ఓం నమః శివాయ
సకామ్యమ్మే జీవమ్ము వినయపు దీక్షా సతిపతే
ప్రకాశమ్మే ధ్యానమ్ము సహనపు రక్షాగతి మతే
వికాసమ్మే విన్యాస వినయపు శిక్షా సమ గతే
సకాలం మే దీనాతి బతుకుకు విద్యా పశుపతే 1
మాతా బొజ్జసకామ జన్మ భవమై మానంద పాపమ్ముగా
ప్రీతీ నొంద ఫలమ్ము గాను జలపీయూష పుత్రుండుగా
ప్రాతత్ భావముగాను తెల్ప జఠరాగ్నే బంధ దాహమ్ముగా
ఏతత్ భూమిన నేనుపుట్టె సహనమ్మే జూప విశ్వేశ్వరా 2
పసితనమందునే పలుకుదుఃఖపు పీడన సుబ్రతలేక వేదనే
శశికళచూపకే భయము నెంచియు సీఘ్రము బంధన మౌట కాలమే
పశువులమాదిరేకదిలె ఇంద్రియ పాశములేకయు బాధ తత్త్వమే
కసువులమధ్య పెర్గితిని నిత్యము కామ్యము తెల్పుము నాకు యీశ్వరా 3
నేటి దృశ్య పఠన పద్య ప్రాంజలి ప్రభ.. 14/2
Ramakrishna Mallapragada
బాల్య కథ.
* పిల్లలు హృదయం సున్నితం*
మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ప్రతిదీ పాలు మరియు తేనెలా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ పిల్లలకు అందరూ స్నేహితులే. కల్లాకపటం ఎరుగని స్థితి, పొరుగున ఉన్న శత్రు సమూహాలకు చెందిన పిల్లలు వారికి స్నేహితులే. అందరి పిల్లల మనస్తత్వం ఒక్కటే, కులాల్లో మతాలు అనేవి అక్కడ కానరావు. తల్లిదండ్రులకు తేడా తెలిసినా పిల్లలకు తెలియదు.
ఒక కుటుంబానికి చెందిన పిల్లలు మరో కుటుంబానికి చెందిన పిల్లలతో ఆడుకోవచ్చు, అయితే రెండు కుటుంబాలు తీవ్ర ప్రత్యర్థులు కావచ్చు. వేరే కులాల వారు కావచ్చు, వేరే మతాలవారు కావచ్చు ఎందుకంటే వారి సంతోషానికి మూలం ఆ చిన్న పిల్లల్లో ఉండేటువంటిది స్నేహం.
పిల్లలకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అలాగే ఆత్మ యొక్క ప్రారంభ, అపరిపక్వ స్థితిలో ఇలాగే ఉంటుంది. తనలో ఇసుమంతైనా ఆధ్యాత్మికత లేనందువల్ల, అలాగే చుట్టూ ఉండే ప్రాపంచిక సుఖాల ముసుగులో పడి, ఈ ప్రపంచంలో పొందనిది అంటూ ఏమీ లేదు అనే భ్రమలో ఉంటుంది. భావోద్వేగాలు మరియు అవగాహనలు, మరియు తిరుగుబాట్లు అన్నీ కలిపి ఒక గోళముగా కలిసి ఉంటాయి. (కోపం, అర్పులు,మొండిపట్టు, అలక, బెదిరింపులు ఉంటాయి)
మత్తకోకిల
తల్లిదండ్రుల మాట వీనులఁ దాల్మితో విన
డెప్పుడున్
గల్లలాడుచుఁగూడి దుష్టులఁ గాలమున్
వృథచేయుచ
య్యెల్లవేళల విద్యనేర్వక యీడు పిల్లలఁ
గూడుచున్
గల్లుఁద్రాగుచు జూదమాడును గన్యలన్
వెనుకాడుచున్.
