ఓం నమః శివాయ..4
యతి..7
ఇ పుణ్యా దేహమ్మే యిణకుల పరా సేవల శివా
ప్ర పూజ్యా స్నేహమ్మే ప్రమధ గణమై ప్రేమగ హరా
ఉ పాయా పాశ మ్మై పుడమి చరణాలే గతి విభో
స పూజ్యా సౌందర్యో సుగుణ గిరిజా శంకర భవా 17
తే. గీ.సురవర కరి చర్మాంబర పురధర హర
సిరి వరాధి పతి గిరిజా వినయ ధీర
మొరలను వినుమా కేదార మోహన పర
మురిపము నినుగొలుతు శివా ముందరగను 18
శా..అన్నప్రాశగణాధివిఘ్న పతిగా యానంద భాగ్యమ్ముగన్
కన్నా పాశముగా మనస్సు కలిపే యాయన్న పూర్ణమ్ముగన్
మూన్నాళ్ళా సహనమ్ముగాను తెలిపే ముక్కోటి వేదమ్ముగన్
అన్నాయీశ్వర లీల మేను వెలుగై యైశ్వర్య సంతృప్తిగా 19
ఉ.మౌనపు ముంగురుల్ చెదరి మాదిరి ఎఱ్ఱన కళ్ళు భీతిగన్
ధ్యానము నందు కుంకుమలు దారిగ జారగ తీక్షనమ్ముగన్
మానస చూపులే శివుడు మంగళ పార్వతి దివ్య రూపమున్
ప్రాణమదీయ భావమగు పార్వతి శంకర దివ్య నాట్యమున్...20
ఉ.ఏమని చెప్పెదా మనసు యెంతయు హాయిగ తూలిపోవగన్
ఆమని పిల్పులే జయముగా మది తీరును సాగి పోవగన్
కాముని నీడలో బతుకు గా కదిలేను లె సంతసమ్ముగన్
ప్రేమమనస్సుతో కలసి ప్రీతిగ పార్వతి విశ్వ నాదగన్.21
శ్రీ శివ సంస్తుతి
మనోజ్ఞ
మనసు సహాయము సర్వ మంత్రపు విద్య సదాశివా
మనువుల లక్ష్యము విశ్వమేయగు సురార్చితా
తనువుల తత్త్వము సామ దానము భవ్య శివా
చినుకుల వర్షము మాయ చిత్తముగా శివా 22
(నజజభర యతి..1౦)
మకుట మహిమ విద్యామాత్ర శంభో జయమ్మున్
పక పక పక సాధ్యా ప్రతి యీశ్వర్ సుఖమ్మున్
చెక చెక చెక సాగే చిరు హాసన్ సమమ్మున్
సకల హృదయ విశ్వాసమ్మహేశున్ గిరీశున్ 23
(ననమయయ..యతి..9)
****
దేవీ... శ్రీదేవీ అత్యాను ప్రాస భావ కవిత్వం
536.. వామ.. జజ జజ జజ జయ.. 13
చలించ మనస్సు వినమ్ర విధాన జపంమ్ము శుభమ్ము మహాత్మగ శక్తీ
జ్వలింప భరింప మదీయ భవమ్ము జనాహృదయమ్ము జగమ్మున యీశ్వర్
ఫలించును ధర్మము సత్యము నిత్య తపస్సు ప్రభావ జయమ్ము యీగౌ
గిలించు సహాయ సమర్ధత గాను నిదాన పరమ్ము సుఖంమగు దేవీ
537..సవ్వాలీ.. మ మ మ మ గ..9
భోగమ్ము ల్వాసమ్మే సౌమ్యా బోధత్వమ్మున్ గా
రోగమ్ముల్ బందించున్ తగ్గున్ రోదత్వమ్మున్ గా
యోగమ్ముల్ గల్గంగా సద్విద్యోగమ్ముల్ ధారీ
రాగమ్మై ప్రేమమ్మై శాంతా మోక్షమ్మే దేవీ
538.. వారిశాలా.. జ త గ గ.. యతి లేదు
కరాళ దుర్గమ్మె క్రోధో
పరాంగ నాట్యమ్మె శాంతా
తరాల భావమ్మె భూమిన్
వరాల విశ్వమ్ము దేవీ
వార్తా హారీ.. న జ య గ గ....8
పలుకుల మాయయు పాఠమ్మేలే
అలకల తీరుయు యానందం లే
పిలుపులు మారును ప్రేమమ్మేలే
తలపులు నిత్యము దానం దేవీ
540.. వాసంతీ.. మ త న మ గ గ...7
గుత్తమ్మౌ జీవాత్మ కొలువు సంభావ్యమ్మేలే
చిత్తమ్మున్ పొంగారు చిగురు సద్భావమ్మేలే
విత్తమ్మౌ నీభక్తి నియమ సందర్భమ్ మేలే
సొత్తై సామ్రాజ్యమ్ము సొగసు రాణీ శ్రీదేవీ
ఘనంగా విందు
అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు.స్నేహితులంతా ఏమిటి వనమయ్యా నీవేమీ మాట్లాడడం లేదు.నీవేమీ ఘనకార్యం చెయ్యలేవా?అని ఎగతాళిగా అడిగారు. అప్పుడు వనమయ్య నేనేదయినా చేయగలను.ఏమి చేయ్యమంటారో చెప్పండి చేసి చూపిస్తాను. అన్నాడు.
అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి వుండాలి.ఏ విధంగానూ వేడి తగలరాదు.పొద్దు పొడిచేవరకూ అలాగే నిలబడి వుండాలి.అని హెచ్చరించారు. సరే అలాగే నిలబడతాను.నేను ఓడిపోతే మీ కందరికీ విందు భోజనం పెట్టిస్తాను.అదీ పందెం.అన్నాడు వనమయ్య.
ఇంట్లో కుంపటి,దీపం ఆర్పేసి బయటకు వెళ్లి నిలుచున్నాడు.అర్ధరాత్రి అయ్యే సరికి చలి బాగా ఎక్కువైంది మంచు కురవడం ప్రారంభ మైంది.పళ్ళు గిత్త కరుచుకుని పోయాయి. అటూ యిటూ పచారు చేయటం మొదులు పెట్టాడు..యింతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ వుంటే కొంచెం చలి తగ్గినట్లని పించింది.ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది. స్నేహితులు వచ్చి మొత్తానికి గెలిచావయ్యా అని అభినందించారు.నీ కడుపు బంగారం గానూ!ఎలా ఓర్చుకున్నావయ్యా? అని అడిగారు.అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది. దాని వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను.అన్నాడు వనమయ్య.
ఏ విధమైన వేడీ వుండకూడదు అని చెప్పాము కదా! నీవు ఆ వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు వోడిపోయినట్టే.నీవు విందు ఇవ్వాల్సిందే అని అందరూ పట్టు బట్టారు.
ఎక్కడో దూరంగా వుండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది?యిది అన్యాయం అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు.విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టు బట్టారు.వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమి చెయ్యాలో దిక్కుతోచక న్యాయాధికారి దగ్గరికి వెళ్లి కథంతా చెప్పి నన్నేలాగైనా కాపాడండి అని వేడుకున్నాడు.ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చెయ్యమని చెప్పి పంపించాడు.
సరే నని యింటికి వెళ్లి మరుదినం ఒక కుండ లో బియ్యము నీళ్ళు పోసి చూరుకు వ్రేలాడ దీసి కింద చిన్నదీపం వెలిగించి పెట్టాడు.మధ్య మధ్యలో ఒక చిన్నబల్ల మీద ఎక్కి వుడి కిందా లేదా అని చూస్తున్నాడు.మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు వంట అయిందా వనమయ్యా?అని అడిగారు.యిదిగో యింకా ఉడుకు పట్టలేదు. పొద్దుననగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలి వచ్చి చూసి యిలా పెడితే ఎలావుడుకుతుంది? నీకేమైనా పిచ్చా? అన్నారు.స్నేహితులు.దీపం చిన్నదైనా,ఎంతదూరంగా వున్నా వేడి తగులుతుందని అన్నారు గదా మీరంతా మరి యిదీ అంతే.అన్నాడు వనమయ్య.వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ యింటి కి వెళ్లి వనమయ్యకు ఘనంగా విందు యిప్పించారు..
