

7. దక్షిణ కాశి ద్రాక్షారామం :







సేకరణ :6. వసంత మండపంలో శ్రీ రమా సమేత విష్ణుపూజ
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధవారం తిరుమల వసంత మండపంలో ప్రబోధనైకాదశి - శ్రీ రమా సమేత విష్ణుపూజ ఘనంగా జరిగింది.
ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ ఈరోజు ప్రబోధనైకాదశి అని, ఈ విశిష్టమైన రోజున శ్రీ రమాదేవి అమ్మవారిని పూజిస్తే పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నారు.
అశ్వమేథ యాగం చేసిన ఫలం దక్కుతుందని తెలిపారు. మహిళలకు సత్సంతానం కలుగుతుందని, దీర్ఘసుమంగళులుగా ఉంటారని వివరించారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ రమాదేవి అమ్మవారికి తిరువారాధన చేశారు.
ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
అదేవిధంగా, రాత్రి ... 7.15 నుంచి 7.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై డా.మారుతి 'కార్తీక పురాణం - విష్ణువైభవం' పారాయణం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్ఎకె.సుందరవదనాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
******
5. మనసు విచిత్రమైంది. ఒకే ఆలోచన మీద నిలకడగా ఉండదు. మంచి మాటల దారాలతో కట్టినప్పటికీ గాలిపటంలా గిరికీలు కొడుతుంది. కష్టసుఖాలను పక్కపక్కనే ఉంచి ఒకదాన్ని ఎంచుకొమ్మంటే సుఖం వైపే మొగ్గు చూపుతుంది. దుఃఖానికి వెనకడుగు వెయ్యడం, సుఖం కోసం ఆరాటపడటం- రెండూ మనసుకున్న బలహీనతలే. సుఖాస్వాదనకు అలవాటుపడిన మనసు అది తన నుంచి దూరం కావడం ఏ మాత్రం సహించలేదు. కోరికలు నిండిన మనసుతో భగవంతుణ్ని సేవిస్తే అది బానిసత్వం. వాంఛారహిత స్థితితో దైవం ముందు సాష్టాంగపడటం నిజమైన భక్తుడి తత్వం. సర్వేశ్వరుడికి ఇష్టమైంది నిష్కామసేవ.
సుఖం అనే గాలాన్ని చూపించి మనసును మోహింపజేయడం లోక స్వభావం. అస్థిరతకు చిరునామా వంటి మనసును కారణజన్ములు గాటన కట్టేయగలుగుతారు. కోరికలకు తలలూపే నైజాన్ని మాన్పించి కష్టసుఖాలు రెండూ జీవుడి ప్రస్థానంలోని భాగాలే అని దాని చేత ఒప్పిస్తారు. అన్నమాచార్యులు, పోతన వంటి మహాపురుషులు నాటి పాలకులు తమపై విసిరిన ఆశల వలల్ని ఛేదించగలిగారు. తాత్కాలిక కష్టాలను అనుభవించారు. ఆ ఇక్కట్లు వారి చరితను శోభింపజేసి, శాశ్వత మోక్షప్రాప్తికి కారణమయ్యాయి.
అన్ని సమయాల్లోనూ సుఖంగా జీవించగలగడం ఒక నేర్పు. పాంచభౌతికమైన దేహాన్ని ఆకలి దప్పులు బాధిస్తుంటాయి. అవి తీరినప్పటికీ కొంతమంది అసం తృప్తులు నిరాశతో జీవిస్తుంటారు. సిద్ధార్థుడు సతీ సుతులను వదిలి పెట్టాడు. నిరాహారుడై తపస్సు చేశాడు. అతడు పొందిన జ్ఞానోదయ సారాంశం- అన్ని దుఃఖాలకు కారణం కోరికలు అన్న సత్యం.ఈ వాస్తవం కొన్ని శతాబ్దాల పాటు దేశ దేశాల్లోనూ ప్రభావం చూపించింది. పాలకుల నుంచి ప్రజానీకం వరకు ఆశారహిత జీవనంలోని మాధుర్యాన్ని చవి చూశారు.రాజ్య విస్తరణ కాంక్షను విడిచిపెట్టి అశోకుడు అన్ని శోకాల్నీ అధిగమించాడు. నిష్కామంగా ప్రజల్ని సేవించి ప్రజారంజక పాలకుడు అనిపించుకున్నాడు.
