Sunday, 24 December 2023



నమః శివాయ.. 8.. మత్తకోకిల


దురాశా వెంటాడే మునిగిన సహాయమ్ము ఘటనే

నిరాశా నిత్యమ్మే నియమమగు దేహమ్ము భజనే

చరాశా వైనమ్మే చరితమగు దాహమ్ము నటనే

స్వరాజ్యమ్మే స్వేచ్చా సమయమగు గౌరీ పతి శివా      42


మ. కష్ట జీవికి పాడి పంటకు కామ్య మేదియు  యేలనో 

ఇష్ట జీవికి ఎండ మావులు ఈశ్వరేచ్ఛయు  యేలనో 

ఘోష్టి జర్పిన వర్త మానము హోరమవ్వట యేలనో 

రైతురాజుగ బత్కెరోజులు రాజ్యమేలును  యీశ్వరా   43


మ. క్రౌంచ పక్షులు చెట్టు కొమ్మన కామ్య మాటలు పల్కగా 

పంచ రంగుల బాల భవ్యుడు  పక్షి చూపులు చూడగా 

మచ్చి  కైనవి బోసి నవ్వుల మార్గమవ్వును  హాయిగా 

మంచిమాయయు నవ్వుఅందపు మందబుద్దియు యీశ్వరా  44


అన్నదమ్ముల ఒక్క మాదిరి ఆత్మ తత్వము  ఉండుటే

కన్న ప్రేమయు భార్య మాటను కామ్య మవ్వుట  మన్ననే

ఉన్న దన్నది కల్సి ఉండెటి ఉత్తమోత్తమ కోరికే

చిన్న పెద్దలు తల్లితండ్రుల చేష్ట చూపులు యీశ్వరా   45


అందుకో రమ వల్లభా కర ముల్తొ శోభను చేసుకో

కంది పోయిన లేత వయ్యసు పొందు చేసుకొ ధర్మమై 

అందమంతయు జుర్రుకో మది వల్లభా చిరు నాయకా

చందనం సుమ ఘంధమై తరుణం ఇదే పతి యీశ్వరా  46


ఆంధ్ర రాజ్యపు దైవమా అమరావతీ మది సిల్పమా

చంద్రుడాకశ మే మనో భవ జాతి పుర్షుని ప్రేమయే

బుధ్ధి మంతుని ఆశ దీపము భూమి వెల్గుల చిహ్నమే

బుధ్ధభానుని సద్గుణాలను భూరి నేస్తము యీశ్వరా.47


ఇంద్రి యాలను దోష పూరిత యిచ్ఛ ధర్మము  వ్రాసెనే

బేధ భావము లోన దేశము బంధ మౌనును వ్రాసెనే


చెవి యొక్క ఆత్మ కథ👂

  నేను చెవిని. ....
  హేయ్ మేము  ఇద్దరము.  ఇద్దరమూ కవలలము 👂👂
  కానీ  మా దురదృష్టమేమిటంటే,  
  ఇప్పటి వరకు మేము - ఒకరినొకరు చూసుకోలేదు .
 
ఏ శాపమో ఏమో తెలియదు.  
మేము వ్యతిరేక దిశలో అంటుకుని పంపించబడ్డాము.
   మా బాధ ఇంత మాత్రమే  ,
   మా బాధ్యత కేవలము వినడము మాత్రమే.
   తిట్లు గానీ లేదా చప్పట్లు, మంచి లేదా చెడు.
   అన్నీ - మేము వినాలి ఏంచేస్తాం.
   
క్రమ క్రమంగా మమ్మల్ని ఒక ఆధారం(మేకు)గా భావించారు.
   కళ్ళ జోడు బరువు ను మాపై  పెడుతున్నారు.
   ఫ్రేమ్ యొక్క కాడలను మా పై మోపుతారు.
   ఈ నొప్పిని మేము భరించాలా?  
   ఎందుకు భరించాలి?
   కళ్ళ జోడు సంబంధము నేత్రాలకు చెందినది.
   మరి మమ్మల్ని మధ్యలోకి లాగడంలో - సంగతేమిటి?
   
   మేము మాట్లాడము, అయితే ఏమైంది, వినగలము కదా!
   ప్రతిచోట మాట్లాడే నోరే ఎందుకు ముందుంటుంది ?
 
   బాల్యంలో చదువుకునేటప్పుడు
   ఎవరికైనా మెదడు పని చేయకపోతే
   మాస్టరు గారు మమ్మల్నే మెలేస్తారు.
 
  యవనంలో పురుషులు, మహిళలు - అందరూ
  అందమైన జూకాలు, కమ్మలు, లోలకులు మొదలైనవి చేయించుకొని  
   మాపైననే వేలాడదీస్తారు.
   రంద్రాలు చేయడం మాకైతే, పొగడ్తలు మాత్రము - ముఖానికి.

