జీవాత్మ ప్రపంచ నియమాలు
*Q:- మనుషులు దేవుడ్ని సులువుగా నమ్మరెందుకు? ఏ విధంగా ఉంటే దేవునికి ప్రీతిపాత్రులవతారు?*
*A:--1) గంటలకొద్దీ ఏకాగ్రత లేకుండా చేసే ప్రార్థన కన్నా,జనాన్ని,భగవంతుని మోసం చేయడానికి వేలాది రూపాయిల దానం కన్నా,సాధారణమైన నిజాయితీ గల కారుణాపూరితమైన,నిస్వార్ధమైన పని ఎంతో విలువైనది.*
*2) కొంతమంది దేవుడ్ని బాగా ప్రార్దించి కోరుకున్నది జరగక పోతే దేవుడ్ని నమ్మరు. కానీ -----* *--ప్రార్ధనకు సమాధానం లభించలేదంటే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాదని అర్థం.*
*3) కొంతమంది అన్యాయం జరిగితే కూడా దేవుడ్ని నమ్మరు----*-----
*ఆ అన్యాయం మన కర్మ, అది మనల్ని పరీక్షించడానికో శిక్షణ ఇవ్వడానికో అది మనకు జరిగింది అని అర్థం చేసుకోవాలి.*
*4) కొంతమంది కి ఆరోగ్యం క్షీణించినపుడు ప్రార్ధిస్తారు---- *-----మనకు రోగం వచ్చిందంటే చేడు కర్మని చెల్లిస్తున్నామని గుర్తుంచుకోండి.*
*5) దేవుడు వున్నాడని మనకు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. logical thinking తో మనిషి రుజువు అడుగుతాడు, కనిపించనంత మాత్రాన సత్యం లేదని కాదు, ----- చూడలేని దానిని నమ్మడమే పరీక్ష.*
*6) దేవుడు మోసాల్ని అన్యాయాల్ని ఆపడెందుకు అని అనుకుంటారు. ఆయన మనకు సంకల్ప స్వేచ్ఛని ఇచ్చాడు, అది కొంత మంది చేడు పనులకు ఉపయోగించు కుంటున్నారు.*
*7) ప్రతియుగం లో చెడు పెరిగినపుడు ఒక ఉన్నత సదాత్మ ను మార్గదర్సునిగా ఉండమని భూమి పైకి పంపిస్తాడు, ఆ విధంగా వచ్చిన అంశాత్మలే మనమనుకుంటున్న దేవుళ్ళు.*
కానీ వారు జ్ఞానాన్ని తెలుసుకుని ఎదిగిన వారు మాత్రమే, వారు దేవుని అంశలు మాత్రమే, వారిని పూర్ణాత్మ అనవచ్చు, వారిలోను , అన్ని అంశాత్మలలోను ఒకే చైతన్యం ఉంది. ఒక అంశాత్మ, జ్ఞానం తెలుసుకున్న తర్వాత పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. ఈ భూమి మీద జీవించే ప్రతి ఆత్మకు ఆ శక్తి ఉంది.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏శ్రీకృష్ణుడు_గీతలో_చెప్పిన_ధర్మ_సూత్రాలు ..🙏
ఒక పురుగు దేహంలో ప్రవేశించినపుడు, రోగము మొదలవుతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు•
అలాగే చెడు చంపితేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మం ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రుడివి .. పుట్టిన వానికి చావు తప్పదు యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు•
కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. ఇది ధర్మమా కృష్ణా!* అని..., అప్పుడు కృష్ణుడు చెప్పాడు. నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు...... కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మమే.
యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్దం చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ మరునాడు శివుణ్ణి దూషిస్తాడు... నీవు భక్తుణ్ణి రక్షించలేదని... ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడ్డాడు.
అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి... కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం... మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు... వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి కదా!
అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు *"అశ్వత్థామ హతః"* అని పెద్దగా చెప్పి *"కుంజరహః"* అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి...
పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు...
పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి... ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది... ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా అనుకోరు.
కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు... అప్పుడు మనం ఏమి చేయగలము... వారికి బానిసలు కావాలి...
అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు... దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత యిస్తుంది... దీనుడైన అర్జునుడిని ధీరునివలె భగవద్గీత మార్చివేసినది.
అదేవిధంగా... చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.
భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే... *గీతా పారాయణ కన్నా గీతా ఆచరణ ముఖ్యం* అన్నారు... భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అంటే. వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరంలేదు... ఒక్క పుల్ల చాలు..
బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము.
చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు... గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు.. కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము...
*****
అవతారం అంటే ఏమిటి. కధ
అవతారం అనే మాటను ప్రతీరోజు ఏదో ఒక సందర్భంలో వాడుతుంటారు. అసలు అవతారం అంటే ఏమిటి తెలుసుకుందాం.. తార అంటే నక్షత్రం. అవ అంటే దిగిరావడం. జీవరాశుల అభ్యున్నతి కోసం నిర్హేతుక కృపతో భగవంతుడు స్వీకరించేదే అవతారం. ఆ విశేషాలు తెలుసుకుందాం..
విష్ణువు రాముని గా భూమిపై అవతరించాడని అంటారు. మరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలం లో వైకుంఠమ్ లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించెనని క్రైస్తవులు భావిస్తారు. ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.
విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడి విడి గా ఎత్తినా తన అస్తిత్వం కోల్పోడు; తన అసలు రూపం తో వైకుంఠమ్ లో దర్శన మిస్తూనే ఉంటాడు… విష్ణువు నుండి ఉద్బవించిన ఈ అవతారములు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడి లో (విష్ణువు ) లో ఐక్య మందుతాయి… ఒకసారి ఐక్య మందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకం పై అవతరిస్తూ ఉంటారు. ఇక దత్తాత్రేయుల వారు నేటికి అనేక అవతరాలలో ఆయా ప్రాంతాలలో నేటికి దర్శనమిస్తారని ప్రతీతి. హనుమ, కుమారస్వామి ఇలా పలు దేవతాస్వరూపులు ఆయా రూపాలలో భూమిమీద జన్మించి మనలను ఉద్దరిస్తారు...
🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹
కుటుంబం - అనుబంధం
ఒక ఊరిలో శివయ్య అనే గృహస్థు ఒకతడు ఉండేవాడు. అతడితో పాటు తల్లిదండ్రులు, భార్య, తోబుట్టువులు, పిల్లలు ఉండేవారు. శివయ్య ఒక మఠానికి పోతూ ఉండేవాడు. ఒకనాడు మఠంలోని సన్యాసితో "స్వామీ! నాకు కూడా మీలాగా సన్యాసం స్వీకరించాలని ఉంది. కానీ నా తల్లిదండ్రులకు, భార్యకు నేనంటే ప్రాణం. వారు నన్ను విడిచి ఉండలేరు. వారి కోసమే నేను సన్యాసం తీసుకోవడానికి సంకోచిస్తున్నాను" అని చెప్పాడు. గురువుగారు నవ్వి అతడికి ఒక వేరు