కాలం విలువ
ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి.
కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... ఆకు చివర మంచు బిందువులా- అని వర్ణిస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్. కాలం కదలడం లేదని, మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు... అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి. మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.
సమయపాలనంటే గడియారాన్ని అనుసరించి బతికేయడం కాదు. స్వయం నిర్వహణ. ముఖ్యమైన విషయాలకు ‘అవును’ అని చెప్పగలగడం. ‘కాదు’ అని చెప్పాల్సిన విషయాలకూ, అంతే శక్తితో చెప్పగలగడం. చేయాలనుకున్న పనులే కాదు. చేయకూడనివేమిటో క్రమశిక్షణతో, జీవితం పట్ల బాధ్యతతో వేరు చేయగలగాలి. ‘రేపు ఎక్కడుండాలి’ అని అనుకుంటే, కాలాన్ని ఆ దిశలోనే వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు. ఆధ్యాత్మికమైన ఆలోచనలను ఆకళింపజేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రతించే పని తప్పుతుంది. మనశ్శాంతీ దక్కుతుంది.
చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరూ విజేతలు కాలేదు. విజేతలను చూసి వారు అదృష్టవంతులని ఆసూయపడటంకంటే కాలాన్ని మనసు పెట్టి సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నం కావాలి. కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది! జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటుంటాడు. కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.
జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించాలి. ‘నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.
కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. ఒక రుతువు తరవాత మరొకటి. రోజులు, నెలలు సంవత్సరాల్లో ప్రచండ వేగంతో ఎగిరిపోతున్నట్లు ఉంటుంది. ‘ఏం సాధించలేకపోతున్నాం’ అని చింతించేవారు ఎందరో. కదిలిపోయే ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. దేనికోసం లావాదేవీలు జరుపుతున్నాం... కోపం, అసూయలతోనా, గతం గురించిన వ్యక్తమైన బాధతోనా, భవిష్యత్తు గురించిన చింతతోనా... ఈ భూమ్మీదకు మనమెందుకొచ్చాం, దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకళింపజేసుకోవడానికా... వీటి పై జీవితంలో స్పష్టత అవసరం.
ప్రకాశానికి అడ్డుతగలకుండా ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించాలి. లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు... ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతుంటుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. కాలం నేర్పే పాఠాలెన్నో! కాలం
విలువను గ్రహించకపోతే, ఆ తరవాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలి.
- మంత్రవాది మహేశ్వర్
మహర్షి శంఖం !
అనగనగా ఒకరోజు. ఒక ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు."వజ్రాల హారం వేసుకుని మరీ బయల్దేరారేంటండీ..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా ఏంటీ..?" ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి.
"నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ...? పది వేళ్ళకూ ఉంగరాలు పెట్టుకోలేదూ...? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది" అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి. ఇంతలో మూడో వ్యాపారి కలుగ జేసుకుని.. "డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు, నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు... ఇదంతా సంపద వల్లనే కదా...!!" అంటూ చెప్పుకొచ్చాడు.
"మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే... అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి" మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైనవాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక.. మహర్షిని ఆటపట్టించసాగారు."నీ దగ్గర ఏముంది ముసలోడా...?" అన్నాడొక వ్యాపారి.ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ...
"నా దగ్గరేముంటుంది నాయనలారా...! అంటూ, జోలె లోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపుతూ... ఇది తప్ప నా దగ్గర విలువైనది ఏమీ లేదు" అన్నాడు. "అయినా.. ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే...!" అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు. దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు.పడవ అలా నది మధ్యలో సాగుతుండగా... ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి, బలమైన ఈదురుగాలులు వచ్చాయి.
గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపే అతను "సాములూ.. అందరూ గట్టి అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు" అని చెప్పాడు.దీంతో... వ్యాపారులంతా పెద్ద పెట్టున... రక్షించండి... రక్షించండి... అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండే వారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి.. వ్యాపారులను, మహర్షిని కాపాడారు.
బ్రతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ... మహర్షి వద్దకు వచ్చి... "నిన్న ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా.. అవన్నీ మనసులో పెట్టుకోకుండా, శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం..." అంటూ, అన్యధా భావించకుండా, దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు.అప్పుడు మహర్షి నవ్వుతూ... "నాయనలారా... డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు" అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంటంటే పిల్లలూ... ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదని అర్థం.
*****
ఈరోజు మొగాళ్ళ దినం ....!
అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి
వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న......
మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. ఎందుకో... మచ్చుకు కొన్ని ....
చెడ్డి చొక్కాతో బాల్యం అంతా గడిపెయ్యాలి. కొన్ని సార్లు చెడ్డి కూడా వెయ్యరు చదువు చదివితే సరిపోదు
మొగాడివి రాంక్ రావాలి అని అరచి గోల చేస్తారు.
