Wednesday, 17 January 2024

యీ వారం


ప్రాంజలి ప్రభ...001  (మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ )

సహన సాధన

అరిషడ్వర్గాలను అదుపులో ఉంచే తారక మంత్రం సహనం. దీనివల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు. కోపం వస్తే సహనం కోల్పోతాం. చిన్న మాట పట్టింపుతో జీవితకాలం ముగిసిపోతుంది. దీన్ని నియంత్రించే సూత్రం సహనం. ఇది ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు.

ఒక పసివాడు ఏదైనా వస్తువు కింద పడేస్తే మనకు కోపం రాదు. కానీ అదే పని పెద్దవాళ్లు చేస్తే ఆవేశంతో వివేకం కోల్పోతాం. ఆ సమయంలో పెద్దవారిలోనూ చిన్న పిల్లవాడి మనసు చూడగలగాలి. అప్పుడే మనలో మనకు తెలియకుండానే అర్థం చేసుకోగలిగే సహన స్వభావం పెరుగుతుంది. సహనం ఇతరుల పట్ల మనం ఏర్పరుచుకునే ఓ భావన. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనకు మనం ఎలా స్పందిస్తున్నామో స్వీయ పరిశీలన ఎంతో ముఖ్యం.

మిమ్మల్ని రెండు విషయాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు పాటించే సహనం. అన్నీ ఉన్నప్పుడు మీరు ప్రదర్శించే సంయమనం. వంద బిందెలతో ఒకేసారి నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. మనం కోరుకున్నట్లు ఏ పనులూ క్షణాల్లో జరిగిపోవు. దేనికైనా సమయం రావాలి. సహనం కావాలి.

ఓ శిల్పి బండరాయిని అందమైన శిల్పంలా మలచడానికి సమయం కావాలి. ఓ శాస్త్రవేత్త నూతన విషయం కనుగొనడానికి సహనం కావాలి. అలాగే ఓ తల్లి అందమైన బిడ్డకు జన్మనివ్వడానికి, ఓ గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకలా రూపాంతరం చెందడానికి సమ యం, సహనం రెండూ కావాలి.

ఓర్పు అనేది ఎంతో చేదుగా ఉంటుంది. కానీ దాని వల్ల లభించే ప్రతిఫలం మాత్రం తీయగా ఉంటుంది. అనుభవానికి ప్రతిస్పందనకు మధ్య తలెత్తే అద్భుతమైన స్థితే సహనం. అది ఉన్న చోట స్థితప్రజ్ఞ స్థిమితంగా ఉంటుంది.

సాధన శిఖరంపై పతాక ఎగరేసే వారందరి యశస్సులోని రహస్యం ఒక్కటే. సహనంతో నిరంతర సాధనే వారి విజయ రహస్యం.

డెమోస్తనీస్ అనే గ్రీకు వక్తకు బాల్యంలో నత్తి ఉండేది. దానివల్ల ఎన్నో సార్లు అవమానాల పాలయ్యాడు. ఓ రోజు ఆయన ఓ ప్రముఖ వక్తను చూశాడు. అప్పటి నుంచి తానూ గొప్ప వక్త కావాలని నిశ్చయించుకున్నాడు. కానీ నత్తి అతణ్ని బాధించేది. నిరంతర సాధనతో తనకున్న నత్తిపై విజయం సాధించాడు. గులకరాళ్లను నాలుకపై పెట్టుకుని పెద్ద పెద్ద వాక్యాలను ఉచ్చరించేవాడు. సముద్రం ఎదుట నిలబడి సముద్ర ఘోషను మించిన ధ్వనితో ఉపన్యసించేవాడు. ప్రతిరోజూ పదహారు గంటలకు పైగా గ్రీకు మహాకావ్యాలను అధ్యయనం చేసేవాడు. చివరికి గొప్ప వక్తగా పేరుగాంచాడు.

పూర్వం గురుకుల పాఠశాలలో విద్యతోపాటు ఆధ్యాత్మిక బోధనాంశాలు భాగంగా ఉండేవి. సహనంతో సాధన చేసేవారికి అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. లౌకిక, అలౌకిక అంశాలు సహన సాధనతోనే సాధ్యమవుతాయని విద్యార్ధుల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దేవారు. నేడు విజ్ఞాన వికాసానికి బదులు విపరీత ధోరణులకు తెరతీస్తున్నారు

వినే సహనం లేనివారు అర్థజ్ఞాని గానే మిగిలిపోతారు. ఎక్కడైతే వినే సహనం, వేచి ఉండే ఓర్పు ఉంటాయో, అక్కడ కచ్చితంగా ఆధ్యాత్మిక భావనలు నిత్య సత్యాలుగా భాసిస్తాయి. అవి సహన సాధనకు సహజ ఉత్ప్రేరకాలుగా మారి సత్య దర్శనానికి దిశానిర్దేశం చేస్తాయి.

సేకరణ 

ఎం.వెంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలు

ప్రాంజలి ప్రభ...002  (మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ )


ఆకు చాటు పువ్వు(కథానిక)

______________________   -

ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మ్రోగింది. వంట గదిలోనుండి గబ గబ వచ్చి ఫోన్ తీసి"హలో" అంది సుధ..


"చిన్నీ !"అంటూ అమ్మ గొంతు పదేళ్ల తర్వాత.కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట రావడంలేదు.  

"ఎవరూ !"అన్నాడు భర్త జగదీష్.

