యీ కధల్లో మీకు నచ్చిన కథఏదో తెలపండి
***
🙏🌹మానవుడు జీవితంలో పైకి రావాలంటే ఐదు విధాలుగా పునీతమవ్వాలి.వాటినే పంచపునీతాలు అంటారు... అవి...
🌹వాక్ శుద్ధి
🌹దేహ శుద్ధి
🌹భాండ శుద్ధి
🌹కర్మ శుద్ధి
🌹మనఃశ్శుద్ధి
*🙏వాక్ శుద్ధి🙏*
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు.
కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు.పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు.
మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
*🙏దేహ శుద్ధి🙏*
మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ,
రెండు పూటలా స్నానం చెయ్యాలి.చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
*🙏భాండ శుద్ధి🙏*
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి.
స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
*🙏కర్మ శుద్ధి🙏*
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు.
తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.
*🙏మన: శ్శుద్ధి🙏*
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది ....
ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి.దీని వల్ల దుఃఖం చేకూరుతుంది ....
కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...
ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
భక్తి ప్రవేశిస్తే మనిషి మహాత్ముడవుతాడు !!..
భగవంతుని శుభ ఆశీస్సులు అందరికీ
***
ప్రాంజలి ప్రభ -లోక లీలలు గనుము రామభక్తాంజనేయని రమ్య లీల శతకం (1-9) తేటగీతి.. పంచపది
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ
గడ్డు ప్రేమేను హాయిగా గుటక వేయు
ఈసు కన్నులు దోయిగా యిప్సి తమ్ము
చూచు చెడుపులు వేయిగా సూత్ర మేను
మార్పు పెరిగియు నీటుగా మంచి జేయ
రామభక్తాంజనేయని రమ్య లీల
ఆశ పెరిగిన వాడులే ఆత్ర ముండు
అహము పెరిగిన వాడులే యాట జూపు
తనకు తానుగా కీడులే తప్పు జేయు
మహిమ చూపెడి మోడులే మనసు చేరు
రామభక్తాంజనేయని రమ్య లీల
పొరుగు దేశము లిచ్చియు పోరు జరుపు
పుల్ల ఇజములు మెచ్చియు పుడమి నందు
మూర్ఖ జనులలో మార్పుయు ముఖ్యమౌను
ఎన్ని చెప్పిన మారరు యేల చెప్ప
రామభక్తాంజనేయని రమ్య లీల
ప్రజల కెంతయో మమతయు ప్రగతి కోరి
బీద బతుకులో కలతయు బీరు త్రాగి
పెద్ద ధనికుని చింతయు బీద చితుకు
ఆశ పాశము చిక్కియు యల్లు కొనుట
రామభక్తాంజనేయని రమ్య లీల
చిన్ని పాదము లందును చింత జేరు
చివరి ప్రాసల యందును చినుకు పోరు
చేయు వీనుల విందును చిత్త మందు
తప్పు లెంచకు ఎందును తలపు తెరవ
రామభక్తాంజనేయని రమ్య లీల
నీతి చెప్పెది జాణయు నిజము గనుము
జాతి ఛందము లోనయి జాము రాత్రి
మీటు హృదయము వీణయు మేలు జరుగు
చాటు మాటున సరసము చాకి రగుట
రామభక్తాంజనేయని రమ్య లీల
పెద్ద వృత్తము కన్నను పిడక మదియు
చిన్న పదమేను మిన్నయు చేరు వగుట
చెప్పు నీతులు కన్నను చింత మలుపు
చేయు పనిలోనె నీతియు తీరు మారు
రామభక్తాంజనేయని రమ్య లీల
పరుల మేలును కోరియు పాఠమవ్వు
పదము లల్లెడి వారిని పలుకరింపు
పథము చక్కటి దారిని పరుస వేది
కధలు చెప్పెడి తీరును కాల మార్పు
రామభక్తాంజనేయని రమ్య లీల
నీవు పలికిన రీతియు నీడ తీరు
నేను పాడెద నీతియు పాల మెరుపు
నీకు చెందుత ఖ్యాతియు నిమ్న బతుకు
నాదు మాటల గీతయు నటన మాయ
రామభక్తాంజనేయని రమ్య లీల
***
ఏడడుగుల బంధం కధ
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి
కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.
వివాహాన్ని సుఖమయం
చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు. పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.
కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...
బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేది అందులో ఒకపేజీ మాత్రమే. ఆ ఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.
మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం
(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.
భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి కానీ అయోమయం కాకూడదు.
మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.
అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.
పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.
ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య
***
స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:
పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.
రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.
నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే జీవితం.
అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.
మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.
30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.
మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.
ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.
మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే.
నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.
నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.
అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.
జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:
1. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.
2. ఆహారమే ఔషధం. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.
3. వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.
4. మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.
5. వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.
చివరగా, వీటిని గుర్తుంచుకో:
వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం !
నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !!
ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకున్న జీవిత సత్యం కదా!
