ఓం నమః శివాయ...3
యతి.. 7
స్వరూపా నాయుష్యే స్వయముగనే నీ ప్రార్ధనగతే
నిరీక్షా ప్రోత్చాహాన్ని సకల శక్తీ యిచ్చిన మతే
పరీక్షా సంకల్పా ఫలమగు భ క్తీ హృద్యము స్థితే
సరాగమ్మే స్వేచ్చా సమర యు క్తీయే పశుపతీ...10
ఎవ్వరు లేరు లేరనుత యేలను యెoచుట నీదు ధైర్యమే
సవ్వడి వేచియున్నను యశస్సుసహాయము నీదు శక్తిగా
యవ్వనిచే జనించువిధి యైక్యము చూపుట నీదు భూక్తియే
నవ్వని యేడ్వనీ గతిగ నాటక రంగము యీశ్వరా..11
గమనంమై విధిగాసహాయ గతి భవ్యమ్మై కృతఘ్నా రవీ
సమయంమై బహు దివ్య తత్త్వమగు సంతృప్తీ హిమఘ్నా రవీ
తమకంమోహము బాపి నిస్సతయు తీర్చేభాగ్య మేలే రవీ
మము కాపాడుట సేవ దిక్కగుట మార్తాండైన మృత్యుం. జయా..12
తెల్పెను బ్రహ్మ రాతగను శిక్షణ కష్టము తొల్గిపోవగన్
మల్పులు డబ్బునుండిమది మంగళమేయగు దాహ తృప్తిగన్
వేల్పులు తీర్పుగా తెలప విద్యలు నిత్యము సత్యమే యగున్
గాల్పులు హృద్యమేయగుట గాయపుగమ్యము నాదు యీశ్వరా..13
దీనుల వెంట రక్షణయు దివ్య సహాయము చేయు దైవమై
మానస బుద్ధి మార్చగల మంగళ దూతగ నిత్య మానమై
ఆనతి నీదు శక్తి దయ యాకలి తీర్చెడి సత్య మార్గమై
కానగలేని జీవమగు కామ్యము నేర్పుము మాకు యీశ్వరా..14
ప్రతి మలుపే విధానమగు ప్రేమ ఉషస్సుయె దివ్య మార్గమై
ప్రతి హృదయం సహాయమగ ప్రేమ మనస్సుగ తోడు నిత్యమై
ప్రతి ఉదయం సమానమగు ప్రీతి వయస్సుగ నీడ సత్యమై
ప్రతి పయనమ్ము బంధము ప్రాభవ మేనగు సత్య మీశ్వరా...15
చంపకమాల:
*********
రయమునసేవ జేసితిని ,రాకయు పోకయు సవ్య మార్గమున్
భయమునుతోడు నీడగను, బంధము బాధలుతీర్చ టేగతిన్
మయ పలుకే మనోమయము మానని లక్ష్యము ధర్మమూర్తిపై
దయవిడి మానసమ్ముననె,దారిని జూపుము విశ్వ నాధగన్....16
నేనంటే ఎవరు?🧘♀️
ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ తనను పరిచయం చేసుకునే సందర్భంలో ‘నేను’తోనే ప్రారంభిస్తాడు. నేనంటే ఎవరు ? మనిషి జాతా, కులమా, గుణమా, శరీరమా, ధనికత్వమా, అధికార హోదానా... మరేదైనా ప్రత్యేకతా ?
శిశువు జన్మించినప్పుడు కులమతాల స్పృహ ఉండదు. ‘నేను’ అనే అహంకారం ఉండదు. మాటలు వచ్చాక ‘నేను’ మొదలవుతుంది. శరీరం, దానికి అంటిపెట్టుకున్నవన్నీ ‘నావి’ అనుకుంటాడు. అలాగే పెద్దవాడవుతాడు. ఈ భావన బలపడుతున్న కొద్దీ సభ్యసమాజం నుంచి వేరుపడుతుంటాడు.
మనసు అనే కోశంలో పాములా స్వార్థం బుసలు కొడుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎవర్ని కాటు వేస్తుందో తెలియదు. కాటు వేసే పాముకు కారణాలేముంటాయి ? అది దాని స్వభావం. స్వార్థపరుడు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటాడు.