గొంతు పెగుల్చుకుని "మా అమ్మ "అంది.

మాట్లాడు అన్నట్లు సైగ చేసాడు.

"అమ్మా..ఎలా ఉన్నావు "అంది. "బావున్నా.. టీ వీ లో వార్తలు చూడండి" అని ఫోన్ పెట్టేసింది.

" ఏంటటా "అన్నాడు జగదీష్. 

"అమ్మ వార్తలు చూడమంటోంది"అంది. 


అర్థం కానట్లు చూసి న్యూస్ పెట్టాడు. ఎవరెవరో అవార్డులు అందుకుంటున్నారు.

"నిమ్మల ప్రహేళిక  డాటరాఫ్ జగదీష్" అంటూ పిలిచేసరికి సన్నగా రివట లా ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి వచ్చి దేశ ప్రధాని చేతుల మీదుగా  అవార్డు అందుకుని క్రిందకి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కరించింది.


ఒక్కసారిగా ఇద్దరూ అదిరిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జగదీష్  ముఖం అద్దంలో చూసుకున్నట్లు ఉంది ఆ అమ్మాయి ముఖం.

తన ఇంటి పేరు,తనపేరు అర్థం కాలేదు.తల్లికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. 

మనసు గతం వైపు మళ్ళింది


సుధకువరసగా ముగ్గురు ఆడపిల్లలు. వంశోద్దారకుడి కోసం మళ్ళీ నెల తప్పింది. 'బెడ్ రెస్ట్ 'అంటే అమ్మగారింటి దగ్గర ఉండిపోయింది.

"ఈసారి మగ పిల్లాడితో రాకపోతే నిన్ను తీసుకు వెళ్ళం "అన్న అత్త,మావ,భర్త మాటలు గుర్తుకు వచ్చి చిగురుటాకులా వణికిపోయింది సుధ. 

తరచి తరచి అడగ్గా తల్లికి కారణం చెప్పింది. 

"నువ్వు ప్రశాంతంగా ఉండు "అని ధైర్యం చెప్పి,ఇతి హాసాలు చేతికి ఇచ్చి చదవమనేది తల్లి సుందరమ్మ.

తాను నిద్రపోయేటప్పుడు ప్రక్కన కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది. 

నొప్పులు మొదలయ్యాయి. ఆందోళన లో సుధ మనసు మనసులో లేదు. 

ఆడపిల్ల పుట్టి చనిపోయిందని నర్సు వచ్చి చెప్పింది. 


ఊపిరి పీల్చుకున్నాడు జగదీష్. 

కనీసం బాధ పడని అల్లుడిని చూసి "పాఠాలు చెప్పే వాడికి గుణ పాఠం చెబుతాను "అంది తల్లి."నీకు పుణ్యం ఉంటుంది ఏమనకు "అంటూ ప్రాధేయ పడింది సుధ.

'మంచి రోజులు లేవంటూ'అత్తవారింటికి తీసుకు వెళ్ళారు. 

అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళి పోయేవారు సుధ కుటుంబం. 

పదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడని తెలిసి వెళ్ళారు. మొట్ట మొదటగా అక్కడ చూసింది పన్నెండేళ్ళ ప్రహేళికను. తల్లిదండ్రులు ఈ పిల్లను పెంచుకుంటున్నట్లు ,వారి తదనంతర ఆస్తి ఆ పిల్ల పేరున వ్రాసినట్లు తెలిసి జగదీష్ పెద్ద గొడవ చేశాడు. 

"ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాం !దాన్నేవరినో పెంచుకోవడం ఏమిటి ?"అంటూ పెద్ద గొడవ చేసి, ఆరోజు నుండి ఈరోజు వరకు అమ్మతోమాట్లాడనివ్వలేదు.

రానివ్వలేదు.             

ప్రహేళిక అంటే ప్రశ్న అని అర్థం. భర్త పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏవో ఆలోచనలు జవాబు అమ్మే చెప్పాలి.

అమ్మా వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చినట్లు తెలిసి వెళ్ళాం. హాలు లో నిలువెత్తు నాన్న ఫోటో. చుట్టూ  ఈ అమ్మాయి గెలుచుకున్న అవార్డులు. 

ఒక సాధారణమ్మాయి సంగీత, సాహిత్య నాట్య ప్రదర్శన లలోనూ,కరాటే, బాడ్మింటన్ వంటి క్రీడలలో రాణించడం,నేడు ఇస్రో సైంటిస్ట్ గా అవార్డు గెలవడం చూసి గర్వంగా అనిపించింది.

ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న తాపత్రయం నిలువనీయడం లేదు. ప్రశ్నార్థకంగా చూస్తున్న కూతురు అల్లుడు వైపు చూసి "ఆకు చాటున నేను దాచిన పూజా పుష్పం ప్రహేళిక. చచ్చిపోయిందనుకున్న మీ కూతురు. ఆడపిల్ల మైనస్ కాదు.వంశోద్దారకుడు వంశాన్ని నిలబెడతారు అనేది తప్పు.తనతో పాటు మీకు కీర్తి సంపాదించడమే నిజమైన వంశాభివృద్ధి. ఆడైనా , మగైనా ఇద్దరూ నీ బిడ్డలే గా. వ్యత్యాసం ఎందుకు.మీరు చూసే విధానంలో పద్దతి మార్చుకోండి. "అంది సుందరమ్మ.

