Sunday, 14 January 2024

16-01-2024

 


 

 ఓం శ్రీ మాత్రే నమ:

కారణ పర చైతన్య రూపిణి
కామ పీఠపు ఆశ్రమ వాసిణి
కాంచీపురం కరుణ స్వరూపిణి   
కోమలమైన దయ విహారిణి   ...    ....  (1)   

కంచన కాంచి పుర తిలకమ్ము
నిత్య ధనుర్భాణ కేశపాశమ్ము  
కఠిన పాలిండ్ల తోన భారమ్ము  
కైవల్యానందము కు కారణమ్ము ...... ... (2)
 
కాంచీ కామాక్షి చింతామణి గను  
చింతింప ఫలము పోషణ గను     
చైతణ్యామృత ప్రవాహిని గను
చిత్తం చల్లబర్చు కామక్షి గను ..... .... (త్రీ)

కామాక్షి మల్లెపువ్వువంటి నవ్వు    
వంకర తిరిగి ముంగుర రివ్వు
ముఖము ఎర్రని కుంకుమ పువ్వు    
పర్వత చక్రవర్తి సర్వ మవ్వు ...... .... (4)

కాంచీ పుర యవ్వనాల కుమారి
కామ మోహయతి  శివ శంకరి  
సర్వ దృష్టిని సంప్రోక్షణాసిరి     
పంచ భూతాలపైన అధికారి  .... .... . (5)

కమల నయనాల అధినేత్రి  
కాంచీ పురాన కుచకుంభధాత్రి
సర్వుల ప్రాణ రక్షణగా నేత్రి
త్రినేత్రుని జయించే హిమపుత్రి ..... ... (6)
 

జీవేశ్వరైక్య జ్ఞానాంకి హేతువు  
ఈశ్వరుని ఐశ్వర్యపు హేతువు
వేదాన్ని వివరించేటి హేతువు
శిరస్సున అర్ధ చంద్ర హేతువు  ... .... 7

ఆనందాడ్వైత వృక్షపు మొలక
యవ్వన గర్వ పర్వ పు మొలక    
శిరోభూషణ వేదాల మొలక   
కామాక్షిరక్షణ కాంచీ మొలక ... ...... 8
 
శృంగారాద్వైత సాస్త్ర రక్షనిగా  
మహాశివునికి విధేయతగా
స్థనములతోnu సుందరముగా
నిత్య సిద్ధాంత సూత్రధారిణిగా  ... ...9

కాంచీ పురాణ రత్న భూషణగా
శివ తొడపై దర్శ నించేదిగా  
మన్మధుని ప్రసూతి గృహముగా
కటాక్షము లిచ్చేటి దేవతగా  .. ... ... 10.

మనస్సుఏ విహార ఉద్యానము
చిద్విలాస సుందర మైన మోము   
నివాసము కంపా నది తీరము  
కరుణ తోను పంచు కటాక్షము  .. .... 11..

సర్వస్వ సంప్రదాయము తోకల్గి
మనసు ఏకాగ్రత చూప కల్గి
శివపీఠమే ఆధారము కల్గి
కామాక్షి మనసునే పంచ కల్గి ....... ... 12

నిత్య తరుణీయమైనట్టి బాల
శివాలింగనమునే పొందు హేల
మది ఉల్లాస భరితపు లీల
నిత్యం కంచి నందు జరుగు గోల.... ..... 13

చతన్య శరీర కాంతి మెఱుపు
చెఱకు విల్లు హృదయ మెఱపు
బంధు జీవముల పుష్ప మెఱుపు
గిరిపై శ్రీ కామాక్షిగ మెఱుపు ...... ....... 14

మధుర మైన చిరునవ్వులతో
మంద గమనపు స్థనములతో
మన్మధ సామ్రాజ్య గర్వముతో
శ్రీ కామాక్షి దేవి గ ఆటలతో   .... ...... 15

భూమి ఆకాశం వాయవు వీక్షించే
యజమాన అగ్ని భూమి వీక్షించే
సూర్య చంద్రలు జలము వీక్షించే
రూపాష్టమూర్తి  తల్లిని వీక్షించే .... .... 16
 
తెల తెల్లని మంద హాసముతో
చల చల్లని సృష్టి చూపులతో  
సన సన్నని నడుము వంపుతో
నిర్గుణ తత్వముల పలుకుతో .... ..... 17

కాంచి పురాన్ని పవిత్ర ముగా
శివ పులకిత శరీరముగా
మన్మధ లీలల సరసముగా
శ్రీ కామాక్షి దేవి సాక్షాత్కారంగా .... ..... 18

మన్మథునికే రెక్కలు తెప్పించి
ఇసుక తిన్నెలలో విహారించి
యవ్వన రూప శివుని మెప్పించి
సంపదతో పుణ్యవతి దీవించి  .... .... ... 19

నిత్యమూ యౌవన సర్వస్వముతో
దేహ తరుణారుణ రేఖలతో
సమాన సాంప్రదాయ కళల తో
శ్రీ కామాక్షి దేవి వెలుగులతో   .... ..... ..... 20

శివాభ్యుదయం తెలప గలిగి
మన్మధుని శరీర పుష్టిమయం
కంచి కామాక్షి దర్శించగలిగి  
పరిణామమైన వౌవనమయం  ....... ...... 21

జ్ఞానమయమైన సరస్వతిగా   
పరిపూర్ణత గల్గి సహాయంగా
చంద్రునినే  శిరోభాషణముగా
కాంచీపురము  ఆశ్రయ వాసిగా .... ....... 22

పువ్వుల బాణాన్ని ధరించియు
చెరుకు విల్లునే ధరించియు
కాంచిపురమున ఆటలాడియు
ఎరుపును విశేష౦గా ధ్యానించియు ..... . 23

సంతోష శంభో ప్రవాహమందునా
గర్భమధు ధార గతి యందునా
వేదాంత కమల దివ్య వెల్గునా
స్తనసౌందర్య ముచే తేజంబునా ..... ...... 24

ఏకామ్రనాధుని జీవిత లీల
శ్రీ కామాక్షి దేవి ఆశ్రీయ లీల
సర్వ పాపములు  పోగెట్టే లీల
జింక పిల్ల కన్నుల దేవి లీల ..... ........ 25

ఆనందామృత సాగరంలో తేలి
అమ్మవారి నవ్వుముఖము హోళి
దయ ప్రేమ లతో చూపెటి జాలి
అనిర్వచన మైన దేవి లాలి   ..... ........ 26



.......


