వివేకానందుని జాయింతి సందర్భముగా
విశ్వ వాహిని యందు వేదతత్వ బోధ విద్వక్త
జ్ఞానామృతంలో పంచిన భరత ధర్మ విద్వక్త
హైందవ ధర్మాన్ని జగతిన తెలియపరచె జ్ఞాన సంద్ర
దేశభక్తి సర్వులకు సంతృప్తి యన్న విద్వక్త
యువత జాగృతి పరిచిన స్ఫూర్తి దాతయే యోగీంద్ర
భువనేశ్వరి బెడ్డడే వివేకానంద విద్వక్త
రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడే నరేంద్ర
హిందూ ధర్మ రక్ష సత్య సాధు వివేక విధ్వక్త
కష్టాలు కన్నీళ్లు నేర్పుతాయన్నా విధ్వక్త
ఓటమి,అవమానాలు నేర్పుతా యన్నా విధ్వక్త
***-
[11/01, 6:11 am] Chinta Ramakrishnarao: ఓం *నిర్బీజధ్యానగోచరా* యై నమః ।🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 135వ నామము.
నామ వివరణ.
(ధ్యానావ స్థిత తద్గ తేన మనసా ప శ్య o తి యం యోగినః అని భాగవతము) ఏకాగ్రత తో
కూడిన తీవ్రమైన ధ్యాన స్థితి నిర్బీజ ధ్యానము. అట్టి
ధ్యానములోనున్న సాధకులకు గోచరించు జనని.
కం. ప్రగణిత *నిర్బీజ ధ్యా*
*నగోచరా!* గాంతు నిన్ను, నా ధ్యానమునన్
నిగమాంత సారమీవే,
నగుచున్ గనిపించుమమ్మ నా కన్నులకున్.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
[12/01, 5:27 am] Chinta Ramakrishnarao: ఓం *సర్వతీర్థస్థితా* యై నమః ।🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 136వ నామము.
నామ వివరణ.
అన్ని తీర్థములయందూ ఉండునట్టితల్లి.
తే.గీ. *సర్వ తీర్థ స్థితా!* నేను చక్కగ నిను
మనసులో కనినంత సమస్త తీర్థ
సేవనా ఫలమొదవును చిత్రమిదియె,
నిన్ను భావింపనిమ్మింక సన్నుతముగ.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
కల్పన బతుకు బండి (రోజువారీ చిన్న కథ)
"క చ ట త ప అనే అయిదు వర్ణాలలో *క అనేది నోటిలో చాలా లోపలి కి తగులుతుంది. చ చాలా మద్యస్తములోనూ, ట చివరిలో త పంటి దగ్గర, ప పెదవుల దగ్గర తగులుతాయి. పెదవుల నుంచి గొంతు వరకు ఉండే అన్ని ప్రాంతాలనీ నాలుక ముట్టుకుంటూ, నృత్యము చేసుకుంటూ, మన చేత వాక్యాలు పలికిస్తూ ఉంటుంది.*
అదంతా వాగ్దేవతల కూటమి. కంఠము నుంచి నాలుక కొన వరకు ఉన్న భాగమును వాగ్భవ కూటము అన్నారు." ప్రేమ అంటూ వెంట పడటం మూర్ఖత్వం అన్నా వినిపించుకోక
సద్గురువు జ్ఞాన సూర్యుడగుటచే, తాను సంకల్పించినచో ఎవరికైనను రెప్పపాటు కాలములో మోక్షమును ప్రసాదించగలడు. కాబట్టి నీవు సద్గురువు అనే దైవాన్ని నమ్మి బతకాలి అన్నది కల్పన .
ఉద్యోగంలో చేరటమే కాదు, ముగ్గురు స్నేహితుల్ని కుడా సంపాదించింది.
అందులో ఒకరు (చామంతి) చపల చిత్తంగలది, రెండవవారు (జలజ) జిత్తులమారి ఎత్తుకుపై ఎత్తులు వేయగల సామర్ధ్యం గలది, మూడవవారు
(మృదుల) దొంగబుద్ధి కలది.