అంటే కొంచెం బంగారం, కొంచెం ఇనుము వంటివి కలిసి ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేని పదార్థంగా ఉండవచ్చు. అలాగే పిల్లలలో, వారి సంస్కారాలు, వాసనలు, మానసిక స్థితులు వంటివి, అన్నీ కలిపి అంత సులభంగా విడిగా గుర్తించ బడలేనంతగా కలిసిపోయి ఒక మిశ్రమ పదార్థంగా ఉంటాయి.
అందుకే చాలా జాగ్రత్తగా పెంచుతారు, తండ్రి కోపంగా ఉన్నా తల్లి ఆదరణ మిన్న గా ఉంటుంది.
ఆ.కంట నీరు పెట్ట కష్టాలు తొలగించు
నచ్చ సుఖము పంచు నవ్వి నంత
కష్ట మైన నేర్పు కానరాని చెలిమి
భావమందు ప్రేమ భాగ్య మవ్వు
ఇంకా పిల్లలు ఈవిధముగా
కం.
శిష్టుల మాటలు వినకయె
దుష్టుల నెయ్యంబు జేసి దుడుకు తనముతో
ముష్టి దురభ్యాసమ్ముల
బ్రష్టున్ డగుటే విధిగను బాధపడుటయే
నమస్కారంతో మందలించిన పిల్లల తట్టుకోగలరు కానీ వెటకారంతో పొగడినా భరించలేరు. పిల్లల ముందే పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడం మంచిది కాదు, అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరే మోసం అవుతుంది, నిజం నీతిగా ఒంటరిగా మిగిలిపోతుంది.
అందుకే
సత్కులములో పుట్టడం,సుభాషితములను సంగ్రహించడము,అలాగే, మంచి భార్య మరియు విద్యావంతుడైన కొడుకు వీళ్లంతా పుణ్యమువల్ల మాత్రం దొరుకుతారు.
పగలు,రాత్రి,సాయం కాలం, ఉదయం, శిశిరం, వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.ఇలా కాలం ఆటలాడుతుంది.ఆయుష్ తరుగుతూ ఉంటుంది.అయితే ఆశలనేవి మాత్రం వదలవు.
అందుకే పిల్లలు రేపటి పౌరులు
తల్లిదండ్రుల ఆశయ సాధకులు.
సర్వేజనా సుఖినోభవంతు
నీ మల్లాప్రగడ రామకృష్ణ
నేటి దృశ్య పఠన పద్య ప్రాంజలి ప్రభ.. 14/1
Ramakrishna Mallapragada
*మంకీ ట్రాప్ *
ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త ...
భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని". ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము
"మంకీ ట్రాప్" అవును ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి నికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది.తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.
నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు చాలా మంది తెలుసు.నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. విశిదంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదుల కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.
మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...
నో చెప్పలేని మోహమాటలు...
తిరిగి అడగలేని అప్పులు...
దండిచలేని ప్రేమలు...
ఊపిరి సలపనివ్వని పనులు...
వత్తిడి పెంచే కోరికలు....
ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...
పేరు వెంట చేసే పరుగులు....
అన్నీ మంకీ ట్రాప్ లే.
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు " వదలటం గొప్పా పట్టుకోవడం గొప్ప? అంటే.. అవును సీతను వదిలేసి ఉంటే రావణుడు ప్రాణాలతో బతికేవాడు..
అందుకే కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం.. మరింత మనశ్శాంతిగా ఉందాము.
