Thursday, 3 September 2020

04-04-2021


05.. *🌸సంబంధ బాంధవ్యాలు*🌸

మానవుడిది సామాజిక జీవనం. ఒంటరితనం భరించరాని అనుభవం. ప్రతి మనిషికీ తన వారంటూ ఎవరైనా ఉండాలి. మన మంచిని కోరే స్నేహితులు, ఆత్మీయ బంధువుల మధ్య గడపడంలో ఆనందం ఆహ్లాదం ఉంటాయి. మనలోని వేదనలు వారితో చెప్పుకొని కొంత తెరిపిన పడవచ్ఛు మనలోని సంతోషాన్ని సైతం పంచుకొని, దాన్ని రెండింతలు చేసుకోవచ్ఛు సమాజంతో సాహచర్యం చాలా అవసరం. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

జీవితంలో గెలిచేందుకు గొప్ప శక్తి కావాలి. మన ఎదుగుదలను సర్వదా కోరేవారు వెన్నంటి ఉంటే- మనలోని అంతర్గత శక్తి చైతన్యం పొందుతుంది. అది క్రమంగా హృదయాన్ని సింహసదృశమైన బలంతో నింపుతుంది. మన మేలు కోరేవారు సజీవ దైవాలు. మనమంటే ఇష్టపడేవాడు అంధుడైనా, వికలాంగుడైనా, పేదవాడైనా... భగవంతుడి రూపంలో అతడు మనల్ని లక్ష్యానికి చేరువగా తీసుకెళ్తాడు.
మహాభారతంలోని ఆదిపర్వంలో కౌరవులు లక్క ఇంటి దహనం చేసి పాండవులను హతమార్చాలని పన్నాగాలు పన్నుతారు. విదురుడి సన్నిహితుడైన ఖనకుడి సహాయంతో ఆ ప్రమాదం నుంచి బయటపడి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. తోవలో విదురుడు కనిపించి వారికి కొన్ని హితోక్తులు చెబుతాడు. ‘పాండు నందనులారా.... ధార్తరాష్ట్రుల అసూయ కారణంగా ఇప్పుడు మీరు ఒంటరి వారయ్యారు. తక్షణం మీరు మీ మేలుకోరే హితులను బంధువర్గాన్ని వృద్ధి చేసుకోవాలి. ఈ క్రమంలో మీరు జాగ్రత్త...’ అంటూ వారిని ఏకచక్రపురం వెళ్ళమని సలహా ఇస్తాడు. పాండవులు ఆ సూచనను పాటించి ఏకచక్రపురం చేరి భిక్షాటనతో కాలం గడుపుతారు. అయినా వారిలోని ధైర్యం తగ్గలేదు. ఏ మాత్రం నిరాశ చెందలేదు. అక్కడే బకాసురుడు అనే రాక్షసుడు భీమసేనుడి చేతిలో మరణిస్తాడు.
హిడింబాసురుణ్ని సంహరించి అతడి సోదరి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకుంటాడు. పాండవులకు అది తొలి బంధుత్వం. భీమ, హిడింబిల సంతానమే ఘటోత్కచుడు. అతడు పెరిగి పెద్దయి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అతడి మంత్ర తంత్ర విద్యలకు తాను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు. ద్రుపదుడు తన కూతురు ద్రౌపదికి స్వయంవరం ప్రకటించినప్పుడు వ్యాసుడి సలహాపై పాండవులు ఆ స్వయంవరానికి వెళ్తారు. ద్రౌపదిని గెలిచి భార్యగా స్వీకరిస్తారు. దానితో వారికి బలమైన బంధువర్గం ఏర్పడుతుంది. ఇలా... వరస సంఘటనల కారణంగా పాండవులకు హితులు, బంధువర్గం వృద్ధి చెందడంతో అంతులేని ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నింటికీ మించి శ్రీకృష్ణుడి సాన్నిహిత్యం లభించింది.

