Tuesday, 2 January 2024

ప్రాంజలి ప్రభ పద్య, కథల పత్రిక 03/01/2024



మీకు నచ్చిన కథలు తెలపగలరు

ప్రాంజలి ప్రభ -లోక లీలలు గనుము, రామ భక్తాంజనేయుని రమ్యలీల  శతకము (2) (10-18)

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (తేటగీతి. పంచ పాది )


నీరు పల్లము జారును నిజము యె రుగు 

నిప్పు ఎగసియు పాకును నీడ జేరు 

నిజము చాటున దాగును నిప్పు బతుకు 

ద్రోహ వేగము పెంచును దొడ్డి దారి 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


తళుకు బంగరు బొమ్మయు తళతళతళ

తాను మెచ్చిన కొమ్మయు తప్పు బట్టు 

ఆశ పెంచిన దమ్ముయు అలక జెప్పు 

కాల మార్పుల నెమ్ముయు కథలు జెప్పు 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


మంచి గంధపు చలువలు మనసు జేరు 

మంట వెండ్రపు నిలువలు మాయ మౌను 

కంట నున్నది చెలువలు కాల తీర్పు 

కంట కన్నీరు పలుకులు కలలు తీరు 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


కఠిన హృదయము చితుకుట కాల తీరు 

కావ్య దగ్ధము పితుకుట కంచ మేయు 

న్యాయ రక్షణ తెలుపుట నటన కాదు 

భక్తి ప్రేమలు సలుపుట భజన తీరు 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


లంచ మనెడియు పట్టిక లాలి పాట 

ఇనుము మేకులు తొట్టియు యి స్తరగుట 

సేవ కదలిక గట్టియు చింత మలుపు 

నిత్య జీవన మట్టియు నీడ వెలుగు 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


ఇపుడు నిజమును నొక్కియు యిచ్చ తెలుపు 

ఇంటి కప్పుయు యెక్కియు యీల వేయు 

ఒప్పు చెప్పుట మొక్కియు ఓడి గెల్పు 

తప్పు వప్పియు చెక్కియు తృప్తి కలుగు 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


తాగు చుండెడి బుడ్డియు తాడు యాట 

తిరుగు చుండెడి కొద్దియు తిట్టు యాట 

మెదడు మేసెడి బుద్ధియు మేత యాట 

పశువుగా తిను గడ్డియు ప్రగతి బాట 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


మనసు తెలుపని భాషలే మనుగడగుట 

మంచి తెలుపని భాషయే మాట తీరు 

చెడ్డ చేరని భాషయే చిలక రించు 

ఉత్త సంద్రపు ఘోషయే ఊరు వాడ 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 


కొంత తెల్పెటి నవతయే కోరు తీర్పు 

వంత పల్కెటి యువతయే వాన మార్పు 

సొంత మయ్యెటి మహితయే సోంపు నేర్పు 

పంట ముంచెడి జలముయే పడక కూర్పు 

రామ భక్తాంజనేయుని రమ్యలీల 

    

*****

ప్రాంజలి ప్రభ  పద్య, కథల పత్రిక 03/01/2924

 [గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

****

           *మనోక్షేత్రంలో… పూవు*

హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ



నాశనం చెయ్యాలి. కధ 

ప్రపంచానికి వేదిక మనసే. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఎక్కడా ఎవరూ చూడరు. నిత్యం ఈ రంగస్థలం: ఖాళీగా రకరకాల భావోద్వేగాలతో నిండిపోయి, కుట్ర కుతంత్రాలతో మరిగిపోయి, రాగ ద్వేషాలతో, ఆశాపాశాలతో వేయి. పడగల సర్పంలా బుసలు కొడుతూ ఉంటుంది.

చాలా భీకరంగా, బీభత్సంగా, భయానకంగా ఉన్నత్తంగా ఉండే ఈ మనసును కూడా లొంగదీసుకునే రాజయోగి ఒకడున్నాడు. వాడు. మనిషే వాదెన్నడూ వెనకడుగు వెయ్యలేదు. రణమో, రాజనమో అంటూ పోరాడుతూనే ఉన్నాడు.

సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు.

రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు. ఆప్రతిపాదన ఏమిటంటే "మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదుకదా శిక్ష కూడా అనుభవించాలి, మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు".

 “ప్రశ్న ఏమిటంటే…'ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది...?'

”సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం లభిస్తుంది.” అని అనగా...రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించాడు.

హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పనిమనిషి మరియు మరెంతో మందిని కలుసుకున్నాడు.‘ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే, ఆస్తిపాస్తులని కొందరు, శారీరక సుఖాలని కొందరు మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు, మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది’ అన్నారు.

ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు.

నెల ముగిసిపోయే సమయం వచ్చింది, మరోవైపు, హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానం సేకరించలేకపోయాడు.

అప్పుడు ఎవరో చాలా దూరంగా, మరొక దేశంలో ఒక మంత్రగత్తె నివసిస్తున్నారని సమాచారం, ఇస్తూ ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు, అని సలహా ఇచ్చారు. అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్‌తో పాటు, పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్న ఆమెను అడిగాడు.

అందుకు  మంత్రగత్తె,  "మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను" అని షరతు పెట్టింది. హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు మంత్రగత్తెను చూస్తే చాలా ముసలిదానిలా కనిపిస్తూ ఉంది, మరియు చాలా అందవికారంగా ఉంది, తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహమంటే మిత్రుడికి అన్యాయం చేయటమే, అని ఆలోచించి సమాధానం తెలీకున్నా పరవాలేదు, కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు. అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు.

కానీ సిద్దిరాజు మాత్రం, తన స్నేహితుడు, తన దేశ రాజు అయిన హర్షవర్ధనున్ని కాపాడటానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి  వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.

అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, “ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది.” అంది.

హర్షవర్ధనుడు ఈ సమాధానంకు సంతృప్తి పడ్డాడు.

అతను తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు. రాజు సమాధానం ఒప్పుకొని, హర్షవర్ధనున్ని విడుదల చేసి అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు.

మరోవైపు, తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో,     “మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది.  మీ స్నేహితుడిని కాపాడటానికి మీకు మీరే త్యాగం చేసారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.” అంది.

 “ప్రతిరోజూ, నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను మరియు తరువాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను.  మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు?” అని అడిగింది.

దానికి సిద్ధిరాజ్ “అది  నీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి, నీవు ఎలా వున్నా సరే అలాగే కోరుకుంటున్నాను,” అని బదులిచ్చాడు. ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి “మీరు నన్ను స్వయం నిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను” అని అన్నది.“వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం.  చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను“ అని చెప్పింది.

 ఇందులో గమనించాల్సిందేమంటే..సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు.

అందువల్ల, భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి.

భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కాని, ఆమె జీవితంలో సగం మాత్రమే!      మీరు, మిగతా భాగాన్ని, ఆ సగం భాగాన్నయినా విడుదల చేయాలి,    దీనితో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకూ ఒక మనస్సుందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి,       మీ మానవత్వం మొగ్గతొడిగితే తాను మీ ‘మనోక్షేత్రంలో పూవై’ పూస్తుంది...

[***-

మనోజయం

రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి నీ మనసు ఆధీనంలో నువ్వు ఉండటం లేదంటే నీ ఆధీనంలోకి నీ మనసును తెచ్చుకోవడం తనదే పై చేయిగా ఉండాలని, ప్రతీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు. చివరికి అదే గెలుస్తుంది. మనం ఓడిపోతాం. గెలవడం మనసుకు అలవాటు ఓడిపోవడం మనకు అలవాటు. ఓడి, గెలిచామనుకుంటూ కొంతమంది సంతృప్తి పడుతూ ఉంటారు. ఆ అవకాశం మనకు ఇచ్చేది మనసే