*******
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#గంగాజల_మహిమ
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి, శివ మహత్మ్యమును గురించి వివరించెదను.. వినుము.
మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక.., పూజలలో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించు నట్టిదియు అయినందుననే సర్వపాప హరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా.. యే నీళ్ళను గాని, "గంగ గంగ గంగ" అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలo విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘ మాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను.
కొంత కాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి.వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను., బ్రాహ్మణ కన్యలా యువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విధ్యార్థియూ, మీరు కూడ పిశాచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాదించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడు కొనుచుండిరి.
కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరి చేత మాఘ మాసములో గయలో నున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే అయిదుగురికి యధారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది.
ఓక మాఘమాసములో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరింనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక పోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుందిరి. ఆ దృశ్యమును చూచి మండి పడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవై నందున, నీకు కోతి ముఖము కలుగు గాక యని విశ్వామిత్రుని, పాషాణమై పడి యుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్రా.! క్షణభంగురమైన తుచ్ఛ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము... గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము.. అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ రూపము పొంది, గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
ఇతి శ్రీ మాఘ పురాణం నవమ అధ్యాయ పారాయణం సంపూర్ణం...
దశ మహావిద్యలు - ఫలితాలు
తొలి మహా విద్య
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.
2 వ మహా విద్య
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.
3 వ మహా విద్య
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.
4 మహా విద్య
దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
5వ మహా విద్య
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.
6వ మహా విద్య
దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.
7వ మహా విద్య
దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.
8వ మహా విద్య
దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
