Saturday, 23 December 2023

  

 

నమః శివాయ.. 8.. మత్తకోకిల 


మ. కష్ట జీవికి పాడి పంటకు కామ్య మేదియు  యేలనో 

ఇష్ట జీవికి ఎండ మావులు ఈశ్వరేచ్ఛయు  యేలనో 

ఘోష్టి జర్పిన వర్త మానము హోరమవ్వట యేలనో 

రైతురాజుగ బత్కెరోజులు రాజ్యమేలును  యీశ్వరా 


మ. క్రౌంచ పక్షులు చెట్టు కొమ్మన కామ్య మాటలు పల్కగా 

పంచ రంగుల బాల భవ్యుడు  పక్షి చూపులు చూడగా 

మచ్చి  కైనవి బోసి నవ్వుల మార్గమవ్వును  హాయిగా 

మంచిమాయయు నవ్వుఅందపు మందబుద్దియు యీశ్వరా

అన్నదమ్ముల ఒక్క మాదిరి ఆత్మ తత్వము  ఉండుటే

కన్న ప్రేమయు భార్య మాటను కామ్య మవ్వుట  మన్ననే

ఉన్న దన్నది కల్సి ఉండెటి ఉత్తమోత్తమ కోరికే

చిన్న పెద్దలు తల్లితండ్రుల చేష్ట చూపులు యీశ్వరా   


అందుకో రమ వల్లభా కర ముల్తొ శోభను చేసుకో

కంది పోయిన లేత వయ్యసు పొందు చేసుకొ ధర్మమై 

అందమంతయు జుర్రుకో మది వల్లభా చిరు నాయకా

చందనం సుమ ఘంధమై తరుణం ఇదే పతి యీశ్వరా 


ఆంధ్ర రాజ్యపు దైవమా అమరావతీ మది సిల్పమా

చంద్రుడాకశ మే మనో భవ జాతి పుర్షుని ప్రేమయే

బుధ్ధి మంతుని ఆశ దీపము భూమి వెల్గుల చిహ్నమే

బుధ్ధభానుని సద్గుణాలను భూరి నేస్తము యీశ్వరా 


ఇంద్రి యాలను దోష పూరిత యిచ్ఛ ధర్మము  వ్రాసెనే

బేధ భావము లోన దేశము బంధ మౌనును వ్రాసెనే

వేద పుర్షుడు ప్రత్య గాత్మను వీణ దల్చియు కళ్ళతో

పాదసేవయు తల్లి తండ్రికి సేవ లక్ష్యము యీశ్వరా 


ఊయ్యలోలను కాళ్లు చేతులు ఊపి ఆడుచు జీవుడే 

కయ్య మోదలి లాలి పాటలు కాల చేష్టలు కన్యలే 

వియ్య మోందెటి అత్త మామలు విద్య నేర్పుట  బంధమై 

సైయనే చిరు కళ్ల హాసపు నౌక మాదిరి యీశ్వరా

561.. విపులభుజా.. న జ య గ..7


వినయ విధాన విధీ యుక్తిన్

మనసు సహాయ సుధీ శక్తిన్

తనువు తపత్వ తపో రక్తిన్

క్షణము వినమ్రత శ్రీదేవీ


562.. విభా.. న య త య గ..10


సకల మనోశక్తీ స్వేచ్ఛ సాధ్యమ్మే

వికట వయోశక్తీ యిచ్ఛ విశ్వమ్మే

మకుట జయమ్మేలే సేవ మార్గమ్మే

నకలు భయంమేలే నిత్య శ్రీ దేవీ


563.. విభ.. త ర గ గ యతి లేదు


సామాన్యమే మనో మాయే

ప్రామాణ్యమే తపో మాయే

కామత్వమే విధీ మాయే

క్షామత్వమే మదీ దేవీ


564.. విభ్రమా.. న న నస గ గ...9


నరగతముల నటన విధిగా క్రమ్మన్

వరశతముల తరువ మదిగా నెమ్మిన్

ధరణి గతులు ప్రమద గణమై వచ్చెన్

తరుణ యతుల సహన తప శ్రీదేవీ


565.. అమలా.. స స జ గ గ...7


వరదో భవ సేవ నేస్తమే లే

శరణో భవ యాశ పాశమే లే

తరునోభవ జాత యోగ్యమే లే

పరమాత్మ మదీ ప్రియేలె దేవీ

samohanaalu 

 
ఏమి చెప్పి మెచ్చాలి
మెచ్చాలి ఊండాలి
ఉండాలి భయములేక ఏలా ఈశ్వరా

మనసులోన నేధ్వని
ధ్వని వల్ల ప్రతి ధ్వని