"అమ్మా.. ఎవరు వచ్చారు "అంటూ లోపలికి వచ్చిన ప్రహేళికను చూసి 

"నువ్వు చిక్కుప్రశ్న వి కాదు .చిక్కుపడిన నాలాంటి చదువుకున్న ఛాందసభావాల వారికి సమాధానానివి "అంటూ గట్టిగా కూతురిని గుండెకు హత్తుకున్నాడు  జగదీష్ .

సేకరణ 

మంచాల శ్రీలక్ష్మీ (మైత్రి).                   రాజపూడి గారికి ధన్యవాదములు

నేటి ప్రాంజలి ప్రభ..003 (మల్లాప్రగడ )

*చింతించే అలవాటును వదులుకోండి*


జీవితంలో బలమ్ముగా జీవ యాత్ర

సాగ చింతన వదలాలి సానుకూల

మైన దృష్టిని పెట్టిపురోగతి గను 

దిశలలో ప్రవహించుట దివ్య మౌను 


*జీవితంలో ఆధ్యాత్మిక బలం పెరగాలంటే, చింతించే అలవాటును వదులు కోవాలి. ఇది మనల్ని ఉద్విగ్నంగా మరియు దయనీయంగా భావించడం తప్ప వేరే ప్రయోజనాన్ని అందించదు. మన నియంత్రణకు మించిన విషయాల గురించి చింతించడం మానేసి, ఆశావాద మరియు దయ గల ఆలోచనలను రూపొందించడంపై దృష్టి పెట్టినప్పుడు, మన జీవితం మరింత సానుకూల దిశలలో ప్రవహించడం ప్రారంభమవుతుంది. జీవితం పట్ల అలాంటి తేలికైన మరియు సులభమైన విధానం, ప్రతిదాన్ని మన పురోగతిలో సహాయపడేలా చేస్తుంది.*

పనులు చేయకుండ ప్రారబ్ద మనుకుంటు,

జాతకమును నమ్మి జపము చేయ

జేబు  నిండదు, మరి   జీవంబు గడువగ

చేయవలెను పనులు చెలిమి తోను,

కాలమన్న గతియు గమ్య మార్గముగాను,

కళలు కల్ల లవక కాల మందు,

చేయు దాన ధర్మ చింత మాపియు శాంతి,

కలుగ గలుగు నిత్య కాంతి నిలుచు 


*ఆనందమనెడి జలముతో నిండిన,పరమేశ్వర చరణకమలములనెడి పాదునుండి బయలువెడలి భక్తియనెడి తీగ,స్థైర్యమనెడి పట్టుకొమ్మకెగబాకి శాఖోపశాఖలుగా ప్రసరించి నా మనస్సనెడి ఎత్తైన పందిరినెక్కి నలుదిశల నాక్రమించినది. సత్కార్మానుష్ఠానములనెడి ఉర్వరకము(ఎరువు)ల ప్రభావమున దట్టముగా నిష్కల్మషముగావర్ధిల్లిన ఆ లత నాకు ప్రీతికరమైన శాశ్వతఫలము నొసగుగాక.*

*****

*_కాకి పిల్ల కాకికి..!

Just for laugh )


కొందరు ప్రముఖులు 

ఒక చోట చేరి మాటాడుకుంటుంటే కొడుకుల గురించి ప్రస్తావన వచ్చింది..


గవాస్కర్:ఏంటో నా కొడుకు నాలా ఆటలో పెద్దగా రాణించలేక పోయాడు..

😔😔😔😔😔😔


అమితాబ్:ఆ సంగతి నాకే చెప్పు..నా కొడుకు నా అంత పొడుగైతే అయ్యాడు గాని..నటనలో బెబ్బే..

🙊🙊🙊🙊🙊🙊

జితేంద్ర:నా కొడుకు సినిమాలోనే కనిపించలేదు..

ఇక అందం సంగతి ఏం చెప్పాలి..మీ నాన్నా అని అడుగుతున్నారు..

వాణ్ణి చూపిస్తుంటే..

🙈🙈🙈🙈🙈🙈

మాలియా:నన్ను చూడండి..

ఎంత జాలీగా ఉంటానో..

నా కొడుకు అసలు మీకు ఎప్పుడైనా కనిపించాడా..!

😥😥😥😥😥😥

లాలూ ప్రసాద్:ఆవు గట్టున మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా..మా వాడూ

నాలాగే నానా గడ్డి కరుస్తున్నాడు లెండి!

🤫🤫🤫🤫🤫🤫

మన రాష్ట్రంలోని 

ఓ పెద్దాయన: నా సంగతి 

ఏం అడుగుతారు..

మా సంస్థకు 

మా మామ ఫౌండర్..

నేను కేడర్..

మా అబ్బాయి ఎప్పటికయ్యేనో లీడర్..!?????????????

🤭🤭🤭🤭🤭🤭

ఇంకో పంచె కట్టు పెద్దమనిషి:

నేను డాక్టర్..మావాడు పెద్ద యాక్టర్...

పదవి నాది..

పోలిక మా నాన్నది..!

నేనేమో మడమ తిప్పను..

మావాడు అన్నీ తిప్పేస్తాడు.. తప్పేస్తాడు..తప్పించేస్తాడు!

😡😡😡😡😡😡

ఇంకో ముక్కాయన:

అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న..

ఈ మాటకు మావోడు

సరిగ్గా సర్పోతడు భాయ్..

నేను గుడిని..గుడుంబాను మాత్రమే మింగుతా..

ఆడు గడి దాటకుండా..