9వ మహా విద్య
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.
10వ మహా విద్య
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది..
*జీవితానికి అవసరమైన,ఆచారణీయమైన విషయాలు*
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
manalo lakshanaalu ...
raacchaaita mallaapragada ramakrishna
1 ఎప్పుడు అదుపులో ఉంచుకోవాల్సినవి ఈ మూడు
l) నోరు(నాలుక)
l) నోరు(నాలుక) రెండు విధాలుగా నాట్య మాడు
మంచి గామాట్లాడి మనసు మార్గ మవ్వు
చెడుగ పలికియు భయమును చింత పెంచు
పలుకులోపసందు మనసు మోక్ష మొవ్వు
ll) కోపం
కోపపు పలుకు కొందరి కొంప లార్పు
కోప మున్న మనిషి చెప్ప కుండ అరుచు
కోప భావము ఎప్పుడూ కాల మాయ
కోప పడకుండ విజయము గొప్ప వెలుగు
lll)కోరిక
కోరిక మనిషిలో మార్పు కొంత వచ్చు
కోరికప్పుడూ బాధతో కార్య మవ్వు
కోరి కే లేని మనిషి యే కాల మహిమ
కోరిక యె జీవితమ్ము గా కారణమ్ము
2. ఎప్పుడు గౌరవించాల్సింది ఈముగ్గురిని
I) తల్లిదండ్రులను
తల్లి తనయులకు ప్రేమ తృప్తి నిచ్చు
తండ్రి తనయులకు మనసు తేజ మిచ్చు
తల్లి హృదయము పంచియు త్యాగమూర్తి
తండ్రి సంపద కూర్చియు తరుణ మవ్వు
ll గురువును(ఆచార్యున్ని)
గురువు తనవిద్య బోధించు గమ్య మవ్వు
గురువు కాలాన్ని బట్టియు గాధ తెల్పు
గురువు సకలమ్ము తెలిపియు గర్వ పడును
గురువు విశ్వాస ముంచి విజయిము కూర్చు
lll దైవాన్ని
దైవాన్ని ప్రార్ధ న మనసు ధర్మ మగును
దైవాన్ని తలచు ధైర్యము తేజ మగును
దైవాన్ని స్త్రీ ల మనసును తెల్ప లేము
దైవాన్ని ఎపుడు నమ్ముము తీర్పు చెప్పు
3 ఎప్పుడు పాటించాల్సినవి ఈమూడు
I) పవిత్రత
మన పవిత్రత మన ధైర్య మందు తెలుపు
ప్రేమ కు పవిత్రతయు ముఖ్య పరువు తెచ్చు
సకలము పవిత్రత వలన సాగుచుండు
వినయము పవిత్రత జయము విశ్వమందు
Il) నిజాయితి
మనిషి లో నిజాయితి బత్కు మన్న నవ్వు
మగువలో నిజాయితి విశ్వ మాయ యగును
జయము లో నిజాయితి ధైర్య జాతి యందు
కళల లో నిజాయితి వల్ల కార్య శిద్ధి
lll)కఠోర శ్రమ
మనిషిలో కఠోర శ్రమ మంచి చేయు
మగువలో కఠోర ప్రేమ మనసు చేరు
వినయమే కఠోర శ్రావ్య మవ్వు చుండు
నిత్యమూ కఠోర భ్రమ నిన్ను తాకు
4 ఎప్పుడూ మొత్తానికి విడిచి పెట్టాల్సినవి ఈ మూడు
l) సోమరితనం
సోమరితనం తొ బతుకులో చింత చేరు
సోమరి తనమే నిత్యమూ సోమ్బె రవ్వు
సోమరితనం వరుస శక్తి శల్య మవ్వు
సోమరితనము శాంతికి స్వేశ్చ తగ్గు
Il) అబద్ధం
నిత్యము అబద్ధం ఆడితే నీకు హాని
నిత్యమూ అబద్దమ్ము వల్ల నడక అగు
సత్యవాక్కుఅబద్ధము చేర్చ కుండు
ఎప్పుడైనా అబద్ధమ్ము ఎదను తాకు
Ill) పరనింద
నీవు పరనింద చేసినా నీకు హాని
నీలొ పరనింద భావము నిన్నె మార్చు
నచ్చనివి పర నిందలు నాకు నీకు
కష్ట మొచ్చిన పరనింద కొలువ వద్దు
5.ఎప్పుడు ఈ మూడింటికై ప్రయత్నించాలి
I) ధైర్యం
ఏమి లేకున్న ధైర్యము ఏడుపాపు
భ్రమలు తరిమేది ధైర్యమే భక్తి కరుణ
ధైర్య సాహసములు అన్ని ధర్మ మవ్వు
నిత్య ధైర్యపు జీవితం నిజము తెలుపు
Il) కీర్తి
కీర్తి చేసిన శ్రమవల్ల కమ్మి ఉండు
కళల పంచేటి కాలము కీర్తి తెచ్చు
