** వేదాంత వాక్కు *
మత్త కోకిల.. మధురిమలు
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
నమ్మరాదుయు వమ్ముచేయకునిమ్నపల్కులు యెప్పుడూ
తప్పులెంచకు ఒప్పుమాటలుతన్మయమ్మున యెప్పుడూ
విశ్వభావము మందహాసము విందు చేష్టలు యెప్పుడూ
హాస్యమాలిక ఇప్పుడుంచు ముహావభావము యెప్పుడూ
తగ్గ కుండక మించకుండగ తప్పుచేయక యెప్పుడూ
తాత చెప్పిన మామ చెప్పినతేట పల్కులు యెప్పుడూ
ఆచరించియు ఆశలేకయు ఆదరించుము యెప్పుడూ
కాలమంతయు గాధలన్నియు కావ్య మల్లెను యెప్పుడూ
ఎక్కువెందుకు తక్కువెందుకు ఏక మవ్వుట యెప్పుడూ
ఏమి చెప్పిన ఆశచూపిన ఏమి పల్కకు యెప్పుడూ
ఎంతఅన్నను పట్టుపట్టిన ఏమి చెప్పకు యెప్పుడూ
ఎవ్వరెవ్వరి మాటలెందుకు ఏకమవ్వుము యెప్పుడూ
కాలమాయయు కానిదైనను కర్మ భాగము యెప్పుడూ
ఆలి మాటలు ఒప్పుకొనుట ఆత్మ తృప్తియు యెప్పుడూ
గాలి సవ్వడి దాహ తృప్తియు గమ్యమవ్వుట యెప్పుడూ
జాలి చూపులు నిత్య సత్యము జాతి కంతకు యెప్పుడూ
--(())--
ఓం నమః శివాయ.5.
దయా హద్యం మేలే తలపు పలుకే దివ్య మగుటే
క్రియా నేస్తమ్మే లే క్రియలు దుడుకే భవ్య మొకటే
ప్రియా భావమ్మే లే ప్రియము చిలికే సవ్య మొకటే
భయా దేహమ్మలే భజన పరమేశా సుఖము యే 24
సీస పద్యమాల.. శివతత్వం
ద్వేషమూ లేదులే తేజమూ కాదులే
అనురాగమూ లేదు ఆత్మ ఒకటి
లోభమూ లేదులే లోలత్వమేనులే
మోహమూ లేదులే మోక్ష మొకటి
మదముయూ లేదులే మాత్సర్య మూ లేదు
ధర్మమూ లేదులే దారి ఒకటి
అర్థమూ లేదులే కామమూ లేదులే
మోక్షమూ లేదులే మేను ఒకటి
పుణ్యమూ లేదులే పూజ్యమూ కాదులే
పాపమూ లేదులే పఠము ఒకటి
సుఖమూ లేదులే సుబ్రతా లేదులే
దుఃఖమూ లేదులే దునుయ మొకటి
మంత్రమూ లేదులే మాయనూ లేదులే
తీర్థమూ లేదులే తీట ఒకటి
వేదములూ లేవు వేకువయూ లేదు
యజ్ఞములూ లేవు యతులు ఒకటి
భోజనమే కాను బోధకునే కాను
తినతగినది కాను చిత్ర మొకటి
యేపదార్థము కాను యేదితినను నేను
మృత్యువునూకాను మునగ నొకటి
సందేహమూ కాను. సంసయమును కాను
జాతి భేదము లేదు జాగు ఒకటి
తండ్రియూ లేడులే .తల్లియూ లేదులే
జన్మయూ లేదులే జ్ఞాన మొకటి
బంధువూ లేడులే బాధ్యతా లేదులే
మిత్రుడూ లేడులే యింతి ఒకటి
గురువూ లేడులే గుర్తుయూ లేదులే
శిష్యుడూ లేడులే శిక్ష ఒకటి
నిర్వికల్పుడనులే నిర్వాహకముగనే
నిర్మాణ కారక నిజము ఒకటి
సర్వత్ర వ్యాపించ సంఘమ్ము నందునే
ఇంద్రియములతోను ఇచ్ఛ ఒకటి
సిరులుగా లేవులే స్థిరముయూ కాదులే
శిక్షణా లేదులే శీఘ్ర మొకటి
సంబంధముయులేదు సద్భావమ్ముయులేదు
బంధమూ లేదులే భక్తి యొకటి
తే. గీ.నిత్యమూ చిదానందపు శివుడు గాను
రూపుడైన గతియు కాను రూపిగాను
నిత్య నిర్వాణషట్కము నియమ మేను
లింగరూపమోక్షమునిచ్చు నిజము ఒకటి 25,26
* * *
విస్మయ భావమే గనుట,వీధి సహాయము వర్గమాయలే!