ఇహ పర లోకాల్లో సుఖంతోపాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికే ఉంది. సత్య స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ధర్మం. ధర్మాన్ని అనుష్ఠించే వారు ధర్మాత్ములు. అధర్మానికి పాల్పడేవారు పాపాత్ములు. పరమాత్మ మనం చేసే ధర్మ కార్యక్రమాలనే గాక, అధర్మ కార్యక్రమాలనూ గమనిస్తూ, వేటికి ఎలాంటి ఫలాలివ్వాలో, అవి ఇస్తుంటాడు. పరోక్షంగా ధర్మాధర్మాలను పరీక్షించే వాడు పరమాత్మే. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని కాదని, అధర్మానికి పాల్పడితే అది మనల్ని శిక్షిస్తుంది. మనం ధర్మాధర్మాలను తెలుసుకొని వ్యవహరించాలి. అయితే ధర్మానికి దెబ్బ తగిలే పరిస్థితులు ఆయాకాలాల్లో ఉత్పన్నం అవుతాయి. అప్పుడే మహాత్ములు భూమి మీదికి వస్తారని భగవద్గీత చెబుతున్నది.

శ్రీకృష్ణుడి నోట వచ్చిన ఈ వాక్కులు అర్థవంతమైనవి. ధర్మానికి హాని కలిగిన ప్పుడు తనను తాను సృష్టించుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించాడు. ఇక్కడ తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటలను జాగ్రత్తగా పరిశీ లించాలి. చాలామంది పండితులు దేవుడు అవతరిస్తాడనే అర్థం చెప్పారు. అవతారం అంటే పైనుంచి కిందికి దిగడం అని అర్థం. ఇక సృష్టించుకోవడం అంటే తనను పుట్టించుకోవడం. కృష్ణుడు తనను తాను సృష్టించుకుంటాను అన్నాడు. అంటే తాను మళ్లీ శరీరధారిని అవుతానని చెప్పడమన్నమాట. సృజనలో ఉన్నది శరీరమే తప్ప, ఆత్మ కాదు. జీవాత్మకు చావు పుట్టుకలు లేవు. అది ఇవ్వాళ ఉండి మర్నాడు పోయేది కాదు. శాశ్వతమైనది.

జీవులు తమ కర్మలకు అనుగుణంగా జన్మలను పొందుతారు. అంటే రకరకాల శరీరాలను ధరిస్తారు. ఈ శరీరాలను సృష్టించుకునే శక్తి జీవులకు ఉండదు. పరమాత్మే జీవులకు భోగాన్ని, ఆయువును, జన్మను ఇచ్చేవాడు. మరి శ్రీకృష్ణుడు స్వయంగా తనను సృష్టించుకున్నాడనే మాటకు అర్థం ఏంటి? తానెప్పుడూ ఉన్నవాడే కదా? తనను అంటే ఆత్మను సృష్టించుకోలేడు. ఇక సృష్టించుకోదగింది కేవలం శరీరాన్ని మాత్రమే. అయితే అది అతనికెట్లా సాధ్యమైందో గ్రహించాలి.

వైశేషిక దర్శనం శరీరాలను రెండు విధాలుగా పేర్కొంటున్నది. శుక్రశోణితాల మూలంగా పుట్టుక గలవి యోనిజ శరీరాలు. అలా పుట్టనివి అయోనిజాలు. పరమాత్మ సృష్టి విచిత్రమైనది. అది జీవుల కర్మ వైచిత్రి వల్ల ఏర్పడుతుంది. సృష్టి ఆదిలో పరమాత్మ సంకల్పం వల్ల జీవులకు శరీరాలు లభిస్తాయి. ధర్మ విశేషం వల్ల మహర్షుల శరీరాలు, అధర్మ సహితం వల్ల చీమ, దోమ వంటి శరీరాలు, ధర్మాధర్మాలకు పాల్పడటం వల్ల పశ్వాదుల శరీరాలు ఏర్పడతాయి. పరమాత్మ సంకల్పం వల్ల మహర్షుల శరీరాలు సిద్ధిస్తే, యోగసిద్ధి వల్ల ముక్తజీవులు స్వయంగా శరీరాలు సిద్ధింపజేసుకోవడం సృష్టి వైచిత్రికి చక్కని ఉదాహరణ.

జీవులకు మోక్షం యోగ మార్గం ద్వారానే సిద్ధిస్తుంది. వారు జీవించి ఉండగానే మోక్షానికి అర్హత సంపాదించుకుంటారు. అందుకే భీష్ముని లాగా ఎప్పుడంటే అప్పుడు శరీరాలను విడువడానికి కూడా సంసిద్ధులు అవుతారు. యోగులకు తమ శరీరాలను విడిచిపెట్టగల సామర్థ్యమే కాదు, మరొక సామర్థ్యమూ ఉంది. అదే తమ శరీరాలను తాము సృష్టించుకునే ఏర్పాటు. శ్రీకృష్ణుడు తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటల అంతరార్థం ఇదే! పుణ్యాత్ములైన యోగ పురుషులు మానవలోకం ధర్మభ్రష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోరు. కనుకనే తమను తాము సృష్టించుకొని శరీరధారులై భూమికి వస్తుంటారు. అదే అవతారం. అంతేగాని పరమాత్మ ఎన్నడూ అవతరించడు. అతడు అజుడు. జీవి మాత్రమే జన్మ ఎత్తగలడు. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. తన యోగశక్తితో పూర్వం తానెత్తిన జన్మలను గూర్చి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏ యుగంలో అయినా రాగలడు, ధర్మాన్ని రక్షించగలడు.

*లక్ష్మీదేవి జయంతి*


ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి , స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని , ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని , ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని , సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం.


క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు , అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.


విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ *ఖ్యాతి చేసిన తఫః ఫలమే* లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.


లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు , చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు *కనకధారాస్తవం* పఠించాడని , అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.

అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ , ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.


లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు , ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు.


జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి , తామస మన్వంతరంలో భూమినుండి , రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి , చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.


పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై *”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక”* అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.


దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి , ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.


క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా , తరువాత సురభి అనే కామధేనువు , ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం , పిమ్మట ఐరావతం , కల్పవృక్షం , వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం.


భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము , మేధస్సు , ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.


*అశ్వపురాణం*


వేద వాంగ్మయంలో అత్యంత ప్రధానమైన జంతువు గోవు. తరువాతి స్థానం- అశ్వానిది. వేదాల్లో చాలా చోట్ల గుర్రం ప్రస్తావన వస్తుంది. దేవతా గణాన్ని గోవులో మాదిరిగానే, విశ్వాన్ని గుర్రంలో దర్శించింది బృహదారణ్యకం. 'విశ్వమే అశ్వం' అంది. యజ్ఞ కార్యాలలో దేవతలను ఆహ్వానించేందుకై 'ఓ అగ్నిదేవా! అపరిమితమైన వేగంతో పురోగమించే రోహితాశ్వాలను పూన్చిన రథంలో పోయి దేవతలను త్వరితగతిన వెంట తీసుకొనిరా' అని అగ్నిదేవుణ్ని అభ్యర్థించే వేదమంత్రాలను రుగ్వేదం ఆవిష్కరించింది. రోహితాలంటే ఎర్రని మేలుజాతి గుర్రాలు.

గుర్రాలను మనిషి ఇంద్రియాలుగా సంకేతించింది కఠోపనిషత్తు. ఆత్మను రధికుడని, శరీరాన్ని రథమని, బుద్ధిని సారథిగాను, మనసును కళ్లెంగాను అభివర్ణించింది. ప్రాపంచిక విషయాలే గుర్రం పరుగులు తీసే మార్గాలు. ప్రాపంచిక విషయాల పట్ల ప్రలోభం తగ్గాలంటే- రథం పూర్తిగా సారథి నియంత్రణలోకి రావాలి. అంటే బుద్ధి చైతన్యవంతంగా ఉంటే దేహం అదుపులో ఉంటుంది. మనసు నిలకడగా ఉంటుంది. దుష్టాశ్వాలకు (ఇంద్రియాలకు) పెత్తనం ఇస్తే రథం(శరీరం) గతి తప్పి, ప్రమాదంలోకి జారుతుందని ఆ సంకేతాల సారాంశం.

దేవతల వైద్యులు అశ్వినులు పేరుకు తగినట్లుగా అశ్వముఖులు. హయగ్రీవ మంటే గుర్రం మెడ. 'జ్ఞానానందమయం దేవం...' అంటూ సకల జ్ఞాన స్వరూపుడు, సమస్త విద్యలకు ఆధారభూతుడని లోకం స్తుతించే హయగ్రీవుడి రూపంలోనే శ్రీమహావిష్ణువు అగస్త్య మహర్షికి ధర్మో పదేశం చేశాడని బ్రహ్మాండ పురాణం వెల్లడించింది. లలితా స్తోత్రాలు అందు లోవే! సప్తి అంటే గుర్రం. హయగ్రీవం కారణంగానే శ్రీహరికి ‘సప్తి' అనే పేరు వచ్చింది.

అశ్వధాటీవృత్తం పేరుతో ఛందశ్శాస్త్రం ఒక వృత్తాన్ని నిర్ణయించింది. గుర్రం నడకను పోలిన గతిని దానికి నిర్దేశించింది. 'ఛోటీభవ న్నిఖిలభేటీ కదంబవన వాటీషు నాకిపటలీ...’ అంటూ పది దిక్కుల ప్రకృతి స్వరూపాన్ని పది శ్లోకాల్లో వర్ణిస్తూ తన కవన ధాటిని కాళిదాసు నిబంధించింది అశ్వధాటి ఛందస్సులోనే. మహాభారతమైతే ఒక అధ్యాయాన్ని అశ్వమేధ పర్వమని వ్యవహరించింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు,ప్రబంధాలు... అన్నింటా అశ్వానికి సముచిత గౌరవం దక్కింది.


గుర్రాల ఉత్పత్తి స్థానాలు ఏడని వేదం సూచించింది. అమృతంలోంచి ఉద్భవించింది- ఉచ్చైశవం. (క్షీరసాగర మథనంలో అమృతంతో పాటుగా పుట్టిన ఈ అశ్వాన్నే దేవేంద్రుడు సొంతం చేసుకున్నాడు). దేవతల బాష్పాల్లోంచి ఆవిర్భవించింది- హయగ్రీవం. అది వారి కన్నీటిని తుడిచింది. అగ్ని నుంచి, వేదాల్లోంచి, అండం నుంచి, గర్భం నుంచి... ఇలా మొత్తం ఏడు చోట్ల నుంచి గుర్రాలు పుట్టాయంది వేదం. యుద్ధాల్లో అశ్వదళం పాత్ర విలక్షణం. 'హయలక్షణ విలాసం' పేరుతో మనుమంచిభట్టు- గుర్రాల జాతి లక్షణాలను వివరించాడు. శాలిహోత్రముని సమగ్ర సమాచారంతో అశ్వశాస్త్రాన్ని లోకానికి అందించాడు.

అశ్వమనే పదానికి మార్గాన్ని ఆక్రమిస్తూ ముందుకు సాగిపోయేదని అర్థం. ఆస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, ప్లుతం- అని గుర్రం పరుగులు అయిదు రకాలు. వీటినే 'అశ్వధారలు' అంటారు. ఒకే వేగంతో 500 మైళ్లు ఏకధాటిగా పరుగెత్తగల సామర్థ్యం గలవి- సైంధవాలు. అలసట వచ్చినప్పుడు నేలపై అటూ ఇటూ దొర్లి లేచి నిలబడి తిరిగి అంత దూరమూ పరుగెత్తడానికి సిద్ధమైపోతాయి. జాతిగుర్రాలకు గల ఈ పటుత్వానికి ప్రతీకగానే 'అశ్వశక్తి(హార్స్ పవర్)' శక్తికి కొలమానంగా లోకంలో స్థిరపడింది.