సమాజంలో అందరూ మంచివారే ఉండరు. భిన్న మనస్తత్వాలవారు ఉంటారు. తమను, తమ గౌరవమర్యాదలను కాపాడుకుంటూ మనిషి జీవనప్రయాణం సాగించాలి.
‘నేను- ఎవరో తెలుసు కోవడంలోనే ఆధ్యాత్మిక రహస్యం అర్థమవుతుంది’ అనేవారు శ్రీరమణమహర్షి. నేను అనే మాయ సృష్టి మొదలు నుంచి మనిషిని ఆవరించుకుని ఉంది. శ్రీరాముడు కూడా ‘నేను’ నిర్వచనం కోసం వసిష్ఠమహర్షిని ఆశ్రయించాల్సి వచ్చింది. విశ్వామిత్ర, వసిష్ఠ, శ్రీరాముల ఆధ్యాత్మిక చర్చ యోగ వాసిష్ఠంగా రూపుదిద్దుకొంది.
ఆ గ్రంథం చదివి, అవగతం చేసుకున్నవారికి మాయతెరలు తొలగి ‘నేను’ ఎవరో అర్థమవుతుంది. ఏది నిజం కాదో అదే మాయ. అసత్యాన్ని నిజమనే భ్రమ కలిగిస్తుంది మాయ.
మంచితనమనే ముసుగు ధరించిన ఎందరో మనకు జీవితంలో తారసపడుతుంటారు. వీళ్లనే ‘గోముఖ వ్యాఘ్రా’లంటారు. పులి ఆవు ముఖం ధరిస్తే స్వభావం మారదు.
ప్రతి వ్యక్తినీ గుడ్డిగా నమ్మకూడదు. అతి నమ్మకంతోనే సమస్యలు మొదలవుతాయి. కొన్ని సమస్యల నుంచి ఎలాగోలా బయటపడతాం. కొన్ని ‘ఊబి’లోకి దింపేస్తాయి. ముందు జాగ్రత్తతో ముప్పును తప్పించుకోవాలి. ఏదో జరిగేవరకు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
జాగ్రత్తగా గమనిస్తే ‘నేను’లో దాగిన అనేక రూపాలు మనకు ప్రత్యక్షమవుతాయి. గృహంలో ఉన్నప్పుడు నేను- భర్తగా, తండ్రిగా, పెద్దలు ఉంటే కుమారుడిగా, సోదరుడిగా వ్యవహరిస్తాడు. వృత్తి, ఉద్యోగాల వేళ ‘నేను’ అధికార హోదా అవుతాడు. మిత్రుల మధ్య ఒక సరదా మనిషి అవుతాడు. బాల్యమిత్రులు అగుపిస్తే బాలుడైపోతాడు. బంధువుల మధ్య బాంధవుడవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దీనుడవుతాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నుడవుతాడు. శత్రువుల పట్ల కర్కశుడవుతాడు. ఇలా ‘నేను’ నిత్యమూ అనేక పాత్రలు పోషిస్తుంటుంది.
జ్ఞాన బోధల్లో ‘నేను’ అంటే ఆత్మ అనే నిర్వచనాలు వింటాడు. కాబోలు అనుకుంటాడు తప్ప ఆత్మవిచారం చేసి, తనలోని అంతర్యామిని వెతుక్కోడు. జీవిత చరమాంకం దాకా నేను ఆత్మ భావనలోకి మారకపోవడమే మాయ. దీన్ని జయించాలంటే గీతాకృష్ణుడు చెప్పినట్లు, వైరాగ్యమనే ఆయుధం కావాలి. లేదా సంపూర్ణ శరణాగతి చెయ్యాలి. లేకపోతే జీవితం నిష్ఫలమవుతుంది.
మనకు దైవరూపాలు ఎన్ని ఉన్నా మూలరూపం ‘ఓం’కారమే. యోగులు ‘ఓం’కారమే ధ్యానిస్తారని చెబుతారు. ఓంకారంలోని అకార-ఉకార-మకారాలే త్రిమూర్తులంటారు. మనిషి ‘నేను’ భావనలోంచి ఆత్మభావనలోకి ప్రవేశించడానికి ‘ఓం’కార ధ్యానం ఉపకరిస్తుందని యోగులు చెబుతారు !