భస్మము చేయ బుద్ధిగను బాధ్యత చూపుట కొంత వింత మం
దస్మిత లక్ష్యమే యగుట, దాసులమేయన, రక్ష చేయుటే
రస్మయమైన ఆశలగు,రాజిలు గొప్పలుగాను యీశ్వరా .27
శైవగణాదిభక్తవర, శాంతిని గూర్చెడి పార్వతీపతీ
భావజ పూజ్యమే యగుట,బాంధవ బంధము సేయు భక్తిగా
తావకభాగ్యదర్శనసుధామధురమ్మగు ధర్మ చింతనే
పావన మార్గమే యగుట ప్రార్ధన నిత్యము విశ్వ నాదగన్.28
నేటి దృశ్య పఠన పద్య ప్రాంజలి ప్రభ.. 13/1
Ramakrishna Mallapragada
చిలిపి ప్రేమతో చిరుగాలి చంప నిమిరి
గుండె శబ్దము చెలికోరె గుర్తు గమన
నవ్వు పువ్వుల పిలుపుగా నరుని కలలు
రసమయం విశ్వ చరితమ్ము రవ్వ వెలుగు
ప్రేమలో ప్రేమతో ఘర్షనే, మదీయ
శాంతమే సౌఖ్యమే కోరు సమయ శక్తి
కోరికలసంద్రము తెలిసి పోరు జరుగు
జ్ఞానమే దారిగా గంగ పారు తీరు
కాంతి రావద్దనే రాత్రి స్పర్ధ వేద
రాత్రి రావద్దని కాంతి స్పర్ధ వేద
మంచి చెడ్డల స్వార్ధము మనసు వేద
లాభ నష్టాల స్వార్ధము లహరి వేద
రచన కుసుమాల తో నీడ రంగు తీరు
జ్ఞాన చక్షువులు కలసి జ్ఞాన వృద్ధి
జనుల మనసుబట్టి కలము జాగృతి గను
అక్షరాంజలి ప్రాంజలి ప్రభల వెలుగు
నరులు ఆశ్రమంలోబాల యవ్వనమ్ము
వృద్ధ సేవ తత్పర బోధ కృషియు సల్పు
వారి హృత్కమలము నీదు వ్యాధి భక్తి
మనసు నీయందు శంకరా మార్గ మదియె
మానవం, దేవతం, కొండ, మన్యమేను,
మృగము గాగాని,దోమగా,ముఖ్య మగుట
పశువుగా,అరణ్యము, పక్షి, ప్రాణ పలుకు
చరణ కమల ధ్యానము శివా చరిత మనసు
**--**
భాగవతము
ఓం శ్రీగురుభ్యోనమః
భగవంతుడే మనయందు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా దిగివచ్చి ఉన్నాడు. దానిని 'హంసధ్వని' అంటారు. అక్కడ 'సోహం' శబ్దము వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దము ఆధారంగా ఆ భావనలో లీనమై ఉంటే 'అతడే నేను' అను భావన స్థిరపడుతుంది.
అపుడు దైవమే మన యందు ఆవేశించి తనను తాను ప్రకటించుకుంటాడు. తానుగా అతడే ఉన్నాడని తెలుస్తుంది. ఎప్పుడూ స్పందనగా పనిచేస్తున్నటువంటి దైవముతో సూటిగా ముడిపడడము భాగవత మార్గము. హంస స్వరూపుడైన భగవంతునితో తాను యోగము చెంది, అతడే తానుగా నుండు స్థితి కలిగినటువంటి వానిద్వారా భాగవత కథలు రసవత్తరంగా బయటకు వస్తాయి.
విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు* 📍
శ్రీకృష్ణుడి అంత్యక్రియలు:
రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి.
కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా.
ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం.
అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి.
వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.
ఎక్కడో ద్వారక.
దానికి చాలా దూరంలో తపోవనం.
ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.
ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు.
మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు.
అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు.
అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి (ఇప్పటి కరోనాలాగనే అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది--అది వేరే కథ..ఆ కథంతా ఇక్కడ చెప్పట్లేదు).
ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.
అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.
అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక. 🙏
--(())--
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 5 🌻
తన ఆవశ్యకములకై ఇతరులపై ఎట్లును ఆధారపడక తప్పదు. అది తప్పనిసరిగా గాక, తోటి వారి యెడల తమ వృత్తికర్మను నిండయిన ప్రేమతో నిర్వర్తించినచో తన అవసరములవియే తీరుటయే గాక, అతిలోకమయిన ఆనందము నిలుచును.
ప్రేమ విస్తారమగు కొలది, ఆనందము అఖండమగును. ఆ రుచి యందు, దారాపుత్రాదుల యెడ ప్రత్యేక మమకారము తెలియకుండును.
తనను ఎంత ప్రేమగా తాను ఆదరించునో, అట్టి ప్రేమ ఒరుల యెడ చూపి వర్తించుటే ధర్మము. ధర్మాచరణలో నిలిచే ఆనందమే మోక్షము. అనుషంగికముగ లభించు నట్టివే అర్థకామములు.
మోక్షము ఎప్పుడో కలిగే స్థితి కాదు. లోకములోని జీవులతో తనకు తాదాత్మ్యము ఏర్పడి, తనను తాను మరచేంతగా ఎదలో ప్రేమ నిండుతుందో, ఆ క్షణమే పూర్వకర్మల అలవాటుల వలన ఏర్పడిన కామ క్రోధాదులు, సుఖదుఃఖాది బంధములు తొలగును.
తేలినదేమంటే ప్రేమయే మోక్షము. ఇట్టి అఖండమయిన పరమ ప్రేమ హృదయమంతా నిండాటలంటే, ఊరకే ప్రేమ మయములగు లోక క్షేమాన్ని గూర్చిన తలంపులు చాలవు. ఆచరణ కావాలి. మనస్సును ఆచరణలోకి దింపినపుడు ప్రేమ గాఢమగును.
కావున లోక హితానికై తన జీవ లక్షణానికి సరిపోవు కార్యక్రమాన్ని ఒక గంట అయినా రోజులో చేపట్టాలి. క్రమంగా దినచర్య అంతా అదే కావాలి.
మనసు అర్పించకుండా యాంత్రికంగా సేవలో పాల్గొన్నచో కూడా మంచిదే కాని తన ఉద్ధరణ ఆలస్యమగును. మనసా వాచా కర్మణ లోకహితాచరణకు జీవితాన్ని అర్పించుకొన్న కొలదీ పరమగురువులు తమ ప్రణాళికా నిర్వహణలోకి మనల్ని పరికరాలుగా ఉపయోగించుకుంటారు. అపుడు మనం చేసేవి అని ఉండదు. మన ద్వారా వాండ్లే చేస్తుంటారు.
చెమటలు పట్టే విగ్రహం ఎక్కడుందో తెలుసా...... ?
*************
శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు. 108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. ఆ వివరాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.
ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వేలుతూవుండగా స్వామివారు గరుడవాహనంమీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.స్వామి వారు ఈ సమయంలో ఒక చిక్కుపరిస్థితిలో పడతారు.
అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం.తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనంకన్నా ముందుకి వేళ్ళను.
తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది.అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.
అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది.
3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మాయాల్సుంటుంది.5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది.
ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందువేళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూవుంటుంది.ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతు ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.
గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువువుండి క్రమంగా పెంచుకుంటూ పోయే సరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.అన్నట్టు ఈ గరుత్మంతుని తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలో కాలగారుడన్ అని పిలుస్తారు.
ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది. మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.
ఆదిశేషుడు - తన కంకణంగా
కర్కోటకుడు - తాను ధరించే పూలదండగా
పద్మనాభుడు - తన కుడిచెవి ఆభరణంగా
మహా పద్ముడు - ఎడమచేతి ఆభరణంగా
శంఖపాలుడు - తన కిరీటం ఆభరణంగా
గుళికుడు - కుడి చేయి గాజులాగా
తక్షకుడు - వడ్డాణంగా
వాసుకి - జంధ్యంగా
ఇక 9వ సర్పం ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.
* ఎలా వెళ్ళాలి?
హైదరాబాద్ నుండి కావలి, నెల్లూరు, మహాబలిపురం, చెన్నై మీదుగా నాచ్చియార్ కోయిల్ చూడవచ్చును. మధ్యలో మహాబలిపురం కూడా దర్శించుకోవచ్చును. కారులో 15గంల టైం పడుతుంది.
హైదరాబాద్ నుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16గం ల సమయం పడుతుంది.