ఎంత నున్న నేమి యెదలోన భయము గా
కంటి నిద్ర రాదు గాంచ కలిమి
ధనము కొంత యున్న దారిద్రము తరుము
మనము మనమనినను మనసు శాంతి
ఎంత నేర్చితేమి ఏర్పాటు విద్యగా
మేలు చేయకున్న మేధ యేమి
విద్య విలువ నెంచి వినయ సంస్కారము
తెలియ పరచ గలగు తెలివి మేలు
మగువ మనసు నుంచి మాటలు పంచియు
సహన మంచి కరుణ సమయ మెంచ
సొగసు కాదు తగిన సుదతి సౌభాగ్యమే
అనకువ మరిపములు యానతియగు
ఎన్ని హంగు లున్న నేమి మతిమరుపే
కీచులాట యగుట కీలకమేయగు
భోగ భాగ్య మున్న పోరు జరుపు టేను
అర్ధ మన్న దేది అర్ధ మవదు
భావ మర్ద మౌను పా లుపంచెడి శక్తి
కాలము కసి గున్న కరుణ మిన్న
రాసి యార్తి యైన రవ్వ వెలుగు నీడ
వాక్కు విలువ బట్టి వలపు చిక్కు
జీవితపరమార్ధమేను గీత యగుట
ఇష్ట కష్ట మౌను యిచ్ఛ పెరుగు
ఆశ యన్న దౌను ఆత్మ తృప్తి
ప్రకృతి సృష్టి ఫలము ప్రతిభ జూపు
నేటి దృశ్య పఠన పద్య ప్రాంజలి ప్రభ.. 13/2
Ramakrishna Mallapragada
సీస పద్యము
మాటలై వనమున మట్టి లాగ బ్రతుకు
కోకిలమ్మగ కూత కోరి నేర్పు
శాంతి పాఠము నేర్పు సాక్షిలా తిరుగుటే
వెలుగు దివ్యగ నుండి వినయ నేర్పు
శ్రమకు తగ్గిన కూలి శ్రామికుడై నుండి
శక్తి నిధిగమనా సరయు నేర్పు
మనసు గట్టిగ నుంచి మార్గము చూపుచు
మానవత్వము జూపి మంత్ర ఓర్పు
తే.పెదవి చిరునవ్వు సత్యమై పెనుగు లాట
కళ్ళ దయ చూపు ధర్మమే కరిగి పోవు
చేసడి న్యాయ దానము చేరువ యగు
మనసు హృదయ ప్రేమ కలిపె మనుగడయగు
****
అచ్యుతానందబ్రహ్మచారి
జీవనతరంగాలు
వ॥
మాధవీ మురారిశర్మ దంపతుల పుత్రుఁ
డట్లుఁ బ్రవర్తించు చున్నందున మిక్కిలి చింతా
క్రాంతులయిరి. మురారిశర్మ తనగురువైన
శ్రీగోవిందాచార్యుల సన్నిధికేగి తనపుత్రుని
చేష్టలను వివరించిచెప్పి, బాధపడి గృహం
బునకు వచ్చి హితోపదేశంబుఁ జేయవలెనని
ప్రార్థించఁగా, వారంగీకరించిరి. అప్పుడు
వారిఁదనవెంట తీసికొని రాగ, గురువా
దంపతులకు వారిపుత్రున కీవిధంబుగా
నుపదేశించెను. 40
శ్రీగోవిందాచార్యోపదేశము
దుష్టమైత్రిచే ననర్థాలు
సీసము
పదమూబిలోఁ బెట్టఁ పంక మంటినరీతిఁ