భావ చైతన్య తీర్పులు కీర్తి తెచ్చు
సంపదలుకన్న సుఖముతో కీర్తి పంచు
Ill) ప్రశాంతత
మానవుని లొ ప్రశాంతత ముఖ్య మవ్వు
మార్పులన్ని ప్రశాంత తే మరుపు తెచ్చు
హాస్యములలొప్రశాంత తే మనిషి బతుకు
నవ్య జీవన శాంతియే నాణ్య తవ్వు
6. ఎప్పుడూ నిలబెట్టుకోవాల్సినవి ఈమూడు
I) వాగ్దానం
పట్టుదలలోను వాగ్దాన పసయు తేల్చు
నిత్య వాగ్దానములు తీర్చు నిముష మవ్వు
సత్య వాక్కుల వాగ్దాన నిత్య జీవి
మనిషి వాగ్దానములు తెల్వి మార్చు చుండు
Il) మంచివారిస్నేహం
మంచివారిలొ స్నేహమ్ము మౌన మొవ్వు
మంచివారిలొ స్నేహమ్ము మదిని మార్చు
మంచివారిలొ స్నేహమ్ము మగువ తీర్పు
మంచివారిలొ స్నేహమ్ము మనిషి బతుకు
Ill) వాత్సల్యం
ఒకరి వాత్సల్యపు పలుకు ఓర్పు పెంచు
ప్రేమ వాత్సల్యపు పిలుపు పేరు తెచ్చు
కరుణ వాత్సల్యపు మనసు కధలు తెల్పు
సమయ వాత్సల్యపు ఘటన సౌఖ్య మిచ్చు
7. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాల్సినవి ఈ మూడు
I) మాట్లాడే విధానం
నీవు మాట్లాడి కళ విధానమ్ము తెల్పు
మనసు మాట్లాడదు విధము ముద్దు లొలుకు
మనము మాట్లాడు మాటల్లో మాయ వుండు
మదిలొ మాట్లాడె మనుగడే మగువ మెచ్చు
ll) ప్రవర్తన (నడవడిక)
నిత్య నడవడికలు ప్రేమ నిజము చుట్టు
మనిషిలొ ప్రవర్తన సమ మైత్రి పెంచు
ఉత్చవమ్ము నడవడిక ఊపు తెచ్చు
కలలొ న ప్రవర్తన మంచి కార్య మవును
Ill) పని
అంద నంతకు ఎదిగినా పనులు చేయు
జీవితమ్ములో పనులన్ని చేసి బతుకు
పనులు అన్నియు క్రముగాను ప్రీతి నిచ్చు
పనుల వేటలో విశ్వాస పలుకు నమ్ము
8. ఎప్పుడూ నేర్చుకోవాల్సినవి, పెంపొందించు కోవాల్సినవి
I) సత్ప్రవర్తన
చెపితె మన సత్ప్రవర్తన చేరువవ్వు
రసము తెలుపు సత్ప్రవర్తనలు వల్ల
రామ సత్ప్రవర్తన వల్ల రమ్య కధలు
మనిషి సత్ప్రవర్తన వల్ల మమత పెరుగు
Il)దానగుణం
ఎవరి వద్ద దానగుణము ఏది దాగు
బతికి బతికించు దానగుణములు ఇలలొ
నవరసభరితం దానగుణము తృప్తి
ధర్మ నడక దానగుణము దారిచూపు
Ill) సేవాభావం
చేరువలొ సేవ భావము చింత తొలుగు
కరుణతో సేవ భావాలు కలలు తీర్చు
కధలు సేవలు భావాలు కరుణ చూపు
సహజ సేవలు పడతికి సౌమ్య మవ్వు
8.ఎప్పుడూపూర్తిగా లేకుండ చేసుకోవాల్సినవి ఈ మూడు
I) ,ఈర్షాద్వేషం
ఎవరితో ఈర్ష ద్వేషము ఎపుడు వద్దు
ఏమి టిది ఈర్ష ద్వేషము ఎదలు నలుగు
నీరులా ఈర్ష ద్వేషము నిన్ను చేరు
గాలిలా ఈర్ష ద్వేషము కమ్ముకొచ్చు
Il) అహంకారం
మనసు లో అహం కారము మాయ గుండు
మగని లో అహంకారము మ్రోగు చుండు
మగువలో అహంకారము మౌన మవ్వు
కధలు అహంకారము కళ్ల చేయు
lll) అపార్ధం
జీవితంలోఅపార్ధము చింత తెచ్చు
ఊహలో అపార్ధము చోటు ఊయలగును
ప్రేమలో అపార్ధ౦ సర్వ పతన మగును
కాల జగతి అపార్ధమ్ము కధలు చెప్పు
--(())--
🍀*
*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*
*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*
మనోజయం
సహజంగా మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే చిక్కులు పడిన తాడులా ఉంటుంది. అర్థం కాని సమస్యలా ప్రతీసారి మన ముందుకు వచ్చి నిలబడుతుంది.