ఖాండవ దహనం సందర్భంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి అగ్ని దేవుడితో దివ్యాస్త్రాలను ఇప్పించి తన ప్రాణసఖుణ్ని జిష్ణువును చేశాడు. ఈ స్నేహితులు, బంధువులు మహాభారత యుద్ధంలో పాండవుల తరఫున పోరాడి వారి విజయానికి కారకులయ్యారు. మంచి చెలికాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథ్యం వహించడమే కాక భగవద్గీతను బోధించి కర్తవ్యం వైపు నడిపాడు. పాండవులు ఒంటరిగానే ఉండి ఉంటే మహాభారత యుద్ధంలో ఫలితం వేరుగా ఉండేదేమో!
మంచి స్నేహం, ఆత్మీయ బంధుత్వాలు లభించడం మానవుడి విజయానికి చాలా అవసరం. దీనితో పరాధీనత తొలగి భగవంతుడిపై, తమపై విశ్వాసం పెరిగి సమాజంలో చక్కని స్థానం లభిస్తుంది. మంచి సంబంధ బాంధవ్యాల వల్ల కామ క్రోధ మోహాల బంధత్రయాన్ని దూరం చేసుకోవచ్ఛు ఈ పరిణామం మనిషిని పరిపూర్ణుణ్ని చేస్తుంది.
06 *_పళని_*

*పళని దండాయుధ పాణి స్వామి*

*పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా*

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో , మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. 

*దండాయుధ పాణి*

ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను *“పళని మురుగా”* అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని , కౌపీన ధారియై , వ్యుప్త కేశుడై నిలబడి , చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం *“నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో”* -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.

ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠ రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే , వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా , స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుందని పెద్దలు చెప్పారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు.

ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు.
కులందైవళం , బాలసుబ్రహ్మణ్యన్ , షణ్ముఖన్ , దేవసేనాపతి , స్వామినాథన్ , వల్లిమనలన్ , దేవయానైమనలన్ , పళనిఆండవార్ , కురింజిఆండవార్ , ఆరుముగన్ , జ్ఞాన పండిత , శరవణన్ , సేవర్ కోడియోన్ , వెట్రి వేల్ మురుగా ...మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.

ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.

ఇంకొక విషయం ఏమిటంటే , పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా , రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)



*పళని క్షేత్ర స్థల పురాణము:*


పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని , పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని , చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య  నదులలో స్నానం ఆచరించి  ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే , అప్పుడు పెద్దవాడు , వినాయకుడు యుక్తితో ఆది దంపతులు , తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని , వినాయకుడు *“తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది”* అనే సత్యము తెలుసుకుని , కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల , సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు  వెళ్ళినా , అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.

కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదా , దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి , భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదా , అందులోనూ చిన్న వాడు , శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత , గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా , శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు. 


ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని , *“ నువ్వే సకల జ్ఞాన ఫలానివి నాన్నా”* అని ఊరడిస్తారు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి *పళని* అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే *“కావడి ఉత్సవం”* మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.

*కావడి ఉత్సవము - ఇడుంబన్ వృత్తాంతం:*


సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహా ముని ఒకరు. అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందారు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. 

పూర్వము దేవ దానవ యుద్ధములో చాలా మంది దానవులు నిహతులై పోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి , వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అనుకున్నారు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే , తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు , వీడిలో ఉన్న ఆసురీ గుణములను తీసివేయాలి అని తలచి , లోకంలో ఆదిగురువు దక్షిణా మూర్తి , శంకరుడు ఉండేది కైలాసంలో కదా , అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి , *“ఒరేయ్ నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను , వాటిని శివగిరి , శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను , ఒక కావిడి లో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా”* అని ఆజ్ఞాపించారు.

సరే ఇడుంబుడు , వంట్లో ఓపికుంది కదా , కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. శంకరుడు అనుకుంటాడు, ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం , జ్ఞాన రాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నారు , ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి , కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు.

మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి , రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు , ఇంకో వైపు తేలిక అవుతోంది కాని , సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి , ఏమిటిరా ఈ కావిడి అనుకుని , అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నారు. ఇది చూసి  ఇడుంబుడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే , ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి *“ఏమిటా నవ్వు , నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా ? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు , నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో , తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక , స్వామి రెండు గుద్దులు గుద్దారు , ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు , వాడికి తెలిసింది , ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా , మా గురువు గారికి (అగస్త్యుడు) గురువు , సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు.

అప్పుడు వేడుకుంటాడు *“ఈశ్వరా తెలుసుకోలేక పోయాను , మీ చేతి గుద్దులు తిన్నాను , నాకు వరం ఇవ్వండి”* అన్నాడు. ఏమిటో అడుగు అన్నారు స్వామి.
ఇడుంబుడు అన్నాడు , *“స్వామీ , నేను ఈ పళనిలోనే కదా , కావిడి ఎత్తలేకపోయాను , ఈ కావిడి వల్లనే కదా , మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది , అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా , ఒక్క సారి కావిడి పాలతో కాని ,  విభూతితో కాని , పూలతో కాని , తేనెతో కాని , నేతితో కాని భుజం మీద పెట్టుకుని , మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే , అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన , శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో , అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసేయ్యాలి”* అన్నాడు ఇడుంబుడు.