జెనటిఁగూడిన చెడుగొనము కలుగు
నల్లరంగునఁబత్తి నల్లనై నట్లుగాఁ
గుమతిఁగూడిన వ్యక్తి కుమతి యగును
దురదగొండినిఁ దాక దురద కలుగునట్లు
నతి దుష్టమైత్రి దుర్వ్యసనమబ్బుఁ
గల్లులో నిడనీరు కల్లగునట్లుగా
దుస్సంగమువలన దుష్టుఁడగును
తే గీ
చింతపులుసు పోసిన పాలు చెడినరీతి
దుష్టజన మైత్రిచే వ్యక్తి దుష్టుఁడగును
జార చోరమైత్రిని జార చోరుఁడగును
త్రాగుబోతులఁ గూడనౌఁ ద్రాగుబోతు. 41
ఉత్సాహము
పాలుఁబోసి పెంచితిమని పాము నమ్మ
వలదయా,
వాలుమెకము, వనపుఁ గ్రూర పశుల నమ్మ
రాదయా,
వేల రూక లిచ్చితినని వేశ్య నమ్మ
రాదయా,
జాలి కలిగి దుష్టుని, మఱి జాల్ము నమ్మ
వలదయా. 42
ఉ॥
గరళముఁ గూడి నట్టి యుదకంబు వినాశన
మొందునట్లుగాఁ,
దరచు హరీద్రమున్ గలసి తండుల చూర్ణము
మారినట్లుగాఁ,
గరమును నిప్పులో నిడిన కాలు విధంబున
దుష్ట మైత్రిచే
సరగున మారి దుష్టుఁడగు సత్యము
నమ్ముడు నాదు వాక్యముల్. 43
నేటి దృశ్య పఠన పద్య ప్రాంజలి ప్రభ.. 13/1
Ramakrishna Mallapragada
చిలిపి ప్రేమతో చిరుగాలి చంప నిమిరి
గుండె శబ్దము చెలికోరె గుర్తు గమన
నవ్వు పువ్వుల పిలుపుగా నరుని కలలు
రసమయం విశ్వ చరితమ్ము రవ్వ వెలుగు
ప్రేమలో ప్రేమతో ఘర్షనే, మదీయ
శాంతమే సౌఖ్యమే కోరు సమయ శక్తి
కోరికలసంద్రము తెలిసి పోరు జరుగు
జ్ఞానమే దారిగా గంగ పారు తీరు
కాంతి రావద్దనే రాత్రి స్పర్ధ వేద
రాత్రి రావద్దని కాంతి స్పర్ధ వేద
మంచి చెడ్డల స్వార్ధము మనసు వేద
లాభ నష్టాల స్వార్ధము లహరి వేద
రచన కుసుమాల తో నీడ రంగు తీరు
జ్ఞాన చక్షువులు కలసి జ్ఞాన వృద్ధి
జనుల మనసుబట్టి కలము జాగృతి గను
అక్షరాంజలి ప్రాంజలి ప్రభల వెలుగు
నరులు ఆశ్రమంలోబాల యవ్వనమ్ము
వృద్ధ సేవ తత్పర బోధ కృషియు సల్పు
వారి హృత్కమలము నీదు వ్యాధి భక్తి
మనసు నీయందు శంకరా మార్గ మదియె
మానవం, దేవతం, కొండ, మన్యమేను,
మృగము గాగాని,దోమగా,ముఖ్య మగుట
పశువుగా,అరణ్యము, పక్షి, ప్రాణ పలుకు
చరణ కమల ధ్యానము శివా చరిత మనసు
*🙏🏻🌹శుభోదయం*🌹🙏🏻
_*💫అన్నం..*
_*పరబ్రహ్మ...*_
_*స్వరూపం !!