మనసును గెలిచినవాడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. మనసును నేల కనిపించినవాడి నడవడిక నిండుకుండలా తొణక్క బెణక్క ఉంటుంది. మనో నాశనం అయినవాడి ముఖం భగవద్గీత చెప్పిన ఉత్తమమైన యోగిలా ఉంటుంది. మనలో ఉండి, మనతో పోరాటం ఈ మనసుకు... అదే గమ్మత్తు శత్రువు ఎక్కడో ఉండడు. లోపలున్నవాడిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే తొందరగా తేల్చుకోవాలి. మనసు

చెప్పినట్లు వింటే అరిషడ్వర్గాలకు ఆహుతి అయిపోతాం. లేదంటే మనసునే మచ్చిక చేసుకోవాలి. చితిలోని కట్టెను తీసుకుని, ఆ చితినే తగలబెట్టినట్లు మనసుతోనే మనసును 

మనసును ఆధీనంలోకి తెచ్చుకునే దానితో సర్వకార్యాలు నెరవేర్చుకోవాలి. మనసు లేకపోతే మౌనాన్ని ఆశ్రయించాలి. కొండ మీద కూర్చోవాలి. శీతోష్ణ సుఖదుఃఖాదులను ఓర్చుకోవాలి. సంసార సముద్రాన్ని దాటేశానని సంతోషపడాలి. వద్దు వద్దు. అన్నీ ఉండగా, అందరితో ఉండగా, మనసును రళ్లెం వేసి పట్టుకుంటూనే ఈ బతుకు తీరం దాటాలి అంటాడు కబీర్ ఇది సంతోషం కలిగించే విషయం. కోట బయట యుద్ధం కంటే కోట లోపల యుద్ధం సురక్షితం అంటారు రామకృష్ణ పరమహంస..

ఇలా అందరూ చెయ్యగలరా? చెయ్యలేదు. అయినా తప్పదు. మనసు ఆధీనంలోకి మనం వెళుతున్నట్లు నటించి మన ఆధీనంలోకి దాన్ని తెచ్చుకోవాలి. ఆ విషయాన్ని మనసు పసిగట్టకుండా చూసుకోవాలి. ఆ నైపుణ్యం మనకుండాలి. జీవితమంతా మనసుతో ఆడే అటే. ఇలాంటి రంజుగా ఉండే ఆట లేకపోతే బతుకు ఎంతో చప్పగా ఉంటుందనేమో భగవంతుడు మనిషికి మనసిచ్చాడు. ఆ మనసే అంతులేని శిక్షగా మారిపోయింది. మనసే బంధకారకం. మనసే మోక్ష కారకం అంటున్నాయి ఉపనిషత్తులు, అంటే ఎంతో చెడు చేసినా, చివరికి ఈ భవబంధాల్లోంచి విడగొట్టేది మన సేనన్నమాట. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు మనసు ఏదైనా చెయ్యగలదు. మంచిగా మనసుతో వ్యవహరిస్తూ అదుపు

చేసే సామర్థ్యం పెంచుకోవాలి. మనం ఒక ఎత్తు చేస్తే, అది మరో ఎత్తు వేస్తుంది. ఈ చదరంగ క్రీడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో కాలమే నిర్ణయించాలి. అయితే పట్టుదల గల మనిషిని విజయం వరించకుండా ఉండదు! 

ఆనందసాయి స్వామి

......

[

       *నమస్కారం - సంస్కారం*

భారతదేశ సంస్కృతి అతి ప్రాచీనమైనది. ఎన్నో యుగాలుగా మంచి విషయాలకు ప్రాధాన్యతనిస్తూ, సమయానికి తగినట్లుగా, తన ఒరవడిని మార్చుకుంటూ సాగుతున్నది. రకరకాల సంస్కృతుల నుండి మంచిని గ్రహిస్తూ, పాత కొత్తల మేలు కలయికతో  మేలిమి బంగారం వలె, నిత్యనూతనమై, కాంతులీను చున్నది.