***
* శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
ఓంశ్రీమాత్రే నమః
ఏవ మానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ ౹ తదధిష్ఠాన కూటస్థ బ్రహ్మణీ తు సునిర్మలే ౹౹226౹౹
226. అట్లే ఆనందమయ కోశము, విఙ్ఞానమయ కోశము అనునవి మాయ దాని వికారమగు బుద్ధి ఉపాధులుగ ఏర్పడినవి.వానికి ఆధారములు,అధిష్ఠానములు అగు కూటస్థము బ్రహ్మము అనేవి పరిశుద్ధములు.
వ్యాఖ్య:- తత్,త్వం అనే పదాలయొక్క శోధనస్వరూపాన్ని చూపించటానికై వెనుకటి దృష్టాంతాన్ని గుర్తు చేస్తున్నారు.
తత్,త్వం అనే పదాల్ని బాగా శోధనచేసి శుద్ధరూపాన్ని ప్రదర్శించాల్సి ఉంది.ఈ ప్రకరణమునందు తత్,త్వం అనే పదాల శోధనమే ముఖ్య ప్రయోజనం.
అందుచేత,ఘటాకాశ మహాకాశాలు,జలాకాశ,
అభ్రాకాశాల దృష్టాంతం లోగడ చూపబడ్డది.దానిని బట్టి,
ఘటాకాశస్థానీయుడు కూటస్థుడు,
మహాకాశస్థానీయుడు పరబ్రహ్మ,
జలాకాశస్థానీయుడు జీవుడు,
మేఘాకాశస్థానీయుడు ఈశ్వరుడు!
అని గుర్తుచేసుకోవాలి.
పదార్థశోధన పద్దతి,
జలాకాశం జలరూపమైన ఉపాధియొక్క ఆధీనంలోను, మేఘాకాశం మేఘం అనే ఉపాధియొక్క ఆధీనంలోను ఉన్నందువల్ల పారమార్థికమైనవి
కావు.
వాటికి ఆశ్రయభూతమైన ఘటాకాశం,మహాకాశం అనేవి స్వచ్ఛమైనవి.
జలంలాంటి ఏవిధమైన ఉపాధిని ఆపేక్షించకుండా శుద్ధము,నిర్మలము
అయినవి కేవలం ఆకాశ మాత్రంగానే. ఉన్నాయి కాబట్టి!
ఇదే విధముగా ఆనందమయుడైన ఈశ్వరుడు మాయ అనే ఉపాధి యొక్క ఆధీనములోను, విజ్ఞానమయుడైన జీవుడు బుద్ధి అనే ఉపాధి ఆధీనములోను ఉన్నారు.
కాని వారిద్దరికి అధిష్ఠానాలైన కూటస్థుడు,బ్రహ్మ ఈ ఇరువురు మాత్రం,
శుద్ధము,నిర్మలము (పరిశుద్ధము)అయినవారు-ఘటాకాశ మహాకాశాల్లాగా !
పదార్థ శోధనలో ఉపయోగపడుతున్నప్పటికి సంఖ్యయోగమతాలు అంగీకరింపదగినవి కావు.
***---
531.. వాణీ.. మ భ స న య స గ..10
శ్రీ రామా బంధము యనగా సిరులుగ సాగే సమయమ్మే
శ్రీ రామా లక్ష్యము యనగా స్థిరమగు శక్తీ సకలమ్మై
శ్రీ రామా భక్తి యనగవా సికథలు యుక్తే వినయమ్మై
శ్రీరామా నిన్ను కొలిచెదా ని యముల వల్లే మది దేవీ
532.. వాణీ భాషా.. మ మ త న మ.. 9
విద్యామార్గమ్మేలే శక్తీ వినయపు మార్గమ్మే
విద్యా పాశమ్మే లే ముక్తీ విమలము ధైర్యమ్మే
విద్యా స్నేహమ్మేలే యుక్తీ విజ యము భాగ్యమ్మే
విద్యాధ్యానమ్మేలే భక్తీ వినయము శ్రీదేవీ
533..వాణీ వాణ :.. మ భ స భ త య గ గ..12
ఊహా లోకమ్ముల వినయమ్మేకను సామర్థ్యము చూపే వేలే
లోహమ్మై కల్పనల కధే పోలిక కార్యర్థము తెల్పే వేలే
దాహానన్ నిల్చెడి తిరు దైవమ్మున విశ్వాసము చూపేవేలే
వైహల్యమ్మున్ పెను బలమౌ భాగ్యముయే శ్రీదేవీ
534.. వా తాలీ.. మ భ భ గ గ..6
సామర్థ్యమ్మే పస పాశము యేలే
ప్రామాన్యమ్మే ఉప దానము యేలే
కామత్వమ్మే వికసమ్ముగ యేలే
సామాన్యమ్మే రస మాయలు దేవీ
535.. వాత్యా.. భయ గగ యతి లేదు
బంధమున బంధుత్వమ్మే
పొందికయు లోబత్వమ్మే
సంధియము వైఖల్యమ్మే
వందనముయే శ్రీదేవీ
......
లోకంలో సాధారణంగా తప్పు చేయనివాడు ఉండడు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. మనకు శత్రుత్వమనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకరిని మనం స్నేహితుడిగాను, మరొకరిని శత్రువుగాను చూస్తున్నామంటే, చూసేవారి దృష్టిలో భేదం ఉందని చెప్పక తప్పదు. ఆ భేదానికి కారణం ఎదుటి వ్యక్తి చేసే పనులే కానీ, ఆ వ్యక్తి కాదు. కానీ, అందరూ సమానులే అయితే శత్రుత్వం ఉండకూడదు. లోకంలో మనకు కీడు చేసినవాడు శత్రువు అవుతాడు. మేలు చేసినవాడు మిత్రుడవుతాడు. కానీ, ఇద్దరినీ మిత్రులుగా చూసే అలవాటు సాధారణంగా అందరికీ ఉండదు. అది యోగుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
మన శరీరంలో జీవుడనే వాడు ఒకడున్నాడు అనడానికి ఏమిటి కారణం? దీన్ని తెలుసుకుంటే ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో అవగతమవుతుంది. పరమాత్మ జీవుడికి కనీస జ్ఞానాన్ని (కామన్సెన్స్) ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ కనీస జ్ఞానం వికటిస్తుందో అప్పుడే మార్పు ఏర్పడుతుంది. సర్వజ్ఞుడైన పరబ్రహ్మలో మనం ఉన్నాం. ఇది కనీస జ్ఞానమే! అంతా పరమేశ్వరుడే అని చెప్పుకొంటాం. కానీ, మనం పరమేశ్వరుడితో ఉన్నామన్న విషయం మరచిపోతుంటాం. అయితే, మనం పరబ్రహ్మ స్వరూపులమని, పరబ్రహ్మను మాయ ఆవహించడం వల్ల జీవులమయ్యామని, మాయ తొలగిపోతే మళ్లీ పరబ్రహ్మలో కలిసిపోతామని, మనకూ, పరబ్రహ్మకూ తేడా లేదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ, వేదజ్ఞానం కలిగినవారు పరబ్రహ్మకూ, జీవుడికి భేదం లేదని చెప్పరు. పరబ్రహ్మ స్వరూపం తెలిస్తే ఎవరూ ‘మేం పరబ్రహ్మలం’ అని అనరు. పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడు. చిత్ అంటే పూర్ణజ్ఞానం కలిగినవాడు. ఆనంద స్వరూపుడు అంటే, ఏ మాత్రం దుఃఖం లేనివాడని అర్థం. అంతేకాదు పరబ్రహ్మ నిత్య శుద్ధబుద్ధముక్త స్వభావుడు. అంటే ఎల్లవేళలా అవిద్య అంటక పవిత్రంగా ఉండేవాడు.
మరి జీవుని విషయానికి వస్తే పరబ్రహ్మలా ఎల్లవేళలా ఉనికి కలవాడైనప్పటికీ పరబ్రహ్మ అంతటి జ్ఞానం అతనికి లేదు. పరబ్రహ్మ సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు. సర్వవ్యాపకుడు. జీవుడు అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, ఎక్కడో ఒకచోట ఉంటాడు గానీ, పరబ్రహ్మలా బ్రహ్మాండమంతటా ఉండడు. జీవుడు అవిద్యచే శరీరధారి అవుతున్నాడు. అంటే జన్మలెత్తుతున్నాడు. బంధాల్లో చిక్కుకుంటున్నాడు. ముక్తికోసం పరితపిస్తున్నాడు.