ఇచ్చి, "ఇంటికి పోయిన తరువాత, ఈ మూలికను నోట్లో ఉంచుకో. నీ శరీరం నిశ్చేష్టితమవుతుంది. కదలలేవు. అయితే ఎవరేమీ మాట్లాడేది నీకు తెలుస్తుంటుంది" అని చెప్పాడు. గృహస్థు ఇంటికి వెళ్ళి పడుకొని వేరు నోట్లో ఉంచుకొన్నాడు. శరీరమంతా బిగుసుకుపోయింది. కాళ్ళు చేతులు కూడా కదిలించలేకపోయాడు. అతడి పరిస్థితి చూచి, కుటుంబమంతా శోకాలు పెట్టసాగారు. అప్పుడు సన్యాసి వారింటికి వచ్చాడు. ఆ దారిన పోతుంటే ఏడుపులు వినబడి లోపలికి వచ్చానన్నాడు. శివయ్య కుటుంబానికి ఆయన ఏదైనా చేయగలడనే ఆశ కలిగింది. సన్యాసి కాళ్ళమీద పడి, శివయ్యను కాపాడమని వేడుకొన్నారు. సన్యాసి శివయ్యను పరీక్షించి, వారితో అతడు జీవించాలంటే ఒకే ఉపాయం ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులు అదేదో చెప్పమన్నారు. సన్యాసి అతడి బదులు కుటుంబంలోని వారెవరైనా తమ ప్రాణాన్ని అర్పిస్తే శివయ్య బతుకుతాడని చెప్పాడు. ఆ మాటలు వినగానే శోకాలు ఆగిపోయాయి. సన్యాసి అతడి తండ్రి వంక చూచాడు. ఆయన "స్వామీ! శివయ్యకు లౌకిక వ్యవహారాలు అంతగా పట్టవు. నేనే ఈ కుటుంబానికి ఆధారం. నేను పోతే ఈ కుటుంబం వీధిన పడుతుంది" అన్నాడు. సన్యాసి శివయ్య తల్లి వంక చూచాడు. ఆమె "స్వామీ! నేను సిద్ధమే. కాని నాకు ఆడపిల్లలున్నారు. నేను పోతే వారి పెళ్ళిళ్ళు, బాగోగులు చూచేవారుండరు" అనింది. సన్యాసి శివయ్య భార్య వైపు చూచాడు. ఆమె "స్వామీ! నాకు చిన్న పిల్లలున్నారు. నేనుపోతే, ఆయన మరొకరిని పెళ్ళి చేసుకొంటే, సవతితల్లి వారి ఆలనాపాలనా సక్రమంగా చూస్తుందా?" అనింది. పడుకొని ఉన్న శివయ్య ఈ మాటలన్నీ విన్నాడు. నోట్లో ఉన్న మూలికను ఉమ్మేశాడు. శరీరం స్వాధీనంలోకి వచ్చింది. లేచి సన్యాసితో "గురువుగారు! సన్యాసం స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని సన్యాసితో పాటు బయలుదేరాడు.
అయినవారి మధ్య ఆపేక్షలు, అనురాగాలు చాలావరకు స్వార్థపూరితాలు, నటనలు. వాటిని సత్యాలని భ్రమించి, మానవుడు మమకార బంధాలలో చిక్కుకొని, పరమాత్మకు దూరమవుతాడు. లౌకిక ప్రేమలలోని డొల్లతనం గ్రహిస్తే, ముక్తి మార్గంలోకి అడుగిడ గలుగుతాడు.
ఓ ఫలంలోని విత్తనాల్ని ఎవరైనా చూడగలరు.
కానీ ఓ విత్తనంలో ఎన్ని ఫలాలున్నాయో చూడగలిగేవారే వివేకవంతులు.
నిజాయితీ అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఇతరుల విశ్వాసాన్ని పొందవచ్చు.
మంచితనం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా ఇతరుల స్నేహాన్ని పొందవచ్చు.
వినయం అనే ఇత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా గొప్పతనాన్ని పొందవచ్చు.
పట్టుదల అనే విత్తనాన్ని నాటితే...
దానికి విజయాన్ని ఫలంగా పొందవచ్చు.
దయ అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఇతరులతో సమన్వయాన్ని పొందవచ్చు.
నిరహంకారం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా సుహృద్భావాన్ని పొందవచ్చు.
నిష్కపటం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఆత్మీయతను ఫలంగా పొందవచ్చు.
ఓర్పు అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా అభివృద్ధని పొందవచ్చు.
విశ్వాసం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా అద్భుతాలనే పొందవచ్చు.