మన సంస్కృతిలో నమస్కారం అనే చర్యకు చాలా విలువ ఉన్నది. సాధారణంగా దేవునికి, గురువులకు, వయసులో కానీ, వరుసలో కానీ పెద్దైన వారికి, అతిథులకు, పదవిలో ఉన్నవారికి చేతులు జోడించి నమస్కరించడం మన సంస్కృతి, సంప్రదాయం. మన పురాణేతిహాసాల ప్రకారం ఎదుటివారిలో దైవత్వానికి, మనం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, అంటే ఆ నమస్కారం మన ఎదురుగా నిలబడిన వ్యక్తికి కాదు. అతనిలో అంతర్గతంగా ఉన్న దైవానికి, ఆత్మారామునికి. ఈవిధంగా మనం ప్రతి ఒక్కరినీ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నామని చెప్పవచ్చు.

అంతేకాదు మనం రెండుచేతులు జోడించినపుడు, రెండు చేతుల వేళ్ళు, అరిచేతులు కలిసి ఒక దానిపై ఒకటి ఒక రకమైన ఒత్తిడిని తెస్తాయి. దాని వలన మన శరీరంలోని అన్ని రక్త నాళాలలో ప్రసరణ వృద్ధి చెంది, మనలో ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది. మన శరీరంలో రక్తప్రసరణ చురుకుగా సాగుతుంది. ఒకవిధంగా ఎదుటివారికి నమస్కరించడం కూడా మన మేలుకే నన్నమాట.

మన ముందు తరం వారు పెద్దవారి కాళ్ళను తాకి నమస్కరించేవారు. అప్పుడు శరీరంలో కదలికలు ఏర్పడి శరీరం మొత్తం ఉత్తేజితమౌతుంది. ఈ రకంగా పరిశీలిస్తే ప్రాచీనులు ప్రవేశపెట్టిన సాంప్రదాయాలు మన మేలుకోసమే అని అర్థమౌతోంది. నమస్కారం మన సంస్కారాన్ని తెలియ పరచడమే కాక, ధైవానికి నమస్కరించడం, మన శరీరానికి మేలు జరగడం అన్నీ జరుగుతాయి. అందుకే యోగాభ్యాసంలో సూర్య నమస్కారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.

మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షింప బడిన ఎందరో విదేశీయులు మన భారత దేశానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చి ఇచ్చటి వేద విద్య నభ్యసించి

మన సంస్కృతి పై గౌరవంతో సంప్రదాయాలను పాటించు చున్నారు. ఇది మనకు గర్వకారణం.

ఇంటి చెట్టు మందుకు పనికి రాదు అన్నట్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు మన వారు విదేశీ మోజుతో అంధానుకరణ చేస్తూ తిలోదకాలు ఇస్తున్నారు. కానీ మన కన్నా అధికంగా విదేశీయులు వాటిని గౌరవిస్తున్నారు. మనము కూడా ప్రాచీన మైనవేవీ నేటి తరానికి పనికి రావన్న భావన నుండి బైటపడి అందులో ఉన్న మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి. 

మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను నిలిపే భారం మన పచనే ఉంది. నేటి ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ

చేతులు కలపడం మాని, సామాజికదూరాన్ని పాటించడానికి చేతులు జోడించే సంప్రదాయాన్ని అలవర్చు కుంటోంది. 

అప్పటిలో మన వారు పాటించిన ఎన్నో విషయాలను నేడు వైద్యులు మనను పాటించ మంటున్నారు. నాటి నుండే మనము పెద్దలమాటకు గౌరవమిచ్చి ఆ సంప్రదాయాలను కొనసాగించి ఉంటే ఈ రోజు ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడేవారు కాదేమో.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడానికి ప్రయత్నిద్దాం. మన భావితరాలకు నేర్పుదాం. చేయి కలిపే ప్రాచ్య సంస్కృతిని వదలి, చేతులు జోడించే మన ప్రాచీన సంస్కృతిని స్వాగతిద్దాం. 

        …..శ్రీమతి నందగిరి రామశేషు.

.......