స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి , ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చారు.
అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది , అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే , సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు.

*సుబ్రహ్మణ్య కావిడలు*

అప్పటి నుంచి , తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు.  
అంతే కాక , ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే , భక్తితో , పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్తారు.


అంతటి శక్తివంతమైన క్షేత్రం , తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి , జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం.


*ఈ క్షేత్రమును చేరే మార్గములు:*

పళని తమిళనాడు లోని మధురై సమీపంలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది.

రోడ్ ద్వారా: మధురై , కోయంబత్తూరు , తిరుచిరాపల్లి , చెన్నై , బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి.

రైలు ద్వారా: పళని లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ నుండి మధురై కి , కోయంబత్తూరు కి రైళ్ళు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాల్ ( 46 Km ), దిండిగల్ ( 48 Km ) దూరం లో ఉన్నాయి.

విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు కోయంబత్తూరు ( 116 Km ), మధురై ( 129 Km ), తిరుచిరాపల్లి ( 158 Km ), బెంగళూరు ( 306 Km ), చెన్నై ( 471 Km ) దూరంలో ఉన్నాయి.. 

*వసతి సదుపాయము:*

పళని కూడా మదురైకి దగ్గరగా ఉండడం వల్ల , వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. TTDC వాళ్ళ వెబ్ సైట్ లింక్
http://www.ttdconline.com/User/HotelRoomDetails.aspx?Tid=19

ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే , వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది. దీని లింక్
http://palani.org/accommodation_fees.htm

*ఆలయంలో ఆర్జిత సేవలు:*

పళని స్వామి వారికి జరిగే వివిధ సేవలు, వాటి వివరాలు ఈ క్రింద లంకె లో
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు

క్షేత్రము యొక్క వెబ్ సైట్: 

07....పీనాసి బుద్దులు

ఇమిటండి ఇంత పీనాసి బుద్దులు మీకు, సంపాదించినది కట్టుకు పోతామా, అనుభవించటానికే కదా

కాదని ఎవరన్నారు, నా సంపాదనంతా నీకు మన పిల్లలలుకు కాక ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వను,  ఇతర ఖర్చులకు  వాడను, అది నీకు తెలుసు.

మరి నీవు నన్ను పీనాసి అను, సన్నాసి అను, ఏబ్రాసి అను ఏ పదముతో నయినా తిట్టు, నేను నోరు విప్పితే నీమీద ఒట్టు.

మీరు కారు కొనుక్కుంటే ఎంతో చక్కగా అన్ని ఊరులు తిరిగి రావచ్చు,  చుట్టాల నందరిని కలసి రావచ్చు, భ్న్దు వర్గాన్ని పెంచు కోవచ్చు. 

దాని వలన ఫలితాము ఏదన్న ఉన్నదా

ఎందుకు లేదండి సమయము సందర్భము కలసి వస్తుంది, ప్రేమ బంధం పేరుగు తుంది.

దాని కోసం " కారే " కొనాలా పుణ్యక్షేత్రాలు చూడాలన్న, చుట్టాలింటికి పోవాలన్నా క్యాబ్ మీద పోదాం, ఇప్పుడు కొన్నామనుకో మన పుత్రికా రత్నం నడుపుతాడు వాడి వేగాన్ని అడ్డు కట్ట వేయలేము, రోజు చూస్తూనే ఉన్నాము కదా యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారో రోజు వింటున్నాము కదా.

మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఏమి చేస్తారు, కారు కొని డ్రైవర్ను పెట్టు కోవచ్చు కదా అని హెచ్చరించింది. ఏది ఎమన్నా నేను మాత్రం నాకున్నస్కూటర్ మీదే పోతాను, ఎక్కడకన్నా పోవాలన్న బస్సు,  రైలు దాని మీదే వెళదాం. మరోసారి ఈవిషయం నాముందు తీసుకు రాకు అన్నాడు భర్త .

ఏమిటే ఆ కాగితాలు తెచ్చావు, ముందు జాగర్త అండి

ఇప్పుడు నాకేమైందని రేపు ఏమైనా జరగ వచ్చు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీలునామా వ్రాసుకొని రిజిస్టర్ చేసుకుంటే మంచిదికదాఅన్నది భార్య .