***
పెద్దముదురు కధ
: *కొట్టుకొచ్చిన స్టోరీ..*
ఒక పిల్లాడు కోడి గుడ్లు బుట్టతో సైకిల్ తొక్కుతూ ....
ఒక రాయిని ఢీ కొని పడిపోయాడు.
గుడ్లన్నీ పగిలిపోయాయి..
జనం గుమిగూడారు..
*సైకిల్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి.*
*సున్నితమైన వస్తువులు ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాల్సింది*.....ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు..
సమూహంలోనుంచి ఒక పెద్దాయన వచ్చి....
*అరెరె..గుడ్లన్నీ పగిలిపోయాయే..! పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు . ఇదిగో బాబు ఈ పది రూపాయలు ఉంచుకో..చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు..ఎవరైనా సహాయం చేస్తే కాదనకు.*.....
చెప్పి వెళ్ళిపోయాడు..
ఇదంతా చూసిన జనం - ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు.
మొత్తానికి - వీడికి పగిలిపోయిన గుడ్లు విలువ కంటే ....
ఎక్కువ మొత్తం డబ్బులొచ్చాయి.
గుంపులో ఒకతను....
*నువ్వు అదృష్టవంతుడివి. ఆ ముసలాడు లేకపోతే నువ్వు నీ యజమానికి సమాధానం చెప్పుకోలేపోయోవాడివి*.
పిల్లాడు నవ్వుతూ.....
*ఆ ముసలాడే నా యజమాని.. అతని దగ్గరే నేనుపనిచేస్తుంది. అతను గుజరాతీ. వాడు పెద్ద ముదురు.*
***
***
నిజమైన శక్తి కధ
ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.
కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు.
విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపో ఫలానికి ఒక పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.
తపోఫలమా? సత్సంగాత్స ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మవద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు.. దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో.. పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు. ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు.. సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.
విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపో ఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు.
అప్పుడు వశిష్ఠుడు అన్నాడు. ‘ఒక పూట సమయంతో పాటు (దైవికంగా అరగంట అనుకోవచ్చు) మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.
వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది.
ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.
అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు.
‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపో ఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు. వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.
చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?!.
ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని.. ఏ ఇద్దరు కలిసినా అదే తీరు.. ‘చరవాణి’తోనే మాట్లాడుకుంటున్నారు. చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక, మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?
........
******************************
విజేత కవిత గా ఎన్నికైన నా కవిత.
******************************
అంశం:-ఈ జన్మకిది చాలు.
శీర్షిక:-సత్యం శివం - సుందరం సుమధురం.
**************************************
అట్టడుగునుంచి మెట్టు మెట్టు ఎక్కుతు
గుట్టుగా సాగుతు
కష్టనష్టాలను వెనక్కు నెట్టుకుంటు
మట్టిలో మాణిక్యం లా
మెరుపులు నా సొంతం!!
నిట్ట నిలువుగా ముంచిన
బంధాల కబంధ హస్తాల నుంచి
మాయ మాటల విషపు కౌగిళి నుంచి
కాలం తప్పించిన వైనం ఓ అధ్భుతం!!
మంచితనాన్ని మానవత్వాన్ని
కాపాడుకోవాల్సిన బాధ్యత తనకుందని
ప్రకృతి చూపిన చొరవ అండగా నిలిచిన
మూడుముళ్ళ బంధం నిగ్రహానికి
పలకాల్సిందే కృతజ్ఞతల నీరాజనం!!
నమ్మకం పెట్టుబడిగా పెట్టి
అమ్మకం మొదలెట్టి ప్రతికూలాలకు
తలవంచక వేసిన అడుగులు
ఇచ్చిన నిబ్బరం
ధైర్యానికి వెన్నెముకై నడిపిస్తే
నిర్ణయాలన్ని సహేతుకమై
సాధించిన సమతుల్యత
ఈ జన్మకిది చాలనే
సంతృప్తికి పట్టం కట్టింది!!
పైసా రాక పోకలకు కొత్త భాష్యం చెప్పి
ఊరి ఉన్నతి ప్రాముఖ్యతకు పెద్దపీట వేసి
ఎవరు చేయలేని సాహసాన్నై
కదులుతున్న కాలంతో
నా అడుగులు ఆనందానికి సంకేతాలై
నలుగురు నా వాళ్లని గర్వంగా చెప్పుకునేలా
ప్రస్థానం సత్యం శివం సుందరం సుమధురం!!
****************************************
మహేష్ వూటుకూరి ✍️
దోర్నాల.
ప్రకాశం జిల్లా.
*************
***
ద ద ద కధ
దేవుడు, మనిషి, దానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.
దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు.
'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ 'ద' అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." 'ద' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు
మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!' అని యథాప్రకారం సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. 'ద' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటాను' అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు.
ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ 'ద' శబ్దం భావం బాగా గ్రహించి ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’' అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! 'ద' శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను' అని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు.
వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో 'ద.. ద.. ద' అంటూ కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమ, దాన, దయా గుణాలనిగూర్చి బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***
*భర్త ఆఖరి ఉత్తరం*..పెద్ద కధ
(వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ...)
పది రోజుల నుండి బంధువుల,పిల్లల తోటి కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది.
ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకరరావు మాస్టారు సడన్ గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరి అయిపోయింది.
పిల్లలందరూ శంకరరావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.ఇక మిగిలింది పార్వతమ్మ మనసులా మారిన ఆ ఇంటిలో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిలిస్తే పలికే నాధుడే లేడు.ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికి లేదు.వెళ్లి వస్తాo... "ఆరోగ్యం జాగ్రత్త,"
"సమయానికి మందులు వేసుకో",
"ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్" .....అంటూ పిల్లలు మాట వరసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. మొట్ట మొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది.
కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి.
ఇంతలో..... పోస్ట్ అని కేక వినబడింది.
ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దానిమీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త శంకరరావు గారిదే. చనిపోయిన వ్యక్తి ఎలాఉత్తరం రాశారనుకొంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది.
" ప్రియమైన పార్వతికి...
నువ్వు ఆశ్చర్య పడతావని నాకు తెలుసు. నేను బతికున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో ఏపీ భవన్ లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యం కిచ్చి....నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను.
నా మనసులోని మాట నేను బతికిన్నన్నాళ్ళు చెప్పలేకపోయా.ఎవరికి చావు ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది.భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం.ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు.
ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి.ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్లినా ఈ ఆధునిక కాలంలో కొడుకు, కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ల కుటుంబ వ్యవహారాల బాధ్యతలను నీ నెత్తి మీద రుద్దబడుతాయి.వయసు మీరిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం.తప్పని పరిస్థితిల్లో తెలియకుండానే కుటుంబ బరువులు మరింత పెరుగుతాయి.
ఒంటరిగా ఉంటే.... ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. మంచి వాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు. ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ల మీద నమ్మకం లేదు.కాలం అలా ఉంది మరి.ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూసాను.
రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలైపోయింది.నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంది.వీలునామా కాగితం దేవుడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను. ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్ లో ఉంచాను. ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు ఏపీ భవన్ సుబ్రహ్మణ్యం కు ఫోన్ చెయ్. వాడికి చాలా వివరాలు అన్నీ చెప్పాను.
ఆర్థిక స్వాతంత్రం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు. పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా...ఏదైనా పరిస్థితులు బాగా లేనప్పుడు నువ్వు ఎవ్వరిని అడగక్కర్లేదు.బ్యాంకు బాలన్స్ అంతా జాయింట్ అకౌంట్ లోనే ఉంది . ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసే పెట్టే నా శిష్యుడు రామరావు బ్యాంకు మేనేజర్ గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు. వాడు సహాయం చేస్తాడు.
ఏ పిల్లల ఇంటికెళ్ళిన నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు. సున్నితమైన నీ మనసు బాధపడు తుంది.నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో శేష జీవితాన్ని చక్కగా గడుపు. దేవుడిచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు.
వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళు నీతోటి చాకిరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దానిగా, జీతం లేని పనిమనిషి లాగా చేయడం జరిగే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను.
మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము. మంచి మంచి చదువులు చెప్పించాం. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లిళ్ల తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్లో, మరే కారణము తెలియదు కానీ వాళ్లకు ఉన్న ప్రాధాన్య అంశాల్లో మనం లేము.నేనది గుర్తించాను.
మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్నా కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేదు.కూతురు పరిస్థితి సరే సరే.
ఇవన్నీ నేను గమనించాను.ఎంతోమంది తల్లిదండ్రులు అనాధ శరణాలయాల్లో దిక్కుమొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు.
తమ సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా జీవిస్తున్నారు.
కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి.కానీ అధైర్య పడకూడదు. ఒకరు ముందు ఒకరు వెనక. ఓపిక ఉన్నన్నాళ్ళు ధైర్యంగా, ఇష్టమైన పనులు చేస్తూ బతుకు.ఇన్నాళ్లు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే...పడే బాధ్యతలు నిన్ను ఊక్కిరిబిక్కిరి చేస్తాయని తెలుసు.దీనికి భయపడకు.అన్నీ సర్దుకుంటాయి.
మన చేతల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని.జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కష్టమైనా, సుఖమైనా నింపాదిగా ఎదుర్కో.బాధ్యతలన్నీ ఒంటిచేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తో సుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం. నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునే వాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత.
ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను.
- ఇట్లు... ప్రేమతో నీ భర్త శంకర రావు "
ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ....
కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ.... ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది శంకర్రావు భార్యపార్వతమ్మ....✍️
పదవీ విరమణ చేసిన,చేయబోతున్న ఉద్యోగులకు అంకితం....
సేకరణ రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
నాకు నచ్చిన కథ ఏడడుగుల బంధం మరిమీకు
ReplyDelete