*
కాలం అమూల్యం
'కలయతి ఇతి కాల' అని కాలానికి నిఘంటువులు నిర్వచనం చెప్పాయి. అంటే అన్నింటినీ తనలో లీనం చేసుకొనేది కాలం. కాలాన్ని గణించాలంటే అత్యంత సూక్ష్మసమయం నుంచి మహాకల్యాల వరకు లెక్కించవలసి వస్తుంది. కాలం అనంతంగా సాగుతూ ఉంటుంది కనుక మనిషి తన పరిధి మేరకే కాలాన్ని లెక్కించగలుగుతాడు. మనిషి ఆయుర్దాయం అనంతకాలంలో చాలా చిన్నది.
గడచిపోయిన క్షణం మళ్ళీ రాదు రెప్పవాల్సి తెరిచేలోగా కాలం గడిచిపోతుంది. కాలంతో పరుగులు తీయడం మనిషికి సాధ్యం కాదు. కాలశక్తిని ఆపడం మనిషితరం కాదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా భూమిపై కొనసాగే పగటివేళలో మనిషి జాగృతుడై జీవన విధానాన్ని దిద్దుకొంటాడు. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా మనిషి నిద్రిస్తాడు. ఇది లోకంలోని కాల నియమం. ఇది భూమికే పరిమితం. భూమిని దాటి ఇతర గ్రహాలకు వెళ్తే అక్కడి కాలమానమే వర్తిస్తుంది.
కాలం గడచిపోతున్నది అని ఎవడో అంటే ఒరే వెర్రిబాగులవాడా! గడచిపోతున్నది కాలం కాదురా, నీ ఆయుర్దాయమే అంటుందట కాలం. నిజమే. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి ఆయువు తరుగుతుందే కానీ పెరగదు కదా! కాలు మార్పును తెస్తుందని గుర్తించడానికి. మనిషి బాల్యం నుంచి కౌమారానికి, కౌమారం నుంచి యౌవనానికి, యౌవనం నుంచి వార్ధక్యానికి క్రమంగా భౌతికంగా మార్పు సంపూర్ణాయుర్దాయం నూటఇరవై ఏండ్లని పెద్దలమాట, అంతకాలం జీవించేవాళ్లు అదృష్టవంతులే. 9 నూరేళ్లు దాటకుండానే గతించేవారే ఎక్కువ. ఏ వయసులో ఏమి చేయాలో కాలం నిర్దిష్ట ప్రణాళికను సూచించింది. బాల్యంలో ఆటపాటలు, కౌమారంలో చదువు సంధ్యలు యౌవనంలో వైవాహిక జీవనం, వార్ధక్యంలో ఆత్మశాంతి అనేవి సాధారణ విషయాలు. మనిషి ఏ ప్రాయంలో ఏది చేయాలో ఆది చేయకపోతే, కాలం విలువను జీవన మూల్యాన్ని కోల్పోయినట్లే. బాల్యంలో మనిషి ఆటపాటలతో ఎదిగితేనే క్రమాభివృద్ధి జరుగుతుంది. కౌమారదశలో బడికి వెళ్ళి చదువుకోకపోతే, జ్ఞానాన్ని కోల్పోయినట్లే. యౌవనంలో వైవాహిక జీవనాన్ని అనుభవించకపోతే, యౌవనం తిరిగి రాదు. వృద్ధాప్యంలో శాంతిమయ జీవనం లేకుంటే జీవితం భారంగా మారుతుంది.. 11 12 3 76 5
చెందడమే ఉదాహరణ మనిషి కాలం పాదరసంలా జారిపోతుంది. పట్టుకుందామనుకుంటే దొరకదు. కాలం కర్పూరంలా హరించుకొనిపోతుంది. కనుమరుగైన తరువాత చింతించి లాభంలేదు. మనిషి తన కంటికి ఎదురుగా ఉన్న వర్తమాన కాలం విలువను గుర్తించాలి. మంచి పనులతో ముందుకు సాగాలి. ప్రతి క్షణాన్ని అమూల్య ధనంగా చూడాలి. వ్యర్ధంగా కాలాన్ని గడిపితే సంపదలు చేజారిపోక తప్పదు. దేవతలు సైతం కాలాన్ని అమూల్యంగా భావిస్తారు. కాలం కలిసిరానప్పుడు మౌనం వహిస్తారు. శుభసమయం కోసం వేచిచూస్తారు. తగిన సమయంలోనే అనుగ్రహిస్తారు.