ప్రతి ధ్వని యే మనిషికి రోగమె ఈశ్వరా

మాయ కుమ్మి ఉన్నా
ఉన్న కధలు విన్నా
విన్నా నాలొ భయము తరమాలి ఈశ్వరా

ఆహార లోపాలు
లోపాల శాపాలు
శాపాలు మహత్చమే చీకటి  ఈశ్వరా

ఆత్మహత్య పాపం
పాపం ఒక శాపం
శాపం జన్మజన్మలబంధం ఈశ్వరా

బతక లేని ఆశ
ఆశతో పేరాశ
పేరాశ మార్చు బుద్ధి మనసును ఈశ్వరా

కాలము నీది కాదు
కాదు ప్రేమ కాదు
కాదు అనే పదం అన్న కాదు ఈశ్వరా
 
భ్రమలో చిక్కినా
చిక్కిన భయపడినా
భయము మనిషిని నాశనము చేయు ఈశ్వరా

ఎప్పుడో జరిగినది
జరిగి కదులుతున్నది  
కదలి కలవరము తెప్పించేను  ఈశ్వరా

మగువతోడును లేక
లేకను మనసు లేక
మనసు లేని పక్షిలా తిరుగే ఈశ్వరా

--(())--


శ్రీమద్భాగవతం: గజేంద్రమోక్షం:
ఏనుగు మొసలి బారినుండి తప్పించుకొనలేక శ్రీహరికై ప్రార్దించు సన్నివేశం. (ఏనుగు మాత్రమే కాదు మనంకూడా ఈ సంసారమనే మొసలి నుండి తప్పించుకోడానికి ఈ ప్రార్ధన చేయాలి)
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్||
ఒకపరి జగములు వెలి నిడి
యొక పరి లోపలికి గొనుచు నుభయము దానై
సకలార్ధసాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్ధి దలంతున్||

లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన దుది నలోకం బగు పెం
జీకటి కవల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని సేవింతున్||

ఈవిశ్వమెవ్వనివలన ఉద్భవించెనో, యెవ్వనియందు లయించునో, యెవ్వనియందు లీనమైయుండునో, పరమేశ్వరుడెవ్వడో, మూలకారణమైన వాడెవ్వడో, ఆది మధ్య అంతములు లేని వాడెవ్వడో సర్వమూ తానే అయిన వాడెవ్వడో అట్టి స్వయంభువైన నీశ్వరునే నేను శరణు వేడుచున్నాను.
మరియు లోకములనొకమారు తననుండి వెలుపలికి నెట్టి (సృష్టి చేసి) వేరొకమారు ఆలోకములను తనలోనికి తీసికొనుచు, వెలుపలను, లోపలను, తానైయుండుచు, సర్వమునకు సాక్షియై యుండు, పవిత్రుడును, నిర్మలుడును అయిన ఆ ఆత్మమూలమైన పరమాత్ముని ధ్యానింతును.
అంతియేకాక ఈ లోకములు, లోకులు, లోకపాలకులందరును అంతమైన పిమ్మట, చివరకు అలోకమైన (లోకములేవియు లేని) స్థితిలో, శూన్యస్థితియందు గాఢాంధకార తమస్సుకు అవతల ఎవ్వడు ఏకైక పరంజ్యోతియై వెలుగుచుండునో ఆ పరమాత్ముని నేను సేవింతును.
భావాన్ని మనస్సులో ఉంచుకొని రోజూ ప్రభాత సమయంలో ఈ మూడు పద్యాలు చదివినచో ఆ శ్రీహరిని శరణు వేడినట్లగును.


 శ్రవేంకటేశ్వర: తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి? 🌻


భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు. పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.

కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది. సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?

మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవా…
 శ్రీహరి పరాధీనత

భూదేవీ ! బ్రహ్మాది దేవతలారా ! ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు బ్రహ్మదేవుడూ శివుడు ఇంద్రుడూ దిక్పాలకులు చంద్రుడు సూర్యుడూ అగ్ని - ఎవ్వరూ స్వతంత్రులు కారు.
సృష్టి అంతా యోగమాయావశంవదం. బ్రహ్మాదిస్తంభపర్యంతమూ గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే.

నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగానూ ఒక తాబేలుగానూ జన్మిస్తానా ? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా ? పోనీ అంటే, క్షుద్రజంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా ? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు ? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ - ఎవరైనా ఎన్నడైనా ఇష్టపతారా ? ఇరవైయొక్క సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం ! ఎంత నీచం ! గర్భస్థ శిశువులనుకూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా ? తరవాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న (పచ్చి) మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గు పడవలసిన విషయమా ? మీరే చెప్పండి.

బంగారులేడి కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటిరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడుకూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నామాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారుమ్రోగేట్టు విలపించాను. కార్యవశాత్తూ సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞచేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను.

నేనూ నా సోదరుడూ నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్య పోయినవారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులుపడ్డానో మీకు తెలుసా ! దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై అసహాయుడనై పాదచారినై భార్యతో కలిసి పధ్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను.

క్షత్రియుడనై పుట్టి బోయవాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగిపొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం ! లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యా వియోగ దుఃఖం. వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది.

రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి.

చతుర్వదనా ! నీకు తెలుసును గదా ! నువ్వూ రుద్రుడు ఇంద్రుడూ అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు అధీనులమే.
(అధ్యాయం - 18, శ్లోకాలు - 60)

దేవతలారా ! మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడూ శాంతుడూ అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను - అని అహంకరించి మోహితులమవుతున్నాం. అతి సనాతనమూ పరాత్పరమూ అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఐంద్రజాలికుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేనూ ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూంటాను.

పద్మసంభవా ! కల్పారంభంలో నువ్వూ నేనూ శివుడూ కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాంకదా ! సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి. మనస్సుల్లో స్మరించండి.

శ్రీమహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకలభువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు.

జగన్మాతా ! సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీనుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరీ ! ఓ కరుణాసముద్రమా ! నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు (జ్ఞాన రూప). దేవీ ! మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మీ ! ఓ మహాశక్తి ! మమ్ము నడిపించు.

ఓ భువనార్తి హారిణీ ! అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావుకదా ! కంస కేశి సాల్వ జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకుకూడా లొంగని మహామహాదానవులను నువ్వు ఒక కేళీవిలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చెయ్యలేరుగదా ! అనంతుడు ఈ భూమిని ధరించలేడుగదా ! ఓ చంద్రకళావతంసా ! మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు - అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు. అభ్యర్థించారు.

జగన్నాయకీ ! సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చినదానవు నువ్వేకదా - అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు.

ఓ త్రిలోకీ ! నీ కళావైభవాన్ని మాకు అందించావు కనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం. ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే - అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు.

జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది. దేవతలారా ! పని ఏమిటో చెప్పండి. ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైనా సురల కోరిక తీరుస్తాను. మీకుగానీ ఈ భూదేవికిగానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి - అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు.

భువనేశ్వరీ ! పాలకులందరూ దుష్టులై పీడిస్తూంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్ధురాలవు నువ్వే అని నిన్ను ప్రార్ధించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతిక్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లీ !

దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొసలు ఎరుపెక్కాయి. మేఘగంభీర స్వరంతో పలికింది -

 దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం

దేవతలారా! ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను.

కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో అనకదుందుభి గా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతాకార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణీ గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్టసంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడూ, అశ్వినీ దేవతల అంశలతో నకులసహదేవులూ, అష్టమవసువుగా (వసు అంశంతో) భీష్ముడూ జన్మించి శత్రుబలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది.

మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహమూ, కామమూ మొదలైన దోషాలతోనూ, బ్రాహ్మణశాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాపకారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీమీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.