ఎందుకిలా జరుగుతుంది? మనసుతో ఈ ఇబ్బంది ఏమిటి? చాలా సార్లు, చాలా మందికి అనిపిస్తుంది. మనసుతో ఇలాంటి గొడవ ఏదో ఒక రోజు రావాలి. అదే నాంది- మనసును శోధించడానికి. మనసును సాధించడానికి. దాని సంగతి తేల్చుకోవడానికి.
మనిషికి చాలా సంతోషకరమైన, మేధాపరమైన ఆట ఏది అంటే, మనసుతో నిత్యం ఆడేదేే! మనసుతో ఆడాలి. మనసును పరుగెత్తించాలి. మనల్ని మనసు పరుగెత్తిస్తుంటే ఆపాలి. మనసుకు ఎదురుతిరగాలి అంటారు స్వామి వివేకానంద.
మనసు భయపెడుతుంది. బాధ పెడుతుంది. విసిగిస్తుంది. చివరకు కాళ్లబేరానికి వచ్చి బుజ్జగించి, లాలిస్తుంది. రాయిలా మనం కదలక మెదలక ఉంటే, చివరకు దండం పెడుతుంది- రమణ మహర్షికి వశమైన మనసులా.
మనసు లేని మనిషి గడ్డకట్టిన సరస్సులాగా ఉంటాడు. శీతోష్ణ, సుఖ, దుఃఖాలను సమంగా చూస్తాడు.
ఇలాంటి ప్రశాంతమైన మనసు కలిగిన మనిషే శక్తికి పుట్టినిల్లు అవుతాడు. శక్తి కావాలంటే నిరంతరం ఆలోచనలతో సతమతమయ్యే మనసును భారంగా మొయ్యడం కాదు. ఆలోచనలను నియంత్రించుకుని, సృజనాత్మక భావాల మీద ఏకాగ్రత నిలిపితే అసలైన శక్తి పుడుతుంది.
ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.
ప్రశాంతమైన మనసే అద్భుతాలు సృష్టించగలదు. ఆలోచనలు తగ్గుతున్న కొలదీ సృజనాత్మకత పెరుగుతుంది. వందలు, వేల కొద్దీ క్రమం లేని ఆలోచనలు మనసులోని శక్తిని తగ్గించేస్తాయి. ఒక మంచి, గొప్ప ఆలోచన దివ్య మార్గంలో నడిపిస్తుంది.
హృదయం మనసుకు అనుసంధానమైనప్పుడు పుట్టే ప్రతి ఆలోచనా గొప్పది అవుతుంది. హృదయం కలగజేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్రమబద్ధమైన, శక్తిమంతమైన ఉపయోగకరమైన ఆలోచనలు చెయ్యాలి.
ఆలోచనలకు ముందు ధ్యానం చెయ్యాలి. ఆలోచించిన తరవాత ధ్యానం చెయ్యాలి. మరిన్ని మంచి ఆలోచనల కోసం ఆలోచనల తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆలోచనలకు స్థావరమైన మనసును ముఖాముఖీ ఎదుర్కోవాలి. అవసరమైతే పక్కకు తప్పుకొని మనసుకు సాక్షిగా నిలబడి ఉండాలి. ఇదంతా సాధన వల్లనే సాధ్యపడుతుంది.
మనసుతో వ్యాయామం చెయ్యని మనిషి సాధనలో పరిణతి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్లని మనిషి ఆధ్యాత్మిక రహస్యాలు అందిపుచ్చుకోలేడు.
మనసు మనకు మంచి మిత్రుడు. దారుణమైన శత్రువు కూడా. ఉపయోగించుకోవడంలో అంతా ఉంది.