భయమేసినా భయపడి చావకూడదు. మగాడు భయపడేది ఏంటి అంటారు. ఎలకవచ్చినా... పాము వచ్చినా బల్లి చచ్చినా.. మనమే తియ్యాలి... వారు తియ్యరు అరవడం మాత్రమె చేస్తారు.
ఉద్యోగాలు చెయ్యల్సింది మనం.... కోయిలమ్మ.... కుంకుమరేఖ... రచ్చబండలు...
లాంటి సీరియల్స్ చూసేది వాళ్ళు. నోములు వ్రతాలు వాళ్ళకి... సరుకులు,సామాన్లు తేవాల్సింది మనం. పెళ్లి చేసుకుంటే.. వాళ్ళని బుట్టలో తెస్తారు మనల్ని బుట్టలో వేసుకుంటారు
పట్టు చీరలు వుంటాయి కాని పట్టు పాంటులు వుండవు, ఉన్నా పెట్టరు. మనం అమ్మాయిలని చూసినా...
వాళ్ళు మనన్ని చూసినా... పళ్ళురాల గోట్టేది మనన్నే...
ఫలానా ఆవిడ మొగుడు అని చెప్తారు కాని... ఫలానా వాడి పెళ్ళాం అని ఎందుకు అన రో...
కాఫీ ఇస్తే తాగాలి.లేకపోతే... మంచినీళ్లని కాఫీలా భావించాలి... నోరు ఇచ్చాడు..
కాని వాడకూడదు. ఇలాంటి బాధల మధ్య కూడా...
ఓ రోజు మనకంటూ ఇచ్చినందుకు తోటి మొగవాళ్ళకి...
నా అభినందనలు.. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మన బాధలు మనమే పడాలి.
మనకు శుభాకాంక్షలు మనమే చెప్పుకుందాం!!
చివరిగా.... అదే ఉమెన్సు డే అయితే ప్రత్యేక సెలవు . టీవీల్లో ఆడవాళ్ళ కోసం ప్రత్యేక ప్రోగ్రాంలు,
పాటలు.... మరి మగవారి కోసం ఒక్క. పాట కూడా లేదు
ఇక వాట్సాపుల్లో అయితే ఉదయం నుండి పడుకునే వరకూ ఒకటే మెసేజులు...
వాటిని డిలీట్ చేయాలంటే ఓ పూట పడుతుంది మన గ్రూపులో ఉన్న ఆడలేడీసులో ఇప్పటి వరకూ
మగవారికి ఎవరూ శుభాకాంక్షలు చెప్పినవారు లేరు!
ఏదైనా మగవారిదే విశాల హృదయం అని నిరూపించారు
ఈ జన్మకింతే....హ్యాపీ మగవాళ్ళ డే.......
--(())--
" శిరీ ..! ఒక సారి ఇలా రా" వేడి నీటి స్నానంతో సేదతీరి , perfume వేసుకుంటున్న శిరీష ని పిలిచాడు కుమార్ లాప్ టాప్ లో పని చేసుకుంటూ ..!
"ఒక్క నిమిషం" జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది .
"అబ్బబ్బ! ఈ పిల్లలు ఒకపట్టాన పడుకోరు కదా! పెద్దవాడిి కి కథలు కావాలి. చిన్నోడు అయితే నా వొళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్ట మంటాడు. ఇద్దరూ పడుకునే సరికి ఇంత లేట్ అయింది. ఎప్పటి కి పెద్ద వాళ్ళు అవుతారో ఏమో"!
పిల్లలు ఇద్దరినీ వాళ్ళ రూం లో నిద్రపుచ్చి, తలుపులు వేసి వచ్చెసరికి రోజూ ఇదే టైమ్ అవుతుంది.
"ఆ..చెప్పండి. ఏంటో పిలిచారు కదా! వచ్చి పక్కనే.కూర్చుంది.
ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి,హాల్ కి మరో పక్కగా.ఉన్న బెడ్రూం దగ్గర ఆగాడు.
దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద. ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరి.చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని...
ఏదో అనబోతున్న శిరీష ని హుష్ అంటూ సైగ చేసి, నిశబ్దం గా తలుపులు మూశాడు కుమార్ .
విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూంలో కి వచ్చింది.
"చూసావుగా శిరీ! వాళ్ళు ఎలా పడుకున్నారో వొళ్ళు తెలియకుండా! ...confusing గా చూసింది అతనివైపు.
"మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట. మీ అమ్మగారు ఏమంటున్నారు?". ఏ భావం మొహం లో కనబడ నీయకుండా అడిగాడు.
ఉలిక్కి పడింది శిరీష, 'తాను పిల్లల రూంలో కూర్చుని, అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట..