*******
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది*.
కృష్ణుడు పాండవులను తీసుకుని #హస్తినాపురానికి వస్తాడు.
తన #వందమంది_పుత్రులను_పోగొట్టుకున్న_ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.
#కృష్ణుడి_రాకను_గమనించిన_ధృతరాష్ట్రుడు_ఎదురువెళ్ళి_బోరున_విలపిస్తాడు.
చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.
ధృతరాష్ట్రుడి_దుహ్ఖం_కోపంగా_మారి_కృష్ణుడిని_నిలదీస్తాడు.
అన్నీ_తెలిసి_కూడా,
మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు?
ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు?
కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు?
ఈరోజు_తనకి_వందమంది_పుత్రులని_పోగొట్టుకునే_స్థితిని_ఎందుకు_కలగజేశావు_అని_నిలదీస్తాడు
అందుకు అన్నీ తెలిసిన #శ్రీ_కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.
ఓ_రాజా ఇ దంతా నేను చేసిందీ కాదూ,
నేను జరగనిచ్చిందీ కాదు.
ఇది ఇలా జరగటానికి,
నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం_నువ్వూ_నీ_కర్మ.
50 #జన్మల_క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక #అశోక_వృక్షం మీద రెండు #గువ్వల_జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి.
వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ #నీ_బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ #గూట్లో_ఉన్న_వంద_గుడ్లను_ఆ_రెండు_పక్షులు_చూస్తుండగా_విచ్చిన్నం_చేశావు.
తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి.
ఆ #పక్షుల_గర్భశోకం_దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది.
నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా,
ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ_కర్మ_నిన్ను_తప్పక_వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది.
కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు.
కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై_జన్మలు_ఎందుకు_వేచి_ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు.
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి
ఓ రాజా
వందమంది_పుత్రులను_ఒకే_జన్మలో_పొందాలంటే_ఎంతో_పుణ్యం_చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి.
ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది
పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు.
వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు.
అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు.
మనం_జన్మజన్మలుగా_సంపాదించుకున్న_పుణ్యఫలాలన్నీ_ఒక్క_చెడ్డపనితో_తుడిచిపెట్టుకుపోతాయి_అని_శ్రీ_కృష్ణుడి అంతరార్థం.
ఓం నమో భగవతే వాసుదేవాయ
*****
నేటి మంచి మాట
ఎవరి భర్త వారికి శివుడు
ఎవరి బార్య వారికి పార్వతి
ఎవరి ఇల్లు వారికి శివాలయం
ఎవరి దేహం వారికి దేవాలయం
శివుడు చేసేది ధ్యానం
పార్వతి ఉండేది మౌనం
ఇన్ని ఆస్పత్రులు
ఇన్నిన్ని కోర్టులు
ఇంకెన్నో పోలీస్ స్టేషన్లు
మరెన్నో గుడులు
ఇంకెంతో సంపాదన
ముప్పై రూపాయల కొబ్బరికాయ
ముప్పై రూపాయల అరటి పండ్లు
ముప్పై రూపాయల ఆటో చార్జి
ముప్పై నిముషాల టైం
ముప్పు తిప్పల ఆరాటం
అర్దం అయితే ఆనందం
అర్దం చేసుకుంటే పరమానందం
అయినా అనుక్షణం వేదన
అరగంట సాధన ధ్యానం
అరగంట వుదాం మౌనం
అందరిలోనూ ఆనందం
అది కాదా పరమార్థం
అది కాదా జీవితం
అది కాదా ఇల్లంటే
అది కాదా ఆత్మజ్ఞానం
అది కాదా మోక్ష మార్గం
కష్టం మనకు మాత్రమే
కనిపించేది దెయ్యం లాంటిది .
దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు .
అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు.
కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది.
ఒక్క క్షణం కన్నా ఎక్కువ ఉండదు.
అది చేసే నష్టమాత్రం మామూలుగా ఉండదు.
జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది.
మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరే దిగిపోతుంటే
మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసి పోతూ ఉంటుంది.
కోపం కష్టం జీవితం
మూడు మనవే.