మనసు గాలిలో దీపంలా ఉంది. దీన్నెలా వశం చేసుకోవాలని దీనంగా ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు పరమాత్మ చెప్పాడు-
‘నిస్సందేహంగా మనసు చంచలమైనది. దాన్ని వశపరచుకోవడం చాలా కష్టం. అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని నియంత్రించడం సాధ్యమే. మనసు వశం చేసుకున్న ప్రయత్నపరుడైన మనిషికి సాధనద్వారా సహజంగా యోగ సిద్ధి పొందడం సాధ్యమే’ అని వివరించాడు." వాట్సప్ సేకరణ
********
బ్రహ్మజ్ఞాన అధికారం ఎవరికి?
‘మోక్షం’ అంటే ‘విడుదల’. సంసారబంధం నుంచి విముక్తి కావడం. స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ‘సచ్చిదానంద’ స్థితిని చేరడం. మోక్షాన్ని పొందడం మానవజన్మలోనే సాధ్యం. ఇంద్రాది దేవతలు కూడా మోక్షాన్ని పొందడానికి మానవజన్మనే కోరుకుంటారని ప్రతీతి. ఎన్నో జన్మల పుణ్య విశేషంతోనే మానవజన్మ లభిస్తుంది. ఈ జన్మ సిద్ధించినా కూడా ‘పరమాత్మ’ను గురించి చెప్పగల ‘సత్పురుషులు’ మనకు దొరకాలి. వారు లభించినా ‘జ్ఞానం’ సమకూరాలి. ‘ఆత్మజ్ఞానం’ ఏర్పడినా కూడా ‘మోక్షాన్ని పొందాలన్న’ ప్రబలమైన కోరిక మనకు కలగాలి. ‘ఇవన్నీ అత్యంత దుర్లభమైనవే. కేవలం దైవానుగ్రహంతోనే కలుగుతాయని’ శాస్ర్తాలు చెబుతున్నాయి.
దుర్లభం త్రయమే వైతద్దెవానుగ్రహ హేతుకమ్
మనుష్యత్వం ముముక్షుత్వం మహా పురుష సంశ్రయః ॥
‘దుర్లభమైన మానవజన్మను పొంది కూడా ప్రధాన పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించకపోతే తనకు తానే హాని చేసుకున్నట్లు అవుతుంది’ అన్నది పై శ్లోక సారాంశం. ఉత్తమ మానవజన్మను పొందాక మోక్షసాధనకు అవసరమైన ‘తత్తజ్ఞానం’ కోసం ప్రయత్నించాలి. ఈ జ్ఞానం (బ్రహ్మ విద్య)పొందడానికి శాస్ర్తాలు నాలుగు సాధనాలను పేర్కొన్నాయి. అవి: నిత్యానిత్య వస్తు వివేకం, ఇహముత్ర ఫలభోగ విరాగం, శమాది షట్క సంపత్తి, మోక్షాపేక్ష. ప్రతి సాధకుడు మొదట ‘నిత్యానిత్య వస్తువివేకాన్ని’ పొందాలి. అంటే, ‘ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో’ తెలుసుకోవాలి. ప్రపంచంలోని భోగాలు, శరీరం, సంపదలూ అన్నీ నశించిపోయేవే. ఇవేవీ శాశ్వతం కావు. ఇది స్పష్టంగా అవగాహనలోకి వచ్చాకే వాటి పట్ల ‘వ్యామోహం’ పోతుంది.
‘ఇహముత్ర ఫలభోగ విరాగం’ అంటే.., ‘ఈ లోక పరలోకాల భోగాల పట్లా వైరాగ్యం’ ఏర్పరచుకోవాలి. సాధారణంగా మానవులంతా ఇహలోక సుఖాలతో పాటు మరణానంతర స్వర్గసుఖాలనూ కోరుకుంటారు. కానీ, ఈ లోకంలోని సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే. స్వర్గాది సుఖాలు కూడా శాశ్వతమైనవి కావు. పుణ్యకర్మల వల్ల స్వర్గాది సుఖాలు లభించినా, ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం ప్రవిశంతి’. అంటే.. ‘పుణ్యం క్షీణించగానే మరల భూ లోకంలో జన్మించవలసిందే’. అందువల్ల, ఈ అన్ని భోగాల పట్లా వైరాగ్యం ఏర్పరచుకోవాలి.
