Sunday, 31 December 2023



మానస మేకమవ్వావిధి మార్గము నేస్తము మోహనాకృతీ
జ్ఞానము నిత్యకళ్యాణము జ్ఞానిగ లక్ష్యము సేవలాకృతీ
ధ్యానము సర్వవిద్యామది దాతగనిత్యము విశ్వ సించుచున్
మౌనమనస్సు సాహాయము మోక్షము సత్యము యీశ్వరా సతీ.. 82

కాలము లీలలన్నీవిధి కామ్యమనస్సగు విశ్వమాయగా
జ్వాలల నీడలన్నీవిధి జాడ్యతపస్సగు తత్వ మార్పుగా
గాలుల సవ్వడి శ్వాసగు గాధ ఉషస్సగు విద్య నేర్పుగా
డోలల చందమామాగతి రోగనిరోధగు పార్వతీ పతీ  83

విధి విశ్వాసమొ, నామదీకృతమొ, నిన్వీక్షించ గానేమొ, నా 
వ్యధలందీర్పగనేమొ నీ చరణ సంప్రాప్యంబు సిద్ధించె, నా 
క్షుధలార్పన్వినుతింతు, నిల్తునిట దృక్కుల్నిల్పి, సద్భక్త ర 
క్ష ధురీణాంకిత దేవ, విశ్వజయ వాసా, పార్వతీశా, నమో॥  84

పలుకుల్ జేర్చిన జీవజాలములలో పాఠమ్ము రూపంబునన్
చిలుకెన్ మోహము దాహమార్గములలో చిన్మాయ తీరమ్ముగన్
విలువల్ మారెను విద్య వాహినిగనే విశ్వాస భావమ్ము గన్ 
తెలిపెన్ న్యాయము సర్వసృష్టి గనుటే తత్త్వమ్ము గా యీశ్వరా  85

జీవాత్మ ప్రపంచ నియమాలు

*Q:- మనుషులు దేవుడ్ని సులువుగా నమ్మరెందుకు? ఏ విధంగా ఉంటే దేవునికి ప్రీతిపాత్రులవతారు?*

*A:--1) గంటలకొద్దీ ఏకాగ్రత లేకుండా చేసే ప్రార్థన కన్నా,జనాన్ని,భగవంతుని మోసం చేయడానికి వేలాది రూపాయిల దానం కన్నా,సాధారణమైన నిజాయితీ గల కారుణాపూరితమైన,నిస్వార్ధమైన పని ఎంతో విలువైనది.*

*2) కొంతమంది దేవుడ్ని బాగా ప్రార్దించి కోరుకున్నది జరగక పోతే దేవుడ్ని నమ్మరు.  కానీ -----* *--ప్రార్ధనకు సమాధానం లభించలేదంటే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాదని అర్థం.*

*3) కొంతమంది అన్యాయం జరిగితే కూడా దేవుడ్ని నమ్మరు----*-----
*ఆ అన్యాయం మన కర్మ, అది మనల్ని పరీక్షించడానికో శిక్షణ ఇవ్వడానికో అది మనకు జరిగింది అని అర్థం చేసుకోవాలి.*

*4) కొంతమంది కి ఆరోగ్యం క్షీణించినపుడు ప్రార్ధిస్తారు---- *-----మనకు రోగం వచ్చిందంటే చేడు కర్మని చెల్లిస్తున్నామని గుర్తుంచుకోండి.*

*5) దేవుడు వున్నాడని మనకు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. logical thinking తో మనిషి రుజువు అడుగుతాడు, కనిపించనంత మాత్రాన సత్యం లేదని కాదు, ----- చూడలేని దానిని నమ్మడమే పరీక్ష.*

*6) దేవుడు మోసాల్ని అన్యాయాల్ని ఆపడెందుకు అని అనుకుంటారు. ఆయన మనకు సంకల్ప స్వేచ్ఛని ఇచ్చాడు, అది కొంత మంది చేడు పనులకు ఉపయోగించు కుంటున్నారు.*

*7) ప్రతియుగం లో చెడు పెరిగినపుడు ఒక ఉన్నత సదాత్మ ను మార్గదర్సునిగా ఉండమని భూమి పైకి పంపిస్తాడు, ఆ విధంగా వచ్చిన అంశాత్మలే మనమనుకుంటున్న దేవుళ్ళు.*