ఇది నీ ఆలోచనా, లేదా నీ పుత్రుని ఆలోచనా ఎవరిదైతేనేమి మా ఉద్దేశ్యం చెప్పాము ముందు జాగర్తగా అన్నది

నాది గట్టి ప్రాణం " నీకు వడ్డాణం, అబ్బాయికి కాస్ట్లీ కారు కొనలేదని ఏమి ఆలోచనే మీది '

 రేపు బిసినెస్ కాన్ఫరెన్స్ పోవాలి చాలా పని ఉన్నది.  

నేను నీవు చెప్పినట్లు నీకు గిఫ్ట్ గా  2  కోట్ల పెట్టి కారు కొన్నాను, ఇంటికి తెచ్చాను అందరు మెచ్చు కున్నారు,ఇక మన కుమారుడయితే ఒక్కసారి నడుపుతానని కారు తీసు కెల్లడు

జాగర్తగా వెళ్ళమని చెప్పగా స్నేహితులతో రింగ్ రోడ్డులో౦ అధిక వేగం తో ఆగి ఉన్న బస్సు గుద్దేసి

అక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆ విషయం అప్పుడే నాకు ఎవరో ఫోన్ ద్వారా తెలిపారు, స్నేహితులకు గాయాలు దాగిలాయ్ అని       

అంతే నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.....

న ఆత్మా కలవరిస్తున్నది.

కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
కాన్ఫరెన్స్ కు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?

వసారాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దాని ప్రక్కన నా కొడుకు దేవుడా!

నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్కగదిలోకి తొంగి చూశాను....

 నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.

కొడుకును చూసి వీడు ఎప్పుడు చని పోయాడు అని అడుగు తున్నాను ఎవ్వరు పట్టించు కోవటం లేదు.
భార్యను పిలిచాను.
తనకు నా మాటలు వినిపించలేదు........
 
మరో గదిలోకి వెళ్ళి చూశాను.  ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు దు;ఖంలో.  " నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను. .ఎవ్వరూ నన్ను చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను. అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు.
వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు. నా స్నేహితునితో నాకు గొడవవచ్చి, వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడ్టం మానేశాను,ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు. మరి వాడెందుకు ఏడుస్తున్నాడు. అవును నేను చనిపోయాను. నిజంగానే చనిపోయాను.

' దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు  తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని ఇవ్వు.
.ఇన్ని రోజులు నేను నా వ్యాపార వత్తిడితో నా భార్యను, కొడుకును  మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను.
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను, నానా బిడ్డను కూడా తీసుకెళ్లినావు .

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను.
చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను."

" దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు..నా తల్లి మొహంలో నవ్వును చూడాలి.
.నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు ప్రాణబిక్ష పెట్టు స్వామీ! "

ఓ దేవుడా నాకు నాకొడుక్కి ప్రాణ బిక్ష పెట్టు అని గట్టిగా నిద్రలో అరుస్తున్నాడు ఏమండి ఏమండి ఏమైంది మీకు అలా కలవరిస్తున్నారు. అంటూ లేపింది కళ్ళు తెరిచి చూశాను. కళ్ళ ముందు నా భార్య.
 
" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట. నిజంగానే నాకు ఇది మరుజన్మనే! మన అబ్బాయిని పిలువు ముందు వాడు బ్రతికి ఉన్నడా
వాడు నిద్ర పోతున్నాడు. ముందు వాడిని పిలువవే అన్నాడు. బాబు నాన్న గారు పిలుస్తున్నారు, ఏమిత్తి నాన్న నిక్షేపం లాంటి కలను పాడు చేసావు చెప్పి మొఖం కడుక్కొని వస్తా అని చేపి వెళ్ళాడు.  
 కాంఫరెన్సు  టైం అయిందన్నా నా భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని .నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం.
నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను......
 
ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య, మీరు బ్రతికే ఉన్నారు అంతే చాలు మరో ఆలోచన పెట్టుకోకండి. ఎం కల గన్నారు.   అబ్బా ఆకల ఒక పీడకల ఏమిటో చెప్పండి ఏముందే కారు కొన్నా కొడుకు నేను దేవునిదగ్గర చేరాము అంతే   ఆమ్మో అప్పుడు కలేమి టండి. ముందు అబ్బాయిని పిలువ ఆంజనేయస్వామి గుడికెళ్ళి పూజ చేయిన్చుకొని మరి కాన్ఫరెన్సుకు బయలు దేరుతా
     
--(())--
      

08.. 🏵కాకి నేర్పే అద్వైతం🏵... 116

ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.