గాడి తప్పకుండా..

గారడి చేసి మొత్తం

......స్తాడు..!!

ఆయన భాష  కొంచెం మొరటు మరి!?

🫢🫢🫢🫢🤭🤭


*ఇవన్నీ వింటున్న* 

*ఓ మేడం తన కొడుకు* *గురించి ఏం చెప్పాలో తెలీక అక్కడి నుంచి కామ్ గా జంప్..!!??*

💃💃💃💃💃💃

నేటి ప్రాంజలి ప్రభ ..005

*శక్తిపీఠాలు అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నయ్ ?

*పురాణ కథ...*

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు, 

ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది.

ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.                                        .                                                                                                                                                                                                                                                                               

సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి  విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.

ప్రతీ శక్తిపీఠంలోనూ, దాక్షాయణీ, భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, భేదాభి ప్రాయాలున్నాయి.

ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి:


*18 శక్తిపీఠాలు..🙏*

*అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం :*


*లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే*

*ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే*

*అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా*

*కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా*

*ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా*

*ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే*

*హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ*

*జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా*

*వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ*

*అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్*

*సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్*

*సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్*


1. శాంకరి - శ్రీలంక 

ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో  ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో  పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. #దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.


2. కామాక్షి - కాంచీపురం.

తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. శృంఖల ప్రద్యుమ్ననగరం.

పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. చాముండి - క్రౌంచ పట్టణం.

మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. జోగుళాంబ-అలంపూర్.

తెలంగాణ 'తుంగభద్ర' & కృష్ణ నదుల సంగమ క్షేత్రంలో ఉంది.

6. భ్రమరాంబిక - శ్రీశైలం.

ఆంధ్రప్రదేశ్ - కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతంగా ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో  కూడా  ఒకటి.

7. మహాలక్ష్మి - కొల్హాపూర్..

మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం  మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8. ఏకవీరిక - మాహుర్యం..

లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు.  షిరిడీ నుండి ఈ మాతనుదర్శించుకొనవచ్చును.

9. మహాకాళి - ఉజ్జయిని..

మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10. పురుహూతిక - పీఠిక్య..

లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11. గిరిజ - ఓఢ్యదేశం ఒడిశా..

జాజ్‌పూర్ కే రోడ్ నుండి 20 కిలోమీటర్లు - వైతరిణీ నది తీరాన ఉంది.

12. మాణిక్యాంబ - దక్షవాటిక..

లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో.

13. కామరూప-హరిక్షేత్రం..

అసోం, గౌహతి  నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నదీతీరాన వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

14. మాధవేశ్వరి -ప్రయాగ..

(అలహాబాదు), ఉత్తర ప్రదేశ్,  త్రివేణీ సంగమం సమీపం - 

ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు.

15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం..

కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ - 

ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

16. మంగళ గౌరి - గయ.

బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

17. విశాలాక్షి - వారణాసి..ఉత్తర ప్రదేశ్.

18. సరస్వతి - జమ్ముకాష్మీరు.

అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.


*🙏51 శక్తి పీఠాలు..🙏*


1- సంఖ్య-స్థలము

2- శరీరభాగము / ఆభరణము

3- శక్తిరూపము

4- శివరూపము


1. హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్ 

బ్రహ్మరంథ్రము (శిరోభాగము)

కొత్తారి

భీమలోచనుడు


2. షర్కారె,సుక్కార్ స్టేషను వద్ద, కరాచీ, పాకిస్తాన్

కన్నులు 

మహిషమర్దిని

క్రోధీశుడు


3. సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున

ముక్కు 

సునంద

త్ర్యంబకేశ్వరుడు


4. అమరనాధ్  శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్ 

గొంతు 

మహామాయ

-త్రిసంధ్యేశ్వరుడు


5.జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద 

నాలుక 

సిద్ధిద (అంబిక)

ఉత్తమ భైరవుడు


6. జలంధర్ (దేవీ తాలాబ్)

ఎడమ స్తనము

త్రిపురమాలిని

భీషణుడు


7. వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్ 

గుండె 

జయదుర్గ

వైద్యనాథుడు


8. గుజ్యేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరం వద్ద, నేపాల్ 

మోకాళ్ళు 

మహాశిర

కపాలి


9. మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వత సమీపమున మానస సరోవరంలో ఒక శిల

కుడి చేయి 

దాక్షాయిని

అమరుడు


10.  బిరాజా, ఒడిషా 

నాభి 

విమల

జగన్నాథుడు


11.  ముక్తినాథ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్ 

నుదురు 

గండకీ చండి

చక్రపాణి


12.  బహుళ, అజయ నది ఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్ 

ఎడమ చేయి 

బహుళా మాత

భిరుకుడు


13.  ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్  

కుడి మణికట్టు 

మంగళ చండిక

కపిలాంబరుడు


14.  ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం 

కుడి కాలు 

త్రిపురసుందరి

త్రిపురేశుడు


15.  ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్ 

కుడి చేయి 

భవాని

చంద్రశేఖరుడు


16.  త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్ 

ఎడమ కాలు 

భ్రామరి

అంబరుడు


17.  కామగిరి, కామాఖ్య, నీలాచల పర్వతాల వద్ద, గౌహతి, అస్సాం 

యోని 

కామాఖ్య

ఉమానందుడు


18. జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్

కుడి పాదము 

జుగాద్య

క్షీర ఖండకుడు


19. కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా 

కుడి బొటనవేలు 

కాళిక

నకులీషుడు


20.  ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్ 

కుడి వేళ్ళు 

లలిత

భవుడు


21. జయంతి, కాలాజోర్ బోర్ భోగ్, ఖాసి గ్రామం, జయంతియా పరగణాలు, సిల్హెట్ జిల్లా, బంగ్లాదేశ్ 