జీవించి ఉండగానే ముక్తికి అర్హత గలవారు జీవన్ముక్తులు. మరణించిన తర్వాత ముక్తిని పొందినవారు ముక్తజీవులు. ముక్త జీవులుండే చోటునే ‘తృతీయ ధామం’ అంటారు. పాపం చేసినవారు భూలోకంలో పుడుతూ, చస్తూ ఉంటారు. పుణ్యం చేసినవారు పితృలోకాన్ని చేరి మళ్లీ మనుషులుగా జన్మిస్తారు. కానీ, భవబంధాల నుంచి బయటపడినవారు దేవలోకాన్ని చేరుకుంటారు. ఈ దేవలోకమే ‘తృతీయ ధామం’. అదే ‘బ్రహ్మలోకం’- పరబ్రహ్మ సన్నిధానం. పరబ్రహ్మ సాలోక్యాన్ని, సాయుజ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని పొందేవాడు జీవుడే. పరబ్రహ్మలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తే అదే ‘సాలోక్యం’. పరబ్రహ్మతో కలిసి ఉండటం ‘సాయుజ్యం’. యోగంతో పరబ్రహ్మను సమీపించడం ‘సామీప్యం’. పరబ్రహ్మ సామ్యాన్ని పొందడమే ‘సారూప్యం’.
ఇష్టపడటం, ద్వేషించడం, ఏదైనా సాధించడానికి ప్రయత్నించడం, సుఖదుఃఖాలను అనుభవించడం, జ్ఞానం కలిగి ఉండటం శరీరధారి అయిన జీవుడి లక్షణాలు. కష్టాలను కలిగించే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం పరబ్రహ్మలో లేవు. పరబ్రహ్మ ధర్మాధర్మ ప్రవృత్తులకు దూరంగా ఉంటాడు. వాటి ఫలాలు అతనికి అంటవు. అతను విశేష పురుషుడు (సామాన్యుడైన జీవుడి వంటి వాడు కాడు). శరీరధారులం కావడం వల్లనే మనం ఇచ్ఛాద్వేషాలకు లోనవుతున్నాం. అజ్ఞానంలో పడిపోతున్నాం. సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. మన ఇచ్ఛాద్వేషాల వల్ల ఒకరు మిత్రులు, ఒకరు శత్రువులవుతున్నారు. పరబ్రహ్మ స్వరూపం తెలిస్తే మనకు శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. అందరూ మిత్రులే!
......
మధురిమలు ...
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉదయభాను ప్రయాణం
జీవ యుత్తేజ భావం
ధర్మ చరిత తత్వ మయం
జీవ మనసు ఉల్లాసం
సూర్యనిది ఉష్ణ తాపం
పుడమిదీ సహన శాపం
ఇరువురిది ప్రకృతి ధర్మం
అదియె జీవులకు మార్గం
సూర్యుని ధర్మం తాపం,
జలమునకు ధర్మం రసం
అగ్నికి ధర్మం దహనం,
జీవునికి ఆత్మజ్ఞానం
మన ధర్మం సంస్కారం
మన పలుకులు సంసారం
మతము న్యాయసమ్మతం
బతికించు మానవత్వం
తేజస్సుయె విస్తారం
భక్తికి ఇదిఒక మార్గం
నిత్య హృదయం నిర్మలం
ఏకభావ సమ్మోహం
నిత్యతృప్తి సంతోషం
లక్ష్మికి స్థిరనివాసం
మనసులొ సత్యాంగత్యం
ఏర్పడును ఉత్తమ గుణం
పలుకులలోన ఉత్తమం
జీవితానికి సార్ధకం
అక్కడ బ్రహ్మ జ్ఞానం
దేవుని సాక్షాత్కారం
***
*🌹. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత 🌹*
*సేకరణ : ప్రసాద్ భరధ్వాజ*
*🌿🌼🙏శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🙏🌼🌿*
*🌿🌼🙏దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.🙏🌼🌿*
*🌿🌼🙏ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿*
*🌿🌼🙏సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన
సంకల్ప బలం
రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.
ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.
తర్వాతి రోజుల్లో ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.
కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది.
కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.
తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీబుద్ధునికి-అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!
వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.
ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.
'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.
దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.
ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.
తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలోఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు.
అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.
మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!
No comments:
Post a Comment