ట్రైన్ లో... రేపటి పాట్లు* కధ 

*భారతీయ రైల్వే లు ప్రైవేటీకరణ జరిగింది. ఒక ప్రయాణీకుడు టిక్కెట్టు కొనుక్కోవటానికి టికెట్ బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాడు.*

*ప్రయాణీకుడు: ఢిల్లీ నుండి లక్నో కు టిక్కెట్ ఇవ్వండి.*

*బుకింగ్ క్లర్క్: రు. 750లు ఇవ్వండి.*

*ప్ర: అదేంటి రు.400 కదా?*

*బు.క్ల: అవును. సోమవారం రు.400లు. శనివారం రు.700లు. ఆదివారం రు750.మిగతా రోజుల్లో రు.600.*

*ప్ర: సరే, క్రింది బెర్త్ ఇవ్వండి.*

*బు.క్ల.: క్రింది బెర్త్ కు రు50లు అదనం.*

*ప్ర. పోనీ, సైడున ఉండే క్రింద బెర్త్ ఇవ్వండి.*

*బు.క్ల: రు.25లు అదనం.*

*ప్ర: చాలా ఎక్కువ. టాయిలెట్స్ లో నీళ్లు లేవు. పెట్టెలు  శుభ్రంగా లేవు. టిక్కెట్ ధర మాత్రం చాలా ఎక్కువ.*

*బు.క్ల.; మీరు టాయిలెట్ వాడుకోవాలంటే రు.50లు అదనంగా చెల్లించాలి. అదీ ప్రయాణం మొత్తంలో 2సార్లు మాత్రమే వాడుకోవచ్చు. అదనంగా వాడుకోవాలంటే ప్రతిసారి రు.10లు రుసుము చెల్లించాలి.*

*ప్ర: ఇంకా దేనికి దేనికి చెల్లించాలో చెప్తారా?*

*బు.క్ల.: సెల్ ఫోన్ ఛార్జింగ్ కు గంటకు రు10లు. హాండ్ బ్యాగ్ మాత్రమే అనుమతిస్తాం. అంతకు మించితే కిలోకు రు20లు లగేజీ చెల్లించాలి. ఇంటినుండి తెచ్చుకునే ఆహారాన్ని అనుమతించం. పాంట్రీ కార్ నుండి మాత్రమే ఆహారం కొనాలి. ఏరోజు కారోజు ధరలు మారతాయి.*

*ప్ర.ఇవన్నీ ఎవరు వసూలు చేస్తారు?*

*బు.క్ల: ప్రతి పెట్టెలో మా మార్షల్స్ ఉంటారు. వారు వసూలు చేస్తారు.*

*ప్ర. థాంక్స్. దీనికంటే విమానంలో వెళ్ళటం నయం.*

*బు.క్ల: అలాగే వెళ్ళండి.  మానుండి వివరాలు పొందినందుకు కన్సల్టెషన్ చార్జీలు రు 100లు చెల్లించి వెళ్ళండి. మా మార్షల్ మీవెనుకే ఉన్నారు.*

****

చుక్కల అమావాస్య రేపటి రోజు ఏం చేయాలి*

ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...

హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. 

ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !

ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.

ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా *‘చుక్కల అమావాస్య’* పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !

ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.

--(())--


*ఏం చూస్తున్నాం. ఏం చేస్తున్నాం*?

మనిషి జీవించి ఉన్నంతవరకు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు మంచో, చెడో.... ఏదో ఒకటి మనిషి నిత్య చైతన్యశీలి, తన ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు అంతర్విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ ఆలోచన తనకు గాని, ఇతరులకు గాని మేలు చేస్తుందా, కీడు చేస్తుందా వివేకంతో ఆలోచించుకోవాలి. నిర్ణయించుకోవాలి.