ప్రతి ఏడాది కాలం గీసే ప్రకృతి చిత్రం నిష్కామ సేవకు ప్రతీకగా నిలబడుతుంది. సూర్యభగవానుడి ఎండ ధాటికి భూమి బీటలు వారుతుంది. వరుణదేవుడి కరుణా దృష్టికై ఆకాశాన్ని అర్థిస్తుంది. సామాన్యుల శ్రవణేంద్రియాలకు వినిపించని నిశ్శబ్ద సందేశాన్ని ప్రకృతి పరమాత్మకు చేరవేస్తుంది. ఈ నేలతో సంబంధంలేని రుతుపవనాలు ఏ మూల నుంచో వేగంగా వీస్తాయి. ఆకాశం ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఉరుములు ఉరుముతాయి. నీటికై ఎదురు చూసీ చూసీ భూమి అడుగు పొరల్లో ఎండిపోతున్న విత్తనాన్ని నీటి చెమ్మ పలకరిస్తుంది. చల్లని తన స్పర్శతో ఆ గింజకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఎంతో ఉత్సాహంతో భూమి పైపొర దాకా ఎదిగొచ్చిన విత్తనం రెండుగా చీలిన తన భాగాలను ఒక్కటిగా చేసి నమస్కార ముద్రతో ఆకాశానికి ప్రణామం చేస్తుంది. ఏరులుగా నదులుగా పారిన నీరు దాహార్తితో అలమటిస్తున్నవారి గొంతు తడుపుతుంది. నిశ్శబ్
దంగా పైకెదిగిన మొక్క ధాన్య సిరుల్ని రైతుకు అందిస్తుంది.ప్రపంచ చిత్రపటం మీద కాలం గీసిన ఈ చిత్రం ప్రతి ప్రాణికీ సుపరిచితమైందే. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే వర్ణాల కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
పంచభూతాత్మకమైన శరీరంలో కొలువైన మనసు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది- ఏదీ నీది కాదు, నీతో ఏదీ రాదన్న వాస్తవానికి మనసు తలొగ్గక తప్పదు. ప్రలోభపెట్టే కోరికలకు ప్రభావితం కావడాన్ని మనసు తగ్గించుకోవాలి. జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.
sekarana
-
4. కొన్ని జరగకపోతే బాగుండు అనిపిస్తుంది..! దాన్ని ఆపగలిగితే బాగుండు అనిపిస్తుంది.నిస్సహాయంగా నిలబడడం తప్ప మనం ఏమీచేయలేమని అర్థం అవుతుంది. ప్రత్యేకించి ఎవరైనా మరణించినప్పుడు. సరే,అది ఒక వాస్తవం.దాన్ని అంగీకరించాల్సిందే. అయితే, ఎవరైనా చనిపోగానే అతని వ్యక్తిత్వంపై అందరూ సానుకూలంగా స్పందిస్తారు. ఆయన మంచి వాడంటారు,.
మారాజంటారు, గొప్పవాడంటారు, గొప్పగా బతికాడంటారు, ఆయన చేతికి ఎముక వుండేది కాదంటారు, ఆయన సాన్నిహిత్యం ఒక గొప్ప వరమంటారు. బతికి వున్నప్పుడూ ఈ మనిషేకదా మన ముందున్నదీ, మనతో కలిసి తిరిగిందీ, కలిసి బతికిందీ, చనిపోగానే ఒక్కసారిగా ఈ సుగుణాలన్నీ వచ్చి చేరుతాయా? ఖచ్చితంగా కాదని మనందరికీ తెలుసు.
ఒక మనిషి చనిపోగానే మనకు వచ్చే కన్నీళ్ళు మన మనసుని సుభ్రం చేస్తాయి. మనలోని మలినాలని కడిగి పారేస్తాయి. ఆ స్వచ్చమైన మనసుతోనే పోయిన మనిషి గుణగణాలను గుర్తించగలుగుతాము, ఆరాధించ గలుగుతాము. అది మనవారైనా, పగవారైనా. ఒక మనిష ప్రతిభనో గొప్పతనాన్నో గుర్తించడానికి అర్ధం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టడం నిజంగా అన్యాయం. ఇంత కంటే అన్యాయం మనం గుర్తించిన విషయం ఆ చనిపోయిన మనిషికి తెలియకపోవడం!
దీని వల్ల ఏం ప్రయోజనం? అందుకే చెబుతున్నాను!
ఒక్కసారి కళ్ళుమూసుకోండి. చిక్కటి చీకటి మీకు కనబడుతుంది. ఆ చీకటిలోంచి ఒక సన్నని వెలుగు రేఖ ప్రసరిస్తుంది. అది మీకు బాగా ఇష్టమైన వ్యక్తో, మీరు ఆరాధించే మనిషో, మీకు సాయం చేసిన పుణ్యాత్ముడో
మీ జీవితం నిలబెట్టిన దేవుడో, వీళ్ళెవరూ కాదు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అది ఎవరైనా కావొచ్చు. ఆ వెలుగు ఈ భూమ్మీదినుంచి మాయం కాకముందే ఆ మనిషిని గుర్తించండి. వారిలో నచ్చిన విషయాలను రోజూ చెప్పండి. అప్పుడే బంధాలు బతుకుతాయి, వెలుగుతాయి....!!!