   ఇంకా అలంకరణ చూడండి. !
   కండ్లకు కాటుక, ముఖానికి క్రీములు, పెదవులకు లిపిస్టిక్, మరి, ఇప్పటి వరకు మేము ఏమైనా అడిగామా చెప్పండి?

  ఎప్పుడైనా ఏ కవి అయినా కూడా ఏ సారైనా అయినా  చెవుల గురించి - ప్రశంసిస్తే ...  పొగిడితే ...  చెప్పండి.
వారి దృష్టిలో కళ్ళు, పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము.

 మేము, నలిగిపోయిన రెండు పూరీల మాదిరిగా లేపి ముఖానికి - ప్రక్కల అతికించబడినాము. ఏదో మృత్యుభారము లాగా
కొన్ని సార్లు వెంట్రుకలు కత్తిరింపులో మాపై కూడా గాట్లు పడతాయి.  
డెటాల్ పూసి మంట పుట్టిస్తారు.
 
  విషయాలు చాలా ఉన్నాయి.
  ఎవరితో చెప్పుకోవాలి ???
  బాధలు పంచుకుంటే మనసు తేలిక అవుతుందని అంటారు.
   కళ్ళతో చెప్పుకుంటే అవి కన్నీరు కారుస్తాయి,
   ముక్కుతో చెప్పుకుంటే అది చీదరిస్తుంది.  
   నోటితో చెప్పుకుంటే మమ్మల్నే తిడుతుంది.
మేము, కుయ్యో మొర్రో అంటే, అయ్యో పాపం అంటూ జాలి పడుతుంది.  

ఇంకా చెప్పాలంటే
  పండితుల వారి జంధ్యము,
  టేలర్ మాస్టర్ యొక్క పెన్సిల్,
  మేస్త్రీ యొక్క మిగిలిపోయిన గుట్కా పొట్లము,
  మొబైల్ ఫోన్, దాని ఇయర్ ఫోన్స్, వీటన్నింటిని మేమే భరించాలి.
   
  ఇంకా
  ప్రస్తుత పరిస్థితి లో ఈ క్రొత్త క్రొత్త మాస్కుల జంజాటము కూడా
  మేమే భరించవలసి వస్తుంది.
  చెవులు కాదు. మేము - పక్కా మేకులు లాగా ఉన్నాము. ఇంకా
  ఏమైనా తగిలించాల్నా,....వ్రేలాడదీయాల్నా.... అనుకుంటే తీసుక రండి.  
  మేము కవల సోదరుల లాగా సిద్ధంగా ఉన్నాము.

  😃😃😃😃😃

   హరిఓమ్, జై శ్రీరామ్ అంబజ్ఞ నాథ సంవిధ్.
.

ఉన్నచోట  లక్ష్మీ దేవి ఉన్నట్లుగా ముసలి వయసులో కూడా అనుభవాలను కధలు వ్రాస్తూ దానధర్మాలు చేస్తూ  గ్రామదేవతగా మారింది.      
          .
     --(())--

రైతుకు ఋణ మాఫీ---


మన రాష్ట్రములో ప్రతి యేటా రైతులకు ఋణ మాఫీ చేయడము పరిపాటి అయినది.


రైతులు పొందే లాభాలు.

1.రైతు బంధు

2.ఉచిత విద్యుత్తు

3.పంటకు మద్దతు ధర

4.పంట నష్ట పరిహారము

5.సబ్సీడీ విత్తనాలు

6.సబ్సీడీ ఎరువులు

7.ఉచిత నీటి సరఫరా

8.రైతు బీమా

మున్నగు వసతులు కల్పించినా ఇంకా యేటా లక్షా రెండు లక్షల ఋణమాఫీ-

రైతులు అందరు బీదవారుకారు-హైదరాబాదు,రంగారెడ్డి జిల్లాల లాంటి అభువృద్ధి జెందిన చోట్లలో భూముల విలువలు కోట్ల రూపాయలు పలుకుతున్న ఈ కాలములో {మారు మూల పల్లెలలో కూడా భూముల ధరలు ఎకరాకు 30 లక్షలకు తక్కువ లేవు} 

కొంత మంది భూములలో వ్యవసాయము చేయక పడావ పెట్టడము,కోళ్ళ ఫారాలు పెట్టడము,పాడి పరిశ్రమ,తోటలు,చేపల పెంపకము మున్నగు లాభదాయక పరిశ్రమలతో అధిక లాభము పొందుచు గూడ  పై రాయితీలు పొందుచున్నారు-ప్రభుత్వము ఇవన్ని పరిశీలించి నిజమైన అర్హులకు సరియగు సదుపాయాలు కల్పించాలి=అప్పుడు ప్రభుత్వ ఖజానా పై ఇంత భారము పడక సొమ్ము వేరే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చును.