"అమ్మ తమ్ముడు కి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని, వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నదీ?!
"మా ఇంట్లోనే ఉంటాడు లేమ్మా! రూం అడ్జస్ట్ చేస్తాలే! మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్ లో కి షిఫ్ట్ చెస్తాలే! అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకోళ్లు చేయ్యేసుకొని పడుకుంటారు. చూడటానికి మాకే సిగ్గు వేస్తుంది. హాల్ లో అలా పడుకుంటే అసహ్యం గా ఉంటుందని ఆలోచిస్తున్నా! సరే ..ఏదో చెప్పి వాళ్ళని హల్ లో పడుకో బెడితే వాళ్ళే సర్దుకుంటారు. సర్దు కోక ఏమి చేస్తారు? ఎక్కడికీ పోతారు? అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా పోనీ"
తను మాట్లాడింది అంతా అతను విన్నాడని అర్ధం కాగానే కొంచెం గాభరాగా అనిపించినా, మాట్లాడకుండా తల దించుకుంది.
"శిరీ! ఎక్కడో మా వూళ్ళోఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి, ఇక్కడ మూడు బెడ్రూంల ఫ్లాట్ కొనుక్కునే దాకా సతాయించావు. సరే! వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా, అని వాళ్లకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకు వచ్చాను."
" మనం ఇక్కడ అద్దెలు కట్టుకొలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసివస్తుంది అని వాళ్లు వొప్పుకున్నారు. వచ్చినప్పటి నుండి మనకు చాకిరీ చేయటం లోనే మునిగిపోయారు వోపిక లేకున్నా!
నువ్వు, నేను పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లి ఏ రాత్రో వచ్చేదాకా, పిల్లలని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు.
వాళ్ళ కి వేరేగా వండి, తినిపించి,ఆడించి, పగలంతా వాళ్ళ, అల్లరి భరించి, సాయంత్రం మనం వచ్చే సరికి కడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు శ్రమపడుతున్నరో గమనించావా ఎప్పుడైనా! ఒక్క రోజైనా హాస్పిటల్ కి తీసుకెళ్లే అవసరం రానీయకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా?
పూట పూటకీ రుచిగా, వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే, కడుపు నిండా తినటమే తప్ప ఒక్క రోజైనా ఆమెకి సహాయం చేసావా?
నాన్న ఈ వయసు లో కూడా ఇల్లు శుభ్రం గా ఉంచటానికి, పిల్లల్ని శుభ్రం గా ఉంచటానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా!?
ఆదివారం రాగానే , నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు. ఒక వారం ఛారిటీ కలెక్షన్స్, ఇంకో సారి కిట్టిపార్టీ, ఒకవారం పిల్లలతో outing, ఒక వారం రెస్ట్..... అయినా అమ్మ ఒక్క రోజు కూడా విసుక్కొలేదు పైగా"పోనీలే! వారమంతా ఆఫీస్ పని కదా! ఒక్కరోజు దానికి ఇష్టం అయినట్టు ఉండనీ"! అంటుంది.
తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలిసి పోయిన అమ్మకి రెస్ట్ తీసుకో వాలనీ, పడుకోవాలని అనిపించదా చెప్పు!
ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి, రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్లనొప్పి, నడుం నొప్పితో బాధ పడుతుంటే నాన్న ఆమె కి ఆయిట్మెంట్ రాసి కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే, అది నీకు వేరే విధంగా అనిపించిందా?
80 ఏళ్ల నాన్నకి రాత్రి పూట చాలా సార్లు బాత్రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది. నిద్ర మత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేక పోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది. ఆయన తో పాటు మెళకువ రావటానికి. అది నీకు శృంగారం గా కనిపిస్తున్నదా?
వయసు మళ్ళిన ఇద్దరికీ ఎవరు ముందు తమను విడిచి వెళ్లి పోతారో అని లోలోపల భయం. దానికి తోడు మనకి కూడా మాట్లాడటానికే time ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరికి ఒకరు నీడగా ఉంటారు. అది కూడా నీకు తప్పు గా ఉంది.
మీ తమ్ముడికి రూం ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు. అతడి హాస్టల్ ఖర్చు మనం ఇద్దాము.
మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాము. మనకు కూడా అలాంటి స్థితి వస్తె ఎలా ఉంటుందో వూహించుకో!
"వార్థక్యం తప్పేది కాదు, తప్పూ కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చక పోతే నేను ఉన్నది ఎందుకు? దండగ కదా!"
"ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను వోప్పు కోను. " ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదికి చేరుకున్నాడు కుమార్ ....
#ఎవరికిఏంఅర్ధమయితే_అది#
--(())--
No comments:
Post a Comment