ఎడమ తొడ

జయంతి

క్రమదీశ్వరుడు


22.  కిరీత్, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

కిరీటము 

విమల

సంవర్తుడు


23.  వారణాసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్

చెవిపోగు 

విశాలాక్షి, మణికర్ణి

కాలభైరవుడు


24. కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమాఱి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు 

వీపు 

శర్వాణి

నిమీశుడు


25.  కురుక్షేత్రం, హర్యానా

మడమ ఎముక 

సావిత్రి

స్థాణువు


26. మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్ 

రెండు చేతి కడియాలు

గాయత్రి

సర్వానందుడు


27.  శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్ 

మెడ 

మహాలక్ష్మి

సంబరానందుడు


28. కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్ 

ఎముక 

దేవగర్భ

రురుడు


29.  కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్ 

ఎడమ పిరుదు 

కాళి

అసితాంగుడు


30.  షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్ 

కుడి పిరుదు 

నర్మద

భద్రసేనుడు


31.  రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్ 

కుడి స్తనం 

శివాణి

చందుడు


32.  బృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్

కేశాభరణం 

ఉమ

భూతేశ్


33.  శుచి, శుచితీర్థం శివమందిరం, కన్యాకుమారి వద్ద, తమిళనాడు

పై దవడ పండ్లు 

నారాయణి

సంహరుడు


34.  పంచసాగరం (స్థలం తెలియదు) 

క్రింది దవడ పండ్లు

వారాహి

మహారుద్రుడు


35.  కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్

ఎడమకాలి పట్టీ 

అర్పణ

వమనుడు


36.  శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాష్మీర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు)

కుడికాలి పట్టీ 

శ్రీ సుందరి

సుందరానందుడు


37.  విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

ఎడమ కాలి మణికట్టు

కపాలిని (భీమరూప)

సర్వానందుడు


38. ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాథ్ మందిరం వద్ద, జునాగధ్ జిల్లా, గుజరాత్

ఉదరం 

చంద్రభాగ

వక్రతుండుడు


39.  భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ 

పై పెదవి పైభాగం 

అవంతి

లంబ కర్ణుడు


40.  జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర

చుబుకం 

భ్రామరి

వికృతాక్షుడు


41.  సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్ 

బుగ్గలు 

రాకిణి / విశ్వేశ్వరి

వత్సనాభుడు / దండపాణి


42. బిరత్, భరత్ పూర్ వద్ద, రాజస్థాన్ 

ఎడమ కాలి వేళ్ళు 

అంబిక

అమృతేశ్వరుడు


43.  రత్నావళి, రత్నాకర నది ఒడ్డున, ఖనకుల్-కృష్ణనగర్ వద్ద, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్

కుడి భుజం 

కుమారి

శివుడు


44.  మిథిల, జనక్ పూర్, భారత్-నేపాల్ సరిహద్దులో

ఎడమ భుజం 

ఉమ

మహోదరుడు


45.  నల్హతి, కొడపైన, బీర్భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్

కాలి పిక్క ఎముకలు

కాళికా దేవి

యోగేశుడు


46.  కర్ణాట్ (స్థలం తెలియదు) 

చెవులు 

జయదుర్గ

అభీరుడు


47. వక్రేశ్వరి, పాపహర నది ఒడ్డున, దుబ్రాజపూర్ స్టేషను వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

కనుబొమల మధ్య భాగము

మహిష మర్దిని

వక్రనాథుడు


48.  జెస్సోర్ (యశోరి), ఈశ్వరిపుర్ వద్ద, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్ 

చేతులు, కాళ్ళు 

యశోరేశ్వరి

చందుడు


49.  అత్థాస్, లాభపూర్ వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

పెదవులు 

ఫుల్లార

విశ్వేశుడు


50.  నందిపూర్, సైంతియా రైల్వే స్టేషనులో ఒక మఱ్ఱి చెట్టు క్రింద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

మెడలో హారం 

నందిని

నందికేశ్వరుడు


51. శ్రీలంక  (ట్రింకోమలి లో, హిందూమహాసాగర తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదనీ, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదనీ ఒక వివరణ) 

కాలి పట్టీలు 

ఇంద్రాక్షి

రాక్షసేశ్వరుడు.


*సర్వేజనా సుఖినోభవంత్🙏🏻*

*సేకరణ :*

*_మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ *

ప్రాంజలి ప్రభ..006

భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషలు::


 2000 సంవత్సరం:

1వ స్థానం- హిందీ

 2వ స్థానం -తెలుగు

 3వ స్థానం- బెంగాలీ 

4వ స్థానం- మరాఠి


2010 సంవత్సరం:

1వ స్థానం- హిందీ 

2వ స్థానం -బెంగాలీ

3వ స్థానం- తెలుగు 

4వ స్థానం మరాఠీ 


2020 సంవత్సరం:

 1వ స్థానం -హిందీ

 2వ స్థానం- బెంగాలీ 

3వ స్థానం -మరాఠీ 

4వ స్థానం -తెలుగు 


చూశారా కేవలం 20 సంవత్సరాలలో తెలుగు 2వ స్థానం నుండి 4వ స్థానానికి దిగజారింది.