*_మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కు కున్నాడు రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది. కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు._*
*_అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు. రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది, చాలా కార్లు నిలిచి వున్నాయి. అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు._*
*_30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు. రెండుకూరలు, రెండు పచ్చళ్ళు, పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు. ‘హాయిగా తినండి. నిదానంగా తినండి తొందరేమీ లేదు’ అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు._*
*_'ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి !’ అని హెచ్చరిస్తూ తిరిగేవాడు. ఎవరైనా పారేస్తే చెయ్యి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే._*
*_బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే. అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా వుండడంతో అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు. అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు._*
*_రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు. పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు. అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీది హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండమీది స్వామిని దర్శించుకొని ఆ హోటల్ లో భోజనం చేద్దామని వచ్చాడు._*
*_శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి యిది వెయ్యండి. అని అన్నీ వేయించుకొని తిన్నంత తిని సగం పారవేసి చెయ్యి కడుక్కున్నాడు. అది చూసి శంకరయ్యకు కోపం నసాళానికి అంటింది._*
*_బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు._*
*_చుట్టూ వున్నవాళ్ళు ‘అతను ఎవరనుకున్నావు ? పెద్ద జమీందారు ! అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా యిష్ట మొచ్చినంత తింటాం పారేస్తాం నీకేమిటి ?’ అన్నారు అతని వెంట వచ్చినవాళ్ళు._*
*_”మీరు డబ్బు చెల్లించినా సరే పారెయ్యడానికి మీకు హక్కు లేదు. ఎన్ని కోట్లు డబ్బు వున్నా ఆకలేస్తే డబ్బు తింటారా ? మీకందరికీ కూడా సామాజిక బాధ్యత వుండాలి, బరువూ బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి, అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడయినా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం !’ దాన్ని వృధా చెయ్యకూడదు. ఇలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాలవారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు._*
*_రాయుడు నవ్వుతూ చెయ్యి జాచాడు. శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు._*
*_అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎమ్.ఎల్.ఏ గా నిలబడి గెలిచాడు. ఇప్పుడు మంత్రి పదవి లభించింది. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్ లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు._*
*_శంకరయ్యగారు చనిపోయినట్టున్నాడు, అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టివుంది పూలమాల వేసి. ఆ ఫోటో వెనక అతని బెత్తం కూడా వుంది బూజు పట్టి. మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావుడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు. అందరూ తినలేక చాలా పారవేశారు._*
*_అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది. తట్టుకోలేక పోయాడు. శంకరయ్య ఫోటో వెనక వున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు. కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్లి “యింత అతి మర్యాద చేసే అవసరం లేదు. ముందు నీ బాధ్యత తెలుసుకో ! ఎంత భోజనం వృధా అయింది చూడు !” అని అతన్ని చెయ్యి చాచమని చితక బాదాడు._*
*_ఆ బూజు పట్టిన బెత్తాన్నిముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు._*
*_ఈ కాలంలో అటువంటి నేతలు వున్నారా ? వుంటే వారికి పాద నమస్కారం చెయ్యాల్సిందే._*
*_మనమంతా కూడా ఎక్కడయినా సరే తినే పదార్థాలను వృధా చెయ్యకూడదు. ఇప్పటికీ మా యింట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము. మరి మీరు..?_*
*_(నవ్య వార పత్రిక సౌజన్యంతో)_*
*_’అన్నం పరబ్రహ్మ స్వరూపం !’ దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు "అన్నమో రామచంద్రా" అని ఏడ్చే గతి పడుతుందని పెద్దలు చెప్తారు !_*
*_రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
సేకరణ
🙏🇮🇳😷💉🎊🪴🦚🐍
అకారణంగా ఒక్కొక్కసారి మిత్రులు కూడా శత్రువులు అవుతారు.
అంతకుముందు వరకూ మనల్ని గౌరవిస్తూ వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతారు. సహోద్యోగులు, బంధువులు కూడా దూరదూరంగా తప్పించుకుని తిరగాలనుకుంటారు.
ఎందుకిలా జరుగుతోంది అని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేక సందర్భాలలో సులభంగా అర్థమవుతుంది. మన వాగ్ధోరణే మన మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోందని
మాట్లాడడం అనేది జీవన కళలో ప్రధానమైనది. భావవ్యక్తీకరణ సాధనం వాక్కు – అన్నది నిజమే అయినా, సందర్భానుగుణంగా దానిని వినియోగించడంలోనే జీవితంలోని మానవసంబంధాలు, కార్యసాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నయి.
‘వాగ్ఘి సర్వస్వ కార్యణమ్’ అంటోంది శాస్త్రం.