✍🏻ఎర్రాప్రగడ రామకృష్ణ


         *విష్ణుపాదుని దివ్యకథ*


గోవింద అంటే స్తుతింపబడినవాడు అని అర్ధం.ఈ సృష్టి మొత్తంలో  శ్రీమన్నారాయణుల వారికంటే స్తుతించదగినవాడు ఎవరుంటారు. అందుకే  సమస్త ప్రాణికోటి నిత్యం ఆ స్వామినే కీర్తిస్తుంటారు. వేదాలు, ఉపనిషత్తులు,  పురాణాలు అన్నీ ఆ పరబ్రహ్మమూర్తిని స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులని, దివ్యభోగ భాగ్యాలను వివరిస్తున్నాయి.


 తిరుమల కొండలలో ….               ఈ గోవిందనామమే  నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరి  గోవిందనామ స్మరణతో  ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి


పూర్వకాలంలో ఒకనాడు శ్రీనివాసుని ఆనందనిలయంలో ఉన్న హుండీ  ప్రక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై ఒక చిలుక వచ్చి వాలింది. అది ఎటూ కదలక  భక్తులను చూస్తూ అక్కడే ఉంది. ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకుని హుండీలో  కానుకలు సమర్పించుకుని అటు తరువాత ప్రక్కనే ఉన్న      ఆ చిలుకను చేతితో  నెమ్మదిగా నిమరసాగారు. అలా ప్రతిభక్తుడు ఒక్క క్షణం చిలుకవద్దనే నిల్చుని  ఆప్యాయంగా ఆ చిలుకను నిమురుతున్నాడు. ఆ చిలుకకు ఒకే కన్ను ఉండటం  భక్తులలో కొందరు గమనించారు. రెండవ వైపు కన్ను  మూసుకునే ఉన్నది. ఆ  ఒంటికన్ను చిలుకను చూసి జాలిపడి ఒక భక్తుడు నెమ్మదిగా దానిని నిమరగా  బహుశా అలా చేస్తే మంచిది కాబోలు అనుకుని ప్రతి భక్తుడు అదే పని  చేయసాగాడు. 

ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది. వారు ఈ  చిలుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతమంది భక్తులు దానిని  ముట్టుకుంటున్నా అది అసలు ఎటూ ఎగరటం లేదు ఎందుకని. వారెవరికి  అర్ధం కాలేదు.

అలా వారం రోజులు గడిచాయి. ఆ చిలుక మాత్రం అక్కడనుండి  కదలలేదు. రాత్రి చీకటి పడిన తరువాత బహుశా   ఏ  పండో   తినడానికి ఎగిరి  వెళుతోంది. తిరిగి ఉదయానికల్లా మళ్ళీ అక్కడకే వచ్చి అదేచోట నిలుస్తోంది.

ఒకనాడు తిరుమలకు స్వామి దర్శనార్ధమై ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు  ఎంతో మహిమ గలవాడని   అతనికి పక్షుల భాషలు కూడా తెలుసునని భక్తులు  చెప్పుకున్నారు. ఇది విన్న అర్చకులు ఆలయంలోని చిలుక గురించి చెప్పారు.

అప్పుడు ఆ సాధువు స్వామిని దర్శించుకొన్న తరువాత హుండీ దగ్గరకు వచ్చి  పక్కనే ఉన్న ఆ చిలుకను అందరిలానే తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు. వెంటనే ఆ చిలుక రెండవ కన్ను తెరుచు కున్నది...

అప్పుడు ఆ చిలుక ఆ సాధువుతో ఇలా అన్నది. స్వామీ! తమరు  మహానుభావులలాగా ఉన్నారు. నేనిక్కడ ఇలా ఎందుకు వాలానో చెప్తాను వినండి…

కిందటి జన్మలో నేను విష్ణుపాదుడనే బ్రాహ్మణుడను. ఎన్నో పాపకార్యాలు చేయడం  వలన ఈ జన్మలో ఇలా పక్షిరూపం ధరించాను. అది కూడా పుట్టు గుడ్డిగా  జన్మించాను. కంటికి ఏమీ కనపడక ఆ చెట్టుపై, ఈ చెట్టుపై వాలుతూ దొరికిన  ఫలాలను తింటూ కాలం గడిపాను. అలా ఎక్కడెక్కడో ఎగురుతూ ఈ కొండపైకి  చేరాను. వారం రోజులక్రితం ఈ ఆలయసమీపంలోనికి వచ్చాను.

ఇది ఆలయం  అని నాకు తెలియదు. ఏదో అలా ఎగురుతూ వచ్చి ఇక్కడ వాలాను. అప్పుడు  ఒక భక్తుడు నాపై చెయ్యివేసి నెమ్మదిగా నిమిరి వెళ్లిపోయాడు. అంతే! క్షణంలో  నాకు ఆ భక్తుడు నిమిరినవైపు కంటిచూపు వచ్చింది. నేనున్న ప్రదేశం సాక్షాత్తూ  ఆ శ్రీమన్నారాయణుని ఆలయంగా గ్రహించాను. నన్ను ఆవిధంగా నిమిరిన ఆ  భక్తుడు ఏ అహంకారం లేక స్వామినే సర్వంగా భావించి, ఆరాధించేవాడు.  సర్వకాల సర్వావస్థలయందు  ఆ స్వామినే స్మరిస్తూ ఏపని చేసినా అది       శ్రీ వేంకటేశ్వర  ప్రీత్యర్థంగా భావించి చేసేవాడు. 

రోజూ ఉదయాన లేవగానే, తిరిగి రాత్రి  పడుకునేటప్పుడు ఆ స్వామి పాదాలనే స్మరించేవాడు. ఎవ్వరినీ తరచు మాటలతో  నిందింపడు. ఎటువంటి చెడు ఆలోచనలూ చేయడు.    దేనికీ తొణకడు. అంతటి  అసమాన్య భక్తుని స్పర్శ తగలడంతో నాకు కంటిచూపు వచ్చింది.     నా రెండవ  వైపు కూడా నిమిరితే రెండవ కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో అతనికై  చూశాను. కానీ ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు అని అన్నది.