కృషిచేసేవారికి కాలం ఎంతో విలువైంది. సోమరులకు కాలం విలువ లేనిదిగా కనబడుతుంది. మంచి పనులు చేసేవారికి ఇరవై నాలుగు గంటలూ అవసరమే. సూర్యోదయ, చంద్రోదయాలు సక్రమంగా, సకాలంలో జరుగుతున్నందువల్లనే భూమిపై ఆరు రుతువులు క్రమం తప్పకుండా వస్తూ పోతున్నాయి. ఎండలు, వానలు, చటులు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో సమతౌల్యం జారిపోకుండా నిలుస్తోంది. ప్రపంచం సురక్షితంగా ముందుకు సాగుతోంది. కాలం కరుణించినంత కాలం మనిషి మనుగడ చక్కగా ఉంటుంది. కనుక కాలం విలువను తెలుసుకొని మనిషి ప్రవర్తించాలి!
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
------- శుభోదయం ------ సుభాషితాలు -------
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే
సీ. శ్రీమనోహర । సురా - ర్చిత సింధుగంభీర ।
భక్తవత్సల । కోటి - భానుతేజ ।
కంజనేత్ర । హిరణ్య - కశ్యపాంతక । శూర ।
సాధురక్షణ । శంఖ - చక్రహస్త ।
ప్రహ్లాద వరద । పా - పధ్వంస । సర్వేశ ।
క్షీరసాగరశాయి । - కృష్ణవర్ణ ।
పక్షివాహన । నీల - భ్రమరకుంతలజాల ।
పల్లవారుణపాద - పద్మయుగళ ।
తే. చారుశ్రీచందనాగరు - చర్చితాంగ ।
కుందకుట్మలదంత । వై - కుంఠధామ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
ప్రభావితు ర్ధర్మస్య నిర్వ్యాజతాఅక్రోధ స్తపసః క్షమా
సర్వస్యాపి హి సర్వకారణ మిదం శీలం పరం భూషణం
తా:-- ఐశ్వర్యమునకు అలంకారము మంచితనము, పరాక్రమమునకు మాట, మంచి
శోభ నిచ్చును. జ్ఞానమునకు శాంతము, పాండిత్యమునకు వినయము, శోభించును.
ధన మున్నందుకు సత్పాత్ర దానము, తపస్సునకు కోపము లేకుండుట,సమర్థునికి
క్షమా గుణము అలంకారము లగును. ధర్మ మునకు సమత తేజస్సు నొసగును.
మిగిలిన ఏ గుణములుండనీ లేకపోనీ మంచి నడవడి సర్వ జనులకూ శోభ నిచ్చును.
తన రహస్యము నోకనితో చెప్పి మరల
నితరులకు చెప్ప వలదని హెచ్చరించు
కంటే చెప్పక యుండుట కరము మేలు
నాల్క దాటిన మాటలు నగరు దాటు
మామూలుగా లోకం లో చాలా మంది రహస్యమని ఒకరితో చెప్పి ఇంకెవరికీ చెప్ప వద్దని చెప్తూ వుంటారు.
మన తెలుగులో ఒక సామెత వుంది "పెదవి దాటితే పృథ్వి దాటుతుంది" అని అందుకని చెప్పకుండా ఉండడమే మేలు కదా!