*కానీ వారు జ్ఞానాన్ని తెలుసుకుని ఎదిగిన వారు మాత్రమే, వారు దేవుని అంశలు మాత్రమే, వారిని పూర్ణాత్మ అనవచ్చు, వారిలోను , అన్ని అంశాత్మలలోను ఒకే చైతన్యం ఉంది. ఒక అంశాత్మ, జ్ఞానం తెలుసుకున్న తర్వాత పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. ఈ భూమి మీద జీవించే ప్రతి ఆత్మకు ఆ శక్తి ఉంది.*
🌹 🌹 🌹 🌹 🌹

 



*భగవంతుని లీలలు* 02--01--2022 daily Stories from pranjali prabha 

*వీధులు ఊడ్చేవాడు..... ఒకరోజు దేవుడితో మొర పెట్టుకున్నాడు.*

 *"రోజూ హాయిగా నీవు పూజలందుకుంటూ ఉంటావు.*
*నా బతుకు చూడు. ఎంత కష్టమో.*

*ఒక్క రోజు... ఒకే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"*

*అని సవాలు విసిరాడు.* 
*దేవుడు విని.... 'సరే' నన్నాడు.* 

*"అయితే ఒక్క షరతు. ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.*
*నోరు మెదపకూడదు."అన్నాడు దేవుడు.*
*"సరే" అన్నాడు మనోడు.* 

*తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.* 

*కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.*
*"దేవా ... నేను కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు"* 
*అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.* 
*అప్పుడు జేబులోని పర్సు కింద పడిపోయింది.*
*అతను చూడకుండా వెళ్లిపోయాడు.* 

*మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.*
*కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.*

*ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.*
*"దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను.* *దయచూడు తండ్రీ"* 
*అంటూ మోకరిల్లాడు.*
*కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.*
*"ఇలా దయ చూపించావా తండ్రీ"*
*అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.*

*"ఒరేయ్ దొంగా.... "*
*అని అరుద్దామనుకున్నాడు మనోడు.*
*కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.*

*ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.*
*"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ"*
*అన్నాడు.*  
*అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి...*
*"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.పోలీసులు అతడిని అరెస్టు చేశారు.*

*ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.*
 *"ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు."*
*అని అరిచేశాడు.*

*దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.*

*ఇచ్చిన ఒక్క రోజు గడువు అయి పోవడంతో...* 
*సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.*
*దేవుడు కూడా తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.*  

*"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాలని. ఒక దోషిని

ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 (కల్పవృక్షవాహనం) 🎈


🍃🌹బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు ఉదయం శ్రీదేవి - భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు. కాండము, శాఖలు, పత్రాలు, పుష్పాలు, లతలు - ఇలా: వృక్షభాగాలన్నింటినీ మేలిమి బంగారంతో, కళాకౌశలం ఉట్టిపడేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు.

🍃🌹ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం. సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం. క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంఛా ఫలాలను సిద్ధిస్తుంది. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్కులు నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టె అంటే దేవతలు, రాక్షసులు క్షీరసముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు: అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది.

🍃🌹ఆది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది. కానీ, ఆ వాహనాన్ని అధివేష్ఠించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక, ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. అన్నమయ్య రామావతారుడైన శ్రీమహావిష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, చింతామణిగా ఇలా వర్ణించాడు -

గౌతము భార్యాపాలిటి కామధేను వితడు,
ధాతల కౌశికుపాలి కల్పవృక్షము,
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు,
ఈతడు దాసులపాలి ఇహపరదైవము ||


🍃🌹కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోర్కె తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛితాలను యీడేర్చడం కోసం - శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తున్నారు.

🍃🌹వృక్షం అనంతమైన జీవజాలానికి ఆలవాలం. చెట్టు తొర్రలు, బొరియలు, వ్రేళ్ళు, శాఖలు - సమస్తం పక్షులకు, చీమలకు, పాములకు ఇంకా అనేక రకాల క్రిమికీటకాలకు ఆవాసం కల్పిస్తాయి. చెట్లు మానవజాతికి ఫల, పుష్పాదులను ప్రసాదించడమే గాకుండా - జీవం కోల్పోయిన తర్వాత కూడా కలప నిచ్చి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి. అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి.

🍃🌹అదేవిధంగా, కల్పవృక్షవాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే "పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు" అన్నట్లు స్వామి వారు కల్పవృక్షంలా భక్తుల కోర్కెలను కాదనకుండా తీర్చుతారు.