***
భగవంతుడు...
భగవంతుడు మనకు చేసిన అతి పెద్ద సహాయము, అతి పెద్ద వరము ఈ మానవ శరీరమును ఇవ్వటమే. ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో అత్యుత్తమ ఉపాధి ఈ మానవ ఉపాధి . నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు, ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి.
భగవంతుడు మనందరికి బుద్ధిని , విచారణ చేయగలిగే శక్తిని అనుగ్రహించారు. ఈ విచారణా శక్తిని చక్కగా వినియోగించుకొని ఆత్మ జ్ఞానమును పొందే అర్హత మానవ శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి ఉన్నది.
శాస్త్రము మనకు గురువు అంటే ఎవరు? గురువుకు ఉండవలసిన లక్షణములు ఏమిటి? గురువును ఆశ్రయించి దేనిని గురించి తెలిసికొనవలెను? గురువును దేనిని గురించి ప్రశ్నించ వలెను అను ప్రాధమిక విషయముల గురించిన అవగాహనను కలుగ చేస్తుంది.
శాస్త్రము మనకు సిద్ధాంతమును తెలియ చేస్తుంది. ఆ శాస్త్రములోని వాక్యములను అనుభవములోనికి తెచ్చుకోనవలెననిన ఆత్మజ్ఞానమును అనుసరించి జీవించి అనుభవమును పొందిన గురువు సహాయము తప్పనిసరి.
*గురువు నీకు చేసే సహాయము ఏమిటి?
నీకు నిన్ను నీవు చూసుకోవటము, సరిచేసుకోవటము చేతకాదు కనుక , నిన్ను నీవు పరిశీలించుకొనేటప్పుడు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తావు కనుక గురువును ఆశ్రయిస్తున్నాము.
గురువు నీలోని లోపములను చూపించి, నీ సంస్కార బలమును అనుసరించి ఏవిధమైన సాధన చేస్తే వాటిని అధిగమిస్తావో, ఆ విధానమును తెలియచేస్తారు. నీకు నీ లక్ష్యమును తెలియజేసి ఆ లక్ష్యము దిశగా ప్రయాణించుట ఎలాగో తెలియచేస్తారు.
మనము ఈ శరీరము ధరించడానికి కారణమైన బలీయమైన సంస్కారములు మూడో , నాలుగో ఉంటాయి. అవే నీ ప్రారబ్ధము.
మిగిలిన సంస్కారములను కేవలము విచారణచే అదిగమించవచ్చు. కాని జన్మకు కారణమైన సంస్కారములను మాత్రము కేవలము ఆత్మజ్ఞానము చేతనే అధిగమించుటకు వీలగుతుంది.
సంస్కారములు, వాసనలు ప్రాణ,మనో,బుద్ధులు అనే సుక్ష్మాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ శరీరము ప్రాణ,మనో,బుద్ధులను ఆశ్రయించే పనిచేస్తుంది. కనుక మనము సరిచేయవలసినది అంతరంగమును, సూక్ష్మమును.
అది కేవలము విచారణ ద్వారానే సాధ్యము. బుద్ధిని బుద్ధి చేతనే అధిగమించాలి. మన జీవన విధానము ఈ సంస్కార బలము మరింత బలపడే విధముగా ఉంటున్నది.
విచారణ ద్వారా ఏవిధమైన జీవితమును జీవించిన ఈ సంస్కార బలము నుండి బయట పడతామో ఆ విధమైన జీవన విధానమును ఆశ్రయించాలి.
ప్రా(ముందు) + ఆరబ్దము(వచ్చినది) - ప్రారబ్ధము అంటే పూర్వము నుండి వచ్చినది అని అర్ధము.