ఆఁక్ర మింపగవచ్చు నన్యరాష్ట్ర౦బులు ప్రజల నందఱ బాధ పఱుపవచ్చు
నన్యాయమున విత్తమార్జింపగా వచ్చు విభవంబు పెంపుగావింపఁవచ్చు
మిత్రాధికారంబు మీటివేయగవచ్చు మహితోపకారంబు మఱువవచ్చు
నొకమాటబల్కి వేఱొకటి సేయఁగవచ్చు సంపదున్నతికి గర్వించవచ్చు
నాయువధికంబుగా గూర్ప నలవి యగునె
దుర్ణయులుమీదెఱుంగక దుండగమున
నిహపరములకు వెలియౌదు రింతెగాక
రామలింగేశ రామచంద్రపురనివాస!
గజాదీనాం మందబుద్ధిశ్చ సర్పాణా మతినిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకం
తా:-- మహాబలముగల ఏనుగులకు బుద్ధిమాంద్యమును, ప్రాణాపాయకారములైన సర్పములకు అతినిద్రయును, తీక్షణ బుద్ధిగలిగిన బ్రాహ్మణులలో అనేకత్వమును;
ఈ మూడింటివల్లనూ లోకమునకు ఉపకారమే జరుగుతుంది.బుద్ధి తీక్షణతవల్ల గతానుగతికత్వము ఉండదు. దానివలన కొత్తమార్గములు బట్టి పోవుటయు, స్వతంత్రాలోచనములును పెరిగి బహుముఖములైన సిద్ధాంతములు, ఆచరణములు ఏర్పడును.లోకస్థితికి యిట్టి పరిస్థితి ఉపకారమేయగుచున్నది.
క్షామమునందు నన్నము నొసంగెడు వాడు సుభిక్ష వేళలన్
హిమము నిచ్చువాడు రుణమించుక యైనను లేనివాడు సం
గ్రామము నందు ధీరుడు జగంబున వీరులు నల్వురున్ వర
గ్రామణు లంచు నెంతు రఘురామ దయాహృదయా శుభోదయా!
రాజన్నంతనె బోవునా? కృపయు, ధర్మం, బాభిజాత్యంబు, వి
ద్యాజాతక్షమ, సత్యభాషణము, విద్యన్మిత్రసంరక్షయున్
సౌజన్యంబు, కృతంబెరుంగుటయు, విశ్వాసంబుగాకున్న దు
ర్బీజ శ్రేష్ఠలుగా గతంబుకలదే శ్రీ కాళహస్తీశ్వరా!
౩౯
ఈశ్వరా! రాజు అవగానే దయాధర్మములు, అభిమానం, విద్యావివేకములు, దానివల్ల కలిగే ఓర్పు, సత్యవాక్పరిపాలనం, పండితులను, స్నేహితులను పోషించే మంచితనం, కృతజ్ఞత, విశ్వాసం అన్నీ నశించిపోతాయా? ఏమో! లేకపోతే రాజులు ఇలా పరమనీచులుగా ఉండటానికి కారణమేమి?
న తథేచ్ఛంతి కళ్యాణాన్ పరేషామ్ వేదితుం గుణాన్
యథైషా౦ జ్ఞాతు మిచ్ఛంతి నిర్గుణ్యం పాపచేతనః
పాపబుద్ధికలవారు యితరుల దోషములను తెలిసికొనుటకు నిరంతరం ఆసక్తి
చూపుతుంటారు.కానీ వారి మంచి గుణములను తెలిసికొనుటకు అంతగా ఆసక్తి చూపరు
విద్య వలన కలుగు విజ్ఞాన మెంతయో
విజయ పధము చూపు విబుధ తతికి
విశ్వ మందు చూపు విఖ్యాతిగా నిన్ను
నవ్య కవన సరణి నడుచు హరిణి.
సేకరణ (ప్రేమ ప్రసాద్ )
శ్రీ హరిణి శతకము నుండి.
ఎటువంటి వర కులంబున
బటు తరముగ బుట్టెనేని పరగగ మును గ
న్నటువంటి కర్మఫలముల
కట కట భోగింప వలయు గాదె కుమారా!
ఓ కుమారా! ఎంతటి గొప్పవంశము పుట్టినను , మనిషి పూర్వజన్మలందు తను జేసిన కర్మఫలంబులను అనుభవింపక తప్పదు కదా! కావున ఈ సత్యము నెఱింగి మసలు కొనుము.
ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు
మొదల పట్టుబట్టి వదలరాదు
మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా
విశ్వదాభిరామ వినురవేమ!
విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం.
సిరిపొయిన సమయంబున
ధరలో నెవ్వారు వాని దలపరు సుమ్మీ
సరి, రాత్రిబోవ జంద్రుని
నరులేక్రియ జూతురయ్య నాథా! కృష్ణా!
జూలు చుట్టుకొన్న వాల మల్లార్పిన
కొండకొమ్ము మీద కూరుచున్న
కరుల గుండె లదర గర్జించునా నక్క
లలితసుగుణజాల! తెలుగుబాల!! ౧౭
అధరము కదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ!
అధికారియైనవాడు మాటాడడు, మాట్లాడినా పెదవులు కదిలీ కదలనట్లు మాట్లాడుతాడు.
మౌనదీక్షలో వున్నట్టుంటాడు. ఒకవేళ మాట్లాడినా కటువుగా మాట్లాడుతాడు కానీ
మృదువుగావిన సొంపుగా మాట్లాడడు. ఇతరులు చెప్పినవి వినిపించుకోడు. ఇతరులను
సరిగాచూడడు, పట్టించుకోడు. చూచి సత్యము గ్రహించుకోడు. అట్టివాడు చెవులు వినిపించని, ,
కనులు కనిపించని శవము వంటివాడు. అతనిని చూసినా, తాకినా పాపము వస్తుంది.
నినుఁ జింతించుచుఁ, బాడుచుం, బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!
భావము:
ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతేతప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలు కావు.
!!శ్లోకము!!
కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే|
కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్||
||తాత్పర్యము||
యే గృహస్థు పెట్టిన అన్నము వేదాభ్యాసము చేసే వాని కడుపునపడి వేదాభ్యాసముతో జీర్ణమగునో ఆ అన్నము- ఆ గృహస్థుని,అతని పదితరముల పూర్వులను,పదితరముల(తరువాత వారిని) సంతతిని కూడా తరింపజేయును..... శ్రీ దత్త ఘనపాటి ఋగ్వేదం
***
అది... అమ్మ హక్కు!
క్షమ అమ్మ, బాధ్యత కాదు. ఆది ఆమె హక్కు ఎవరైనా అమాయక పుత్రుడు క్షమ ఆమె బాధ్యత అనుకుంటే, విధి అనుకుంటే, ఆమె బలహీనత అనుకుంటే. అది అతడి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఆమె ప్రేమను, ఉదాత్తమైన ఆమె హక్కును అంతలా తీసిపడేస్తే, తీసికట్టుగా భావిస్తే... అతడు నిజంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే అమ్మ క్షమలో ఏముందో ఆ అమాయక చక్రవర్తికి అర్ధం కాదు. అందులోని ప్రయోజనాలు అతడి అవగాహనలోకి రావు. అమ్మ క్షమను చిన్నచూపు చూస్తే ఆమె ఆత్మ గౌరవాన్ని కించపరచినట్లే, ఆమె సహనాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసినట్లే, తనకు చెందవలసిన ప్రయోజనాలను తానే
భంగపరచుకున్నట్లే. గర్భంలో ఎడాపెడా పల్టీలు కొడుతూ సుకుమారమైన కడుపంతా తన్నేసే దున్నేసే గర్భస్థ శిశువును, ఆ నొప్పిని భరిస్తూ బిడ్డ కదలికలకు అనుగుణంగా కష్టపడి తన శరీరాన్ని అమర్చుకునే అమ్మ క్షమ ఎంతటిదో ఆ బిడ్డకెన్నటికీ అర్ధం కాదు.