మూడవదైన ‘శమాది షట్క సంపత్తి’ అంటే.. ‘శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం’ అనే ఆరు గుణాలు. ‘మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం.. ఈ నాలుగు అంతరింద్రియాల నిగ్రహమే ‘శమం’. అనవసర విషయాల్లోకి ప్రవేశించకుండా వీటిని వశంలో ఉంచుకోవాలి. ఐదు బాహ్య జ్ఞానేంద్రియాల (చర్మం, కళ్లు, ముక్కు, చెవులు, నాలుక)తో సహా ఐదు కర్మేంద్రియాల (నోరు, చేతులు, కాళ్లు, జననేంద్రియాలు, గుదం) నియంత్రణనే ‘దమం’ అంటారు. వీటిని వాటి విషయాల పట్ల ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకుండా నియంత్రించుకోగలగాలి. చంచలమైన ఇంద్రియాలను విషయాల నుంచి మళ్లించి, లక్ష్యంలో నిలపడం ‘ఉపరతి’. అంటే, మనసును నిశ్చలం చేయడం. ‘ఆకలి-దప్పిక, చలి-వేడి, గౌరవం-అవమానం’ వంటి ద్వంద్వాలను సహించడం ‘తితిక్ష’. శాస్త్ర విషయాలు, గురువులు, సాధువుల బోధనల పట్ల నమ్మకం, నిశ్చయబుద్ధిని కలిగి ఉండటం ‘శ్రద్ధ’. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్'. ‘శ్రద్ధ గలవాడే జ్ఞానం పొందుతాడని’ గీతావాక్యం. ఏకాగ్ర లక్ష్యంతో చిత్తాన్ని సర్వకాల సర్వావస్థలలో పరమాత్మ పట్లే నిలిపి ఉంచడమే ఆఖరిదైన ‘సమాధానం’. ఈ ఆరింటి సాధన మానవుణ్ణి ‘మహామనిషి’గా మారుస్తుంది.
ఇక, నాలుగవదైన మోక్షాన్ని పొందాలన్న తీవ్రమైన కోరికే ‘ముముక్షుత్వం’. అంటే, సంసారబంధం నుంచి విముక్తి కావాలన్న వాంఛ. ఈ నాలుగింటినీ సాధించినవాడే నిజమైన ‘సాధకుడు’. బ్రహ్మజ్ఞానాన్ని పొందే అధికారాన్ని అలాంటివారే సంపాదిస్తారు. ‘జ్ఞానా దేవతు కైవల్యమ్. జ్ఞానం వల్లనే కైవల్యం’ అని కదా ఆర్యోక్తి. ఈ నాలుగింటి సాధనతోనే ‘ఆత్మజ్ఞానం’, తద్వారా ‘మోక్షం’ సిద్ధిస్తాయన్న దానిని ప్రతి ఒక్కరూ గ్రహించి, ఆ దిశగా ప్రయత్నించాలి.
ఒక పెద్దాయన మాటలు :.....
కోడళ్ళు మీకు జోహార్లు
ప్రతీ కోడలు ఆదర్శం కావాలి 👏👏👏👏👏👏
నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.
చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.
ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.
చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.
4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.
'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.
దారి మధ్యలో ఇలా అంది.
'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'
👏👏👏👏👏👏
పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.
అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.
కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...🌷🌷🌷🌷🌷🌷🌷🌷
' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'
'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.
అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...
'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.
కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...
'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!
ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం
💐💐💐💐💐
పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి
అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!
పెద్దవారు మనకు మార్గదర్శనం.....🙏🙏
ఇలా కూతురు లా చూసుకునే కోడళ్ళు ఉన్నంత కాలం వృధాశ్రామాలతో పనివుండదు💐💐🙏🙏🙏💐💐
No comments:
Post a Comment