*****

శంఖ - లిఖితులు

పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేదవేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.
 

తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.
 

చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.
 

మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడవైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటానే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.
 

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

ఈ శంఖ లిఖితులు - ద్వాపర యుగం లో
" ధర్మశాస్త్రం " రచించారు .
 ఆయనకి చేతులు ( బాహువులు) మళ్ళీ వచ్చాయి కాబట్టి , దీనికి " బాహుదా " నది అన్న పేరు వచ్చింది .
స్థానికులు అయిన గ్రామీణులు " చేతులు ఇచ్చిన యేరు  కాబట్టి, ఈ పవిత్ర నదిని " చెయ్యి + యేరు = చెయ్యేరు ) అని పిలుస్తున్నారు .]

****

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

ఈ శంఖ లిఖితులు - ద్వాపర యుగం లో
" ధర్మశాస్త్రం " రచించారు .
 ఆయనకి చేతులు ( బాహువులు) మళ్ళీ వచ్చాయి కాబట్టి , దీనికి " బాహుదా " నది అన్న పేరు వచ్చింది .
స్థానికులు అయిన గ్రామీణులు " చేతులు ఇచ్చిన యేరు  కాబట్టి, ఈ పవిత్ర నదిని " చెయ్యి + యేరు = చెయ్యేరు ) అని పిలుస్తున్నారు .]

****
ప్రస్తుతం ఈ అంశం ప్రతి ఒక్కరికీ అవసరమైనదిగా నేను భావిస్తూ గ్రూపులో పోస్టు చేస్తున్నాను..

దయచేసి చదవండి..

ఒక తొండ పాముతో  "నువ్వు కాటేసినా మనిషి చావడు, కానీ నేను కరిస్తే మాత్రం మనిషి చస్తాడు.." అంది..

అదెలా..?? అనడిగింది పాము.

"నేను చెప్పినట్టు చెయ్యి" అని చెప్పిన తొండ
ఒక పొలంలో పని చేస్తున్న రైతుని "వెనుక నుండి కాటెయ్యి" అన్నది..

*పాము అలానే వెనక నుండి కాటేసింది*.

వెంటనే రైతు  రెండు కాళ్ల మద్య నుంచి తొండ పరిగెత్తి పారిపోయింది..

అప్పుడు రైతు అనుకున్నాడు..
నన్ను కరిచింది తొండే కదా అనే ధైర్యంతో గాయానికి ఆకు పసరేదో పూసుకొని తిరిగి పని చేయడం ప్రారంభించాడు..

ఇప్పుడు తొండ  "రైతుని నేను కరుస్తాను,
నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి వెళ్ళు.." అని తొండ పాముతో చెప్పింది.

పాము అదేవిధంగా వేరొక పొలంలో పని చేస్తున్న  రైతు కాళ్ల మధ్య నుంచి సర్రున పాకి పోయింది. పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు భయంతో..

*భయం*  ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది..

కాబట్టి
కరోన విషయంలో పేపర్లు, టీవీలు, వాట్సాప్‌లు, ఫేసుబుక్కులు మిగతా సామాజిక మాధ్యమాల్లో వాటిలో వచ్చేవి, రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది..

*ధైర్యంగా ఉండండి*

*కానీ జాగ్రత్తతో మసలుకోండి*.
*మీ ధైర్యమే మీకు  కొండంత బలం..*

మాస్కు ధరించండి..
సామాజిక దూరం పాటించండి..
తరచుగా చేతులు శుభ్రపరుచుకోండి..

ధన్యవాదాలు
*---**
..నేటి చిట్టికథ*

*గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!*

*వెంటనే గంగానదినే అడిగాడట!*

*అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.*

*అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.*

*అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!*

*సముద్రాన్నే అడిగాడు!*

*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!*

*దానికా సముద్రుడు!*

*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.*

*అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!*

*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!*

*అవి పకపకా నవ్వి!  మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...*

*ఓహో!!!*
*ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*

*అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!*
                
*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.*

*పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.*

*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!*
*అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*

*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.*

*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*

*అంటే ..*
*కర్మ అనేది కర్మతోనే* *నశిస్తుంది.*

****

గంటల తరబడి క్యూలో నిలుచొని ఉన్నప్పటికీ ఆ దేవుడిని దర్శించుకోలేక  ఓ భక్తుడు దేవుడిని ఒక ప్రశ్న వేసాడు.


