలలా కనబడతాయి.
ప్రతిరోజూ జాగ్రత్తగా కట్టుకొని పెట్టుకుంది. ఈశ్వర సంకల్పం చేత గుళ్ళో పెట్టిన దీపం జ్వాల పెరిగి గూళ్ళు అన్నీ తగులబడిపోయాయి.
...................
శక్తీశ్వరస్వామి ఆలయం, యనమదుర్రు
శివుడు తలక్రిందులుగా దర్శనమిచ్చే శివాలయం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు. శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నవారిగా భావిస్తారు. ఇప్పుడు అటువంటి శివుని విగ్రహాన్నే దర్శించుకోబోతున్నాం. ఇక్కడ శివుడు విగ్రహరూపంలోనే కాదు తలక్రిందులుగా తపస్సు చేస్తూ భక్తులచేత పూజించబడుతున్నారు.
వంద సంవత్సరాల కిందట ఈ దేవాలయం ఒక తవ్వకాలలో బయటపడింది. ఇది త్రేతాయుగం నాటిదని చెబుతారు. ఈ తవ్వకాలలో శివుని విగ్రహం, 3 నెలల బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి.
స్థలపురాణం
యమధర్మరాజు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆయన జీవులను, కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకెళుతుంటాడు. ఒకానొక దశలో యముడు ఈ పనిపై విరక్తి చెంది, శివుడికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ప్రత్యక్షమైన శివుడు ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు లయకారులన్న భయం పోయి ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇస్తారు. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని, గుడిలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణంలో పేర్కొనబడింది.
యనమదుర్రు గ్రామంలో ఉన్న శక్తీశ్వరాలయం విశిష్టమైనది. శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతీదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారు మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు కొలువై ఉండడమూ విశేషమే.
శివుడు తలక్రిందులుగా దర్శనం ఇవ్వటానికి ప్రధాన కారణం ... యమధర్మ రాజు తపస్సు. ఆ సమయంలో శివుడు తలక్రిందులుగా తపస్సుచేస్తూ .. పార్వతీదేవి బాల కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉన్నారు. యముడు ఉన్నపళంగా లోకకల్యాణం కోసం ప్రత్యక్షం కావాలని వేడుకుంటాడు. యముడి కోరికను మన్నించి శివుడు, పార్వతీ యదా స్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానిక కధనం.
Friends
ఓం శ్రీ రాం.. శ్రీ మాత్రేనమః
నేటి ఉదయం తేటగీతి పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
గెలుపు ఓటమి సర్వ సాధారణమ్ము… 
Shared with Your friends
Friends
ఓం శ్రీ రాం.. శ్రీ మాత్రేనమః
నేటి ఉదయం తేటగీతి పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
గెలుపు ఓటమి సర్వ సాధారణమ్ము…
Friends
ఆది పాదావృత్త ఈర్ష్య మణి పూసలు...
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
నిను చూసిన కన్నులు
నిను కమ్మిన వెతలు
నిను చూస్తే ఈర్ష్య
నిను కలవని తలపులు
నిను మార్చే బుద్ధులు
నిను మేపే శక్తులు
నిను చూస్తే ఈర్ష్య
నిను కమ్మే యుక్తులు
నిను తేల్చిన రైతులు
నిను మార్చిన జాతులు
నిను చూస్తే ఈర్ష్య
నిను చేరిన కలతలు
నిను కళలతొవెలుగులు
నిను తరిమే పరుగులు
నిను చూస్తే ఈర్ష్య
నిను వెతికే కనులు
నిను గెలుపు భద్రతలు
నిను ఓటమి నీతులు
నిను చూస్తే ఈర్ష్య
నిను తిప్పిన రేఖలు
నిను మెచ్చేటి కధలు
నిను చూసాక రగులు
నిను చూస్తే ఈర్ష్య
నిను చూసాక గుబులు
నిను కలిస్తే సెగలు
నిను పిలిస్తే దిగులు
నిను చూస్తే ఈర్ష్య
నిను నవ్విస్తె నగలు
నిను నమ్మె వెన్నెలలు
నిను కమ్మె చీకటులు
నిను చూస్తే ఈర్ష్య
నిను చుట్టే నిపుణులు
నిను చుట్టు సమస్యలు
నిను తాకు కిరణములు
నిను చూస్తే ఈర్ష్య
నినుచేరు నియమములు
🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏
🌹 *శుభోదయం* 😀
--------------------
తేదీ :- 24.11.2020
🌻 *మహనీయుని మాట*🙏
------------------------
"గెలిచినవాడు నీతులు చెప్తాడు.. ఓడినవాడు అనుభవాలు చెప్తాడు.. మనం నీతులుకంటే.. అనుభవాలు చెప్పించుకుంటే మంచిది. మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి..! "
--------------------------
🌺 *నేటి మంచి మాట*🦜
---------------------------
"విధి వెయ్యి తలుపులు మూసినా.. ప్రయత్నము ఒక కిటికీ ఐనా తెరుస్తుంది.. కనుక ప్రయత్నం ఆపకు...!"
🌼🍒




