(అధ్యాయం - 19, శ్లోకాలు - 46)


(రేపు.... వ్యాసకృత యోగమాయా ప్రశంస )

 🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే .......‌‌‌‌‌‌‌.🙏
                                  ..... సశేషం

శ్రీ మాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
[7:36 am, 27/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.

🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.

🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా రేపటి నుంచి ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.

🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.

🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.

🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో జాయిన్ చేయడం జరుగుతుంది.

🌹మీ పేరు ఇలాంటివి తెలపడానికి ఇష్టం లేని వారు గ్రూపులో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు.
--

pranjali prabha -- stories 875


 మన హిందూ ధర్మసంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవితమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.
మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభముని తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలివనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.

ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము "18" సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం.


స్మృతులు - 18
1.మనుస్మృతి, 2. బ్రహ్మస్మృతి, 3. దక్షస్మృతి, 4. గౌతమస్మృతి, 5. యమస్మృతి, 6. అంగీరసస్మృతి, 7. యోగీశ్వరస్మృతి, 8. ప్రచేసస్మృతి, 9. శాతతాప స్మృతి, 10. పరాశరస్మృతి, 11. సంవర్తనస్మృతి, 12. ఉశనస్మృతి, 13. శంఖస్మృతి, 14. లిఖితస్మృతి, 15. ఆత్రేయస్మృతి, 16. విష్ణుస్మృతి, 17. అపస్తంబస్మృతి, 18. హరీతస్మృతి.

సిద్ధులు - 18
1.అణిమ, 2. లహిమ, 3. మహిమ, 4. ఈశాక్త్వా, 5. వసిత్వ, 6. ప్రాకామ్యా, 7. బుద్ధి, 8. ఇచ్చా, 9. ప్రాప్తి, 10. సర్వకామ, 11. సర్వాసంపత్ప్రద, 12. సర్వప్రియంకర, 13. సర్వమంగళాకారణ, 14. సర్వదుఃఖవిమోచన, 15, సర్వమృత్యుప్రవాచ, 16. సర్వవిఘ్ననివారణ, 17. సర్వాంగసుందర, 18. సర్వాసౌభాగ్యదాయక.

విద్యలు - 18
1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అధర్వణవేదము, 5. శిక్షా, 6. వ్యాకరణము, 7. చందస్సు, 8. నిరుక్త, 9. జ్యోతిష్యము, 10. కల్పము, 11. మీమాంస, 12. న్యాయశాస్త్రము, 13. పురాణాలు, 14. ధర్మశాస్త్రాలు, 15.ఆయుర్వేదము, 16. ధనుర్వేదము, 17. నీతిశాస్త్రము, 18. అర్ధశాస్త్రము.

మానవశరీరములోఉన్న_ముఖ్యమైన స్థానము - 18
1. మూలాధారం, 2. స్వాధిష్ఠానము, 3. మణిపూర్వకము, 4. అనాహతము, 5. లంబిక, 6. విశుద్ధి, 7. అంగత, 8. బిందు, 9. అర్ధచక్రము, 10. రోధిని, 11. నాధం, 12. సాంధారము, 13. శక్తి, 14. వ్యాపిక, 15. సమన, 16. ఉన్మన, 17. మహాబిందు, 18. సహస్రావరము.

శబరిమలైప్రాంతములోస్వామివారి పవిత్రగిరులు(కొండలు) - 18
1.శబరిమలై, 2.కాంతమలై(పొన్నంబలమేడు, 3. నాగమలై, 4. సుందరమలై(సౌందర్యమలై), 5. చిత్రంబలమేడు, 6. కల్కిమలై, 7. మదంగమలై(మాతాంగమలై), 8. శ్రీపాదమలై, 9. గ్రౌండర్మలై(అప్పాచిమేడు), 10. దేవమలై, 11. నైలడంకుండ్రు, 12. తహైప్పార్ మలై, 13. నిలక్కల్ మలై, 14. పుడుచ్చేరిమలై, 15. కాళైకట్టి, 16. ఇంజిప్పారై, 17. కరిమలై, 18. నీలిమలై.

అష్టరాగపంచేంద్రియతిగు_జ్ఞానాజ్ఞనములు - 18
1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. 🙏


మాత్సర్యము, 6. దర్పము, 7. అహంకారము, 8. కన్ను, 9. ముక్కు, 10. చెవి, 11. నోరు (నాలుక), 12. చర్మము, 13. సత్వగుణము, 14. తమోగుణము, 15. రజోగుణము, 16. అవిద్య, 17. విద్య.