స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.

క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!

విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.

అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. 

అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?

అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణంకలిగినది.

మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.

ఇది ఎంతమంది పాటిస్తున్నారు?

కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.
మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.

కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.

నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని  తెలిపారు......
 
🙏🙏🙏🙏🙏🙏🙏

09..తల దించుకున్నాడు ధర్మరాజు

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని  పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం  కృష్ణుడు ధర్మరాజుని వేరే  రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.

ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.

 అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !

ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా   బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ?.. అని చెప్పడంతో...
ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును  మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!!

ఆ రాజ్యపు సంపదను  గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.

ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్లారు.

కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు...

రాజా...ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు...

కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు...  ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు... అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు !!!

తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !!!

సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు !!!

మరి మన పాలకులు  ఎప్పుడు తెలుసుకుంటారో... ప్రజలు ఎప్పుడు మారుతారో...*

10. ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

*డిస్కౌంటు
" ఏమండి ఏమండి
ఆ గోకుడు ఆపి విషయం చెప్పు అసలే కరోనా కాలం భయంగా ఉందండి భయమెందుకు నేనునున్నానుగా
అదేనండి నాకు భయం భయం వద్దు విషయం చెప్పు ఆ ఎం లేదండి " ఆక్సిజన్ డిస్కోట్  ఇస్తారటండి తీసుకుందామండీ  " అది ఇప్పుడు దేనికే ముందు జాగర్తకండి ఎవరికోసమే మీకోసమే

అదిగో మాట్లాడుతుంటే ఆయాసపడుతున్నారు "అసలే కరోనాలో కఱువు కాలం "
ఆ......   ఆ...   ఆ లేదు ఊలేదు  డబ్బులు మూటకట్టి ఎవరికోసం ఎవరో చెప్పారు పట్టుచీరకొని పిడతపట్టుకొని తిరిగాడుట నాలాంటి ఓడు,  ఎందుకే ఆతొందరాఆ రోగం వస్తే అందరికి వస్తుంది నాకేను అనుకోకు రోజులు  పొతే
అబ్బా మీతో ఎం మాట్లాడినా తంటానే అవునే ఎంతైనా నీమొగుడ్ని, అడుగులో అడుగేసే అమాయకుడ్ని
అంతలేదు వేలు పెడితే కొరకలేరుకదూ ఆ ......
.ఆ ....

సరే బట్టల షాపుకన్నా తీసుకెళ్తారా ఈ రోజు
"క్వాలిటీ లేకుండా ఈచీర అంతా చిల్లులే అని అడిగింది శ్రీమతి శ్రీదేవి "
(అప్పుడే గుర్తుకొచ్చాయి సరోజ మాటలు అడిగింది షాపు యజమానితొ ఇంత డిస్కౌంటు ఇచ్చి క్వాలిటీ ఎలా ఉంటుందనుకున్నారు  అన్నాడు షాపు యజమాని కట్టుకోటానికి పనికిరాని చీర కొన్న డిస్కౌంటు కూడా దండగా
ఈ  చీర కట్టుకున్నానుకో యువకులందరు నా చుట్టూ మూగుతారు ఎక్కడ కొన్నారు అనా మేడం
నీకు పెళ్లైందా ఓంకా కాలదు అయ్యాక ఎలాంటి చీర కొనాలో తెలుస్తుంది, అప్పుడు ఇల్లాంటి చీరలు అమ్మితే మీ ఆవిడే చెబుతుంది అర్ధం అయిందా అ యింది
పక్క సెక్షన్ పొండి అసలైన సిసలైన కొత్త చీరలు ఉన్నాయి    .
ఆ....
ఆ.... 

ఎదో డిస్కౌట్ చీరలు కొంటావని ఇక్కడికి తెస్తే ఖరీదైనవి కొన్నవే అవునండి సంవత్స రానికి ఒకసారి కట్టేందుకే చీరలు ఇవి మరి రోజూ చీరలు కట్టుకోవా మరి రోజు నా మొఖం చూస్తున్నారు ఎం కట్టు కుంటున్నానో  తెలియటలా
పొద్దున్న  ఆఫీసుకు పోయి రాత్రికి వచ్చేవాడ్ని నివేంకట్టుకున్నావో నాకేం తెలుస్తుందే ఆ ఏమన్నవ్
ఏమి అనలేదే అని నాలిక కోరుకున్నాడు శ్రీపతి


--(())--


No comments:

Post a Comment