పెద్దలు 'మంచిని చూడు, మంచిని విను. మంచి మాట్లాడు' అని చెప్పారు. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి అన్న ధోరణి మనిషి అహంకారానికి, పతనానికి హేతువవుతుంది. సమాజంలో దురాలోచనతో, స్వార్థంతో, గర్వంతో, ఆజ్ఞానంతో, అవిద్యతో, అవినీతితో, ఆకృత్యాలతో ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడని వాళ్లను చూస్తున్నాం. అత్యాచారాలు, హత్యాచారాలు, దౌర్జన్యాలు, దోషిళ్లు... ఇలా ఎన్నో అవాంఛనీయ దుర్ఘటనలు చూస్తున్నాం. కారణాలనేకం... సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడమనేది తరువాతి సంగతి. మనల్ని మనం ఉద్దరించుకోవాలి. ఎదుటివారి మాట వినాలి. అందులోని మంచీ-చెడూ సమీక్షించుకొని మంచి గ్రహించాలి. విజ్ఞులు, వేదమూర్తులు, ప్రవచనకారుల మాటలు వినడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ నిక్షిప్తమై ఉంటుంది. గ్రహించి, స్వీకరించే అలవాటు చేసుకోవాలి. సభ్రంధ పఠనం చేయాలి. సుభాషితాలను అవగాహన చేసు కోవాలి. అనుభవజ్ఞుల ప్రస్థానాన్ని అనుసరించాలి.

పుణ్యధాముడు పరమభక్తుడు. రోజూ సమీపంలోని గుడికి వెళ్ళి పురాణం వింటూ వచ్చేవాడు. భగవ న్నామస్మరణం చేస్తూ పేదలకు తన శక్తి మేరకు దానాలు చేసేవాడు. అతడి ఇంటికే రోజున 'జ్ఞానసింధు' అనే యాత్రికుడు అతిథిగా వచ్చాడు. పుణ్యధాముడు అతడికి మర్యాదలూ చేసి భోజనం వడ్డించ బోయాడు. అతిథి 'గంగానది ఇక్కడికి ఎంత దూరంలో ఉంది. స్నానంచేసి రావాలి' అని అడిగాడు. 'సమీపంలోనే ఉంది. కాని నేనెప్పుడూ వెళ్లలేదు' అన్నాడు. పుణ్యధాముడు. జ్ఞానసిందు కోపంతో 'గంగలో స్నానం చేయని నీ ఇంట భోంచెయ్యను' అంటూ స్నానానికి బయలుదేరాడు. 'స్వామీ! నేను వికలాంగుణ్ని. పురాణ పఠనం జరిగిన చోటే సకల పుణ్యతీర్ధాలు నెలకొని ఉంటాయంటారు. కద స్వామీ! అందుకే నేను గుడికి వెళ్ళి రోజూ పురాణ శ్రవణం చేసి వస్తుంటాను" అన్నాడు పణ్యధాముడు. జ్ఞానసింధు గంగా తీరానికి వెళ్ళి అడుగు వేసేసరికి నది వెనక్కి వెళ్ళింది. అడుగులు వేసిన కొద్దీ గంగనీరు వెనక్కిపోతోంది. జ్ఞానసింధు విస్తుపోయాడు. గంగ నిజరూపంలో ప్రత్యక్షమై 'విష్ణుకథాశ్రవణం చేస్తున్న పుణ్యధాముణ్ని అవమానించిన నీకు నేను అందను. వెంటనే వెళ్ళి క్షమాపణలు కోరు..." అని అదృశ్యమైంది. జ్ఞానసిందు వెనక్కి తిరిగి వచ్చి పుణ్యధాముణ్ని క్షమాపణ కోరి భోంచేశాడు.

ఆలోచన, మాట, రాత, చేత, నడతలో పొరపాటు రాకుండా ఎప్పటికప్పుడు మనో విశ్లేషణ చేసుకోగలిగేవాడే మహామనీషి

***

*కర్మ , తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. 


*ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది*

*ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే*

*ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు*


*దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది**ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి*

*రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు*

 *ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.*


*అతడి పరిస్థితి* *తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను**కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు*


*భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది ఒకరోజు *భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు*


*సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త *వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది *దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు*


మిత్రులారా *జీవతం చాలా నేర్పిస్తుంది*

*నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది*

*అహంకారం అసలు పనికిరాదు*

*జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు*

*ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని*

*నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.*

*మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది మిత్రులారా!

శుభోదయం తో  మీ ప్రాంజలి ప్రభ 


1 comment:

  1. మీరు చదవండి మీ అభిప్రాయాలు తెలపండి

    ReplyDelete