🌻 సర్వభూపాలవాహనం 🌻


🍃🌹బ్రహ్మోత్సవాల్లో నాల్గవనాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి - భూదేవిలతో సర్వభూపాలవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మేలిమి బంగారంతో, అచ్చెరువొందే శిల్పకళా సోయగంతో, ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదాన్ని ఈ వాహనంపై ఆవిష్కరిస్తారు. అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత బరువైన ఈ సర్వభూపాల వాహనం - వెయ్యి కిలోలకు పైగా ఉంటుంది.

🍃🌹"సర్వభూపాల" అంటే "రాజులందరూ" అని అర్థం. దిక్కులను కాచే అష్టదిక్పాలకులు కూడా ఈ కోవకే చెందుతారు. విష్ణు అంశ లేనిదే రాజభోగం లభించదు. "రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే" అనే వేదస్మృతి ననుసరించి, శ్రీహరి రాజాధిరాజు. మిగిలిన రాజులందరూ శ్రీనివాసుణ్ణి తమ భుజస్కంధాలపై మోస్తూ ఆదరిస్తున్నారు. లోకపాలకులందరూ శ్రీవారి పాదాక్రాంతులై, వారి కనుసన్నల్లో వెలుగుతూ ఉన్నట్లుగా ఈ ఉత్సవం ద్వారా మనకు గోచరిస్తుంది.

🍃🌹సమస్తలోకాలలో ఉన్న రాజులందరికీ విశేషమైన అధికారాలు ఉంటాయి. వాటి సహాయంతో, దుష్టశిక్షణ - శిష్టరక్షణ గావిస్తూ మనోరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే, వారికి శ్రీవారి పట్ల అపరిమితమైన భయభక్తులు కలిగి ఉండాలి. సర్వభూపాలవాహన వీక్షణం ద్వారా రాజులందరూ ఈ సద్గుణాలను పుణికిపుచ్చుకొనటం వల్ల పరిపాలన సజావుగా సాగుతుంది.

🍃🌹ఈ సేవను దర్శించడం ద్వారా భక్తులు తమ అహంకారం నశింపజేసుకొని, శాశ్వత ఫలితాన్ని పొందుతారు. ఇతిహాసాల్లో చెప్పబడినట్లు - సాటి నరుడు కోపిస్తే రాజు రక్షిస్తాడు. రాజు కోపిస్తే, దేవుడు రక్షిస్తాడు. అంటే, దేవుని కృప ఉంటే వేరెవ్వరూ మనకేమాత్రం హాని తలపెట్ట లేరు. ఈ వాహనం దర్శించడం ద్వారా, దేవదేవుని కృపను సంపూర్ణంగా పొందవచ్చు.


🌻 మోహిని అవతారం 🌻


🍃🌹ఐదవ నాటి ఉదయం శ్రీవేంకటేశ్వరుడు మోహిని రూపం ధరించి, రాక్షసులను మోహింప చేసిన జగన్మోహినిగా బంగారుపల్లకిలో సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దంతపు పల్లకి పై స్వామివారిని అనుసరిస్తూ ఊరేగుతాడు. మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటంటే - మిగతా అన్ని వాహనాలు వాహనమండపం నుండి మొదలైతే, ఈ వాహనం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

🍃🌹శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతార ప్రసక్తి పురాణాల్లో అనేకసార్లు గోచరిస్తుంది - మొదటగా, క్షీరసాగరమధనంలో శ్రీహరి జగన్మోహిని వేషధారియై రాక్షసులను తన ముగ్ధమోహన అవతారంతో మైమరిపింపజేసి అమృతభాండాన్ని అమరులకు అందజేస్తాడు.

🍃🌹విర్రవీగుతూ ముల్లోకాలలో కల్లోలం సృష్టించిన భస్మాసురుణ్ణి - శ్రీహరి జగన్మోహన రూపంతో సమ్మోహింప జేసి ఆ దానవుడి పీచమణుస్తాడు. మూడవసారి - దారుకావనం నందు జగన్మోహిని రూపంలో నున్న విష్ణువును చూసి మోహించిన శివునితో జరిగిన సంగమం వల్ల శాస్తా ఉద్భవం జరిగింది.