 తెలుగు భాష దిగజారింది అంటే తెలుగు వాళ్ళు దిగజారినట్లే కదా! 


ఇంకో 10 సంవత్సరాల లో తెలుగు భాష చివరి స్థానానికి దిగజారుతుంది. అంటే తెలుగుజాతి వాళ్లు అట్టడుగు స్థానానికి జారినట్లే.


ఎవరైనా తెలుగు వాళ్ళు ఆత్మాభిమానంతో తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివిద్దామనుకుంటే భారతదేశమంతటా ఎక్కడా తెలుగు మీడియం పాఠశాలలు లేవు .చివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లేవు.


 తెలుగు మీడియం పాఠశాలలు లేకపోవడం వలన రాబోయే రోజుల్లో తెలుగు రాసేవారు, చదివే వారు ఉండరు. అందువల్ల ఇంకో 10 నుండి 20 సంవత్సరాల్లో తెలుగులో పుస్తకాలే ఉండవు. ఉన్నా మ్యూజియంలో పెట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు. 


ఆ తర్వాత దేశంలో ఎక్కడా తెలుగు భాష ఉండదు కాక ఉండదు.

 అంటే తెలుగుజాతి అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.


 దీనికి కారణం వేరెవరో కాదు. తెలుగు వాళ్ళు తమ భాషను తాము  చేసుకుంటున్న ద్రోహమే దీనికి కారణం.

అందుకే ప్రజలారా తిరగబడండి, తెలుగులో జి ఓ.లు ఇవ్వాలని, తెలుగు భాషలో బోధనా తరగతు లుండాలని, ప్రతి ప్రభుత్వము, ప్రవైట్ లో కూడా తెలుగు తప్పక వాడాలని ప్రభుత్వం వారే చెప్పాలని, ముందుకు రావాలని, తెలుగు కంప్యూటర్ అభివృద్ధి చెయ్యాలని

 కోరు తూ మాతృబాష రక్షించుకుందాం అని ప్రతి ఓటరు ముందుకు రావాలి

దేశభాషలందు తెలుగు లెస్సా అని చాటుదాం


మీ ప్రాంజలి ప్రభ

కొత్త  దంపతుల ఫస్ట్ నైట్. 

కొత్త రంగులతో... అబ్బాయి అమ్మాయి పెళ్ళి నిశ్చయమైన రోజు నుంచి వేచి ఉండే మొదటి రాత్రి.


అమ్మాయి ఒక చేతిలొ వైన్ గ్లాస్  పెట్టుకొని బెడ్ రూమ్ కి వచ్చింది.


భర్త చిరునవ్వుతో అడిగాడు.  సునామి తాకి?


ఆమె wine ఇస్తూ సిగ్గుతో  చెప్పింది " దా.. త్రా. తో..."?


భర్త ప్రేమతో చిరు కోపం వచ్చేలా అన్నాడు...

చచ్చా.. చొచ్చో.. తీ.. తీ..  త్రా..? 


దానికి ఆమె మెల్లగా మృదువుగా చెప్పింది...

"మియో..  మియా.. మా కోడిండ"


భర్త మళ్లీ నవ్వుతూ అన్నాడు "నా మియా..కి నాటిన్ "


అందుకు ఆమె నవ్వుతూ వయ్యారంగా చెప్పింది...    

 "చెక్.. చెక్..కి కినా మాటొ"


అప్పుడు ఆమె భర్త ఆమె చెవులో మెల్లగా ఇలా చెప్పాడు... "సా కో టిటి యేమి చీ"


అందుకు ఆమె నవ్వుతూ , జంభో జంభా జంబియా  అన్నది

...

...


నిజంగా మీ అందరిని మెచ్చుకోవాలి.


 ఒక్క ముక్క అర్థం కాక పోయిన ‘ఫస్ట్ నైట్’ అనే సరికి  ఎంత ఓపిగ్గా చదివారో. .


అలాగే నేనూ బడ్జెట్ అనే సరికి నిన్నంతా చాలా ఓపిగ్గా చూసాను. ...ఒక్క ముక్క అర్థం కాక పోయినా

***

ప్రాంజలి ప్రభ...0012


పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 


అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 


అందరాని చందమామకోసం అలకలు పోయావు. 

కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 


బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు. 


ఆయన నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 


ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. 


తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందామనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 


చెప్పొద్దూ! అంత అహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 


ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.


ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. 


నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానా యాగీ చేసేసింది. 


నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదు ఫొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. 


ఇక్కడుంటే మా నాయకుల్లా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏమిటో? 


పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు. 


‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 


నీకు తోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓ ఉత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 


తనూ బట్టలు సర్దేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.


ఇహ మీతమ్ముడు. 


చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు. 


డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. 

పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 


అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు. 


వాళ్ళతో కలిసి నీ మూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. 


నిశ్శబ్ద మందిరాల్లో నిదరోయే మహరాజు బిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠి కిందే పడుకున్నావు.


ఒకటారెండా.... పద్నాలుగేళ్ళు! 


ఎన్నో తప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 


జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మా సరదా తీర్చకుండా బయటే ఊరేగుతూ వుంటారు.


అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 


అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 


నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 


ఇంటో అన్నీ వుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 


అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆ లేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపంచెంది,  తెద్దామని బయల్దేరావు.


మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు. 


ఏ మాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 


నిస్సహాయతనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. 


మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. 


ఎంతో ఇష్టంకాబట్టే ఎంత కష్టపడాలో అంతాపడ్డావు. 


ఏ సాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలూ చెప్పలేదు. 


తాతయ్య నోటివెంట నీ కథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటి అనుమానం... కోతుల్నెలా లొంగదీసుకోడమని! 


అదీ చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 


వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది! 


ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువు చేసిన స్నేహమూ, ఆనక వాళ్ళ సాయంతోనే నువు కట్టిన వారధీ చూస్తే... 


దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!


సెభాషోయ్ రామా! నీ గురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 


నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం!


నిలకడ లేని వాళ్ళతో పొంతన

నీళ్ళను దాటడానికొక వంతెన

నిర్భయమేగావుంటే నీచెంతన

నిరాధారులకిచ్చావు సాంత్వన

నికార్సైనది నీ మార్గం ఎంతైనా

నిరతమూ మాకదేకదా చింతన


నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!


నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 

నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!


పదిమందీ కలిస్తే పండగ! 

పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! 

పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!


అందాలరాముడు....

అందువలన దేముడు!!

***

ప్రాంజలి ప్రభ....6/02

*ప్రపంచం స్థిరమైన ప్రవాహంలో ఉంది, అది నదిలా ఉంటుంది. ఇది ప్రవహిస్తుంది, కానీ ఈ ప్రవాహం, మార్పు, చిత్రం వెనుక, ప్రతిదీ కలిపి ఉంచే సూత్ర దారం ఉండాలి. ఏదైనా పూర్తిగా మారకుండా ఉండకుండా మార్పు సాధ్యం కాదు. మార్పు లేని మూలకంతో మాత్రమే మార్పు ఉనికిలో ఉంటుంది, లేకపోతే విషయాలు విడిపోతాయి*.

*ఆ విశ్వ నియమాన్ని సదాశివుడు, శాశ్వతమైన దేవుడు, కాలాతీత దేవుడు, మార్పులేని దేవుడు అని అంటారు. మరియు ఇది ధ్యానం చేసేవారి పని: దారాన్ని కనుగొనడం. రెండు రకాల మనుషులు మాత్రమే ఉంటారు. ఒక వ్యక్తి పువ్వుల ద్వారా చాలా మంత్రముగ్ధుడై, దారాన్ని మరచిపోతాడు. అతను శాశ్వతమైన విలువ లేదా ప్రాముఖ్యత లేని జీవితాన్ని గడుపుతాడు, ఎందుకంటే అతను ఏమి చేసినా అదృశ్యమవుతుంది. ఈ రోజు అతను దానిని చేస్తాడు, రేపు అది పోతుంది. ఇది ఇసుక కోటలను తయారు చేయడం లేదా కాగితపు పడవలను ప్రారంభించడం. రెండవ రకం వ్యక్తి అంతర సూత్రం కోసం శోధిస్తాడు మరియు తన జీవితమంతా ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే దానికే అంకితం చేస్తాడు; అతను ఎప్పుడూ ఓడిపోయేవాడు కాదు.*

మనస్సు నుండి అధిమనస్సునకు మనం ఆరోహించినప్పుడు. అచట నొక వినూత్న చైతన్య పరివర్తనం కలుగుతుంది. అధిమనశ్చైతన్య ప్రభావితమైన యోచన, సంకల్పం, భావావేశం, ఇంద్రియ సంవేదనం, భౌతిక సంస్పర్శ మున్నగు వానితో కూడిన దేహ ప్రాణ మనస్సులతో సమస్తమూ దర్శించి అనుభవించ గలుగుతాము.

****

ప్రాంజలి ప్రభ...0012....6/02

..


పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 


అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 


అందరాని చందమామకోసం అలకలు పోయావు. 

కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 


బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు. 


ఆయన నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 


ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. 


తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందామనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 


చెప్పొద్దూ! అంత అహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 


ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.


ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. 


నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానా యాగీ చేసేసింది. 


నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదు ఫొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. 


ఇక్కడుంటే మా నాయకుల్లా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏమిటో? 


పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు. 


‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 


నీకు తోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓ ఉత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 


తనూ బట్టలు సర్దేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.


ఇహ మీతమ్ముడు. 


చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు. 


డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. 

పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 


అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు. 


వాళ్ళతో కలిసి నీ మూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. 


నిశ్శబ్ద మందిరాల్లో నిదరోయే మహరాజు బిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠి కిందే పడుకున్నావు.


ఒకటారెండా.... పద్నాలుగేళ్ళు! 


ఎన్నో తప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 


జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మా సరదా తీర్చకుండా బయటే ఊరేగుతూ వుంటారు.


అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 


అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 


నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 


ఇంటో అన్నీ వుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 


అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆ లేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపంచెంది,  తెద్దామని బయల్దేరావు.


మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు. 


ఏ మాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 


నిస్సహాయతనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. 


మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. 


ఎంతో ఇష్టంకాబట్టే ఎంత కష్టపడాలో అంతాపడ్డావు. 


ఏ సాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలూ చెప్పలేదు. 


తాతయ్య నోటివెంట నీ కథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటి అనుమానం... కోతుల్నెలా లొంగదీసుకోడమని! 


అదీ చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 


వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది! 


ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువు చేసిన స్నేహమూ, ఆనక వాళ్ళ సాయంతోనే నువు కట్టిన వారధీ చూస్తే... 


దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!


సెభాషోయ్ రామా! నీ గురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 


నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం!


నిలకడ లేని వాళ్ళతో పొంతన

నీళ్ళను దాటడానికొక వంతెన

నిర్భయమేగావుంటే నీచెంతన

నిరాధారులకిచ్చావు సాంత్వన

నికార్సైనది నీ మార్గం ఎంతైనా

నిరతమూ మాకదేకదా చింతన


నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!


నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 

నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!


పదిమందీ కలిస్తే పండగ! 

పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! 

పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!


అందాలరాముడు....

అందువలన దేముడు!!

*****

*సుఖం...!*ప్రాంజలి ప్రభ..6/02

                    


        *ప్రతి మనిషీ- జీవితంలో సుఖంగా ఉన్నాడా ?*


     *అసలు సుఖం అంటే*


  *మనసుకు శాంతి అన్నా, సుఖం అన్నా ఒక్కటేనా ?*


       *జీవితంలో డబ్బు ఉంటే.... సుఖం ఉన్నట్లేనా ?*


       *డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక శాంతి అనుభవిస్తున్నారా ???*


       *జీవితం ఎంత  చిత్రం,   విచిత్రం? "ఏమి లేనపుడు   కడుపుకు.... ఇంత కూడు చాలు  అనిపిస్తూ.....   తరువాత కాస్త గొంగళి, తర్వాత ఉండేదానికి కాస్త గూడు అనీ..,ఇంతవరకువచ్చి తృప్తిగా ఉన్నామా,  లేదే.... ?*


    *ఇంకా,ఇంకా ఎదగాలి!  ఎదిగావు..!! ఇంకా డబ్బు సంపాదించాలి !!*


*సంపాదించావు ..!*

*నా పిల్లలు లగ్జరీగా పెరగాలి !! పెరిగారు .. !*


*పెద్ద భవంతులు కావాలి! కొన్నావు .. !! నా పరపతి పెరగాలి ! పెరిగింది .. !! అయినా ఇంకా ఏదో.....*


*ఏమిటి ఆ ఏదో .... ?*

*ఏదో తెలియని అసంతృప్తి !      ఎందుకు అంటే ........ ఏమో .....?*


   *ప్రతి మనిషికి...., ప్రతి మనసుకు.... ఎన్ని కధలు మరెన్ని వ్యధలు ..?*

 

*కధ.. కధ.. మాటున దాగిన...       కన్నీటి చెలమలు ఎన్నో... ఎన్నెన్నో ... !*


*డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండక ... ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండక ...    భార్యా భర్తల గొడవలు .. ,               పిల్లలు మాట వినటంలేదని వేదన...,   ఉధ్యోగం... , వ్యాపారం... ,              పెళ్లి , ఇల్లు , వాకిలి..., ఇలా ఎన్నో ఎన్నెన్నో ...*


*ఎన్నో కధలు విని .. కలత పడిన మనసు ప్రశ్నిస్తుంది ..*

*'అసలు సుఖంగా ఉన్నవారు ఉన్నారా? సుఖం అంటే ఏమిటి ? '*


*అవును సుఖం అంటే ఏమిటి.... ?*

*శాంతి అంటే ఏమిటి ??*

*శాంతి ఎక్కడ దొరుకుతుంది ?*


*నీకు నచ్చిన విధంగా ...*

*నీ మనసు మెచ్చిన విధంగా జరిగిన   ఏ విషయమైనా నీకు సంతోషం అనిపిస్తే అదే సుఖం ... !*


*నీకు నచ్చని ఏ సంఘటన జరిగినా , అది దుఃఖం అనుకుంటావు ... !*


*అంటే సుఖం అయినా దుఃఖం అయినా నీ మనసులో కలిగే భావాలే...!*


*ఆ భావనకు అతీతంగా స్థిమితంగా జీవించ గలిగితే.... స్థిత ప్రజ్ఞతే .... !!*


*ఈ స్థితికి మనసును ఎలా తీసుకు వెళ్ళాలి ... ?*


*'నేనే.. ఈ మేను..!'అనుకున్నంతవరకు                         యెద చీకటేగా...!  ''*


*కంటిలో నలుసులా కుదుట పడనీయదు ...*


*ఇక్కడ నేను అతిధిని మాత్రమే ...!*

*నాలుగు రోజుల అతిధిని మాత్రమే... !! 'ఇది నాది కాదు కాదు..కానే కాదు...!!!' అనే స్పృహ...*

*పరుగులు తీస్తున్న అరిషడ్వర్గాలను 'సత్యం' అనే  అంకుశంతో నిత్యం... ఒక్కమారు స్పృశిస్తే  ....*

*సత్యం బోధపడుతుంది .. !*

*సాక్షిగా నీ చూపు నిలబడుతుంది ...!!*


*డబ్బు, సిరులు, సంపదలు....*

*మేనికి సుఖాన్ని ఇస్తాయి కానీ... మనసుకు శాంతిని, ప్రశాంతతని ఇవ్వలేవు ...*


*మనసుకు శాంతి మాత్రం ....*


*మరణం లేని 'మీరు .... మీరేన'ని గ్రహించిన క్షణం మాత్రమే ... !*


*_you are not a body ...!_*

*_you are a soul... !!_*

*_love you all .. !!!️_*


సేకరణ 🙏

****

No comments:

Post a Comment