ఆ చిలుక ఆ సాధువుతో ఇంకా ఇలా చెప్పసాగింది. 'ఈ ఆలయంలో      రోజూ ఎందరో భక్తులు స్వామి దర్శనార్ధమై రావటం గమనిస్తున్నాను. వీరిలో

ఒక్కరైనా అంతటి పుణ్యాత్ములు ఉండకపోతారా అని చూస్తున్నాను. అందువలననే ఎటూ ఎగరకుండా రోజంతా ఇక్కడే ఉంటున్నాను. అంతటి నిస్వార్థ భక్తుడికోసం   వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో వేలమంది ఇప్పటిదాకా నన్ను స్పృశించి వెళ్లారు. కానీ నా రెండవకంటి చూపు రాలేదు. ఇంకా ఎన్నాళ్ళిలా  వేచి ఉండాలా, ఎప్పటికి అంతటి భక్తుడు వస్తాడా అనిఅనుకుంటున్నాను ...ఇన్నాళ్ళకి నా భాగ్యం    కొద్దీ మీరు వచ్చారు.అని

అన్నది.     

ఆ చిలుక చెప్పినదంతా విని ఆ సాధువు ఆశ్చర్యపడి అక్కడ ఉన్న  అర్చకులందరికీ ఈ విషయం చెప్పాడు.


తిరుమల వచ్చేవారిలో చాలామంది విహారానికి వచ్చినట్లు వస్తారు.  వచ్చినవారిలో కూడా చాలామంది అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టరు.  రెండుసార్లు దర్శించుకున్నానని, మూడు సార్లు దర్శించుకున్నానని గొప్పలుగాచెప్తారు.   తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు. 

ఆ స్వామికి కావలసింది  అచంచలభక్తి. అంతేకానీ, హంగు, ఆర్భాటాలు కావు.

ఎవరైతే ఆ స్వామిని  సర్వస్వంగా భావిస్తారో, ఎవరైతే నిత్యం ప్రసన్నవదనంతో ఉంటూ తోటివారిలో  ఆ స్వామినే చూస్తూ గడుపుతారు. వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా  ప్రసన్నమౌతాడు.


ఎవరైతే ధర్మబద్ధ జీవితం సాగిస్తూ ఉంటారో వారి బాధ్యత తానే  వహిస్తానంటాడు ఆ స్వామి. కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనే మూడుగా  ఉంటాయి.   శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే మనం పూర్వజన్మలలో చేసిన  సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబదడతాయి.   వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే  ఆగామి కర్మఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూదిపింజలకంటే తేలికగా  ఉండేలా అనుగ్రహిస్తాడు. 

అంతేకాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర,  ప్రారబ్ధ కర్మఫలాలను కూదా దివ్య సుఖ ప్రారబ్ధంగా మార్చేది ఆ అమృతమూర్తి  ఒక్కడే. ఓ శ్రీ వేంకటేశ్వరా! నీవేమా కల్పతరువు, నీవే మా ఆప్తుడవు, నీవే  మా సర్వస్వమూ నీకివే మా నమస్కారములు. ఓ జగన్నాథా! నీకివే మా  ప్రణామములు. ఓ జగద్రక్షకా నీకివే మా నమస్కారములు.


శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్‌

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌

శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు.


*అమ్మ మనసు*


ఇది పూరిగుడిసెలోని పచ్చి బాలింత కథ. బయట హోరున వర్షం. కొబ్బరాకు పందిరిలాంటి పూరిపాక పైకప్పు ఆ వర్షాన్ని ఆపలేకపోతోంది. ఎక్కడికక్కడ కారిపోతోంది. ఒళ్లో పసిబిడ్డ తడిసిపోతాడన్న బెంగతో ఆ తల్లి చీరకొంగును గొడుగులా ఎత్తి పట్టుకొంది. అయినా పసికందు నానిపోతూనే ఉన్నాడు- 'వాననీటితో కాదు, ఆ దీనురాలి కన్నీటితో...' అన్నాడు గాథాసప్తశతిలో అజ్ఞాత కవి. అది కన్నతల్లి కడుపుతీపికి కరుణ రసాత్మకమైన వ్యాఖ్యానం. 'అవును నిజం, అవును నిజం చేదువిషం జీవఫలం' అని మహాకవి శ్రీశ్రీ ఊరికే అనలేదు. త్యాగమూర్తులైన పేద తల్లుల జీవితాలన్నీ పరము విషాద కావ్యాలు. అనంతుడి భోజరాజీయంలో... పులిపంజాను తప్పించుకొంటూ ఓ గోమాతదయనీయంగా అర్థిస్తుంది- 'ముద్దులపట్టి! అతడు పుట్టి ఏడెనిమిదినాళ్ల పాటి గలడు... ఇంతియ పూరియు(పూరిగడ్డి) మేయ నేర్వడు... ఏన్ జని

కడుపార చన్దుడిపి చయ్యన వచ్చెద...' నీకు పుణ్యంఉంటుంది, ఒక్కసారి విడిచిపెట్టు అంటూ ప్రార్ధిస్తుంది.

అమ్మదనానికి అరమరికలు తెలియవు. మానవులు, జంతువులన్న తేడాలుండవు. అమ్మ- అమ్మే! మనిషికి లభించే మహోన్నత సుఖ అనుభూతుల్లో అత్యున్నతమేదన్న ప్రశ్నకు- 'కన్నబిడ్డను కావలించుకోవడం' అని చెప్పారు మన పెద్దలు. ‘ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్- పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబునట్లు హృద్యంబే?... ముత్యాల హారాలు కర్పూర పరాగం, మంచిగంధం వెన్నెల... ఏవైనా బిడ్డను హత్తుకొన్నప్పటికన్నా సుఖంగాను, చల్లగానూ ఉంటాయా' అన్నాడు శకుంతలోపాఖ్యానంలో నన్నయ. ఆత్మజుల ఆలింగన సౌఖ్యం అత్యంత సుఖావహం కాబట్టే- పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే స్త్రీమూర్తులు ఆందోళన చెందుతారీ దేశంలో. అమ్మదనం కోసం ఎంతగానో ఆరాటపడతారు


తన కన్నుల పంట తనను విడిచి కనుమరుగైపోతుంటే ఆ కడుపుకోత ఎంత బాధాకరమైనదో- శంకరుల తల్లి ఆర్యాంబనో, కర్ణుడి తల్లి కుంతీమహాదేవినో అడిగితే తెలుస్తుంది. చేతికందిన కొడుకు సర్వసంగ పరిత్యాగియై

ఒంటరిగా వదిలిపోతుంటే ఆర్యాంబ ప్రాణం ఎంతగా


విలవిల్లాడిపోయిందో విద్యారణ్య మహర్షి తమ


శంకరవిజయంలో హృద్యంగా వివరించారు. కర్ణుణ్ని


నీటిపాలు చేద్దామని కాదు- బిడ్డతో సహా గంగలో దూకి


ఆత్మహత్య చేసుకొందామని కుంతి గంగాతీరానికి చేరింది.