🦜డబ్బులేని భక్తులకు దూరం నుండి ..డబ్బులున్న  భక్తుడికేమో  దగ్గరి నుండి దర్శనం...  ఎందుకయ్యా ఈ అన్యాయం ? ఇది ఏమైనా భావ్యంగా ఉందా??....🤔🤔


🦜గట్టిగ నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

🦜తల్లికి మించిన  దైవం లేదు అన్నాను...మీరు ఆవిడను పూజిస్తున్నారా?

🦜తండ్రి మాటకు  మించిన వేదం లేదు అన్నాను...పాటిస్తున్నారా ??

గురువును  మరొక  దైవం అన్నాను...వినిపించు కున్నారా???

🦜ఇందులో ఉన్నా, అందులో ఉన్నా అని కాదు నువ్వెక్కడ  వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను...మీరు నమ్మారా????

🦜కష్టాల్లో ఉన్నవారికి  సహాయం  చేయండి  నాకు చేసినట్టే  అన్నాను మరి చేస్తున్నారా?????

🦜నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు  ఎలా చెల్లించాలో  అన్ని మీరే  నిర్ణయించారు.  

🦜ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే  వస్తువులా నిలబెట్టారు.


🦜అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశాను అని నిందించడం న్యాయమా?????? అని.

ఇప్పుడు ఆలోచించడం  అందరి వంతు అయ్యింది🤔



📣📣📣📣📣📣📣

విద్యుత్ బోర్డు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం.
#AC_యొక్కసరైనఉపయోగం:
వేడి వేసవి ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరిద్దాం.
చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పట్లతో కప్పుతారు. ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది.
ఎలా ???
మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా?
శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు. దీనిని మానవ శరీర ఉష్ణోగ్రత సహనం అంటారు.
గది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు, తుమ్ము, వణుకు మొదలైన వాటి ద్వారా శరీరం స్పందిస్తుంది.
మీరు ఎసిని 19-20-21 డిగ్రీల వద్ద నడుపుతున్నప్పుడు, గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది శరీరంలో అల్పోష్ణస్థితి అని పిలువబడే ప్రక్రియను ప్రారంభిస్తుంది, ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది, తద్వారా శరీరంలోని కొన్ని భాగాలలో రక్త సరఫరా ఉండదు తగినంత. ఆర్థరైటిస్ మొదలైన వాటిలో దీర్ఘకాలిక ప్రతికూలతలు చాలా ఉన్నాయి,
ఎసి ఆన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం చెమట ఉండదు, కాబట్టి శరీరంలోని టాక్సిన్స్ బయటకు రావు మరియు దీర్ఘకాలికంగా చర్మ అలెర్జీ లేదా దురద, అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదం ఏర్పడుతుంది.
మీరు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎసిని నడుపుతున్నప్పుడు, ఇది కంప్రెసర్ నిరంతరం పూర్తి శక్తితో పనిచేస్తుంది, అది * ఫైవ్ స్టార్స్ * అయినా, అధిక శక్తిని వినియోగిస్తుంది మరియు ఇది మీ జేబు నుండి డబ్బును వీస్తుంది.
ఎసిని నడపడానికి ఉత్తమ మార్గం ఏమిటి ??
26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను ఏర్పాటు చేయండి.
మొదట ఎసి యొక్క ఉష్ణోగ్రతను 20-21కి సెట్ చేసి, ఆపై మీ చుట్టూ షీట్ / సన్నని మెత్తని బొంతను చుట్టడం ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు.
26+ డిగ్రీల వద్ద ఎసిని నడపడం మరియు అభిమానిని నెమ్మదిగా వేగంతో ఉంచడం ఎల్లప్పుడూ మంచిది. 28+ డిగ్రీలు ఉత్తమం.
దీనికి తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా పరిధిలో ఉంటుంది మరియు మీ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.
దీని యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఎసి తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, మెదడుపై రక్తపోటు కూడా తగ్గుతుంది మరియు పొదుపు చివరికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించటానికి సహాయపడుతుంది.
ఎలా ??
26+ డిగ్రీ మరియు ఇతర 10 లక్షల ఇళ్ళలో ఎసిని నడపడం ద్వారా మీరు రాత్రికి 5 యూనిట్లు ఆదా చేస్తారని అనుకుందాం, అప్పుడు మేము రోజుకు 5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తాము.
ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లు.
దయచేసి పైన పేర్కొన్న వాటిని పరిశీలించండి మరియు మీ డిగ్రీని 26 డిగ్రీల క్రింద అమలు చేయవద్దు. మీ శరీరం మరియు పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచండి.

ప్రజా ప్రయోజనం
విద్యుత్ మంత్రిత్వ శాఖ
మరియు శక్తి, భారత ప్రభుత్వం
* ఫార్వార్డ్ చేయవచ్చు మరియు పంచుకోవచ్చు. *

No comments:

Post a Comment