*3.పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*




పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*
పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..
వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..
ఇప్పుటి తరం పిల్లలు..
(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)







ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..






వారిస్తే వెర్రి పనులు..
మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,
కానీ కారణం మనమే..
ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..
గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*..
*కష్టం గురించి తెలిసేలా పెంచండి*
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*
ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..
మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..
*అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..
మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..
చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...
గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..
వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే *తల్లిదండ్రులు మారాలి..*
*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*
ఒక్కసారి ఆలోచన చేయండి...
*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*
కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..


















*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*
కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..*
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*
పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...
మనం కూడా మమేకమవుదాం...
భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం..





*2..నేను చాలా గొప్ప అనుకునే వారు ఒక్కసారి....!*
*ఒక ఉన్నతాధికారి రిటైర్ అయ్యాకా తన విశ్రాంతజీవితానగ్ని గడపడానికి గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ కొనుక్కుని స్థిర పడ్డాడు. రోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ తాను గొప్ప అధికారినని, తనను ఎవ్వరూ స సరిగ్గా గుర్తించడం లేదనిలోలోపల ఉక్రోషంతో, చిరాకు పడుతూ ఆవిషయాన్ని రోజూ అక్కడే పార్క్ లో కూర్చున్న మరొక వ్యక్తితో చెపుతూ ఉండేవాడు. కొద్ది రోజులు ఓపికగా ఆయన గొప్పలు విన్న ఆ పెద్దాయన నెమ్మదిగా ఇలా చెప్పాడు.*
*ఇక్కడున్న పెద్దల మందరం ప్రస్తుతం ఫ్యూజ్ లేని బల్బులు / పనైపోయిన ట్యూబులైట్లు లాంటి వాళ్ళమే. అది 20 ఓల్ట్స్, 40 ఓల్ట్స్, 60 ఓల్ట్స్, 100 ఓల్ట్స్, ఎంతైనా ఇక్కడ అందరూ ఒకటే టైపుఅంటూ.. నేను రెండుసార్లు పార్లిమెంటేరియన్ గా మంత్రిగా ఎన్నో పదవులు భాధ్యతగా నిర్వర్తించి విశ్రాంతిగా జీవితం ఇక్కడ ఆనందంగా గడుపుతున్నాను.*
*అదిగో..అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకరు నాసా డైరెక్టర్ గా రిటైర్డ్, ఒకరు మిలటరీ జనరల్ గా రిటైర్డ్, మరొకరు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, ఇంకొకరు ప్రఖ్యాతిచెందిన వైద్యుడు, ఇంకొకరు పేరుగాంచిన చార్టెడ్ అకౌంటెంట్, ఇంకొకరు దేశంలో పేరెన్నికగన్న లాయర్, మరొకరు ప్రపంచంలో అత్యంత పెద్ద కంపెనీలకు ఆ అధిపతి, వాళ్ళెవరూ నాకు చెప్పలేదు.నేనే తెలుసుకున్నాను.*
*ఉదయించే సూర్యుడు,అస్తమించే సూర్యుడు ఒకేరకమైన శక్తినిస్తారని తెలిసీనా.. మన దేశంలో ఉదయించే సూర్యశక్తికి ఆర్య మిచ్చి పూజచేస్తారు కానీ అస్తమించే సూర్యుడుకి కాదు. దానీని గౌరవించి నమస్కరిస్తారంతే!*
*ఇది గుర్తుపెట్టుకుని ఒకప్పుడు మనం ఏమిటి అన్నది కాదు, ఇప్పుడు ఏమిటి అని ఆలోచించుకుంటే విశ్రాంత జీవితాన్ని కూడా ప్రశాంతగా గడపగలుగుతాము అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.*
*పాపం జీవిత సంధ్యాసమయంలో అవసానదశలో కూడా ఇంకా కీర్తి కండూతి కోసం వెంపర్లాడే పెద్దాయన ఆలోచనలో పడిపోయాడు.*
*మనిషి జీవుతంలో వాస్తవపరిస్థితులు ఎరిగి సత్యంలో జీవిస్తే జీవితమంతా ఆనందమే కదా...!శుభోధయం
1.
*ప్రసాదాల లోగుట్టు* ( *Medical benefits of Hindu Prasadam*)


ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .
*జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి*
" బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .
*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*
' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .
*మేధస్సును పెంచే దద్ధోజనం*
' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది .
*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ '*
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం .
*శ్లేష్మాన్ని తగ్గించే ' పూర్ణాలు "*
పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .
*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*
' బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం
*కొబ్బరి పాల పాయసం*
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు _కలకండ_ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.
అవును ఇది ఒక చేదు నిజం.!!
వాళ్ళు....
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!
నడక అలవాటు ఉన్నవాళ్ళు.!_
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!
వాళ్ళు.....
ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
వాళ్ళు....
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు!
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు!
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!
వాళ్ళు..
అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!
స్నేహంగా మెలిగే వాళ్ళు...!
తోచిన సాయం చేసేవాళ్ళు..!
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!
వాళ్ళు...
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు...!
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు....!
వాళ్ళు..
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!
వాళ్ళు ...
తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!
ఆచారాలు పాటించే వాళ్ళు..!
తిధి,వారం ,నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!
వాళ్ళు ..
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!
లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు...!
చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!
వాళ్ళు ..
తలకు నూనె రాసుకునే వాళ్ళు .!జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!కాళ్ళకు పసుపు రాసుకునే వాళ్ళు...!
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !
ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువులతో స్నేహం కాకుండా...
వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం.....
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
మీకు తెలుసా ?
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు.
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి.
లేదంటే .....లేదంటే ....
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో, స్నేహంతో కూడి ఉండే తరం.
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది!
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం!
ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది!
లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది ! 🙏
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం!
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.
మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లలకు మంచి సంస్కారం అందివ్వండి 🙏
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి...
సంస్కారం లేని దేశంగా ... సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని మార్చేయ్యకండి.!!!
తప్పులను సరిదిద్దగలది సంస్కారమే! సర్కారు చేసే చట్టాలు కాదు..._🙏
రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను, స్నేహాన్ని కూడా అందిద్దాం.
లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు.
అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి. 🌹🙏
అజ్ఞాత రచయితకు నమస్కారములతో...
సేకరణ🌹🌹🌹🌹🌹
🌹తల్లితండ్రుల గొప్పతనం🌹
తల్లితండ్రుల గొప్పదనం గురించి - శాస్త్రాలలో చెప్పబడిన విధానం.
01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.
02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0
03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.
04. సత్యం తల్లి
జ్ఞానం తండ్రి.
05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.
06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం
08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.
09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది.
10. తల్లిని మించిన దైవం లేదు - గాయత్రిని మించిన మంత్రం లేదు.
🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment