Wednesday, 20 December 2023




నమశ్శివాయ..6

శివా కళ్యాణమ్మే స్థిరము ఫలమౌ దివ్య పదమౌ 

భవా వైకుంఠమ్మే భరత గుణమౌ నిత్య జయమౌ 

నవాభ్యా భావమ్మే నరులు గొలిపే విశ్వ నయమౌ 

వివాహమ్మే సర్వా వినయ సుఖమౌ పార్వతి శివా  29


మంచి చెడుల గూర్చి నాల్గు మాటలే నమశ్శివాయ 

కంచి చేరు మాట లొద్దు కధలే నమశ్శివాయ

తుంచి వేరు చేయ బుద్ది తప్పులే నమశ్శివాయ

దంచి జాలి చూపు టేల నెప్పులే నమశ్శివాయ         30


మార గలర ధాత్రి జనులు మంచిగాన మశ్శివాయ

గార వించు స్త్రీలు కూడ ఘనతగా నమశ్శివాయ

భార మేదొ బెట్టి తుంచు బ్రహ్మగా నమశ్శివాయ

 చేర కోకిల్లమ్మ పాట విందుగా నమశ్శివాయ            31


మధుర మైన స్వరమ తోడ మొప్పగా నమశ్శివాయ

విధిగ సేవ చేయ నీడ విందుగా నమశ్శివాయ

మదిన ప్రియము మనకు గుర్చుముందుగా నమశ్శివాయ

బదుల దిశగ నడవ గలర చిందుగా నమశ్శివాయ     32


భయము వాపు దీవ నిచ్చు బంధమే నమశ్శివాయ

జయము నీకు కలుగు గాక జంత్రమే నమశ్శివాయ

నయమయినది మార్గ మందు వేగమే నమశ్శివాయ

బ్రియము మనకు గూర్చు గాత విశ్వమే నమశ్శివాయ  33


ఉ..భారము నెంచకాలమిది బాధ్యత నుంచని పోరు గొప్ప నా

హారము లేని పేదలకు హాయిని జూపక సర్వ శక్తి యో

దారము జూపకుండగను దారిని మార్చియు శబ్ద        యుక్తి మోం

కారము జూపు భక్తిగను కార్యము లన్నియు జేయు యీశ్వరా    34


కలలను తీర్చువేళయిది కాలము నందున సేవ చేసెదా

కలతల మాయతీయగల కమ్మని వాక్కుల భావసంపదా

కలమున జాలువారెగద కావ్యముగావిల సిల్లు వర్ణనా

కలుపుల మొక్కతీయువిధి కల్పనలన్నియు సిద్ధియీశ్వరా    35


మ.కనులున్నా నిను జూడలేము విధిగా కన్నీటిలో మున్గినన్

మనసారా నిను కొల్వలేము తిధిగా మాకష్టముల్ హెచ్చినన్

కనుమా కాలము కష్టనష్టమగు కామత్వమ్ము యే యీశ్వరీ 

పెనురోగమ్ములుబాధ పెంచె జనులన్ వీక్షింపవే యీశ్వరా.36

నేటి దృశ్య వాణి పద్య ప్రాంజలి ప్రభ 20/2

అంత్యానుప్రాస భావ కవిత్వము 


546.. వికసిత పద్మావళి.. న య య గ గ..9


జగతిన ధర్మమ్ముగ రాజ్యమ్మే లే

ప్రగతికి సత్యమ్ము గద్వీపమ్మే లే 

మగసిరి మేధస్సుగ మోక్షమ్మే లే

సొగసరి సౌఖ్యమ్మగు సొమ్మే దేవీ


547.. వికుంఠకంఠ:.. ర జ ర జ ర జ ర జ గ గ...9, 19

 తిప్పలన్ శమించు దారి తీ రమ్ముగానుచూపు వేళలే తీవ్రతా మనస్సు చిందే

ముప్పులన్ కుదించు నేర్పుమూ లమేను సహాయమ్ము గాను ముఖ్యమైన సేవ పొందే

అప్పులే గతిన్ సుఖాన యాశయే విధాన నిర్ణయమ్ము గానుపొందే 

గొప్పగా నినున్ నుతింతు కోర్కె లేకయే మనోమయమ్ము పోరుసాగుటేను దేవీ


548.. విగా హితా గేహం.. నన నయ మన జయ..13


 మెరిసెడు శుభములగుట తత్త్వమ్మే శోభల్ మనసున బ్రాంతి గానే

విరులతెరలు కలలను పొందే విద్యార్ధీ వయసుకు కాంతిగానే

మరులు గొలుపు తలపుకు నాందీ మంత్రమ్మే మనసుకు శాంతి గానే

సిరులు కలుగు విని మయ రీతిన్ గీతాభా వముగను క్రాంతి దేవీ


549.. విజయ పరిచయా.. న న త య..8


పలుకుల కళ శోభల్ ప్రభ లాయే

తలపుల కళ దాఁహాఁతప మాయే

పిలుపుల కళ మోహా క్రియ లాయే

వలపుల వల ప్రేమా వతి దేవీ


550.. వితాన.. జమ గగ యతి లేదు


జయమ్ము పొందేమార్గమ్మే

భయమ్ము తీరే మోహమ్మే

నయమ్ము యయ్యే రోగమ్మే

ప్రియమ్ము సంతృప్తే దేవీ

***

నాల్గవ అడుగు - సుఖవృద్ధికి

ఐదవ అడుగు - ప్రజాపాలనకి

ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి

ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.

💖 వివాహాన్ని సుఖమయం

 చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

💖 కలిమి లేములతో...

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేదిఅందులోఒకపేజీమాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

💖 మగవాడు గాలి పటం

(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)

ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకువెన్నంటిప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)

విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

💖 భర్తకి భార్య బలం కావాలి

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదుభార్యా భర్తల బంధం 

అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.

మనసులోనిప్రేమని,బాధనికళ్లలోచూసిచెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటేఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య

💐💐💐💐💐💐💐💐💐


శ్రీరామ చింతనామృతం

శ్రీరాముడు వనవాసానికి బయల్దేరినపుడు అయోధ్య వాసులందరూ వెంటపడ్డారు. మంత్రి సుమంతాదులు ఇంకా ముందుకు వెంట వచ్చారు. తర్వాత వాళ్ళని వెనక్కి మళ్ళించి సీతా లక్ష్మణ సమేతుడై ముందుకు సాగాడు శ్రీరాముడు. రామాయణంలో ఎవరెవరు రాముడ్ని ఎంత భక్తితో సేవించారనేది తలచుకోవడమే మధురమైన శ్రీరామ చింతనామృతం. 

#వెడలినాడు రాఘవుడు అడవి చేరగా

పడతి సీత సౌమిత్రి తోడునీడగా

గోడుగోడునా అయోధ్య గొల్లుమన్నది

వీడకుమా మనలేమని వేడుకొన్నది

అడుగుల బడి రాఘవా! ఆగమన్నది

ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది..

వనవాసం తొలి ఘట్టంలో గుహుడితో లక్ష్మణుడు అన్న మాటలు రామ మంత్రంలాంటివి.. నిషాదరాజు గుహుడు తన పరివారంతో ఎదురొచ్చి రాములవారిని స్వాగతించి సీతారాములను ఒకచోట విశ్రమింపజేసాడు. లక్ష్మణుడికి కూడా పత్రాలతో శయ్య ఏర్పాటు చేశాడు. "నేను కాపలా కాస్తాను. నువ్వు కూడా పడుకో లక్ష్మణస్వామీ!" అన్నాడు గుహుడు. "నిషాదరాజా! జగదేక వీరుడైన శ్రీరాముడు సీతాదేవితో నేలమీద పడుకుంటే నేను సుఖంగా ఎలా నిద్రపోగలను? నా జీవిత సుఖాలను నేను ఎలా స్వీకరించగలను?" అన్నాడు లక్ష్మణుడు.

#కథం దాశరథౌ భూమౌ 

శయానే సహ సీతయా

శక్యా నిద్రా మయా లబ్ధుం 

జీవితం వా సుఖాని వా!

(వాల్మీకి రామాయణం - 2-51-9)

తర్వాత రాముడు అన్నాడు: "లక్ష్మణా! నీవు అయోధ్యకు మరలిపోయి తల్లిదండ్రుల్ని సేవిస్తే మంచిది కదా!" అప్పుడు లక్ష్మణుడు విలవిలలాడుతూ ఇలా అన్నాడు: "రామరాఘవా! నీవులేక సీతమ్మ గానీ నేను గానీ నీటికి దూరమైన చేపల వలె క్షణమైనా ఉండలేము"!

#న చ సీతా త్వయా హీనా 

న చాహమపి రాఘవ!

ముహూర్తమపి జీవావో 

జలాన్మత్స్యా వివోద్ధృతౌ! 

(వాల్మీకి రామాయణం - 2-53-31)

ఓం శ్రీ సీతారామాభ్యాం నమః

****

అభ్యాసం 

ఆలోచనలు లేని స్థితి. అంటే మనసును ఖాళీగా ఉంచుకోవటం. ఆ స్థితి పొందడం ఎంతో ప్రావీణ్యం సంపాదించుకుంటే కానీ వీలుపడదు. ఆ స్థితి పొందడం వల్ల కలిగే జ్ఞానం ప్రత్యేకమైనది. నేర్చుకొని సంపాదించుకునే జ్ఞానం కన్నా, బుద్ధితో ఆలోచించగలిగే జ్ఞానం కంటే అది భిన్నమైనది, ప్రత్యేకమైనది. జీవితానికి ఉపయోగం లేని ఇతర జ్ఞాపకాలను ఆ జ్ఞానం తొలగించగలుగుతుంది. మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు తొలగిపోవడం కొంతవరకు అందరిలోనూ జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా తొలిసారి ధ్యానం చేసినపుడు ఇది జరుగుతుంది. ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా, అంతరంగం ఖాళీ అయినట్టు గమనిస్తాం. ధ్యానం కొనసాగుతున్న కొద్దీ ఆ స్థితి మరింతగా పెరుగుతుంది. పాత సంస్కారాలన్నీ పోయి, ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిగా మారుతూ ఉంటాం. ఇదే స్వచ్ఛమైన జ్ఞానమని నిపుణులైన సాధకులు చెప్తుంటారు.

ఒక గ్రామంలో ఓ చిరు వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకులు గ్రామానికి వచ్చిన ఓ సాధువు దగ్గర శిష్యులుగా చేరారు. వారు అతని బోధనల్లో మునిగిపోయి, అతను చెప్పిన పద్ధతులు ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు. తన కొడుకులు బాగా సంపాదించాలని వ్యాపారి కోరిక. వారిని ఎందుకూ పనికిరానివారిగా చేస్తున్నాడని వ్యాపారికి ఆ సాధువుపై కోపం పెరిగిపోయింది. ఓ రోజు కోపంతో ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. అతణ్ని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్లగానే కోపం మరింత పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పేడను తీసి అతని ముఖంపై విసిరాడు. సాధువు ముఖమంతా పేడతో నిండిపోయింది. శిష్యులకు కోపం వచ్చింది. సాధువు మాత్రం చిరునవ్వు నవ్వాడు. ఆ వ్యాపారి అక్కడ ఉండలేక గబగబా ఇంటికి వెళ్లిపోయాడు. అతని మనసు నిండా ఆలోచనలు. ముఖం మీద పేడ వేసినా చిరునవ్వుతో ఉన్న వ్యక్తిని జీవితంలో తను మొట్టమొదటిసారి చూశాడు. రాత్రంతా నిద్రపట్టలేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తప్పు చేశాననే భావన అతని మదిలో నిండిపోయింది.

మర్నాడు పొద్దున్నే వెళ్లి సాధువు పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు తాను క్షమించలేనని చెప్పాడు. అందరూ విస్తుపోయారు. ‘క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు’ అన్నాడు సాధువు. కానీ వ్యాపారి పశ్చాత్తాపంతో తాను నిన్న వచ్చి అతని ముఖంపై పేడ వేసిన విషయాన్ని గుర్తుచేశాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ‘నిన్న ఆ పని చేసిన వ్యక్తి ఈ రోజున లేడు. అంటే ఆ గుణం ఈ రోజున నీలో లేదు. ఈ రోజు నువ్వు ఏ అపకారమూ చేయలేదు. కాబట్టి నిన్ను క్షమించ వలసిన అవసరం లేదు’ అన్నాడు. అదీ క్షమాగుణం.

ఒక వ్యక్తిని మొదట తప్పు చేశావని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు. అది సరైన క్షమ. వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది. అదే అసలైన జ్ఞానం.

అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు. పై కథలో సాధువు అనుసరించిన విధానం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అంతటి సహనశీలత ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే! మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి.

***

"ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమీలేదు" అనుకుని ధైర్యం తెచ్చుకుని

 "ఇది తన ప్రాణానికి సంబంధించినది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి" అని నిశ్చయించుకొని వెంటనే భట్టిని పిలిచి రాజ్య భారం అప్పగించి చతురంగ బలాన్ని వెంటనిడుకొని ప్రతిస్టానపురానికి ప్రయాణం సాగించాడు.

ఇంతలో అతని సైన్యం వెళ్ళి ఆ బాలుని యుద్ధానికి ప్రేరేపించారు. ఇంతకీ ఆ బాలుని పేరు "శాలివాహనుడు". అతనికి నాగేంద్రుని మంత్ర శక్తి వలన నాగులు, గుర్రములు, రథములు, భటులు అందరు యుద్ధానికి తరలివచ్చారు.

ఆదిశేషుని ఆశీర్వచనము వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టు ముట్టి చంపసాగాయి. 

శాలివాహనునికీ విక్రమార్కునికీ ముఖా ముఖీని భయంకర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది. కానీ దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చెల్లాచెదరైపోయాయి.

 ఐనా సరే "ఆ సర్వేశ్వరుడే కాలఖర్మాన్ని తప్పించుకోలేనప్పుడు, మానవ మాత్రులం మనమనగా ఎంత?" అనే దృఢ నిశ్చయంతో ధైర్యాన్ని కూడగట్టుకుని మన విక్రమార్కుడు శాయశక్తులా ఫోరాడాడు. 

ఐనా చివరికి శాలివాహనుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురియై మరణించాడు.

[****)


No comments:

Post a Comment