పద్దెనిమిదిసార్లుమాలధరించివెళ్లివచ్చిన స్వామివార్ల_పేర్లు - 18
1. కన్నెస్వామి, 2. కత్తిస్వామి, 3. గంటస్వామి, 4. గధాస్వామి, 5. పెరియస్వామి, 6. జ్యోతిస్వామి (గురుస్వామి), 7. సూర్యస్వామి, 8. చంద్రస్వామి, 9. త్రిశూలస్వామి, 10. విష్ణుచక్రస్వామి, 11. శంఖదార స్వామి, 12. నాగభరణస్వామి, 13. శ్రీహరి స్వామి, 14. పద్మస్వామి, 15. శ్రీస్వామి, 16. శ్రీశబరిగీశ్వరస్వామి (రాతిస్వామి), 17. ఓంకారస్వామి, 18. నారికేళస్వామి.

పద్దెనిమిదిసార్లుశబరిమలైవెళ్ళిన_స్వాములు ప్రతీ ఏట శరంగుత్తిలో వదిలిపెట్టే వస్తువులు - 18
1. శరము (బాణం), 2. కత్తి, 3. గంట, 4. గధ, 5. విల్లు (ధనస్సు), 6. జ్యోతి (దీపము), 7. సూర్యుడు, 8. చంద్రుడు, 9. త్రిశూలము, 10. విష్ణు చక్రము, 11. శంఖం, 12. నాగాభరణం, 13. వేలాయుధం, 14. పద్మము (కమలము), 15. శ్రీ, 16. రాయి, 17. ఓం, 18. కొబ్బరిచెట్టు.

కాళికాదేవి యొక్క కరములు - 18
అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది.

భారతయుద్ధము జరిగిన దినములు - 18
కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.

కురుపితామహుడు అంపశయ్యమీదనున్న దిననములు - 18 పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన
అంపశయ్యపైన ఉన్నది 18 దినములు.
భారత యుద్ధములో పాల్గొన్న అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది.
అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది.
పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప  


గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము
--
అమలమ్ముగ నుంచి యెడఁద
సమభావముఁ బెంచుకొమ్ము
గమనించుచు సృష్టి రచన
ప్రముదమ్మునఁ బ్రణతులిడుము
--
నిరుపేదల నిరసించకు
ఒరులెవ్వరి దూరఁబోకు
గరిమమ్మిడు గుణముఁ బెంచు
సరసంబగు బాసలాడు
--
అతిగానెటఁ బల్కఁ బోకు
మతినుంచుము మాతనెపుడు
స్తుతిసేయకు దుష్టజనుల
గతిమార్చకు మాశమీఱి
--
ప్రాప్తమైనదానితోడఁ
దృప్తి గలిగి బ్రతుకనగును
ఆప్తవాక్యమంచునెంచి
జ్ఞప్తినుంచ సూక్తి మేలు
--
వెంటరావు కాసులేవి
జంటయగును గర్మమొకటె
మంటలోన బూడిదగుచు
మంటిలోనఁ గలయఁ దనువు
--
పాపభీతిఁ గలిగి యుండు.
ఆపలేని వాఁడననుచు
వేపఁబోకు పెచ్చుమీఱి.
తాపమిడును యముఁడు పిదప
--
మర్మముంచఁబోక మదిని
ధర్మమార్గమందె సాగి
కర్మఫలము విభునికిడుము
వర్మమగును దైవమతఁడె
--
ఆశలెన్ని యున్నఁగాని
నాశనమునుజేయకొరుల.
పాశమెపుడొ తగులుకొనును
క్లేశమొదవ నీకుఁ గూడ
--
మోసగించి బ్రతుకఁబోకు
హాసములను బయికిఁ జిమ్మి
దాసజనము మెచ్చఁబోరు
మాసిపోవునున్న పేరు
--
పిల్లపాపలందఱలర
మెల్లఁగాను దరికిఁ దీసి
చల్లఁగాను గాయుచున్న
నిల్లె స్వర్గమగును జూడ
--
కల్లలాడఁ గాదు ముద్దు
చెల్లదెపుడు దాట హద్దు
అల్లరవఁగ నెమ్మి రద్దు
తల్లి చెప్పుదొకటె కద్దు
--
చల్లనైన తల్లి యగుట
నెల్లరొకటె కనఁగఁ దలికి
నుల్లసిల్లు నేకమయిన
kaalamaay tapp dika
--((***))--
 