ఒకేభావాన్ని రకరకాల మాటలతో చెప్పవచ్చు. కుండబద్దలు కొట్టినట్లో, బుజ్జగింపు ధోరణిలోనో, నచ్చజెప్పే విధంగానో, కఠినంగానో, కోమలంగానో ఒకే భావాన్ని పలురీతులలో వ్యక్తపరచవచ్చు.
వాక్కు మన సంస్కారాన్ని చాటి చెబుతుంది
వాల్మీకి తన రామాయణ కావ్యంలో ఆదినుండి వాక్సంస్కారంపై ఎన్నో మంచి విషయాలను పేర్కొన్నాడు.
‘వాగ్విదాం వరః’, ‘వాక్య కోవిదః’, ‘మృదుభాషీ’, ‘మధురభాషీ’, ‘పూర్వభాషీ’, ‘స్మితభాషీ’, అంటూ ఉత్తమ వాగ్లక్షణాలను చక్కగా తెలియజేశారు.
మాటలో స్పష్టత, నిష్కపటత్వం ప్రధానం. ఒక్కొక్కసారి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, మాట్లాడడం మన స్వభావం అని గొప్పగా చెప్పుకుంటూంటాం.
కానీ అవతలివారు అదే నిక్కచ్చితనం మనపట్ల చూపిస్తే సహించగలమా?
బాధించే విధంగా సత్యాన్ని కూడా పలుకరాదు. ప్రయోజనం ప్రధానం. అలాగని అబద్ధం చెప్పనవసరం లేదు. నిజం చెబితే ప్రమాదమనే చోట తటస్థవైఖరి క్షేమం.
మాట్లాడే నైపుణ్యం గురించి మన శాస్త్రాల ఆధారంగా గమనిస్తే ఈ క్రింది విషయాలు స్పష్టమౌతాయి.
🌷మాట అవతలి వారికి ఉద్వేగం కలిగించకూడదు.
🌷అవతలి వారి పేరును పలికి సంభాషిస్తే, వారికి ఆదరంగా వుంటుంది.
🌷మనమే ముందు మాట కలపడం స్నేహానికి, కార్యసాఫల్యానికి ముఖ్యం.
🌷ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడడం ‘మధుర’వాక్కు అనిపించుకుంటుంది.
🌷కసిరికొట్టినట్లుగాను, వెకిలితనంతోను మాట్లాడడం శత్రువులను పెంచుతుంది.
🌷అతి సంక్షిప్తమూ, అతి విస్తారమూ – రెండూ పనికిరావు.
🌷ఉచ్చారణ తేటగా ఉండాలి.
🌷చిరునవ్వుతో మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం అవతలి వారిని వినేటట్లు చేస్తుంది.
🌷వడివడిగా పలకడం, అతి నెమ్మదిగా నాన్చడం – రెండూ రాణించవు.
🌷సద్గ్రంథపఠనం, మంత్రజపం, మౌనం – ఇవి మాటకి శక్తినిస్తాయి.
🌷ఎప్పుడూ సకారాత్మకంగా (Positive) మాట్లాడడం శ్రేష్ఠం.
🌷మన గురించి మనమే ప్రశంసించుకుంటూనో, అలాగని అతి వినయంతో హీనపరుచుకుంటూనో మాట్లాడడం నిరాదరణకు గురిచేస్తుంది.
🌷ఒక విషయంపై మాట్లాడేటప్పుడు దానిపై అవగాహన కలిగి ప్రారంభించాలి.
🌷తక్కువ సమయంలో విషయాన్ని స్పష్టంగా, సానుకూలంగా చెప్పగలిగే రీతిని అలవరచుకోవాలి.
🌷ప్రతికూల పరిస్థితుల్లో భీతి, ఉద్వేగం, శత్రుత్వం లాంటివి మాటల్లో ప్రకటిస్తే అది ప్రమాదహేతువౌతుంది. మనం దుర్బలత్వాన్ని చూపిస్తే, అది ఎదుటివాడిలో తెగింపును పెంచుతుంది.
No comments:
Post a Comment