🍃🌹మరోసారి, భోళాశంకరుడిచ్చిన వరగర్వంతో
మోహిని అవతారంలో, మలయప్పస్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. స్త్రీలు ధరించే సర్వాభరణాలు శ్రీవారికి అలంకరింప బడతాయి. మోహిని వేషధారణలో ఉన్న మలయప్ప స్వామికి పట్టు చీర, రవిక, కిరీటం స్థానంలో రత్న ఖచ్చితమైన సూర్య చంద్ర - సావేరిలను అలంకరిస్తారు. స్వామివారికి వజ్రపు ముక్కుపుడక, ముత్యాల బులాకీని సైతం ధరింపజేస్తారు.

🍃🌹సాధారణంగా, వరదభంగిమలో ఉండే స్వామివారి కుడి చెయ్యి మోహిని అలంకరణలో కొన్నిసార్లు రాచిలుక తోనూ, మరికొన్ని సార్లు అభయ హస్తంగానూ దర్శనమిస్తుంది.

🍃🌹జగత్తంతా మాయా మోహానికి లొంగబడి ఉంటుంది. తన భక్తులు కానివారు మాయాధీనం కాక తప్పదని గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సెలవిచ్చారు. మాయా పూరితమైన ఈ ప్రపంచం నుండి తన భక్తులను రక్షించడానికి తిరుమలేశుడు మోహిని వేషధారియై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు.

🍃🌹"బలగర్వితులు, అహంకారులు కార్య ఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుని ఆశ్రయించిన వారే కృషి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరనే" సందేశం మోహిని అవతారం ద్వారా ప్రకటిత మవుతుంది.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.
తండ్రి శాపం :-
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష :-
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నేయి ,ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు . వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట :-
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన :-
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట :-
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి :-
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను
వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం  :-
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ :-
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత

***

*👌*ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**

         _**ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.*_


       _**కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.*_


     _**ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.*_


       _**ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.*_


      _**బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.*_


       _**వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.*_

 

       _**ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.*_


       _**మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.*_


       _**వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.*_


        _**సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.*_


       _**నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.*_


       _**ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..*_


         _**ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.*_


        _**మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది. మరి  మీకు తెలిసిన వారికి ఈ కథను పంపండి. ఏ ఒక్కరు మారినా మీ జన్మధన్యమే కదా.. చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "...*_


     _**సర్వే జనా సుఖినోభవంతు.**_


596.. వేదశ్రీ..ర జ ర భ స గ..9


 రామచంద్ర భూమి రాజ్యపాలనయేలే 

 క్షేమమే మనస్సు క్షేమమే తులచేలే 

స్వామసుందరుండు సామ్యమౌ సుఖమిచ్చే

ప్రేమతోను కామ్య ప్రీతిగా విధి దేవీ


597.. వేలా.. న య ర ర గ..7


కళలను తీర్చే కామ్య తత్త్వమ్ముయేలే

పలుకుల మాయే ప్రేమతత్త్వమ్ముయేలే

పిలుపుల వల్లే ప్రీతి తత్త్వమ్ముయేలే

తలపుల వల్లే తృప్తి తత్త్వమ్ము దేవీ


598.. వేల్లిత.. స స స స మ గ..7

వలెపే చిలికే వయసే కదిలే మాధుర్యమ్మున్ 

మలుపే జరిగే మనసే తెలిపే సౌందర్యమ్మున్

కులుకే సొగసే సుఖమైన విదీ ప్రాబల్యమ్మున్

పలుకే తెలిపే పరువమ్ము గనేలే శ్రీదేవీ


599..వేళ్ళితా.. స స న న మ గ..8


ఎవరింటనవారు యెరుకగన యే కత్వమ్మున్

సవరించగవారు సమయమును సంతృప్తీగన్

నవరంగములేను నటనలగు విశ్వాసమ్మున్

నవరత్నములౌను నయన కళలే శ్రీదేవీ 


600.. వేశ్వా రత్న.. తన తన తన గగ..13


సర్వజ్ఞతగల సర్వమ్ము గనుట సందర్భమగట లక్ష్మీ

నిర్వాహముగను నిర్మాణ మనుట విశ్వమ్ము యనుట లక్ష్మీ

పర్వంబు గనుట సంతోష మగుట పాఠమ్ము తెలుపు లక్ష్మీ

గర్వమ్ము విడిచి నిన్నూ మనసున గొల్చేదను దేవీ

No comments:

Post a Comment