  •  
     
    *కాలంతో కరోనాతో మారుతున్న పెళ్ళిసందళ్ళు*
    ...
    ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు.. 105
    సేకరణ రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


    *పెళ్లి సందడి 1940 కి పూర్వం* 😊
    కానివ్వండర్రా..
    మగ పెళ్ళివాళ్ల బండ్లు అప్పుడే పెద్దినాయుడు గారి గరువుకు చేరాయట...
    ఇంకో ఘడియలో ఊరి పొలిమేరలోకి వచ్చేస్తాయి...
    ఆ మేళగాళ్ళెక్కడ తగలడ్డారో...
    ఎదురువెళ్ళి తీసుకురావద్దూ..
    అబ్బాయీ..
    కాస్త వంట పందిరిలోకి చూసి.. వంటవాళ్లను తొందరపెట్టు..
    విడిదిలోకి ఫలహారాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారో.. లేదో..
    అమ్మా ఆ ముత్తైదువల సింగారం ఎంత వరకొచ్చిందో చూడు..
    ప్రతీవాళ్ళూ పెళ్లి తనకే నన్నట్టు తయారైపోతున్నారేవిటీ... త్వరగా తెమలండీ..
    ఊరి పెద్దలు నలుగురూ వచ్చి పందిరిలో కూర్చున్నారు .. .
    కామేశం..
    వాళ్ళ సంగతి కాస్త చూసుకో నాయనా.. .
    ఆరే అబ్బాయి..
    ఒక్కగానొక్క పిల్లదాన్ని..
    6 మైళ్ల దూరమిస్తావా.. ఏమీ..
    మీ అగ్రహారంలో ఆపాటి పిల్లవాడు దొరక్కపోయాడా..

    అయ్యోరూ..
    కాగడాల వాళ్ళమండీ..
    నాలుగు పాత గుడ్డలిప్పిస్తే, మా పని మీదుంటాం బాబూ.. 
    బావా..
    పెట్రోమాక్సు లయిట్లు ..
    పది తెచ్చాము..
    ఈ ఊర్లో అంతకు మించి లేవట...

    పల్లకి వాళ్ళడుగుతున్నారు.. పొలిమేరలోకి పోయి కరణం గారి తోటదగ్గర తయారుగా ఉంటారట..

    పందిరిలో నాలుగు కుర్చీలు వేయాలి.. ఈ కుర్రాళ్లంతా ఏరిరా..
    సా..మేళం చుట్టూ మూగారూ,
    ఇక ఈ మూకలొస్తే..
    మనమాట ఓ లెక్కా...
    బాబయ్యా...
    మునసబు గారి గుర్రాన్ని తెచ్చానండీ.. ఎక్కడ కట్టమంటారూ...

    అయ్యా పెదరాజు గారు.. మగపెల్లొళ్ళకోసమట...
    అరిటిగెలలు..
    పనసకాయలు పంపారండి..
    రేపటి నుండి ..
    5 రోజులూ దివాణం నుండే పాలు, పెరుగులు పంపిత్తామని సెప్పమన్నారు..

    అయ్యా...
    పెద్ధిశెట్టిగారబ్బాయి నండీ..
    మా నాయన ఈ రొక్కం మీకిమ్మన్నారండి...
    తర్వాత చూసుకుందామని సెప్పాడండి..

    *పెళ్లిసందడి...1940 to 1990*😊
    అయ్యా కట్నం ముఖ్యం గాదండీ..
    మాకు లాంఛనాలేమిస్తారూ... అడబడుచులు ఆరుగురు.. వాళ్ళ సంగతేవిటీ...
    పిల్లవాడికి బండి కావాలట...
    మీ పిల్లకి బంగారం మీరేలాగూ పెట్టుకుంటారుకదా...
    పెళ్లి మీ ఇంటివద్దే...
    మేము తరలి రావటానికి..
    ఎన్ని బస్సులు పెడతారో..
    పెళ్లి కుమారుని బావలు కార్లో తప్పరారట...
    మీ ఇంటి దగ్గర పెళ్లంటే కాస్త ఇబ్బందే.. ఓ రిసార్ట్ కళ్యాణ వేదిక చూద్దురూ...
    కాస్త ఘనంగా పెళ్లిచేస్తే నలుగురూ మెచ్చుకోరూ...
    ఈ రోజుల్లో అంతా టేబుల్ మీల్స్ అంటున్నారు..
    కొంపదీసి.. చాపకూడు అనరుగదా...

    కాస్త బ్యాండు మేళం ఉంటే చూడండి.. మా బంధువర్గానికి  శెలవులు కష్టమట... అటుంచి ఆటే ట్రైన్లకి వెళ్తారుట... వివరాలిస్తాను..
    రిజర్వేషన్స్ దొరుకుతాయేమో చూద్దురూ....

    *పెళ్లిసందడి..1990 to 2020* 😊
    కట్నం మాకు పట్టింపు లేదండీ.. పిల్లలిద్దరూ ఉద్యోగులే కదా...
    కాకపోతే..
    లాంఛనాలు ఘనంగా ఉండాలి.
    పెళ్లి మీరెలా చేశారని మేమడగం..
    రిసెప్షన్ హైదరాబాదులోనే... మాకు సర్కిల్ ఎక్కువండీ..
    తప్పదు...
    ఏ రిసార్ట్ హాలో బుక్  చేయాలి మరి.. ఘనంగా మా హోదాకు తగ్గట్టు చేస్తారుకదా...

    *పెళ్లి సందడి.. మార్చి2020* నుండి.😢  మాఅబ్బాయి పెళ్లి.. ఫలానా అమ్మాయితో...
    వాళ్ళింట్లోనే..
    మీరెవరూ పెళ్ళికి రావద్దు...
    50 మందికే పరిమితం.
    ఆడ పెళ్లి వాళ్ళకి 20 ఇవ్వగా మిగిలింది 30. అందులో మీ పేరు లేదు..
    కనుక మీరొస్తే  పోలీసులు చర్య తీసుకొంటారు..
    అందుకు మా బాధ్యత లేదు..

    ఇక.. పెళ్లిలో..ఎవరి మాస్కులు వారివే.. సానీటైజర్ ఎవరిది వారే..
    మెసేజీలు పెట్టాం..
    లింక్ ఇచ్చాము..
    చూడాలనిపిస్తే...
    మీ కొంపలో నుండే చూసుకోవచ్చు..
    ఖంగారు పడకండి..
    పెళ్ళి భోజనాలు లేవు..
    కరోనా సమయంలో క్యాటరింగ్ వాళ్ళు హోం ఐసోలేషనులో ఉన్నారుట..
    ఇళ్ళు కదిలితే కాళ్లిరగ దీస్తామని.. పోలీసువారు వారికి మనవి చేసుకొన్నారుట.. 

    ఇక పరిస్థితులు చక్కబడిన తర్వాత.. ఘనంగా రెసెప్షను..
    పెట్టుకోవాలని.. ఉభయపార్టీల అంగీకారం.
    అప్పటికి పోయినవారు పోగా.. మిగిలినవారితో..
    అప్పటి ప్రభుత్వ నియమ నిబంధనలనుసరించి..
    రిసెప్షన్ ఉంటుంది....

    గమనిక: ఈలోపు దంపతులిద్దరూ తొందరపడి..
    ఒకరో ..
    ఇద్దరో పిల్లలని కంటే...
    అప్పుడు రిసెప్షన్ ఉండదు..
    గెట్ టు గెదర్.. మాత్రమే... అంతవరకూ...
    Stay Home..Stay Safe.. 😄😢😊😢

    No comments:

    Post a Comment