 

మనోరమ ముద్దు కోసం... కవిత

మను వాడ గా వచ్చితి నే సహనమ్ము తొ
తను వంత యు తాపము దాహము దేహము
విను మాటలు నచ్చితి వే మన సైనది
కనుక సైగలు చేయుము కాలము నీదియు

అటులే ఇక నాకు యు నీ కును శోభ యె
చిటికేసిన పిల్పు కు వచ్చె ద వెంట నె
కటి నేల ను తాకి యు ఉంటిని ఆశలు
ఇటు తీర్చు ము వేడి కి చల్లగ ఉండును

కళగా ఇచటే కొలువే మనకుందిలె
ఇలలో కలిసే తెలిపే వరసుందిలె
కలలో కదిలే కథలే శుభ కాంక్షలె
వలలో మనమే ఒకటై సుఖముందిలె

తనువే తపనే కలిగే ఇక ఏలిక
మనసే బిగువై వరదై ఇక పొంగులె
మనువే ఇకలే కలలే ఇక తీర్చుకొ
అణువైనవి సేవకులుగా మనకుందిలె

తరుణం ఇదియే శరణం అనుచుంటిని
పరువం మనదీ పదిలం ఇక విదితం
సరళం సుముఖం సహనం మన జంటకు
కరుణా లయమే కథనం చిరు శాంతిగ

0
నేటి ఛందస్సు ...  

కోరు వయసులోన - కొరికే తృప్తిగా  
చేష్టలగను - కలలు తలపు గాను  
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం  
ప్రేమ బ్లు చూపుటే

చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు    

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు

ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ    
 
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ


*జ్యేష్ఠ మాసం ప్రాధాన్యత ఏంటి..? నీళ్లను ఎందుకు దానం చేయాలి..? బ్రహ్మదేవుడితో సంబంధమేంటి..? 


జ్యేష్ఠ మాసము తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల జ్యేష్ఠము. చైత్రం, వైశాఖం తర్వాత వచ్చేది జ్యేష్ఠమాసం. ఈ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తెలుగువారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది ఛైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.


బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసం 


జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్నదానం చేయడం ఉత్తమం.


ఈ మాసంలో ఏం చేయాలి..? 

జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది.


ఈ మాసంలో ఏమేమి దానం చేయాలి..? 


జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు.


వటసావిత్రి వ్రతం చేయనున్న మహిళలు 


జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి.సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.


జ్యేష్టమాస ఫలములు 


గోచారరిత్య ఈ మాసంలో ఐదు శని,ఆదివారములు ఉన్నందున దుర్భిక్షం, ఆనారోగ్య బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దూది, సూత్రధ్యాన్యాదులు అధిక ధరలు కలిగి ఉండును. బియ్యం, శనగలు ,మినుములు, సుగంధ ద్రవ్యములు, కుంకుమ పువ్వు, కర్పూరం, తమలపాకులు, గంధం, అవిసెలు, బఠాణీలు, కందులు, పెసల్ల ధరలు తేజోవంతంగా ఉంటాయి. ఆవాలు, సజ్జలు, జీలకర్ర ఉప్పు, లక్క, వెదురు, కాగితం, సిమెంటు, ఇనుము, ఉక్కు, రత్నాలు, వస్త్రాలు, బంగారం, వెండి, వ్యాపార వాటాలు, వాహనములు, పెయింట్స్, చేతిపని వస్తువులు ధరలు అధికంగా ఉండును. పల్లిలు, పసుపు, మిరియాలు, నువ్వులు, బెల్లం, నెయ్యి, అల్లం, పూలు, పండ్లు, దుంపకూరలు, జలసంబధమైన ఉత్పత్తుల ధరలు నిలకడ లేక ఎగుడు, దిగిడుగా ఉండే అవకాశం గోచరిస్తుంది.
****

No comments:

Post a Comment