కానీ మన అదుపులో
ఎప్పుడూ ఉండవు.
మన మాట ఎప్పుడు వినవు. మనకు చెప్పిరావు.
ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది.
కోరిక దేవుని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది.
కానీ ధైర్యం ఒక్కటే మనల్ని మనమే నమ్మేలా చేస్తుంది.
చీకటి దాటి కదలాలంటే
ఓపిక ఉండాలి...
అలుపే ఎరుగక అడుగులు
ముందుకు సాగాలి.
ముళ్ళూ పూలూ ఏవైనా
ఒకటే తీరున వేగం ఉండాలి.
గాయం చూస్తూ గమనం ఆపితే
గమ్యం చేరే దెప్పటికి?
రాలిన పూలే చెట్టును చేరవు
కొత్త చివురులే రావాలి
మనసు గడియ తీసి
మేలు ఘడియలు గడపాలి
మధువనం పరిమళం పంచినట్టుగా మంచితనం పంచాలి.
మబ్బుల్లో నీళ్ళన్నీ నేలపైనే కురిసినట్టు ప్రేమను పెంచాలి
సృష్టి లోని అందాలన్నీఆస్వాదిస్త
ఆనందపు మకరందాలే జీవనమంతా
నవ్వుతూ నవ్విస్తూ
ఆడుతూ పాడుతూ జీవితముంటే
నిరంతరమూ వసంతాలే!
జీవన పయనపు సారం పెంచి
జీవించడంలో స్వారస్యం నింపే
ప్రశాంతమైన ఉదయానికి సుప్రభాతం
****
స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం*
రామునికి — సీత
కృష్ణునికి — రాధ
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ
*మన దినచర్యలో భాగంగా
ఉదయానికే — ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
రాత్రి మత్తులో — నిషా
పడుకున్నాక — స్వప్న
చూచేటప్పుడు — నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు — వాణి
ఓరిమిలో - వసుధ వడ్డించేటప్పుడు - అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు — హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే — సుందరి
చేసేపనికి - స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు — సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో — సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు — ఆనంది
గెలుపు కోసం — జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ
నాట్యమాడునపుడు — మయూరి
సాహిత్య గోష్టిలో — కవిత
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి
జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — స్త్రీ
****
సమాజాన్ని, నిత్యం ఎదురయ్యే అనుభవాలను మనిషి దర్శించే విధానమే దృక్పథం. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి ఆనకట్ట మీదుగా రైలు ప్రయాణిస్తోంది. ఓ మహిళ వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమల్ని భక్తితో- పవిత్రమైన ఆ నీళ్ళలోకి జారవిడిచింది. పక్కనే కూర్చున్న యువకుడికి ఆమె చర్య హాస్యాస్పదంగా అనిపించింది. అతడు అల్పాహారం తిన్న తరవాత పొట్లం కట్టిన కాగితాన్ని నలిపి అదే నీళ్ళలోకి విసిరేశాడు. ఆ చర్యలు సంస్కృతీ సంప్రదాయాల ఆచరణలో వాళ్ళ దృక్పథాన్ని తెలియజేస్తాయి.
జరిగే సంఘటనలను సామాన్యులు యథాతథంగా గ్రహిస్తారు. సత్పురుషుల వ్యక్తిత్వం అందుకు విభిన్నం. శ్రీరాముడు అనేక సందర్భాల్లో సంఘటన అంతర్లీనతను గ్రహించి ఉత్తమ దృక్పథాన్ని ప్రదర్శించడం గమనించవచ్చు.
సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యాలకెళ్ళాడు. భరతుడికి ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. పితృ సంస్కారాలను భారంగా పూర్తిచేశాడు. అన్న లేని అయోధ్యలో ఇక ఏమాత్రం ఉండలేక, ఆయనను అయోధ్యకు తీసుకువస్తానంటూ బయలుదేరాడు. సైన్యం, ప్రజలు భరతుడితో కలిసి ముందుకు నడిచారు. కొంత ప్రయాణం తరవాత వారు గుహుడి నివాసాన్ని సమీపించారు. భరతుడు సైన్య సమేతుడై రావడాన్ని గుహుడు దూరంనుంచే చూశాడు. రాముడికేదైనా అపకారం చెయ్యబోతున్నాడేమో అని అతడి మనసు కీడును శంకించింది. భరతుణ్ని సమీపించి తన అనుమానాన్ని వ్యక్తపరచాడు.
గుహుడి మాటలు భరతుణ్ని తీవ్రంగా బాధించాయి. తనకు తండ్రిలాంటి వాడైన శ్రీరాముడిని అరణ్యం నుంచి అయోధ్యకు తీసుకెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. అతడి మాటలు విని గుహుడు సంతోషించాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిన మార్గాన్ని చూపించాడు. భరతుడు గుహుణ్ని కలుపుకొని ముందుకు సాగిపోయాడు.
కొంత ప్రయాణం తరవాత భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆ రుషి భరతుడికి అతడి పరివారానికి మంచి ఆతిథ్యం అందించాడు. కుశలప్రశ్నలడిగిన పిమ్మట భరద్వాజుడు అతడి రాకలోని ఆంతర్యాన్ని ప్రశ్నిస్తూ రామలక్ష్మణులకేదైనా అన్యాయం తలబెట్టబోతున్నావా అంటూ నిర్భయంగా, నిర్మొహమాటంగా అడిగాడు. ఆ ప్రశ్న వినడంతోనే భరతుడు దుఃఖితుడయ్యాడు. మహర్షిని సమీపించి తనకే పాపం తెలియదని విన్నవించుకున్నాడు. భరతుడి నిజాయతీని అర్థం చేసుకున్న భరద్వాజుడు అతన్ని… ఓదార్చాడు. రాముడి ఔన్నత్యాన్ని మరోమారు భరతుడికి తెలియజెప్పాడు. రామలక్ష్మణుల్ని చేరుకోవడానికి దారిని చూపించాడు.
మరికొంత దూరం ప్రయాణం చేసిన భరతుడు సీతారామలక్ష్మణులు నివసిస్తున్న చిత్రకూట పర్వతాన్ని సమీపించాడు. భరతుడు సపరివారంగా రావడంవల్ల ఆ ప్రాంతమంతా ధూళి వ్యాపించింది. లక్ష్మణుడు అందుకు కారణాన్ని అన్వేషిస్తూ చెట్టు పైకెక్కి చూశాడు. భరతుడు సైన్యసమేతుడై రావడం కనిపించింది. భరతుడి రాక లక్ష్మణుడికి అపోహను కలిగించింది. పరుషోక్తులతో భరతుణ్ని నిందించడం ప్రారంభించాడు.
శ్రీరాముడు ఆ సందర్భంలో భరతుడి పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించాడు. లక్ష్మణుడిని వారిస్తూ భరతుడి రాక సమయోచితంగా ఉందంటూ కొనియాడాడు. అతడు వచ్చిన పిమ్మట పరుష వచనాలను ఉపయోగించ వద్దని ఆ విధంగా మాట్లాడితే అది తనను గురించి మాట్లాడినట్లే కాగలదని అన్నాడు. రాజ్యం కోసం ఆశతో ఈ విధంగా భరతుణ్ని నిందిస్తున్నావన్న భావన తనకు కలగగలదని చెప్పాడు.
ఈ విధంగా గుహుడు, భరద్వాజుడు, లక్ష్మణుడు వంటివారు శంకించిన భరతుడి వ్యక్తిత్వాన్ని శ్రీరాముడు తన దృక్పథంతో సరైన కోణంలో దర్శించాడు. అన్నదమ్ముల బంధాన్ని కలకాలం నిలుపుకోగలిగాడు.
మనందరం నకారాత్మకతను విడిచిపెట్టాలి. తోటి మనుషులపట్ల, జరిగే సంఘటనల పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. జీవితాన్ని ఆదర్శమయంగా తీర్చిదిద్దుకోవాలి.
ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంకలాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా నెలవంక లాగా అందంగా కనిపిస్తారు. కాగితం నలిపేటపుడు చెత్తగా చూస్తాం. డబ్బయినపుడు దేవుడిగా చూస్తాం. మనమూ కాగితమే, చెత్తవడం దేవుడవడం మన స్థాయిని బట్టే ఉంటుంది
*****
No comments:
Post a Comment