విధివశాన ఒక పెట్టె తీరానికి కొట్టుకొచ్చింది.


'ఆత్మహత్యయు శిశుహత్యయనక, గంగపాలు కానున్న ఈ దీనురాలిమీద భువనబంధునకే జాలిపుట్టెనేమొ! పెట్టె పంపించి తెరువు చూపెట్టినాడు' అనుకొంది - కరుణశ్రీ కుంతీవిలాపంలో. 'నీ వరహాల మోము నేనెన్నటికైన చూతునె! ఏ యమయైన ఇంత నీకు అన్నము పెట్టి ఆయువు ఇడినప్పటి మాట గదోయి నాయనా!' అంటూ పొగిలిపొగిలి ఏడ్చింది. ఆయువుంది కర్ణుడికి. కాబట్టే బిడ్డను సూతుడు చేరదీశాడు. స్లొవేకియాలో తాజాగా ఇలాంటిదే జరిగింది. వెయ్యి కిలోమీటర్ల దూరానగల ఉక్రెయిన్ నుంచి రైలులో వచ్చిన 11 ఏళ్ల ఒంటరి బాలుణ్ని చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. భీకర యుద్ధ వాతావరణంలో కుటుంబసభ్యులు అనారోగ్య స్థితివల్ల దేశం విడిచి రాలేకపోయారు. పిల్లవాడైనా చల్లగా బతకాలన్న ఆశతో- పొరుగుదేశానికి పంపేశారు. 'వీనిని ఏ తల్లి చేతిలోనైన పెట్టి మాట

దక్కింపు మమ్మ! నమస్సులమ్మ' అన్న కుంతీదేవి మాదిరే, స్లొవేకియాలోని బంధువు ఫోన్ నెంబరు పిల్లవాడి చేతిమీద రాసి ఒంటరిగా బండి ఎక్కించారు. అధికారులు చూసి చుట్టాల ఇంటికి చేర్చారు. బిడ్డకు దూరమవుతున్న ఆ సమయంలో తల్లి సంగతి తలచుకొంటే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది. మనసు కలవరపడుతుంది!

పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది  ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ?


పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి , తెస్తారు?

 ముందుగా అమ్మాయి తో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో  కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు .

 బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.

సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం  ఋషి ఋణం తీరవు .

అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.

అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!


శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.
ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.
ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.  ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.

అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.

ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.

అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అ…
ऊँ!
----

"శ్రీచక్రరాజనిలయాంప్రగతిప్రదాత్రీం ,

శ్రీపద్మరౌచ్యశుచినీంప్రముదేష్టదాత్రీమ్ !

శ్రీహంసగుహ్యసఫలాప్తశుభేష్టదాత్రీం ,


త్రైమూర్తిరూపపరమార్థగతింనమామి !!!
----
----------------------------------------

                      గురువు....!
                    

అవతార పురుషుడైన రాముడంతటి వానికి వసిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు.

జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపుడు గురువయ్యాడు.

గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. ఇక సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం.

గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాలలో అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ, ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతాడు. అందుకే ఈ ముగ్గురినీ దేవుళ్లుగా అభివర్ణించారు.

గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను సాక్షాత్‌ పరబ్రహ్మంగానూ పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన మనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటుంటారు. సాధారణంగా గురువుల్లో రెండు రకాల వారిని మనం చూస్తుంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వారైతే, మరి కొందరు లౌకిక విద్యను నేర్పించేవారు.

అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించ లేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు, జ్ఞానం కలగదని వేమన తన పద్యాలలో వివరించారు.

ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవరికీ లభించనంతటి, ఆయన ఊహించనంతటి ప్రయోజనం సిద్ధించింది.

కృష్ణుడు యమలోకానికి వెళ్లి గురు పుత్రుని సజీవుని చేసి తీసుకువచ్చి గరువుగారి ఋణం తీర్చుకున్నాడు. మంచి గురుశిష్యుల సంబంధాన్ని సారవంతమైన నేలపై సకాలంలో సరి పడా పడ్డ వర్షంగా ఒకరు అభివర్ణించారు. ఇక విద్య నేర్వడం అంటే ప్రతి విషయాన్ని మనం తెలునుకునే ప్రయత్నం చేయడం.

వివేకానందుని అభిప్రాయం ప్రకారం జ్ఞానం మనలోనే ఉంది.  మన లోనే విజ్ఞానముంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికీ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనబడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే అవి ఉన్నా కనబడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయ భూతుడిగా, సలహా దారుడిగా ఉంటాడు గురువు.

వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్లనే ప్రజా కవి కాగలిగాడు. పూర్వం రాజకుమారులు సైతం గురు కులానికి వెళ్లి గురువుల్ని సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవడం, ఆయనను సేవించడం వల్ల విద్య పొందడం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవడం మినహా విద్య నేర్చుకునేందుకు వేరే ఎటువంటి మార్గాలు లేవు.

గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు.. అని విశ్వ కవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అన్నారు. మనిషి తన జీవిత కాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహధ్యాయిల సహచర్యం వల్ల, మరొక వంతు పాఠశాలల నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.

మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా, ఎక్కు వగా చూసేది తల్లి కదలికలే కనుక ఆమె నుంచే ఎక్కువ విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతే లౌకిక విద్యలు నేర్పే గురువులు, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు బోధనలు చేసే బోధ గురువులు వంటి వారందరూ వస్తారు...
*******

 గురుపౌర్ణమి విశిష్ఠత / వ్యాస పూర్ణిమ
ఓంశ్రీమాత్రే నమః


|| గురువందనం ||
 
శ్లో|| గురవే సర్వ లోకానాం భిషజే భావరోగిణామ్ |
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: ||


శ్లో|| చిద్ఘనాయ ప్రకాశాయ శృత్యాకాశ విహారిణే |
అద్వైతామృత వర్షాయ శంకరాయ నమోనమ: ||

 
శ్లో|| సదా శివ సమారంభాం శంకరాచార్య మాధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్ ||

 
శ్లో|| ఏకమేవాక్షరమ్ యస్తు గురు: శిష్య: ప్రబోధాయేత్ ||
పృథివ్యామ్ నాస్తి తద్రవ్యమ్ యద్ధత్వా చానృణీ భావేత్ ||

 
గురు పౌర్ణమి విశిష్ఠత:-
 
ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు.  గురుపౌర్ణమి  సాధారణంగా అన్ని పండుగలను జరుపుకోవడానికి ఒక నిబద్ధత, విధానం ఉంటె, గురుపౌర్ణమికి మాత్రం అలా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞత ను త…
గురు వందనం

మనకు, ప్రతి ఒక్కరికీ తల్లి తొలి గురువు.

మాతృదేవో భవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
అతిథి దేవోభవ

ప్రకృతి మయమైన, ఈ జగము లో ప్రతి అణువు లోను , నిండిన శక్తి గురు స్వరూపమే.

ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, మనకి పూలు, పండ్లు ఇచ్చే వృక్షాలు, పంచభూతాలు - నేల, నింగి, వాయువు, అగ్ని, నీరు.  మొ.నవి కూడా గురువుతో సమానమైనవి గా చెప్పబడుతున్నది.

భూమి కి భారం కాకుండా, సహజ వనరులను - కలుషితం చేయకుండా, ఒద్దిక గా ప్రతి ఒక్కరు వాడుకుంటే మన వంతు బాథ్యతను, మన సక్రమంగా నిర్వర్తించినట్లే.

సూర్యచంద్రులు, లేనిదే మన మనుగడ సాథ్యపడదు. నిర్ణీత సమయానికి, ప్రతి రోజు ఉదయించడం, అస్తమించడం - దైనిక చర్య గా చేస్తూ, మనకి ఆరోగ్యాన్ని , ఆహారాన్ని ప్రసాదించే, భాస్కరుడు, చంద్రుడు, మనకి గురువులు కాదంటారా?
మనం తొలి సంథ్య వేళ అర్ఘ్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అర్ఘ్యం ఇచ్చి, నమస్కరించిన మాత్రముననే, మన బాగోగులను చూసుకునే గురువులను, మనం విస్మరించకూడదు.

జగత్ కి మాతాపితరులైన ఉమామహేశ్వరులు, జగద్గురువైన కృష్ణ పరమాత్మ, ఎన్నో వనమూలికలను, ఇచ్చే సంజీవని ప్రదాత థన్వంతరి, లౌకిక విద్యలే కాకుండా జ్ఞాన ప్రభోథాన్ని చేసే లక్ష్మీహయగ్రీవ స్వామి, నిత్యస్మరణీయులు, గురుతుల్యులు.

మన అభ్యున్నతి కి కారకులైన, పెద్దలు-పిన్నలు, కూడా  మనకి మార్గదర్శకులే.

ఎందరోమహానుభావులు అందరికీ వందనములు.
🕉
శివాయ గురవే నమః

🙏🙏🙏🙏🙏
THVAMEVAAHAM   త్వమేవాహమ్‌

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......

             నేను =I

ఈ "నేను" ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

ఊపిరి ఉన్నంతదాకా "నేను" అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ...ఈ
"నేను" ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

ఈ "నేను" లోంచే
నాది అనే భావన పుడుతుంది!

ఈ *నాది లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ "నేను" అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది.

              EGO అహం

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  ”నేను", ”నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య,  

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

 సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

 సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

 మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

1.నేనే  శాసన కర్తను,

 2.నేనే ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

3.నేనే జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ నేను
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’ కథ అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం మాత్రమే!

   అది శాశ్వతం కానే కాదు

ఈ నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
”వైరాగ్యస్థితి” అభిలాషికి సాధ్యమవుతుంది.

వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం.

స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీ నేనే అనే స్థితి నుంచి
త్వమేవాహమ్‌ అంటే నువ్వేనేను అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
మానవ జన్మకు సార్థకత
      🙏 శుభమ్ భూయాత్🙏
గురువె బ్రహ్మ యందు గురువె విష్ణువు గను గురువె ఈశ్వరుడును
గురువె తల్లి తండ్రి గురుతు వల్ల విద్య వైభవమ్ము కలుగు
గురువు నొసగతెరవు గుర్తు బంధమ్ము గ విజయ మార్గ మిచ్చు
గురువె యిలను నాకు గురుతర బాధ్యతే జీవ లక్ష్య మవ్వు

🌻 95. విటమినులు 🌻

ప్రస్తుత కాలమున విటమినులను విపరీతముగ భుజించు చున్నారు. దేహపోషణమునకు అవి అత్యావశ్యకములని వైద్యశాస్త్రము యొక్క నమ్మిక. విటమినుల స్వీకరణము కారణముగ ప్రాణశక్తి (Vital Force) పెరుగునని నమ్మకము. మిటమినుల విషయమున మాదొక
అవగాహన యున్నది. మా అనుభవమున ప్రాణశక్తిని పెంపొందించు విటమినులు జీవుని యందే యున్నవి. జీవునియందలి సద్గుణమలే నిజమగు విటమినులు. సద్గుణములు ప్రాణమును పెంపొందించి నంతగ మిటమినులు పెంపొందింపలేవు.