🌹 🌹 🌹
తులసి’ అన్న పదాన్ని మనం వివేచన చేస్తే ‘తులాంస్యతి తులసి’. ‘తుల’ అంటే ‘వెల కట్టడం’ అని అర్థం. వెల కట్టడానికి వీలు లేనిది తులసి. ‘తులస్యంమృత జన్మాసి’ అని కీర్తింపబడే తులసిని పరమపూజ్యమైందిగా భావిస్తాం. దీన్ని మహాలక్ష్మీ స్వరూపంగా ‘పద్మపురాణం’లో వ్యాసమహర్షి చెప్పాడు. ఇది విష్ణుకామిని. కృష్ణభూషణ రూప. విష్ణుపాద స్థల నివాసిని. తపఃస్సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి కలది. కలియుగంలో కాలుష్యాలను దహించే అగ్ని. దేవతల తృప్తి కోసం మహర్షులు తపస్సు చేసి ఈ వృక్షాన్ని పొందగలిగారు. అందుకే, ఇది కోరికలు తీర్చగలిగే మన పాలిటి కల్పవృక్షం. గంగ ఎంత పవిత్రమో తులసి కూడా అంతే పవిత్రమైంది. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అని వివిధ రకాలుగా పిలుస్తున్నా వాటి గొప్పతనం, పవిత్రత మాత్రం ఒక్కటే. ‘తులసి లేని ఇంట పితృకర్మ, దైవకర్మ లేవి చేసినా ఫలించవు’ అన్నది శాస్త్రం.
తులసి ఉన్నచోటికి దేవతలైనా, పితృదేవతలైనా ఆనందంగా వస్తారట. అంతేకాక, ఇది ఉన్నచోటకు దుష్టశక్తులు రావు. ఎందుకంటే, ఇది సాక్షాత్తూ ‘అమ్మవారి ప్రధానాంశ’ అని ‘దేవీ భాగవతం’ చెప్తున్నది. పువ్వులన్నిటి సారం తులసి. భూమ్మీద దొరికే పుష్పాలన్నిటి సారమంత విశేషమైన, పవిత్రమైంది ఇది. అంతటి పుణ్యదాయిని కూడా. దీన్ని దర్శించినా, స్పర్శించినా ముక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని అనుసరించి తులసి మొక్క లేని గృహం ఉండదు. మనం ప్రకృతిని దైవంగా భావించి వృక్షాలన్నిటినీ దైవాలుగానే భావించినా ప్రత్యేకించి తులసి మొక్కను ఇంటి వద్ద తులసికోటలో పెంచి ధూపదీప నైవేద్యాలతో పూజించటం ఒక ప్రత్యేకత. దీనిని ‘కోట’గా ఎందుకంటామంటే, కోట ఎలాగైతే రక్షణనిస్తుందో ఇదీ అలాంటిదని నమ్మకం. ఇంటి గుమ్మం ముందు నుంచి చూస్తే పెరట్లో పెట్టిన తులసికోట కనపడాలని, ఉదయం నిద్ర లేవగానే తులసిని చూడాలన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఆధునిక ఇండ్ల నిర్మాణంలో అది సాధ్యం కాకపోయినా చిన్న కుండీలలోనైనా తులసి చెట్టు ఉండటం మాత్రం ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ తులసి మొక్కలు కనపడుతున్నాయంటే అది మన ప్రాచీన ఋషుల తపఃఫలమే.
తులసి మూలంలోని మట్టికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. తులసీ మృత్తిక (మట్టి)కు ‘గోపీ చందనమని’ వ్యవహారం. దీన్ని బొట్టుగా పెట్టుకుంటే పవిత్రమని, దివ్యత్వమని అంటారు. తులసి మూలంలో సర్వతీర్థాలున్నాయని, మూలంలో నీళ్లు పోసి తలపై చల్లుకుంటే తీర్థస్నాన ఫలితం కలుగుతుందని ‘విష్ణు పురాణం’ చెబుతున్నది. మన దేశంలోని తులసి, మారేడు వంటి వృక్షజాతి, గోజాతి సామాన్యమైనవి కావు. మనిషి తుదిఘడియలో ‘తులసీ తీర్థం నోట్లో పోయడం’ అంటే తిరిగి ప్రాణాన్ని పుంజుకుంటాడేమోనని ఆశ. అంత ఔషధీయుతమైన తులసి చెట్టు అత్యధిక ప్రాణవాయువును ప్రసరింపజేస్తూ ఆ గాలి పీల్చిన వారికి దీర్ఘాయుర్దాయాన్ని కలిగిస్తుంది. తులసి చెట్టు వద్ద సంధ్యావేళ దీపం పెట్టడం మోక్షదాయకం. అటువంటి ఇంటికి ఐష్టెశ్వర్యాలు లభిస్తాయి. వేదవాక్యంలోని అంతరార్థం తెలిపే తులసిని పెంచి పూజించడం నిజమైన భారతీయాత్మకు ప్రతీక. మన సంస్కృతీ సంరక్షణలో భాగంగా, ఆచారాలు అనుసరించడంలో అంతర్భాగంగా తులసీ మాతను భక్తితో అర్చిద్దాం.
[
No comments:
Post a Comment