'ఎందుకంటే బిడ్డ అమ్మ కాదు. కాబట్టి, పిల్లల్లో కొందరు... అందరూ కాదు... వృద్ధాశ్రమాలను అన్వేషిస్తూ అందులో చేర్చే పథకాలను రచిస్తున్నారు! గర్భంతో నరకాన్ని భరిస్తూ కూడా బిడ్డ అన్ని విధాలా అందంగా, ఆరోగ్యంగా ఈ లోకంలోకి రావాలనే పూజలు. చేసిన తల్లికి, పారాయణాలు చేసిన తల్లికి కడుపులో ఇబ్బంది. పెడుతున్న బిడ్డను నెలలప్పుడే తీసి అవతల అవకాశాలు లేకనా? వసతులు దొరకకనా? ఈ లోకంలో తల్లికి అన్నింటికంటే, తన ప్రాణాలకంటే కూడా బిడ్డ ఎక్కువ బిడ్డే ఎక్కువ తల్లికి బిడ్డ ఒక అమృతపు మొలక వెన్నెల తునక కోకిల తన గూట్లో గుడ్లు పెట్టిపోతే కాళ్లతో, ముక్కుతో కిందికి దొర్లించక పొదిగి పిల్లలయ్యేదాకా, రెక్కలొచ్చి ఎగిరిపోయ్యేదాకా రక్షించే కాకి తల్లిని ఏమనాలి? ఆమెలోని తల్లి మనసుకు ఎన్ని చేతులెత్తి మొక్కాలి. అదే అమ్మ మనసు. ప్రతి అమ్మ మనసు. అన్నింటికంటే మనం గ్రహించవలసింది అమ్మ ఉదార హృదయం. క్షమాగుణం. అది పిల్లల దృష్టిలో ఆమె బలహీనత తమ ప్రేమను, భద్రతను కోల్పోవలసివస్తుందనే భయంతో ఆమె తీసుకునే ముందుజాగ్రత్త. కానీ అది తప్పు.. నిజానికి అది పిల్లల ప్రేమకు దూరమై బతకలేని మధురమైన బలహీనత. దానికంటే ముఖ్యంగా వారిని ప్రేమించకుండా, వారికి ప్రేమను అందించకుండా ఉండలేని అత్యంత సున్నితమైన నాజూకు బలహీనత. ఇంత సూక్ష్మ భానం ఎవరికి అర్ధమవుతుంది. అది అత్యంత కఠినమైన శిల మధ్యలో ఉన్న శీతల సలిలంలాంటిది. ఆది ఆమెకు తప్ప మరొకరికి అర్ధం కానిది. పైకి కనిపిస్తున్న క్షమ ఆమె బలహీత కాదు... హక్కు, గంభీరమైన, హుందా అయిన హక్కు. నిజానికి పిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తికంటే వారి క్షమే నిజమైన ఆస్తి హక్కు. దురదృష్టం ఏమిటంటే ఆ హక్కు అప్రయత్నంగానే, ఆనాయాసంగానే, ఉదారంగానే పిల్లలకు అందుతోంది. చెందుతోంది. ఈ లోకంలో ఆయాచితంగా... వచ్చే దానంత చవకబారు వస్తువు మరొకటి ఉండదు.
తేనెటీగలకు బహుశా నోట్లో రుచి మొగ్గలుండవేమో. ఉంటే అంత మధురమైన తేనెను కనీసం రుచి కూడా చూడకుండా పట్టులోనే నిక్షిప్తం చేస్తూ నెలల తరబడి అలా ఉండిపోయేవి కావేమో. అయితే అమ్మకు రుచి మొగ్గలున్నాయి. తేనె రుచీ తెలుసు... అమ్మకూ ఓ అమ్మ ఉంటుంది కాబట్టి, అయినా అమ్మ ప్రేమ అనే స్వయంసిద్ధ మాధుర్యాన్ని గుండె పట్టులో పెట్టుకుని, బిడ్డకై పెంచుకుని, పెంచుకుని, పెంచుకుని... ఈ అమ్మ అనే తేనెటీగ బిడ్డ కోసమే దాస్తుంది. బిడ్డకే పంచుతుంది!
చక్కిలం విజయలక్ష్మి
Xxxxxxx
No comments:
Post a Comment