సద్గుణవంతులు మిక్కుట ముగ ప్రాణశక్తి కలిగి యుందురు. వారహర్నిశలు పనిచేయుచున్నను ప్రాణము నీరసింపదు. తెలివికి సద్గుణంబుల బలిమి గూర్చినచో అంతకు మించిన విటమినులు, టానిక్కులు లేవు. సద్గుణములే సమస్త మిటమినులకు నివాస స్థానము. సద్గుణములు లేనివారికి యీ స్థావరములు మూతబడవు. వారు విటమినులు తినుచున్నను ప్రాణమంతంత మాత్రముగనే యుండును.

సాధారణ మానవునకు విటమినులు పనిచేయపోవుటకు కారణము వారియందు సద్గుణముల కొలుతయే. మా దృష్టిలో విశ్వాసము మొట్టమొదటి సద్గుణము. విశ్వాసము మూఢ నమ్మకము కాదు. అది ఆత్మవిశ్వాసము. తనయందు తనకు నమ్మకమున్న వానికి ఇతరులయందు కూడ నమ్మకముండును.

ఇతరుల యందు అప నమ్మకము తమ యందలి అపనమ్మకము యొక్క ప్రతిబింబమే. అపనమ్మకము ప్రాణమునకు శత్రువు. నమ్మకము ప్రాణమునకు మిత్రుడు. నమ్మినవాడు చెడడని ఆర్యోక్తి. నమ్మి చెడినవాడు లేడని మరియొక ఆర్యోక్తి. అనుమానము,
అపనమ్మకము గలవారు విటమినులుగొనుట నిష్ప్రయోజనము. అట్టివారికి విటమినులు అపాయమని కూడ మా నమ్మకము. విటమినులను గొని అపనమ్మిక శక్తి పెరుగునే కాని ప్రాణము పెరుగదు. అపనమ్మకము, అనుమానములకు సహాయనిరాకరణము (Non-co-operation) తోడైనచో ఇక అట్టివారికి ఔషధములు, విటమినులు పనిచేయుట కష్టము. ఇది తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

ప్రాంజలి ప్రభ  ..1

మన జన్మ సంగ్రహ సంఘర్షణ దైవ విధానముల్
యుగ ధర్మ సంతృప్తి జీవన వేద విధానముల్
యువ శక్తి సద్భావ భోధన సత్య విదానముల్
ప్రతి నిత్య దాంపత్య సంతస సేవ విధానముల్   

నా భావము : దేవుని ప్రేమ మనపై ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు, పుట్టుక అనేది ఘర్షణల వళ్ళ వచ్చే సంగ్రహ విధానములు,  వేదములలో ఉన్న మహాత్య ప్రభావము వళ్ళ, ధర్మాలను అను సరించి సాగు జీవన విధానములు, యువశక్తి ద్వారా అధునాతన విధానములు, అంతర్జాల విధానములు సద్భావముతో చేసే పనులు,  ప్రతిఒక్కరు సుఖ శాంతులతో ఉండుట యే ఒకరికొకరు అర్ధం చేసుకొని బ్రతకట యే ప్రేమ సేవ  విధానములు.


దేశ సౌభాగ్య  ప్రావణ్య సేవ హితమతుల్
ప్రేమ ఔదార్య ప్రాధాన్య అర్ధ హితమతుల్
 ధర్మ ప్రబోధ భాగ్యమ్ము నాకు హితమతుల్
 నాద బ్రహ్మాండ సాహిత్య బోధ హితమతుల్

 
నా భావము : దేశము కొరకు మేధావు లందరు హితవచనములు తెలిపి ప్రపంచములో మనదేశ గుర్తింపు కోసం నీవంతు ప్రావీణ్యత సేవచేస్తూ తెలపాలి హిత వచనాలు, ధనం కోసం ప్రేమ ఔదార్యం, మంచి ప్రావిణ్యం  గుణం ఎప్పటికి వదలొద్దు, నీవీవు చెప్పే హిమవచనాలే ధనంతో సమానము కావాలి, ధర్మాన్ని రక్షించుట నాకు భాగ్యమ్ము అని తలచాలి, నాద బ్రహ్మాండ పురాణాల సాహిత్యమును అర్ధమే మనకు మనసు ప్రశాంత పరిచే హిత వచనాలు.
ప్రేమ భావాల ప్రతీక ధర్మ ప్రభోధమ్ములన్
దేశ కాలాన్ని ప్రబోధ మార్గ మనోనేత్రముల్
వేళ గ్రహించి ప్రచండ కల్ప మనోశాంతముల్
సత్య ధర్మాన్ని పకృతి నిలిపే మనోభావముల్
 
 నా భావన :

ధర్మాన్ని నిలబెట్టుటకు, ప్రతి వక్కరి మనస్సులో ప్రేమను నింపేందుకు, దేశంలో మంచి మార్గాన్ని చూపే ప్రబోధాలను గ్రహించి జీవితము గడపాలని,  మనస్సులో ఉన్న మంచి మార్గాన్ని నలుగురికి చూపి దేశాన్ని కాపాడుటకు మనో నేత్రములతో సహకరించాలని, ఏంతో కష్టము  వచ్చిన, ప్రళయము వచ్చిన, భయముతో వణుకుతున్న ప్రాంతాన్ని ఆదుకొని భయమును తొలగించి మనస్సుతో శాంతిని కల్పించాలని, ప్రకృతి అనుకరించి సత్యము, ధర్మము గ్రహించి మనుష్యుల మనోభావాల ననుసరించి జీవితము సాగించాలి.
*ఇది దశావతార నృసింహ మంత్రము,
 ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి,
 మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.*

"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |
ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |
ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |
ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |
ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |
ఓం క్ష్రౌం పరశురామాయ నమః |
ఓం క్ష్రౌం రామాయ నమః |
ఓం క్ష్రౌం బలరామాయ నమః |
ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |
ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |
దివ్యసింహాయ నమః |
స్వయంభువే పురుషాయ నమః |
ఓం క్ష్రౌం ||"

ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

. పాత్రత  -1 🌻


తగినవాడు‌ కనిపించినపుడు దానము‌ చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.

ఎవరికిని నీ‌ వలన బాధ కలుగరాదను  ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.

పాత్రునకు దానము చేయుట‌ అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.

అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.

అది లేకపోవుట చేతనే  మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.

దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.

తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో‌ సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.


దానిని‌ సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment